బీసీల సభలో టీడీపీ నేతలే ఎక్కువ.. | Gannavaram: More TDP leaders In The BC Assembly | Sakshi
Sakshi News home page

బీసీల సభలో టీడీపీ నేతలే ఎక్కువ..

Aug 22 2023 5:17 AM | Updated on Aug 24 2023 5:58 PM

Gannavaram: More TDP leaders In The BC Assembly - Sakshi

రామవరప్పాడు/గన్నవరం : లోకేశ్‌ యువగళం పాదయాత్ర కృష్ణాజిల్లా గన్నవరం నియో­­జ­కవర్గంలో ప్రజలు, ప్రయాణికుల సహనా­నికి పరీక్ష పెట్టింది. విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరుకు చేరుకున్న పాదయాత్ర విజయ­వాడ మీదుగా సోమవారం గన్నవరం నియో­జకవర్గానికి చేరు­కో­గా.. సాయంత్రం నిడమానూ­రు క్యాంప్‌ సైట్‌లో బీసీ సామజికవర్గాల ప్రతినిధులతో లోకేశ్‌ ముఖా­ముఖి నిర్వహించారు.

సమావేశంలో బీసీ ప్రతి­నిధుల కంటే టీడీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు. సమా­వేశంలో.. ‘ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ముస్లిం మైనార్టీలకు ఏం చేశాడ’ని లోకేశ్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నించిన ముస్లిం రైట్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్‌ నూరుద్దీన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్‌ మాట్లాడుతుండగానే జనం మెల్లగా జారుకున్నారు.

గన్నవరం చేరుకున్న పాదయాత్ర
అనంతరం.. లోకేశ్‌ పాదయాత్ర సోమవారం రాత్రి కృష్ణాజిల్లా గన్నవరం చేరుకుంది. అంతకుముందు, కేసరపల్లి వద్ద మండలంలోకి ప్రవేశించిన యాత్ర ఎయిర్‌పోర్ట్, దుర్గాపురం, గన్నవరం మీదుగా చిన్నఆవుటపల్లిలోని ఎన్‌ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఆవరణలో క్యాంప్‌ సైట్‌కు చేరుకుంది. పాదయాత్ర జాతీయ రహదారిపై కొనసాగడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదు­ర్కొ­న్నారు.

పోలీసులు ట్రాఫిక్‌ను క్రమ­బద్ధీక­రిస్తు­న్నప్పటికీ టీడీపీ శ్రేణుల అత్యుత్సాహం ఫలితంగా ప్రయాణికులు అసహ­నానికి గుర­య్యా­రు. కొంతమంది మద్యం మత్తులో రాకపో­కలకు తీ­వ్ర ఇబ్బంది కలిగించారు. ఇక లోకేశ్‌ సమక్షంలో కేడీ­సీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రా­వు టీడీపీలో చేరారు. మరోవైపు.. మండల పార్టీ ఇ­చ్చిన రూటుకు భిన్నంగా ఎమ్మెల్యే కార్యాల­యం మీ­దు­గా పాదయాత్ర వెళ్లాని టీడీపీ నేతలు పట్టుబ­ట్టారు. అయితే, పోలీసులు అంగీకరించలే­దు. దీంతో రూట్‌మ్యాప్‌ ప్రకారం పాదయాత్ర కొనసాగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement