మైనార్టీలపై చంద్రబాబు కపట నాటకం | YSRCP MLA chand basha takes on chandra babu | Sakshi

మైనార్టీలపై చంద్రబాబు కపట నాటకం

Published Mon, Jun 9 2014 5:01 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

చంద్రబాబు నాయుడు మైనార్టీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా విమర్శించారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనార్టీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా విమర్శించారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఒక్క మైనార్టీకి కూడా చోటు కల్పించలేదని, బ్లాక్‌ డే గా పరిగణిస్తామని చెప్పారు.

చంద్రబాబు రుణమాఫీ ఫైలుపై సంతకం చేయకుండా కమిటీ నియమించడం రైతులను మోసగించడమేనని చాంద్‌బాషా అన్నారు. చంద్రబాబు కపట నాటకాలను ఎండగడతామని, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తామని చాంద్ బాషా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement