bc
-
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి నేతల భేటీ
-
బీసీలకు స్వాతంత్య్ర ఫలాల్లో సమవాటా ఎప్పుడు?
దశాబ్దాలుగా అన్ని రంగాల్లో వెనుకబడిన చేతి వృత్తుల, కుల వృత్తులపై బతికే బీసీల అభ్యు న్నతే లక్ష్యంగా ప్రభుత్వాలు పని చేయాల్సిన అవసరం ఉంది. దేశా నికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లకు పైగా గడిచిపోయాయి. అయినా బీసీలు, ఎంబీసీలు తమకు న్యాయమైన వాటా దక్కాలనిఇంకా పోరాటం చేస్తూ ఉండాల్సి రావడం నిజంగా బాధా కరం. వారు సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా అట్ట డుగున ఉండడం మన కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోడానికి ముందుకు రావడం కొంత ఆశాజనక అంశమే. అయితే అవి తమ చిత్త శుద్ధిని అమలులో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా; విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన... బీసీ లకు ఆ యా రంగాలలో సరైన న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘బీసీ డెడికేటెడ్ కమిషన్’ నివే దిక ఇవ్వాల్సిన అవసరం ఉంది.రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా వారిసంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ కమిటీ పదవుల్లో 33 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది కేసీఆర్ ప్రభుత్వమే. దానితో పాటుగా బీసీ లను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడం కోసం గొర్రెల పంపిణీ చేయడం, చేపల పెంపకానికి కృషి చేయడం, నాయీ బ్రాహ్మణుల క్షౌరశాలలకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయడం, వందల సంఖ్యలో కొత్తగా బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ‘జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్ షిప్’ను అందించడం, బీసీ కులాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించి నిధులు మంజూరు చేయడం... వంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారు.ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు స్థానిక సంస్థల్లో42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కామారెడ్డిలో బీసీ వర్గాలకు చెందిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యతో డిక్లరేషన్ ఇప్పించింది. ఆ డిక్లరేషన్కు కట్టుబడి బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై కూడా ఎన్నో విమర్శలు, అనుమానాలు తలెత్తుతున్నాయి.ఎందుకంటే సర్వే పత్రాలు రోడ్లపై ప్రత్యక్షమవుతున్న ఘటనలు చూస్తున్నాం. ఈ ప్రభుత్వానికి బీసీల జనాభా లెక్కలపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ కానీ, కాంగ్రెస్ పార్టీగా తాను తెలంగాణ ప్రజ లకు ఇచ్చిన హామీలను కానీ చిత్తశుద్ధితో అమలు చేయాలంటే అధికారంలో ఉన్న వారికి బడుగుల పట్ల ప్రేమ ఉండాలి. ఎన్నికల నినాదాలు ప్రభుత్వ విధానా లుగా మారాలి. హడావిడిగా జనాభా లెక్కలను సేకరించి చేతులు దులుపుకొనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయ కూడదు. రాజకీయ అధికారంతో సామాజిక, ఆర్థిక అసమా నతలు తొలగిపోతాయన్న బాబా సాహెబ్ అంబేడ్కర్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని బీసీలకు, వారి ఉప కులా లకు రాజకీయ అధికారంలో జనాభా నిష్పత్తి ప్రకారం వాటాను కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు ఉండా లని డిమాండ్ చేస్తున్నాం.కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు జరుగు తున్న, జరిగిన బీసీ రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉదాహరణగా తీసుకొని, అదే స్థాయిలో రాష్ట్రంలో బీసీలకు రాజకీయ వాటా దక్కే విధంగా రిజర్వే షన్లను ఖరారు చేసి అమలు చేయాలి. ఒక నెల కాల పరి మితికే రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. ఈ స్వల్ప సమయం సరిపోకపోవచ్చు. బీసీ, బీసీ ఉప కులాల్లో కచ్చితమైన జనాభా గణాంకాలను వెలికి తీయడానికి కమిషన్కు కింది స్థాయి ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ కాలపరిమితిని మరికొంత కాలం పాటు పొడిగించి, బీసీ కులాల కచ్చితమైన డేటా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి వారికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి.డెడికేటెడ్ కమిషన్ కూడా అంతే చిత్తశుద్ధితో సమగ్రంగా అధ్యయనం చేసి ఎటువంటి లోపాలకూ తావు లేకుండా, న్యాయపరమైన చిక్కులు రాకుండా తమ నివేది కను ప్రభుత్వానికి అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలకు సరైన న్యాయం జరగాలనే ఆకాంక్ష, చిత్తశుద్ధిని వ్యక్తం చేస్తూ డెడికేటెడ్ కమిషన్కు ‘తెలంగాణ జాగృతి సంస్థ’ తరఫున నివేదికను అందజేశాం. అన్ని కులాలు, తరగతులు, వర్గాలకు మధ్య ఉన్న తీవ్ర అసమానతలను తగ్గించి, బలహీన వర్గాల సామా జిక, ఆర్థిక జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వా లను రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రాతినిధ్యం లేని, లేదా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వివిధ కులాలకు, తరగతులకు అవకాశాలు కల్పించేందుకు అనేక మార్పులను, చర్యలను ప్రభుత్వాలు తీసుకు రావాల్సిన అవసరం ఉంది.తమ శ్రమను, మేధస్సును మానవ నాగరికతా వికా సానికి ధారపోసిన కులవృత్తుల వారు స్వాతంత్య్ర ఫలాల్లో సమవాటా పొందాలి. ఈ సమాజ నిర్మాణానికి తమ రక్త మాంసాలను కరిగించి వందల వేల సంవత్సరాలుగారంగులద్దిన చేతి వృత్తుల వారికి ఇప్పటికైనా చట్ట సభల్లో గళమెత్తే అవకాశం కల్పించాలి. ఊరికి నాలుగు దిక్కులా మన తాత ముత్తాతల కథాగానం చేసిన సంచార జాతులు కనీసం పంచాయతీ వార్డు మెంబర్ అయినా కాలేకపోతే స్వరాజ్యానికి అర్థమేముంది? ఇకనైనా మార్పు రావాలి. -కల్వకుంట్ల కవిత వ్యాసకర్త ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు -
తప్పుడు సమాచారమిస్తే క్రిమినల్ చర్యలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: బీసీలు కాకున్నా కులగణన సర్వేలో బీసీలుగా నమోదు చేసుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్లు ఖరారు చేసే అం«శంపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా వేదికగా బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపిశెట్టి నిరంజన్ మాట్లాడుతూ సమగ్ర వివరాలు సేకరించనున్న నేపథ్యంలో భవిష్యత్లో ఇవే కీలకమని, దీని ఆధారంగానే రిజర్వేషన్లు, పథకాలు ఉంటాయని వివరించారు. కులాల వారీగా సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుసుకునేందుకు కలెక్టర్లకు బహిరంగ విచారణ చక్కటి అవకాశమని, 13 వరకు జరిగే కార్యక్రమాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొనాలని సూచించారు. కొన్ని కులాలు డీ నుంచి ఏ కు మార్చాలని, మరికొన్ని కులాలు బీసీ ఏ నుంచి ఎస్టీకి, బీసీ బీ నుంచి ఈకి రిజర్వేషన్లు మార్చాలని నివేదించారని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీసీ కమిషన్ సభ్యులు రంగు బాలలక్ష్మి, తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సత్యప్రకాశ్, కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.విచారణ రసాభాసబీసీ కమిషన్ బహిరంగ విచారణ రసాభాసగా మారింది. వివిధ బీసీ కుల సంఘాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వినతిపత్రాలు సమర్పించగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, సంజయ్కుమార్ బీసీ కమిషన్కు వినతిపత్రమిస్తూ కమిషన్ విచారణపై అనుమానాలు వ్యక్తం చేశారు. బిహార్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రొసీజర్ ల్యాప్స్ పేరుతో కోర్టు కొట్టివేసిందని, తెలంగాణలో కేవలం కాలయాపన కోసమే విచారణ, సర్వేలు చేస్తుందని దుయ్యబట్టారు. సర్వే కోర్టులో నిలబడుతుందా.. ఏ రకంగా నిలబడుతుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. తన అభిప్రాయం చెప్పేందుకు కమిషన్ అనుమతించకపోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరూ రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరును కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీసీలకు ఏం చేశారని, రిజర్వేషన్ల అమలులో ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
మీ రాజకీయ పొత్తుల కంటే తక్కువైపోయారా బీసీలు?
-
అవన్నీ తప్పుడు వార్తలు.. పార్టీ మారే ప్రసక్తే లేదు: ఆర్ కృష్ణయ్య
సాక్షి, ఢిల్లీ: పార్టీ మారే ఆలోచన లేదని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనను వివరణ అడగకుండానే పార్టీ మారుతున్నట్లు వార్తలు రాసుకుంటున్నారంటూ ఆయన మండిపడ్డారు.బీసీల కోసం కొట్లాడే తనకు వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతు పూర్తిగా ఉంది. బీసీలు రాష్ట్రానికి దేశానికి వెన్నుముక అని జగన్ చెప్తుండేవారు. బీసీల కోసం ఇంకా పోరాడాలి కృష్ణన్న అంటూ జగన్ నన్ను కలిసినప్పుడల్లా చెప్తుంటారు. చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ కోసం పోరాడే తనకు పార్టీ మారే పరిస్థితి లేదని.. వైఎస్సార్సీపీ నుంచే బీసీల కోసం కొట్లాడుతానని కృష్ణయ్య అన్నారు. -
బీసీలకు బిగ్ షాక్
-
చంద్రబాబు ఆదేశాలతో బీసీ నేతను ఈడిపడేసి..!
-
బీసీలకు మోసం
-
బడుగులకు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, విజయవాడ: మూడు జాబితాల్లోనూ కాపు, బీసీలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు. బడుగులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. తన సొంత సామాజికవర్గానికే ఎక్కువ సీట్లు ఇచ్చుకున్నారు. కమ్మ సామాజిక వర్గానికే 30 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. వెలమ సామాజిక వర్గాన్ని కేవలం ఒక్క సీటుకే పరిమితం చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి మొండిచేయి చూపారు. టీడీపీ జాబితాలో ముస్లిం మైనార్టీ సీట్లు కేవలం మూడే కేటాయించారు. ఇప్పటివరకు 139 స్థానాలకు అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించగా, బీసీ-31, ముస్లిం మైనార్టీ-3, ఎస్సీ-26, ఎస్టీ-04, కాపు-09, కమ్మ 30, రెడ్డి-28, వైశ్య-02, క్షత్రియ-05, వెలమ-01 సీట్లు కేటాయించారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపిక సామాజిక న్యాయాన్ని కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ చేసి చూపారు సీఎం జగన్. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ పదేపదే స్పష్టం చేసిన ఆయన అదే నినాదాన్ని అక్షరసత్యం చేశారు. 50 శాతం సీట్లు బడుగు బలహీనవర్గాలకు కేటాయించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు కలిపి 200 మొత్తం సీట్లకు 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి తాను విశ్వసనీయతకు మారుపేరని మరోమారు చాటుకున్నారు. జనబలమే గీటురాయిగా అభ్యర్థులను ఎంపిక చేశారు. సామాజిక సమతూకం పాటించారు. బీసీలకు, మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెనుకబడిన వర్గాల వారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే తాను మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను సీఎం జగన్ నిబబెట్టుకున్నారు. మొత్తం 175 శాసనసభా స్థానాల్లో 48 మంది బీసీలకు అవకాశం కల్పించారు. మొత్తం 25 లోక్సభ సీట్లలో బీసీలకు 11 సీట్లు ఇచ్చారు. భవిష్యత్తులోనూ తాను బడుగు, బలహీనవర్గాల వెన్నంటే ఉంటానని, వారే నా బలం.. నా బలగం అని చాటిచెప్పారు. -
చంద్రబాబులో నో ఛేంజ్.. లోకేష్ కు మరో ఓటమి
-
కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? రగిలిపోతున్న బీసీ నేతలు!
టీడీపీ అధినేత చంద్రబాబుకు తనసామాజికవర్గ నేతలు ఉంటే.. ఇంక ఎవరితోనూ పని ఉండదు. బీసీలను అసలు పట్టించుకోరు. మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో చంద్రబాబును మోస్తున్న బీసీ నేతలు ఆయన తీరుతో మండిపడుతున్నారు. ఇంతకాలం తమతో పార్టీకి ఊడిగం చేయించుకుని ఇప్పుడు బయటి వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తారా అంటూ ఆగ్రహిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారిని పక్కన పెట్టి ఇతర జిల్లాల నుంచి ఇంపోర్ట్ చేస్తే సహించేది లేదంటున్నారు. అసలు కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకునే నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలో ఆయన కుర్చీ కదిలిపోతోంది. ఏడుసార్లుగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినా కూడా సొంత నియోజకవర్గానికి కనీసం తాగు, సాగునీరు కూడా తీసుకురాలేకపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కుప్పం దశ తిరిగింది. అన్నివిధాలుగానూ కుప్పం నియోజకవర్గాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తున్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా నది నీటిని కుప్పంకు తీసుకువచ్చి వారి దాహార్తిని తీర్చుతున్నారు. పొలాల్ని సస్యశ్యామలం చేస్తున్నారు. నియోజకవర్గం గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించారు. గండం నుంచి గట్టెక్కడానికి కుప్పం పార్టీని తన సామాజికవర్గానికి చెందిన ప్రకాశం జిల్లా నేత, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు అప్పగించారు. దీంతో దశాబ్దాలుగా పార్టీకి ఊడిగం చేసిన తాము పనికిరాకుండా పోయామా అంటూ అక్కడి బీసీ నేతలు చంద్రబాబు మీద మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని బీసీ నేతలతో పాటు..కుప్పంలో ఆయనకు పీఏలుగా పనిచేసినవారిని కూడా పక్కన పెట్టేశారు. వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేసేశారు. దీంతో వారు లోపల ఉండలేక..బయటకు పోలేక అల్లాడిపోతున్నారు. ఇన్నేళ్ళుగా తమను వాడుకుని..ఇప్పుడు నిర్లక్ష్యం చూపిస్తున్నందుకు తామేంటో ఎన్నికల్లో చూపిస్తామని చంద్రబాబును హెచ్చరిస్తున్నారు కుప్పంలోని బీసీ సామాజికవర్గ నేతలు. తమను నమ్మకుండా బాధ్యతలు లేకుండా చేసినపుడు ఇంకా తాము టీడీపీకి, చంద్రబాబుకు ఎందుకు సేవ చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు ఇంతకాలం భారీ మెజారిటీ రావడానికి, అసలు ఆయన విజయం సాధించడానికి అక్కడ చేర్పించిన దొంగ ఓట్లే కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదుతో కుప్పంలో చంద్రబాబు చేర్పించుకున్న దొంగ ఓట్లలో 33 వేలకు పైగా తొలగించారు. అందుకే ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామంటున్నారు అక్కడి బీసీ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కుప్పంలో అధికార పార్టీ బాగా బలం పుంజుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఒకవైపు కేడర్లో నైరాశ్యం..బీసీ నేతల్లో పార్టీ అధినేత పట్ల ఆగ్రహం..ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత...మొత్తం కలిపి కుప్పంలో చంద్రబాబు కోట కూలడం ఖాయమనే టాక్ నడుస్తోంది. -
దెబ్బకు బాబు, పవన్ మబ్బులు వీడిపోతాయి: కొడాలి నాని
సాక్షి,ఎన్టీఆర్: టీడీపీ బీసీ సదస్సుపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి ఇప్పుడు బీసీ భజన చేస్తానంటే ఎవరూ నమ్మరన్నారు. ఈ విషయమై కొడాలి నాని శుక్రవారం నాని మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ను వెనకాల పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు టీడీపీకి బీసీలు వెన్నెముక అని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప...బీసీల కోసం చంద్రబాబు కొత్తగా ఏం పాటు పడ్డాడో చెప్పాలని నాని నిలదీశారు. ఓసీలకు టికెటివ్వాల్సిన జనరల్ సీట్లలోనూ బీసీలకు పదవులు ఇస్తూ వారికి సీఎం జగన్ ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. సీఎం జగన్ నాలుగు రాజ్యసభ సీట్లు బీసీలకు ఇస్తే 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఒక్క బీసీ కైనా రాజ్యసభ సీటు ఇచ్చారా చెప్పాలన్నారు. విద్య, వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు బీసీల ఆర్థిక ఉన్నతికి సీఎం జగన్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారని నాని చెప్పారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడి మబ్బులన్నీ వీడిపోతాయన్నారు. ఇదీచదవండి..చేనేత కార్మికుడి కానుక.. సీఎం జగన్ అభినందనలు -
టీడీపీ కుల అహంకారంపై మండిపడిన YSRCP బీసీ నేతలు
-
సబ్ప్లాన్ .. జనగణన
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమలవుతున్న సబ్ప్లాన్ను బీసీలకు కూడా వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తాము అధికారంలోకి వస్తే బీసీ సబ్ప్లాన్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వనుంది. ఈ సబ్ప్లాన్ కింద ప్రత్యేకంగా నిధులను కేటాయించి అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేయించడం ద్వారా రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని వివరించనుంది. ఈ నెల 10వ తేదీన కామారెడ్డిలో జరగనున్న ‘బీసీ గర్జన’సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించే బీసీ డిక్లరేషన్లో సబ్ప్లాన్ను పొందుపరచాలని నిర్ణయించింది. దీనితో పాటు బీసీ వర్గాల గణన చేపడతామని కూడా హామీ ఇవ్వనుంది. ఈ రెండు ప్రధాన హామీల ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే వ్యూహంలో భాగంగా బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించనుంది. ప్రస్తుతం బీసీ విద్యార్థులకు ర్యాంకుల వారీగా ఫీజును ప్రభుత్వం చెల్లిస్తోంది. అలా కాకుండా డిగ్రీ నుంచి పై స్థాయిలో ఉండే ఏ కోర్సులో అడ్మిషన్ పొందిన బీసీ విద్యార్థికైనా పూర్తి ఫీజు చెల్లిస్తామని హామీ ఇవ్వనుంది. ఎంబీసీ కార్పొరేషన్కు ప్రత్యేక నిధులు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీసీ బంధు పేరుతో అమలు చేస్తున్న రూ.లక్ష నగదు సాయం పథకానికి కౌంటర్గా బీసీ డిక్లరేషన్ సభ వేదికగానే కొత్త పథకాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే నగదు మొత్తాన్ని పెంచి ఇవ్వాలా? నగదు కాకుండా బీసీల అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రత్యేకంగా మరో పథకాన్ని రూపొందించాలా? అన్న దానిపై టీపీసీసీ నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని, ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని కామారెడ్డి సభలో సిద్ధరామయ్య ప్రకటిస్తారని చెబుతున్నారు. దీంతో పాటు కుల కార్పొరేషన్ల ఏర్పాటు, వాటికి నిధుల కేటాయింపు, అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) కార్పొరేషన్కు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు లాంటివి కూడా ప్రకటించనుంది. బీసీలతో పాటు మైనారీ్టల కోసం కూడా ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించగా, ఈనెల 9న ఆ డిక్లరేషన్ను ప్రకటించనున్నట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. నేటి నుంచి రేవంత్ రాష్ట్ర పర్యటన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. హెలికాప్టర్లో ప్రయాణించడం ద్వారా రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. 7వ తేదీన ఆలంపూర్ జోగుళాంబ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభతో ప్రచారం ప్రారంభం కానుంది. అదే రోజు గద్వాల, మక్తల్ నియోజకవర్గాల్లోనూ రేవంత్ పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఖానాపూర్, ఆదిలాబాద్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో, 9వ తేదీన పాలకుర్తిలో, హైదరాబాద్లో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించి సికింద్రాబాద్, సనత్నగర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.10వ తేదీన కామారెడ్డిలో జరిగే బీసీ గర్జన సభకు హాజరవుతారు. అదే రోజున కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. హైదరాబాద్లో మైనార్టీ ముఖ్యులతో డిన్నర్ కార్యక్రమానికి హాజరవుతారు. ఇక ఈనెల 11వ తేదీన బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. -
నేడే మోదీ బీసీ గర్జన సభ
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హైదరాబాద్లో జరిగే బీజేపీ బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ సభ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని ఇప్పటికే ప్రకటించడం నేపథ్యంలో.. మరో అడుగు ముందుకేసి సదరు బీసీ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు.బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాలను ఆకట్టుకునే చర్యలనూ పేర్కొనవచ్చని అంటున్నారు. బీసీలను ఆకట్టుకునేందుకు.. నిజానికి గతంలో ఎప్పుడు కూడా ఏ వర్గం నుంచి, ఎవరు సీఎం అవుతారని ముందే ప్రకటించే ఆనవాయితీ బీజేపీలో లేదని.. తెలంగాణ జనాభాలో 54శాతందాకా ఉన్న బీసీలను ఆకట్టుకునేందుకు సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో ఇప్పటివరకు బీసీ వర్గానికి చెందిన వారెవరూ ముఖ్యమంత్రి కాలేదని.. ఈ క్రమంలో బీసీ ఎజెండా, బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా మారిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఎస్టీల రిజర్వేషన్లను 10–12 శాతానికి పెంచుతామన్న హామీ ఇవ్వొచ్చని అంటున్నారు. గంటన్నర పాటు పర్యటన ప్రధాని మోదీ యూపీలోని ప్రయాగ్రాజ్ నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 5.30 గంటలకు ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. 6.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 6.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. -
బీసీన్ మారుస్తుందా?
కె. రాహుల్: తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ వర్గాలకు చెందిన నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం ద్వారా బీసీ ఎజెండాతో బీజేపీ ఎన్నికల గోదాలోకి దిగుతున్న విషయం స్పష్టమైంది. గత కొంతకాలంగా ఆ పార్టీలో బీసీలకు ప్రాధాన్యం పెంచుతున్న నేపథ్యంలో బీసీ సీఎంపై కూడా పార్టీ అధినాయకత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అటు అధికార బీఆర్ఎస్, ఇటు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తాము గెలిస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని ప్రకటించే అవకాశాలు లేకపోవడంతో బీజేపీకి ఇప్పుడు ఇదే ప్రధాన ఎజెండాగా మారింది. కచ్చితమైన వ్యూహంతో ముందుకు.. కచ్చితమైన వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లాలనే నిర్ణయంలో భాగంగానే అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం అంత బలంగా ఎత్తుకోని బీసీ నినాదాన్ని బీజేపీ తలకెత్తుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.. తాజాగా ఈ నిర్ణయాన్ని సూర్యాపేట సభలో అమిత్షా ప్రకటించడానికి ముందే సంస్థాగతంగా పార్టీలో వివిధ స్థాయిల్లో చర్చించి, ముఖ్యనేతలు, రాష్ట్రకార్యవర్గం, కౌన్సిల్ సభ్యుల స్థాయిలో అభిప్రాయసేకరణ చేపట్టారు. ఈ భేటీల్లోనూ రెడ్డి, ఇతర సామాజికవర్గనేతల నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో బీసీ ఎజెండాతోనే ముందుకెళితేనే మంచి ఫలితాలు సాధించవచ్చుననే నిశ్చితాభిప్రాయానికి జాతీయ నాయకత్వం వచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల గెలుపోటముల్లో బీసీల ఓట్లు కీలకం. రాష్ట్ర జనాభాలో 54 శాతం వరకు బీసీ వర్గాల వారు ఉన్నారనే అంచనాల నేపథ్యంలో అధికశాతం బీసీల ఓట్లు బీజేపీ ఖాతాలో పడేందుకు బీసీ సీఎం నినాదం పనిచేస్తుందని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అయితే ఇదే సమయంలో బీసీ ఎజెండాతో ఇతర సామాజికవర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా తగిన జాగ్రత్తలూ తీసుకోవాలని నిర్ణయించింది. విస్తృత ప్రచారంతో... వారిని చేరుకోవడమే కీలకం 2014 అసెంబీ ఎన్నికల్లో టీడీపీ బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకున్నా అది అస్సలు వర్కవుట్ కాలేదు. సీనియర్నేత టి దేవేందర్గౌడ్ కూడా బీసీల కోసం పార్టీ పెట్టినా ఈ వర్గాల నుంచి పెద్దగా మద్దతు కూడగట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో బీసీ సీఎం ఎజెండాతో ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపీ ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే బీసీ, ఎంబీసీ కులాల పెద్దలు, నేతలను కలిసి వారి మద్దతు కూడగట్టాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. బీసీ సీఎం అభ్యర్థిని ఎవరన్నది కూడా త్వరలో ప్రకటించే యోచనలో బీజేపీ ఉంది. 40కి పైగా సీట్లు ఇచ్చేలా.. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 40కి పైగానే బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేలా నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం సీట్లలో మూడోవంతుకు పైగానే సీట్లు ఇచ్చామనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. తొలిజాబితాను 52 మంది అభ్యర్థులతో విడుదల చేయగా, అందులో బీసీవర్గాలకు చెందిన వారికి 19 మందికి అవకాశం కల్పించారు. రెండో జాబితాలో ఒకరికి, తాజాగా 35 మందితో మూడో జాబితాను ప్రకటించగా అందులో 13 మంది బీసీలకు టికెట్లు కేటాయించారు. మొత్తంగా చూస్తే.. ప్రకటించిన 88 సీట్లలో 32 మంది బీసీ వర్గాలకు వచ్చారు. ఇంకా 31 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, జనసేనకు 11 సీట్లు కేటాయిస్తే.. మిగిలిన 20 సీట్లలో పదిదాకా బీసీలకు కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు. ఆయా కులాల వారీగా చూస్తే ముదిరాజ్–గంగపుత్రులు కలిపి (45 లక్షలు) యాదవ (35 లక్షలు), గౌడ (28 లక్షలు), మున్నూరుకాపు (22 లక్షలు), పద్మశాలి (18 లక్షలు),రజక (12 లక్షలు ),వడ్డెర (10 లక్షలు), ఇతర ఎంబీసీ కులాలకు చెందిన వారు 40 లక్షలదాకా ఉండొచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే ఆయా కులాల వారీగా టికెట్లు కేటాయిపునకు కసరత్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ పథకాలతో.. జాతీయస్థాయిలో బీజేపీ తీసుకున్న ‘సబ్కా సాథ్, సబ్ కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో బీసీలు, ఎంబీసీల అభ్యున్నతి కోసం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తే మంచి ఫలితాలను సాధించొచ్చునని భావిస్తున్నారు. మోదీ హయాంలో ఆయా బీసీవర్గాలకు అందిన ప్రయోజనాలను వివరించనున్నారు. ఎంబీసీ వర్గానికి చెందిన మోదీని బీజేపీ తొలిసారిగా ప్రధానిగా నియమించడం, కేంద్ర కేబినెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 27 మంది వెనుకబడిన తరగతుల వారి నియామకం, అదే విధంగా ఎస్సీ, ఎస్టీవర్గాల వారికి కూడా అత్యధిక ప్రాతినిధ్యం కల్పించడం... ఈ పరిణామాలను జనంలోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఇక సీఎం అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం, ఆనవాయితీ బీజేపీలో లేకపోయినా తెలంగాణలో ఈ సారి ముందుగానే బీసీ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం. -
బీసీ సీఎం ప్రకటనపై బీజేపీ కార్యాలయంలో సంబురాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని బీజేపీ అధిష్టానం చేసిన ప్రకటనకు కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు సంబురాలు జరిపారు. పార్టీ ఆఫీస్ బయట పటాసులు కాల్చి, డప్పులు వాయిస్తూ, స్వీట్లు పంచుకున్నారు. ప్రధాని మోదీ చిత్రపటానికి పార్టీ నేతలు క్షీరాభిషేకం చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ఓబీసీ మెర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్రాజ్, పార్టీ నేతలు ఆకుల విజయ, టి.వీరేందర్గౌడ్ ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కె.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా ప్రకటన చరిత్రాత్మకమని అన్నారు. రాష్ట్రంలో 52 శాతం బీసీ జనాభా ఉన్నా రాజకీయ పార్టీలు బీసీ సామాజిక వర్గాలను పూర్తిగా విస్మరించాయని చెప్పారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని, దీనిపై బీసీ సమాజం ఆలోచించాలని అన్నారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం కల్పిస్తే బీసీలు అభివృద్ధి చెందుతారని చెప్పారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కేసీఆర్కు బీసీలంటే చిన్నచూపని ఆరోపించారు. బీజేపీ 40 స్థానాలకు పైగా బీసీలకు అవకాశాలు కల్పించబోతోందని, తెలంగాణ సమాజం నిండు మనస్సుతో పార్టీని ఆశీర్వదించాలని కోరారు. బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణలో గడీల పాలన నడుస్తోందని, ఏ ఆశయాల కోసం తెలంగాణ సాధించుకున్నామో అవి నెరవేరలేదని అన్నారు. సీఎం స్థానం బీజేపీ బీసీలకు ఇవ్వడం బీసీ సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు. -
బీజేపీకి బీసీ బూస్ట్!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా రాష్ట్ర పర్యటన ఓవైపు.. బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని ఆయన చేసిన ప్రకటన మరోవైపు ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపాయి. బీసీలకు రాజ్యాధికారంలో ప్రాధాన్యత, చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని కొంతకాలం నుంచి చెప్తున్న బీజేపీ అధిష్టానం.. అధికారికంగా బీసీ ఎజెండాను ప్రకటించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఆ వర్గాలు ఎంతమేర ప్రభావితం అవుతాయి, ఏ మేర ఓట్లుగా మారుతాయని పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. ఎన్నికలకు ముందే బీసీని సీఎం చేస్తామని ఇలా ప్రకటించడం సాహసోపేతమైన నిర్ణయమేనని నేతలు అంటున్నారు. అంతేకాదు ఆ బీసీ అభ్యర్థి ఎవరనేది కూడా ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. బీజేపీ చిత్తశుద్ధిని చాటేలా.. 2014లోనే ఓబీసీ వర్గానికి చెందిన మోదీని ప్రధాని చేయడం, 2019లోనూ ఆయననే కొనసాగించడం, మోదీ కేబినెట్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా 27 మంది బీసీ, ఓబీసీ మంత్రులు, ఎస్సీ,ఎస్టీలకూ సముచిత సంఖ్యలో మంత్రి పదవులను బీజేపీ ఇచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా తెలంగాణలో బీసీ సీఎం ప్రకటన పార్టీ చిత్తశుద్ధిని చాటేలా ఉందని అంటున్నాయి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం రాష్ట్ర పర్యటన సందర్భంగా అమిత్షా పలువురు ముఖ్యనేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. గురువారం రాత్రి అమిత్షాతో కిషన్రెడ్డి, కె.లక్ష్మణ్, బండి సంజయ్, ఈటల రాజేందర్ వేర్వేరుగా సమావేశమైనట్టు తెలిసింది. ఈ సందర్భంగా పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి శుక్రవారం ఢిల్లీ వెళ్లే ముందు బేగంపేట విమానాశ్రయంలో అమిత్షాను కలసి ‘ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్ట్’ప్రతిని అందజేశారు. దానిని జాతీయ నాయకత్వం పరిశీలించి ఖరారు చేయనుంది. -
నేడు ‘జగనన్న చేదోడు’ సాయం
సాక్షి, అమరావతి: బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. సమాజానికి బ్యాక్ బోన్ క్లాస్ అని నిండు మనసుతో నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. దానిని మనసా, వాచా, కర్మణా ఆచరిస్తున్నారు కూడా. రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు రావాలని, వారు మిగతా ప్రపంచంతో పోటీపడి ఎదగాలన్న సంకల్పంతో జగనన్న చేదోడు పథకాన్ని చేపట్టారు. ఈ పథకానికి అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ఏడాదికి రూ.10 వేల సాయం అందిస్తున్నారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు సాయం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం శ్రీకారం చుడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ఈ పథకం లబ్దిదారులకు సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ. 325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇదీ పథకం ♦ షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ. 10,000 చొప్పున సాయం ♦ బుధవారం అందిస్తున్న సాయంతో కలిపి ఒక్కొక్కరికి రూ.40,000 వరకు ఆర్థిక సాయం అందించిన జగనన్న ప్రభుత్వం. ♦ గురువారం అందిస్తున్న సాయంతో కలిపి ఈ 4 ఏళ్ళలో కేవలం ఈ పథకం లబ్దిదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లు ♦ 1,80,656 మంది టైలర్లకు ఈ విడత సాయంగా రూ. 180.66 కోట్ల లబ్ధి ♦ 39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 39.81 కోట్ల లబ్ధి ♦ 1,04,551 మంది రజకులకు ఈ విడతలో రూ. 104.55 కోట్ల లబ్ధి ♦ లంచాలకు, వివక్షకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్ ప్లే చేసి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక. ♦ ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే మిస్ కాకుండా సాయం అందాలని తపన పడుతున్న జగనన్న ప్రభుత్వం... ♦ అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ జూన్, డిసెంబర్ నెలల్లో సాయం అందజేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం. -
‘కులగణన’ నివేదిక సభలో ప్రవేశపెట్టడంపై హర్షం
సాక్షి, అమరావతి: కులగణన అంశానికి సంబంధించిన నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టడంపై బీసీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, బీసీ సంక్షేమం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ,, ఎమ్మెల్యేలు ఎం శంకరనారాయణ, పొన్నాడ సతీష్ ఉన్నారు. -
బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: వెనుకబడిన వర్గాల సమస్యలు పరిష్కరించాలంటూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా నినాదాలతో హోరెత్తింది. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, లేకపోతే సమాజంలో మార్పు ఉండదని ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మహిళా బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీల బతుకులు మార్చే బీసీ బిల్లును పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టడంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయాలని, పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, డాక్టర్ ఎన్ మారేష్ల అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో ఆర్.కృష్ణయ్యతో పాటు ఎంపీలు బీద మస్తాన్ రావు, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో జబ్బల శ్రీనివాస్, బత్తుల వెంకటరమణ, పద్మలత, నీలం వెంకటేష్, భూపేష్ సాగర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టి అందులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఈమేరకు ఆయన శనివారం రాజకీయ పార్టీ లకు లేఖలు రాశారు. మహిళా బిల్లు, బీసీలకు ప్రత్యేక వాటా కల్పించేందుకు కేంద్ర ప్రభు త్వంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఇందులో భాగంగా బీజేపీతో పాటు కాంగ్రెస్, జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే, ఎన్సీపీ, రాష్ట్రీయ జనతాదళ్ తదితర పార్టీల అధ్యక్షులకు కృష్ణయ్య వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రస్తుతం చట్టసభల్లో మహిళలకు అతి తక్కువగా ప్రాతినిధ్యం ఉందన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం వా టా ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదన్నారు. -
మంత్రి ఈశ్వర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్పై రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దళితుల సంక్షేమం అమలైందన్న విషయాన్ని ఈశ్వర్ గుర్తుంచుకోవాలని అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో, గత మూడేళ్లలో ఎంతమందికి దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో తాము ఓట్లు అడుగుతామని, బీఆర్ఎస్కు దమ్ముంటే డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిన చోట్ల ఓట్లు అడగాలన్నారు. గత నాలుగేళ్లుగా ఏమీ పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. దళితుల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్ మాట తప్పారని, వాటిని తాము అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో ఆయన ఉలిక్కిపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని కాకుండా దళితులకు అన్యాయం చేసిన కేసీఆర్ను ఈశ్వర్ ప్రశ్నించాలని జీవన్రెడ్డి సూచించారు. -
టీడీపీ కొత్త డ్రామా.. అర్జంటుగా బీసీ కార్డు గుర్తుకొచ్చిందా?
సాక్షి, విశాఖపట్నం: బీసీ నేత అయ్యన్నను అరెస్టు చేశారంటూ టీడీపీ కొత్త డ్రామాకు తెరతీసింది. అర్జంటుగా టీడీపీకి బీసీ కార్డు గుర్తుకొచ్చింది. నానా బూతులు తిడుతున్నప్పుడు అయ్యన్నకు గుర్తుకు రాని బీసీ కార్డు.. అయ్యన్నను అదుపు చేయనప్పుడు గుర్తుకు రాని బీసీ కార్డు.. అరెస్ట్ అనగానే టీడీపీకి గుర్తుకువచ్చిందా? అంటూ ఆ పార్టీ వైఖరీపై పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు.. ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి.. అనకాపల్లి జిల్లా వెంపడు టోల్గేట్ వద్ద వదిలేశారు. ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించిన సంగతి తెలిసిందే. పత్రికల్లో రాయలేనంత దారుణంగా అయ్యన్న రెచ్చిపోయారు. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. చదవండి: బాబు ‘బ్లాక్మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్ -
సంక్షేమ జాతర.. అర్హులకు టోకరా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి :రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశ పెడుతోంది. అయితే అవి అర్హులకు అందడం లేదని, నిరుపేదలకు నిరాశే ఎదురవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ దన్ను లేదా బలమైన సిఫారసు ఉంటేనే గృహలక్ష్మి, బీసీ, మైనారిటీ బంధు పథకాల జాబితాలో చోటు దక్కుతోందని ఆయా పథకాలకు అన్ని విధాలా అర్హులైన వారు వాపోతున్నారు పోటీ తీవ్రంగా ఉండటంతో.. ‘ఇప్పటికైతే పార్టీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలకే పంచేద్దాం..ఈ మేరకు గ్రామాల వారీగా జాబితాలు పంపండి’ అంటూ ఎమ్మెల్యేల కార్యాలయాల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జాబితాలు సిద్ధం అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3.57 లక్షల ఇళ్లకు గాను 14.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. బీసీబంధు పథకం కింద ఒక్కో నియో జకవర్గంలో 300 మందికి, మైనారిటీ బంధు కింద 100 మందికి ఆర్థిక సహా యం చేయాలని నిర్ణయించారు. ఈ రెండు పథకాలకూ వేలల్లో దర ఖాస్తు లు వచ్చాయి. పలు జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపికను దాదాపు పూర్తి చేశారు. వాస్తవానికి అత్యంత నిరుపేదలకు, ఇచ్చే ఆర్థిక సహాయాన్ని జీవనోపాధికి ఉపయోగించుకునే సాంకేతికత, ఇతర పరిజ్ఞానం ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నా.. ఎమ్మెల్యేలు చెప్పినవారికి, బంధుగణానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కొన్ని చోట్ల అర్హుల జాబితాల్లో చేర్చేందుకు 10 నుంచి 30% కమీషన్ మాట్లాడుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను తమసిబ్బందితో కలిసి పరిశీలించాల్సిన జిల్లా యంత్రాం గాలు, కనీస పరిశీలన లేకుండానే ఆమోద ముద్ర వేసేసి చేతులు దులుపు కొంటూ సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పథకం ఏదైనా అదే తీరు.. డబుల్ బెడ్రూంలు దక్కని నిరుపేద తన సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే మూడు దశల్లో రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఇందులో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20, ఎస్టీలకు10, ఇతరులకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఆయా కులాల్లో దివ్యాంగులుంటే వారికి 5 శాతం కేటాయించాలి. కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో ఈ నిబంధనలు పాటించలేదు. చేతి వృత్తులే జీవనాధారమైన నాయీ బ్రాహ్మణ, రజక, సగర పూసల, మేదరి, వడ్డెర, ఆరెకటిక, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, కంచరి ఇతర ఎంబీసీ కులాల్లో పేదరికం, వృత్తి నైపుణ్యం ఆధారంగా ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాధాన్యతలేవీ పాటించటం లేదని జిల్లా కలెక్టర్లకు చేరిన జాబితాలు చూస్తే అర్థం అవుతోంది. మైనారిటీ బంధులో లబ్ధిదారుల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ ఇందులో కూడా నిబంధనలు, ప్రాధాన్యతల పాటింపుపై అక్కడక్కడా ఆరోపణలు విన్పిస్తుండటం గమనార్హం. పథకాలు కలెక్టర్లకు అప్పగించాలి.. ప్రస్తుతం అమలు చేస్తున్న దళిత, మైనారిటీ, బీసీ బంధుతో పాటు నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం పథకాలు పూర్తి పక్కదారి పట్టాయి. రాష్ట్ర ప్రజలు పన్నులతో వచ్చిన ఆదాయం దుర్వినియోగం అవుతోంది. నిజమైన అర్హులకు కాకుండా గ్రామ స్థాయి పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల ద్వారా జరుగుతున్న ఎంపికలతో వాస్తవ పేదలకు న్యాయం జరగడం లేదు. వెంటనే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో కలెక్టర్లకు అప్పగించడం ద్వారా ప్రభుత్వం అందించే ప్రతి పైసా నిరుపేదల ఆర్థిక ప్రగతికి ఉపకరించేలా చర్యలు తీసుకోవాలి. – పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గృహ‘లక్షీ కటాక్షం’ లేదంట పూరి గుడిసెలో జీవితాన్ని వెల్లదీస్తున్న ఈమె పేరు గాలి ఉపేంద్ర. మహబూబా బాద్ జిల్లా నల్లెల గ్రామం. డబుల్ బెడ్రూం రాలేదు. చివరకు సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకంలో రూ.3 లక్షలైనా ఇస్తారన్న ఆశతో దరఖాస్తు చేసింది. అన్ని అర్హతలున్న తనకు లబ్ధి చేకూరుతుందని ఎదురుచూసింది. కానీ ఈ మారు కూడా ఇళ్లు ఇవ్వటం లేదని గ్రామ నాయకులు తేల్చేశారు. అర్హతలున్నా ఎంపిక చేయలేదు..! ఈమె పేరు రాచమల్ల మంజుల. సీఎం కేసీ ఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియో జకవర్గంలోని అలిరాజపేట గ్రామం. ఇటీ వల భర్త చనిపోవటంతో కొడుకు శ్రీకాంత్తో కలిసి ఇస్త్రీ షాపునకు అవసరమయ్యే పని ముట్లు కొనేందుకు బీసీబంధు పథకంలో లక్ష రూపాయల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇలా ఈ ఊరిలో మొత్తం 33 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం ఇద్దరినే ఎంపిక చేశారు. అయితే ఆ ఇద్దరు తమకంటే అన్ని విధాలుగా బాగా ఉన్నవారేనని మంజుల పేర్కొంది. -
బీసీ వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్: జాజుల
సాక్షి,యాదాద్రి/కాజీపేట రూరల్: ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేసి తన వ్యతిరేకతను చాటుకున్న బీఆర్ఎస్ను వదిలేది లేదని, వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఆ పార్టీ కి గుణపాఠం చెబుతామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ సీట్ల కేటాయింపుపై గురువారం యాదాద్రి జిల్లా భువనగిరిలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే రెడ్లు, రావుల సమితిగా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాను వెంటనే సవరించి 60 సీట్లను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 136 కులాల్లో కేవలం ఆరింటికి మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారని, మిగిలిన 130 కులాలకు ప్రాతినిధ్యమే లేదన్నారు. మహిళలకు 7 టికెట్లు కేటాయించగా, అందులోనూ ఆరింటిని అగ్రకుల మహిళలకు ఇచ్చి, బీసీ మహిళలపట్ల వివక్ష చూపార ని ధ్వజమెత్తారు. కాగా, హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్ వైష్ణవిగ్రాండ్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు కూడా జనాభా ప్రకారం బీసీలకు సీట్లు ప్రకటించాలని, సామాజిక న్యాయం, సబ్బండ కులాలకు రాజ్యాధికారం దక్కాలనే లక్ష్యంతో సెప్టెంబర్ 10న హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో తలపెట్టిన బీసీల సింహగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలు అధికారం కోసం తిరుగుబాటు చేయాలన్నారు. -
బీసీల సభలో టీడీపీ నేతలే ఎక్కువ..
రామవరప్పాడు/గన్నవరం : లోకేశ్ యువగళం పాదయాత్ర కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు, ప్రయాణికుల సహనానికి పరీక్ష పెట్టింది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరుకు చేరుకున్న పాదయాత్ర విజయవాడ మీదుగా సోమవారం గన్నవరం నియోజకవర్గానికి చేరుకోగా.. సాయంత్రం నిడమానూరు క్యాంప్ సైట్లో బీసీ సామజికవర్గాల ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. సమావేశంలో బీసీ ప్రతినిధుల కంటే టీడీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు. సమావేశంలో.. ‘ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ముస్లిం మైనార్టీలకు ఏం చేశాడ’ని లోకేశ్ను ప్రశ్నించేందుకు ప్రయత్నించిన ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ మాట్లాడుతుండగానే జనం మెల్లగా జారుకున్నారు. గన్నవరం చేరుకున్న పాదయాత్ర అనంతరం.. లోకేశ్ పాదయాత్ర సోమవారం రాత్రి కృష్ణాజిల్లా గన్నవరం చేరుకుంది. అంతకుముందు, కేసరపల్లి వద్ద మండలంలోకి ప్రవేశించిన యాత్ర ఎయిర్పోర్ట్, దుర్గాపురం, గన్నవరం మీదుగా చిన్నఆవుటపల్లిలోని ఎన్ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆవరణలో క్యాంప్ సైట్కు చేరుకుంది. పాదయాత్ర జాతీయ రహదారిపై కొనసాగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నప్పటికీ టీడీపీ శ్రేణుల అత్యుత్సాహం ఫలితంగా ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. కొంతమంది మద్యం మత్తులో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. ఇక లోకేశ్ సమక్షంలో కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. మరోవైపు.. మండల పార్టీ ఇచ్చిన రూటుకు భిన్నంగా ఎమ్మెల్యే కార్యాలయం మీదుగా పాదయాత్ర వెళ్లాని టీడీపీ నేతలు పట్టుబట్టారు. అయితే, పోలీసులు అంగీకరించలేదు. దీంతో రూట్మ్యాప్ ప్రకారం పాదయాత్ర కొనసాగింది. -
నా విజన్తో యువత ఆకాశానికి
సాక్షి అమలాపురం: తన విజన్తో యువత ఆకాశానికి ఎగిరిపోతారని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. తన సైన్యం యువతని.. వారికి ఉపాధి కల్పించే బాధ్యత తనదేనన్నారు. అమలాపురంలో వర్క్ స్టేషన్ ఏర్పాటు చేస్తానని.. ఇక్కడే ఉంటూ అమెరికాలో పనిచేసేలా చేస్తానని వెల్లడించారు. బీసీల్లో 150 కులాలకు మేలు చేసి వారి రుణం తీర్చుకుంటానన్నారు. కాపులకు కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లో ఐదు శాతం కేటాయిస్తానని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. జగన్కు ఎక్స్పెయిరీ డేట్ వచ్చిందన్నారు. ఆయనలా తాను అప్పులు చేయనని.. సంపద సృష్టించి సంక్షేమం వైపు నడిపిస్తానని తెలిపారు. జిల్లా పేరుతో పచ్చని కోనసీమలో అమాయకులపై తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, మద్యం అమ్మకాలతో దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. తిరుమలలో చిరుతలు ఉంటే మీకు కర్రలు ఇస్తారంట.. ఇంటికొక కర్ర పట్టుకుని వైఎస్సార్సీపీ దొంగలను కొట్టండని ప్రజలను రెచ్చగొట్టారు. వైఎస్సార్సీపీ నేతలు ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం తెచ్చారా అని నిలదీశారు. కోనసీమలో కొబ్బరి, ఆక్వాలకు ప్రత్యేక పాలసీ తెస్తానని చెప్పారు. ఈ సభలో పార్టీ నేతలు గంటి హరీష్ మాధుర్, అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. అమలాపురం సభ అట్టర్ ఫ్లాప్ కాగా అమలాపురంలో చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అనుకున్న దానిలో మూడో వంతు కూడా జనం రాలేదు. తొలి నుంచి జనం రాక మీద నమ్మకం లేని పార్టీ నేతలు గడియారస్తంభం సెంటర్లో సమావేశ వేదికను రివర్స్లో ఏర్పాటు చేశారు. జనం రాకపోతే సెంటర్కు ఆనుకుని ఉన్న రోడ్లు ఖాళీగా కనిపించే ప్రమాదముందని ఇలా చేశారు. ఫ్లెక్సీలు కట్టి రోడ్డును ఇరుకుగా చేసినా జనం రాకపోవడంతో పార్టీ నేతలు డీలా పడ్డారు. -
సర్దార్ పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం
గన్పౌండ్రీ (హైదరాబాద్): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో సర్దార్ పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ, జై గౌడ్ ఉద్యమం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడ్ మహరాజ్ 373వ జయంతి జాతీయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ కులస్తుల అనేక సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. పాపన్న చరిత్ర తెలుసుకుంటే జాతిపట్ల అప్పట్లో ఎంత వివక్షత ఉందో తెలుస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. ట్యాంక్బండ్పై పాపన్న విగ్రహాన్ని పెట్టేందుకు జీవో జారీ చేశామని హెచ్ఎండీఏ అధికారులు స్థలాన్ని అన్వేషీస్తున్నట్లు వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ, బహుజనులంతా ఐక్యంగా ఉన్నప్పుడే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు భరత్కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. 75 సంవత్సరాల రాజమండ్రి పార్లమెంటు చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బీసీ వ్యక్తి పార్లమెంటుకు ఎంపిక కావడమే అందుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా పాపన్నగౌడ్ బయోపిక్పై రూపొందించిన సినిమా వాల్పోస్టర్ను ఆవిష్కరించగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ పల్లే రవికుమార్గౌడ్, జై గౌడ్ ఉద్యమం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వి.రామారావుగౌడ్ పాల్గొన్నారు. -
మందు పోయను, ఓడిపోతే మాత్రం.. : కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ప్రతి పక్షాలు ఓట్లు అడగడానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారికి చెప్పి నిలదీయండి అంటూ తెలంగాణ సమాజానికి మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. బీసీ బందు పథకంలో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ జరిగింది. సుమారు 600 మందికి చెక్కులను కేటీఆర్ స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా. మందు పోయను. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ఎలాగైనా మీకు సేవ చేసుకుంటూనే ఇంట్లో కూర్చుంటా అంటూ వ్యాఖ్యానించారాయన. అలాగే.. పింఛన్ పెంపుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా కేటీఆర్ స్పందించారు. ‘‘ప్రతిపక్షాలు మాకు సలహాలు ఇస్తే కేసీఆర్ పెన్షన్ పెంచలేదు. ఆరువందల మందికి పెన్షన్ వస్తే వార్త కాదు.. ఆరుగురికి రాకపోతే ఇవాళ రేపు వార్త అవుతోంది. తెలంగాణాలో 12 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చాం. వేములవాడ తిప్పాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 70% శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లాలో వచ్చే నెలలో కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీ ప్రారంభిస్తాం. చేనేత దినోత్సవం సందర్భంగా 9 రకాల పథకాలు అమలు చేసుకున్నాం. అలాగే.. బీసీబంధు అంటే లోన్ కాదు. ఇది కేవలం మీ(బీసీ లబ్ధిదారుల్ని ఉద్దేశించి..) కులవృతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇస్తున్న గ్రాంట్ మాత్రమే. తిగిగి కట్టవలసిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన.. ‘‘వేములవాడకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. 24 గంటలు మంచి నీరు అందేలా చర్యలు చేపడుతున్నాం. వేములవాడ ఆలయాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తాం’’ అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇదీ చదవండి: కోకాపేట వేలంపాటపై సంచలన ఆరోపణలు -
బీసీల పక్షాన కాంగ్రెస్కు మద్దతివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీ సంఘాల పక్షాన తమకు మద్దతివ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, మాజీ ఎంపీ వి.హనుమంతరావు శనివారం సాయంత్రం విద్యానగర్లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయానికి వెళ్లి ఆర్. కృష్ణయ్యను కలిశారు. బీసీల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, బీసీల కులగణన చేపట్టాలన్న డిమాండ్కు రాహుల్గాంధీ మద్దతు ప్రకటించారని వారు గుర్తు చేసి.. తమకు సంఘీభావం తెలపాలని కృష్ణయ్యను కోరారు. ఇందుకు స్పందించిన ఆయన బీసీలకు సంబంధించిన 18 డిమాండ్లను కాంగ్రెస్ నేతల ముందుంచి వాటిని పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు. కాగా, వచ్చే ఎన్నికల్లో బీసీల మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగానే కృష్ణయ్య ఆఫీసుకి, ఇంటికి ఠాక్రే, వీహెచ్ వెళ్లారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. రాజకీయాలకు సంబంధం లేదు: కృష్ణయ్య ఠాక్రే, వీహెచ్లతో సమావేశం అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ మధ్య రాజకీయ చర్చ జరగలేదని, బీసీ డిమాండ్లపైనే చర్చ జరిగిందని చెప్పారు. బీసీ సంఘం అధ్యక్షుడిగా మాత్రమే వారు తనను కలిశారని స్పష్టం చేశారు. బీసీలకు సంబంధించిన 18 డిమాండ్లను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టాలని కోరానని, అందుకు కాంగ్రెస్ నేతలు సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో బీసీల పక్షపాతిగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తున్నారని, అందులో భాగంగానే పార్లమెంటులో వైఎస్సార్సీపీ పక్షాన బీసీ బిల్లు పెట్టి 14 పార్టీల మద్దతు కూడగట్టామని వెల్లడించారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి స్పష్టం: ఠాక్రే ఆర్.కృష్ణయ్యతో చర్చల తర్వాత ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అందుకే కృష్ణయ్యతో మాట్లాడేందుకు తాము వచ్చామన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. కాగా, బీసీ సంఘం కార్యాలయంపైనే ఉన్న కృష్ణయ్య నివాసంలోకి ఠాక్రే, వీహెచ్లు వెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. -
ఐఐటీ, ఐఐఎంల్లోని బీసీ విద్యార్థులకు...పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్పై హర్షం
ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎంలో చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రకటించడాన్ని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లపల్లి అంజి హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివే సుమారు ఐదున్నర లక్షల విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బుధవారం విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందిస్తున్నారని గుర్తుచేశారు. ఇక్కడ మాత్రం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించకపోగా కోట్ల రూపాయల బకాయిలు ఉండటంతో విద్యార్థులను కళాశాలల యాజమాన్యం విద్యాభ్యాసం పూర్తయినా సర్టీఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అడ్మిషన్ ఇవ్వాలని, అవసరమైతే అదనపు సెక్షన్లు తెరవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మెస్ చార్జీలను రూ. 1575 నుంచి రూ. 2500లకు పెంచాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్యను 300 మందికి మాత్రమే ఎందుకు కుదించారని ప్రశ్నించారు. బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎం చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ, ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంసీఏ చదివే విద్యార్థులకు ఎందుకు నిరాకరిస్తుందని ఇది సవతి తల్లి ప్రేమ కాదా అని ప్రశ్నించారు. బీసీ హాస్టల్స్కు ఒక్క సొంత భవనం కూడా లేదని అద్దెలకు మాత్రం కోట్లాది రూపాయలు చెల్లిస్తూ అధికారులు మధ్య దళారుల పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. -
తెలుగు రాష్ట్రాల్లో బీసీలంటే గుర్తొచ్చేది ఆర్ కృష్ణయ్య పేరే
-
Telangana: కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం తీపికబురు
సాక్షి, హైదరాబాద్: బీసీ వర్గాలలోని కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కులవృత్తులు చేసుకునేవారు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేసుకునేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలతో పాటు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం నుంచే అవకాశం కల్పించింది. గత కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెబ్సైట్ను మంత్రి గంగుల మంగళవారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం నుంచి ఈనెల 20 వరకు https://tsobmmsbc.cgg. gov. in వెబ్సైట్ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఫొటో, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం తదితర వివరాలతో సరళంగా దరఖాస్తు ఫారాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. వీటిని ఆయా జిల్లాల యంత్రాంగం పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈనెల 9న మంచిర్యాలలో ప్రారంభించనున్నారు. అదేరోజు నుంచి లబ్దిదారులుగా ఎంపికైన వారికి ఆర్థిక సహాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా చెక్కుల రూపంలో అందించనున్నారు. వెనుకబడిన వర్గాలలో అనాదిగా కులవృత్తులు, ఇతర చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి వచి్చన పథకమే ఈ లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకం అని గంగుల అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు పాల్గొన్నారు. బీసీల్లోని ఎన్ని వర్గాలకు? వెనుకబడిన వర్గాలలో కులాలను బట్టి చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వపరంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ పథకం ఉద్దేశం. బీసీ కులాల్లో లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకానికి ఎవరిని అర్హులుగా చేయాలన్న విషయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులదే తుది నిర్ణయం. బీసీ వర్గాలలో కుల, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందని ఓ అధికారి తెలిపారు. చదవండి: మండిపోయిన మంగళవారం.. వచ్చే 5 రోజులు వడగాడ్పుల హెచ్చరిక ఇవీ అర్హతా నిబంధనలు ►ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపచేస్తారు. ►ఈ పథకం కింద లబి్ధపొందగోరే వారు గ్రామాల్లో అయితే లక్షన్నర మేరకు, పట్టణాల్లో రూ.2 లక్షల వరకు ఆదాయ పరిమితిని కలిగి ఉండాలి. ►దరఖాస్తు చేసుకునే వారి వయసు 18–55 ఏళ్ల మధ్య ఉండాలి. ►గడిచిన ఐదేళ్లలో వివిధ పథకాల కింద రూ.50 వేల కంటే ఎక్కువ లబ్ధి పొందిన వారు అనర్హులు. -
పవన్ కళ్యాణ్ బీసీలకు క్షమాపణ చెప్పాలి
-
బీసీలకు గౌరవం పెంచిన గొప్ప ముఖ్యమంత్రి జగన్: మంత్రి ఉష శ్రీ చరణ్
-
బీసీలకు భరోసా..
-
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో బీసీ కుటుంబాల్లో వెలుగులు : మంత్రి చెల్లుబోయిన
-
బిగ్ క్వశ్చన్: బీసీల గుండె చప్పుడుగా వైఎస్ జగన్
-
బీసీల పల్లకీ మోస్తున్న మహానేత సీఎం జగన్ : ఉష శ్రీ చరణ్
-
మీ గుండెల్లో జగన్.. జగన్ గుండెల్లో మీరు..
-
బీసీలకు రాజ్యసభ సభ్యుల వరకు పదవులు దక్కాయి : మంత్రి బొత్స సత్యనారాయణ
-
డిసెంబర్ 7 న జయహో బీసీ సభ
-
జయహో బీసీ మహాసభపై వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల సమావేశం
-
బీసీ ఆత్మీయ సమ్మెళనం
-
సామాజిక న్యాయానికి బీసీ జనగణన
భారత సమాజం కులాల దొంతర అన్న సంగతి తెలిసిందే. ఈ దొంతరలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని ఆదిమ తెగలవారూ, అసలు మనుషులుగా గౌరవం పొందని హిందూ సామాజిక బహిష్కృత ఎస్సీలూ అట్టడుగున ఉంటే... అటు ఓసీలలా గౌరవానికి నోచుకోనివారూ, ఇటు ఎస్సీల్లా మరీ తక్కువ చూపుకు గురికాని బీసీలు మధ్యస్తరంలో ఉన్నారు. దేశ జనాభాలో వీళ్లశాతం సగం కన్నా ఎక్కువే. వీరంతా సంప్రదాయ వృత్తులను అనుసరిస్తూ దేశ సంపద సృష్టిలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో అణగారిన, వెనుక బడిన వర్గాలకు ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించినా... జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి అందడం లేదనేది ఒక ప్రగాఢమైన విశ్వాసం రిజర్వేషన్ పొందుతున్న వర్గాల్లో ఉంది. మరీ ముఖ్యంగా బీసీల్లో ఈ అభిప్రాయం ఉంది. తాము దేశ జనాభాలో ఎంతమందిమి ఉన్నామో తెలిస్తే... ఆ నిష్పత్తిలో రిజర్వేషన్లు పొందవచ్చని వారు భావిస్తున్నారు. అందుకే బీసీ జన గణన జరగాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఈ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినా అది పట్టించుకోవడం లేదు. దీంతో అనేక రాష్ట్రాల్లో బీసీ జనాభాను లెక్కించాలనీ, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనీ కోరుతూ ఉద్యమాలు రగులుకుంటున్నాయి. బీసీ జనగణన చేయమని అడిగితే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వంపై దీర్ఘకాలిక ఉద్యమం చేయక తప్పని స్థితి వచ్చింది. ఈ ఉద్యమం దేశ చరిత్రలోనే మరో శాంతియుత బీసీల హక్కుల సాధన జాతీయ ఉద్యమంగా కొనసాగాలి. అది ఏ విధంగా అంటే 14 ఏళ్లు శాంతియుతంగా కొనసాగిన మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమ నమూనాలో కొనసాగాలి. వ్యవసాయరంగాన్ని రక్షించుకోవడానికి ఇటీ వల జరిగిన శాంతియుత రైతాంగ ఉద్యమ రూపం ధరించాలి. రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం భావించి ముస్లింలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానం పంపి ఇప్పటికి సరిగ్గా ఆరేళ్లు అవుతోంది. కేంద్రం ఇప్పటికీ పెదవి విప్పటం లేదు. ముఖ్యమంత్రి నితీష్కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం బీసీ జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకుని కేంద్రానికి పంపింది. హేమంత్ సొరేన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 60 శాతం నుంచి 77 శాతానికి రిజర్వేషన్లు పెంచాలనే చట్టసవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. రిజర్వేషన్ల పెంపుకోసం రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో మార్పులు చేయాలని కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో తెలంగా ణకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఇలా రిజర్వేషన్ల శాతం పెరిగినప్పుడే జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కుతుంది. రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ను అనుసరించి భారత దేశంలో ప్రప్రథమంగా 1953 జనవరిలో కాకా కాలేల్కర్ నేతృత్వంలో వెనుకబడిన తరగతుల కమిషన్ను నియ మించడం జరిగింది. ఇది 1955లో తన నివేదికను సమ ర్పిస్తూ దేశంలో 2399 కులాలను వెనుకబడిన కులాలుగా అందులో 837 కులాలను అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించి కొన్ని సిఫార్సులు చేసింది. అయితే ప్రభుత్వం ఈ కమిషన్ చేసిన సిఫార్సులను తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం 1979లో బి.పి. మండల్ నేతృత్వంలో రెండవ బీసీ కమిషన్ను ఏర్పాటుచేయడం జరిగింది. ఈ కమిషన్ బీసీల జనాభాను 52 శాతంగా లెక్కకట్టి వీరికి విద్యా ఉద్యోగ రంగాల్లో 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలని 1980లో నివేదిక సమర్పించింది. అయితే, ఈ సిఫారసులు 1992 నుండి మాత్రమే అమలులోకి వచ్చాయి. 2017 అక్టోబర్లో జస్టిస్ రోహిణి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ను నియమించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాను వర్గీకరించడం ఈ కమిషన్ ముఖ్య విధి. ఇప్పటికి ఈ కమిషన్ గడువును 13 సార్లు పొడిగించడం జరిగింది. ఇంతవరకు ఈ కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత బి.ఎస్. రాములు నేతృత్వంలో నియమించబడ్డ తొలి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఏప్రిల్ 2017లో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తూ, బీసీ–ఇ గ్రూప్లో ఉన్న ముస్లింలలోని కొన్ని వెనుకబడిన వర్గాలకు అందించబడుతున్న రిజర్వే షన్లను 4 శాతం నుండి 10 శాతానికి పెంచాలని సిఫారసు చేయడం జరిగింది. ఈ సిఫారసులను ప్రభుత్వం అంగీక రిస్తూనే, సుధీర్ కమిషన్, ఇతర నివేదికలను అనుసరించి వీరికి రిజర్వేషన్లను పన్నెండు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2019లో ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ మరో నివేదిక సమర్పిస్తూ... సంచార, అర్ధ సంచార జాతులకు చెందిన 17 కులాలను తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేయడం జరిగింది. ఈ సిఫారసులను కేసీఆర్ క్యాబినెట్ యధాతథంగా ఆమోదించి అమలుచేయడం జరిగింది. 2011లో జరిగిన సామాజిక ఆర్థిక కులగణన వివరాలు ఉన్నాయని చెప్పిన కేంద్రం ఆ వివరాలు ఎందుకో బైట పెట్టకుండా దాటవేసింది. దేశంలో సగానికి పైగా జనాభా వున్న బీసీల విషయంలో కేంద్రం లెక్కలేనితనం చూపడం దారుణమైనది. దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు? వీళ్ల ఆర్థిక స్థితి గతులేమిటి? వీరి చదువులు ఎలా వున్నాయి? వీరి ఉద్యోగ అవకాశాలేమిటి? వీరింకా దారిద్య్ర రేఖకు దిగువన ఉండటానికి కారణాలు ఏమిటి? బీసీలలో ఇంకా సంచారజాతులుగా వున్న వారి దీనస్థితికి విముక్తి ఎప్పుడు? ఈ సమాచారం లేకుండా దేశాభివృద్ధికి వ్యూహాలు రచించడం కష్టం. అందుకే బీసీ జన గణన అత్యంతావశ్యం. జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ -
బీసీల గురుంచి మాట్లాడే అర్హత చంద్రబాబు కు లేదు : మంత్రి కారుమూరి
-
చంద్రబాబుకు గత ఎన్నికల్లో బుద్ది చెప్పినా సిగ్గు లేదు : ఎమ్మెల్సీ పోతుల సునీత
-
తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరి తెలుగుదేశం పార్టీలో కీలక నేత గంజి చిరంజీవి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని అందులో చేరాను. నేతి బీరకాయలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో తెలుగుదేశం పార్టీలో బీసీలకు చోటు ఉండదనేది అంతే నిజం. పార్టీ కోసం అహర్నిశలు పని చేశా. అయితే టీడీపీలో కొందరు నన్ను మానసికంగా హత్య చేశారు. బీసీ నేత అయినందుకే నన్ను అవమానపరిచారు. మంగళగిరి నియోజకవర్గం చేనేతలకు సంబంధించినది. ఆ ఒక్క సీటును కుమారుడి కోసం లాగేసుకొని మాకు ద్రోహం చేశారు. లోకేష్ కోసం ఒక పథకం ప్రకారం బీసీ సామాజికవర్గానికి చెందిన నన్ను పక్కకు పెట్టారు. పార్టీని నేను మోసం చేస్తే నేను నమ్ముకున్న దేవుడు నన్ను నాశనం చేస్తాడు. ఒకవేళ పార్టీ నన్నుమోసం చేస్తే అదే దేవుడు తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తాడు. 2019 చివరి వరకు సీటు నీదే అని నమ్మించి టికెట్ ఇవ్వకుండా తీవ్రంగా అమానించారని' గంజి చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్సార్సీపీతోనే: బాలినేని) -
బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్.. అసెంబ్లీలో మంత్రి వేణుగోపాలకృష్ణ
సాక్షి, అమరావతి: బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ అని.. 1931లో జనగణన ఆధారంగానే బీసీలను ఇప్పటికీ లెక్కిస్తున్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని అసెంబ్లీలో మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, వెనుకబడిన కులాల జనగణన అత్యవసరం అని.. నిజమైన నిరుపేదలకు ఎంతగానో ఉపయోగమన్నారు. సంక్షేమ పథకాల అమలకు ఇది ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. చదవండి: ప్రత్యేక వాదం వచ్చింది అందుకే.. మండలిలో మంత్రి బుగ్గన ‘‘90 ఏళ్లుగా బీసీల లెక్కలు దేశంలో లేవు. బీసీల జీవన స్థితిగతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీసీల్లో 139 కులాలు ఉన్నాయి. కుల గణన కచ్చితంగా జరగాలి. ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ వరంగా మారింది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో బీసీలకు అనేక మేళ్లు. బీసీలను చైతన్యం దిశగా సీఎం జగన్ నడిస్తున్నారు. ఇది బీసీల ప్రభుత్వం. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం. కాంట్రాక్టు పనుల్లో బీసీలకు 50 శాతం. బీసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. వైఎస్సార్ చేయూత గొప్ప పథకం. బీసీల కోసం వైఎస్సార్ రెండడుగులు ముందుకు వేస్తే.. వైఎస్ జగన్ పదడుగులు వేస్తున్నారని’’ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. -
బీసీబంధు కోసం 8న రాష్ట్రవ్యాప్త ధర్నాలు
ముషీరాబాద్ (హైదరాబాద్): బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతీ కుటుం బానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డి మాండ్ చేస్తూ ఈ నెల 8న అన్ని జిల్లా కలెక్టరేట్లను ముట్టడించాలని, ధర్నాలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని బీసీ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. -
కరోనాతో కుటుంబ పెద్ద మరణిస్తే.. రూ. 5 లక్షలతో స్వయం ఉపాధి
సాక్షి, హైదరాబాద్: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి కరోనా కాటుకు బలి అయితే, ఆ కుటుంబ సభ్యులు వీధిన పడకుండా చేయూత ఇచ్చేందుకు జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్బీసీఎఫ్డీసీ) ‘స్మైల్’కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ, ఆ కుటుంబానికి ఆర్థికపరమైన అంశాల్లో ఆసరా ఇచ్చే లక్ష్యంతో స్మైల్ను ముందుకు తీసుకొచ్చింది. ఏడాదిన్నరగా కొనసాగుతున్న కోవిడ్–19 వ్యాప్తితో చాలా కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. పలు రంగాల్లో ఉద్యోగాల కోత విధించడంతో ఉపాధి కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. కోవిడ్–19తో కుటుంబ పెద్ద మరణిస్తే... ఆ కుటుంబానికి స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు ఎన్బీసీఎఫ్డీసీ ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ స్వయం ఉపాధి యూనిట్పై గరిష్టంగా రూ.5 లక్షలు సమకూరిస్తే.. అందులో రూ.4 లక్షలు రాయితీ కింద ఎన్బీసీఎఫ్డీసీ లబ్ధిదారుకు అందిస్తుంది. మిగతా రూ.లక్షను బ్యాంకు నుంచి రుణం రూపంలో మంజూరు చేస్తుంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఈ ప్రతిపాదనలను ఈనెల 26లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. దరఖాస్తుకు అర్హతలివీ... కరోనా వైరస్ సోకి మరణించిన కుటుంబ పెద్ద వయసు 60 సంవత్సరాలలోపు ఉండాలని ఎన్బీసీఎఫ్డీసీ స్పష్టం చేసింది. కుటుంబ సభ్యుడి మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు తహసీల్దారు నుంచి పొందిన కుల ధ్రువీకరణ పత్రం, కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలలోపు ఉన్నట్లు నిర్ధారణ పత్రం దరఖాస్తుతో జతచేయాలి. వీటిని నేరుగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాల్లో సమర్పించవచ్చు. దరఖాస్తులో మరణించిన కుటుంబ సభ్యుడి పేరు, మరణించిన రోజుకు వయసు, ఆధార్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, కులం తదితర వివరాలను భర్తీ చేయాలి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా సంక్షేమాధికారులు ఈనెల 26లోగా రాష్ట్ర కార్యాలయానికి పంపితే... రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఎన్బీసీఎఫ్డీసీ కార్యాలయానికి పంపుతుంది. బీసీ కుటుంబాలకు ప్రయోజనకరమైన ఈ పథకంపై పెద్దగా ప్రచారం లేకపోవడం... రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఈ నెల 23న సూచనలు జారీ చేసి కేవలం మూడు రోజుల్లో దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించడం క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ఇబ్బంది కలిగించే అంశమే. -
ఇది కోర్టు ధిక్కరణే...!
-
తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: బీసీ గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ణయించాలంటూ 2010లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడంపై హైకోర్టు మండిపడింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కోర్టుధిక్కరణ కిందకే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. బీసీ సమగ్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులపై బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాము స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను నిర్ణయించామంటూ గతంలో అదనపు ఏజీ పేర్కొన్న నేపథ్యంలో, బీసీ కమిషన్ నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే గతంలో తాను పొరపాటున అలా చెప్పానని, జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను నిర్ణయించామని అదనపు ఏజీ నివేదించారు. బీసీ గణన కోసం బీసీ కమిషన్ను ఏర్పాటు చేయలేదని, ఈ నేపథ్యంలో ఎటువంటి నివేదిక ప్రభుత్వం వద్ద లేదని పేర్కొన్నారు. కాగా, ఏజీ పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు చట్టబద్ధమైన బీసీ కమిషన్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది ధర్మేష్ డీకే జైశ్వాల్ నివేదించారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 201ను ఎందుకు చట్టవిరుద్ధంగా ప్రకటించరాదో స్పష్టం చేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను జూన్కు వాయిదా వేసింది. ( చదవండి: హైదరాబాద్ ఐఎస్బీ.. దేశంలోనే టాప్! ) -
ఓటర్లంతా ఎస్సీ.. బీసీ సర్పంచ్ !
శ్రీకాళహస్తి రూరల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి పంచాయతీ సర్పంచ్గా ఖాదర్బీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామంలో అన్నీ ఎస్సీ కుటుంబాలే నివసిస్తున్నాయి. 677 మంది ఓటర్లున్న ఈ పంచాయతీ సర్పంచ్ పదవిని బీసీలకు కేటాయించారు. ఓటర్లంతా ఎస్సీలే కావడంతో మొదట్లో సందిగ్ధానికి గురయ్యారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదరి దామతోటి ముని మైనార్టీ వర్గానికి చెందిన ఖాదర్బీని వివాహం చేసుకున్నారు. ఆమెది బీసీ వర్గం కావడంతో సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. పోటీలేకపో వడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చదవండి: విశాఖ ఘటనలో ఏపీ సర్కార్ పనితీరు భేష్ మా జాబితా తప్పని నిరూపించగలవా! -
దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం
సాక్షి, అమరావతి: బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సందడి చూస్తుంటే సంక్రాంతి పండుగ నెల రోజులు ముందే వచ్చినట్లుగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 బీసీ కార్పొరేషన్లకు పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించారు. ‘బీసీల సంక్రాంతి’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు.. అగ్రవర్ణాల్లో పేదలు సామాజికంగా, ఆర్థికంగా, సదుపాయాల పరంగా నాలుగు మెట్లు పైన ఉండటమే అభివృద్ధి అని నమ్మి ఓ ఉద్యమంలా పని చేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. ఏడాదిన్నర క్రితం ఇదే చోట... ఇదే స్థలంలో 18 నెలల ముందు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పుడు అదే వేదిక మీద మీరందరూ ప్రమాణ స్వీకారం చేయడం నా మనసుకు ఎంతో సంతోషాన్నిస్తోంది. కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమితులైన మిమ్మల్ని చూస్తుంటే సంక్రాంతి పండుగ నెల ముందే వచ్చిందా అన్నట్లుగా ఉంది. 56 కార్పొరేషన్ల చైర్మన్లలో 29 మంది నా అక్క చెల్లెమ్మలే. 672 మంది డైరెక్టర్లలో 336 మంది నా అక్క చెల్లెమ్మలే ప్రమాణ సీక్వారం చేశారని గర్వంగా చెబుతున్నా. మహిళాభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టాం. ప్రతి ఇంట్లోనూ సంతోషం.. నా 3,648 కి.మీ పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలు చూశా. ఓ గ్రామంలో వెయ్యిమంది ఉంటే నాడు కనీసం ఇద్దరు ముగ్గురికి కూడా మేలు జరిగిన దాఖలాలు కనిపించ లేదు. అది కూడా టీడీపీ జెండా మోసినట్లు సర్టిఫికెట్ చూపిస్తే కానీ, జన్మభూమి కమిటీలు ఒప్పుకుంటే కానీ రాలేదు. ఆ స్థాయిలో దిగజారిన కార్పొరేషన్ వ్యవస్థలో మార్పులు తెచ్చాం. బీసీ పేద వర్గాల ప్రతి ఇంట్లోనూ సంతోషం కనిపించాలి. నాడు చెప్పా.. నేడు అమలు చేశా మనం అధికారంలోకి వస్తే బీసీల జీవితాలు మారుస్తానని నాడు మాట ఇచ్చా. 90 శాతం వాగ్దానాలు అమలు చేశాం. పేదలకు తోడుగా నిలబడకపోతే ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనం? అని నేను ప్రతి రోజూ అనుకుంటూ ఉంటా. వారికి తోడుగా నిలబడడం కోసమే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని అనుకుంటా. ఐదేళ్లలో విదిల్చింది రూ.19,329 కోట్లు.. 2014 మేనిఫెస్టోలో టీడీపీ ఏం చెప్పిందో చూశాం. 118 వాగ్దానాలు ఇచ్చి కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదు. బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పింది. అంటే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేయాల్సి ఉంటే కేవలం రూ.19,329 కోట్లు మాత్రమే విదిల్చింది. 2.88 కోట్ల బీసీ కుటుంబాలకు మేలు.. మనందరి ప్రభుత్వం వచ్చాక బీసీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా చెబుతున్నా. 2.88 కోట్ల బీసీ కుటుంబాలకు మేలు చేయగలిగాం. ఒక్కో కుటుంబంలో ఆరేడు పథకాలు కూడా అందాయి. ఇక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అట్టడుగున ఉన్న ఈ పేద వర్గాల కోసం మొత్తం రూ.59,317 కోట్లు చేశాం. తద్వారా 4.45 కోట్ల మందికి మేలు చేయగలిగాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 1.30 లక్షల మంది ఉద్యోగుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 83 శాతం వరకు ఉన్నారు. ఏడాదిన్నరలో దాదాపు నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ స్వరాజ్యాన్ని చూస్తున్నాం. అభివృద్ధి అంటే ఇదీ.. పిల్లలు మంచి చదువులు చదువుకుంటే అది అభివృద్ధిగా భావించి 100 శాతం అక్షరాస్యత కోసం కృషి చేస్తున్నాం. కాళ్లు అరిగేలా తిరగకుండా, లంచాలు ఇవ్వకుండా మన గ్రామంలోనే పనులు జరిగితేనే అభివృద్ధి జరిగినట్లు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇళ్లు వెతుక్కుంటూ వస్తేనే అభివృద్ధి అంటారు. నిలువ నీడ లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలను నాడు–నేడు ద్వారా మారుస్తున్నాం. అభివృద్ధిపై కోవిడ్ సమయంలో కూడా నాలుగు అడుగులు ముందుకే వేశాం కానీ ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు. ఏడాదిన్నరలో ప్రత్యేకంగా ఇవీ – శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు – క్యాబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దాదాపు 60 శాతం పదవులు. – ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. – సౌమ్యుడైన శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా బీసీనే. – గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కనీసం ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. మేం నలుగురిని రాజ్యసభకు పంపితే అందులో ఇద్దరు బీసీలే ఉన్నారు. – నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం. అందులో సగం అక్క చెల్లెమ్మలకు ఇచ్చేలా చట్టం. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. బీసీల సంక్రాంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, అంజాద్బాషా, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరామ్, ఎం.శంకరనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పలరాజు, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీలకు 18 నెలల్లో రూ.38,519 కోట్లు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చరిత్రను తిరగరాస్తూ బలహీనవర్గాలను బలపరిచేలా మరో అడుగు ముందుకు వేశాం. బీసీలకు ఈ స్థాయిలో పదవులు ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. అందులో 50 శాతం పదవులు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం మహిళాభ్యుదయంలో మరో చరిత్ర. అధికారంలోకి వస్తే బీసీల జీవితాలను మారుస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చా. ఈ 18 నెలల్లో అది చేసి చూపించా. బీసీల సంక్షేమం కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశాం. దిగిపోయిన పాలకుడి చెడిపోయిన బుర్ర.. ఈ అభివృద్ధి అంతా ఎక్కడ చూస్తారో అని ప్రజలను మభ్యపెట్టేందుకు గత పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఒక దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో చేస్తున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్తో రాజధాని అక్కడే పెట్టాలని ముందే నిర్ణయించి, బినామీలతో భూములు కొనిపించి ఇప్పుడు వాటి విలువ ఎక్కడ పడిపోతుందోనని ఆందోళన చేస్తున్నాడు. ఒక చెడిపోయిన బుర్ర పని చేస్తుంటే అలా ఉంటుంది. ఒక మంచి బుర్ర పని చేస్తే అభివృద్ధి ఇలా ఉంటుందని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సాక్షి, అమరావతి: కొత్తగా నియమితులైన 56 బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, 672 మంది డైరెక్టర్లు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘బీసీల సంక్రాంతి’ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వారితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. తమ కులాల్లోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వానికి తమ కులాలకు మధ్య వారధిగా ఉంటామని బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్లు ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రికి జ్ఞాపిక అందిస్తున్న మంత్రులు చెల్లుబోయిన, శంకర నారాయణ, జయరాం, ఎమ్మెల్యేలు పార్థసారథి, జోగి రమేశ్ -
బీసీలంతా ఆయన వెంటే ఉంటారు
-
కృష్ణా మీదుగా తెనాలి వరకు..భారీగా బైక్ ర్యాలీ
విజయవాడ : కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే పార్థసారధి ఆధ్వర్యంలో బీసీ సంగీభావ బైక్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లాలో మూడు నియోజకవర్గాల మీదుగా గుంటూరు జిల్లా తెనాలి వరకు ఈ సంగీభావ ర్యాలీ కొనసాగనుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపేందుకు వేలసంఖ్యలో బీసీలు తరలివచ్చారు. ఎమ్మెల్యే పార్థసారధి 130 కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేస్తూ ర్యాలీకి మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు కొక్కిలిగడ్డ రక్షణ నిధి, జోగి రమేష్ , కైలే అనీల్ కుమార్లు పాల్గొన్నారు. వీరంకి లాకు వద్ద బహిరంగ సభలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొననున్నారు. బీసీల సంక్షేమం కోసం నాడు వైఎస్సార్ కృషి చేస్తే, నేడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నారని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. అధికారంలో ఉండగా టీడీపీ కల్లబొల్లి మాటలతో బీసీలకు బాబు శఠగోపం పెట్టి ఓటుబ్యాంకు రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. (వైఎస్సార్ ఆరోగ్యశ్రీని ప్రారంభించిన సీఎం జగన్ ) వైఎస్ జగన్ పద్నాలుగు నెలల్లోనే తన మార్కు పాలన చూపించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణా రెడ్డి అన్నారు. ఐదేళ్ల టిడిపిలో జనానికి చీకటి చూపిస్తే..ఏడాదిలోనే జగన్ వెలుగులు నింపారని, రాజకీయ దార్శనికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని కొనియాడారు. వైఎస్సార్ లేని లోటును తీర్చి ప్రజారంజక పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ బకాయిలు పెట్టిపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని, ఆరోగ్యశ్రీలో పేదలకు మెరుగైన చికిత్స అందేలా సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకొన్నారని తెలిపారు. చంద్రబాబు రాజకీయ అవసాన దశలో ఉన్నాడని, కుట్రలు ,కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నాడని ద్వజమెత్తారు. పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా, అవినీతి లేని పాలన అందిస్తున్నామని వెల్లడించారు. (సచివాలయ సిబ్బందికి డ్రెస్ కోడ్ ! ) -
సంచార జాతులు మరువలేని రోజు
2020 సెప్టెంబర్ 7. సంచార జాతులు, అత్యంత వెనుకబడిన 17 బీసీ కులాలు మర్చిపోలేనిరోజు. తరాలు మారినా మారని తలరాతను మార్చిన రోజది. ‘‘పెద్ద సారులూ! మా బాధను వినండి. ఎక్కని గడప లేదు, మొక్కని దేవుడు లేడు. మమ్మల్ని కనీసం బీసీ కులాల జాబితాలో కలుపుకోండి. మేం ఆశ్రితకులం. మేం సంచార జాతులం...’’ అన్న ఆ మూగవేదనలు ఈ నేలంతా విన్పిస్తూనే ఉన్నాయి. వాళ్ల పిల్లలకు చదువులు లేవు. జనజీవితంలో కలగలిసి ఉన్నట్లే ఉంటారు, బతుకు దెరువుకోసం సంచారులై సాగిపోతుంటారు. గత 70 ఏళ్లుగా వీళ్లను కాలం ఎట్లా వదిలివేసిందో తెలియదు. అందరూ అట్టడుగు వర్గాల గురించి పెద్దగా మాట్లాడేవాళ్ళే. కానీ, ఈ సంచార జాతులకు కనీస గుర్తింపును కూడా ఎందుకు ఇవ్వలేకపోయారన్నది ప్రశ్న. ఈ జాతుల వాళ్లు కనీసంగా విజ్ఞాపనా పత్రాన్ని రాసి వ్వలేని స్థితిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరణ తర్వాత అన్ని రంగాలలో పునర్నిర్మాణం జరుగుతున్నట్లుగానే బహుజన బతుకుల పునర్నిర్మాణం మొదలయ్యింది. ఇందులో భాగంగా సమగ్రంగా బీసీల జీవన విధానంపై అధ్యయనం చేయటానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీసీ కమిషన్ను ఏర్పాటు చేశారు. తెలంగాణలో సామాజిక సూత్రాలను అమ లుచేసే దిశగానే అధ్యయనం కొనసాగించాలని, సమాజంలో సగభాగమైన బీసీల బతుకుచిత్రం మార్చటానికి అధ్యయనమే తొలిపునాది కావాలని కమిషన్ నియామకం తర్వాత సుదీర్ఘంగా ఐదుసార్లు సమావేశాలు జరిపి కమిషన్కు దిశానిర్దేశం చేశారు. బీసీ(ఇ) గ్రూపులోని ముస్లింల జీవన విధానాన్ని అధ్యయనం చేయాల్సిందిగా కమిషన్ను ఆదేశిం చారు. ఆ నివేదికను ముఖ్యమంత్రికి అందివ్వగానే ప్రత్యేక అసెంబ్లీని ఏర్పాటుచేసి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించటం జరిగింది. అదే రోజు ఎస్టీలకు 6 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభు త్వానికి నివేదించింది. కనీసం కుల సర్టిఫికెట్లకు నోచుకోకుండా ఉన్న సంచార జాతులను బీసీ కులాల్లో చేర్చాల్సి వుంది. 70 ఏళ్ల పాలకులు చేయలేని పనిని కేసీఆర్ చేశారు. సంచార జాతులను బీసీ కులాల్లో కలిపే విషయంపై చీఫ్ సెక్రటరీ బాధ్యతలు తీసుకోవలసిందిగా చెప్పారు. కేసీఆర్ చేసిన ఈ ప్రకటన చరిత్రాత్మ కమైనది. అది ఉద్యమకాలం నుంచి ఆయనను దగ్గ రగా చూసిన వాళ్లకు బాగా తెలుసు. ఒక విషయాన్ని తెలుసుకోవటానికి పుస్తక పఠనం ఉండాలి, క్షేత్ర స్థాయి అధ్యయన అనుభవం ఉండాలి. ఈ రెండూ కేసీఆర్లో ఉన్నాయి. బీసీ కులాల్లో చేర్చాల్సిన వారి పట్టికను ఇవ్వగానే వీళ్లంతా సంచార జాతుల వాళ్లే అన్నారు. 1. అద్దపువారు, 2. అహీర్/అహీర్ యాదవ కులము, 3. బాగోతుల/ భాగవతుల, 4. బైల్ కమ్మర/ ఘిసాడి/ గడియ లోహార్, 5.ఏనూటి/ యేనేటివాళ్లు, 6.గంజికూటి, 7.గౌడజెట్టి, 8.గవిలి/ గోవ్లీ/గౌలి/గవ్లి, 9.కాకిపడగల, 10.కుల్లకడిగి/ కుల్లె కడిగి/ చిట్టెపు, 11.పటంవారు/ మాసయ్యలు, 12. ఓడీ, 13.సారోల్లు/ సోమవంశ క్షత్రియ, 14. సొన్నా యిల/ సన్నాయిల/ సన్నాయోల్లు, 15. శ్రీక్షత్రియ రామజోగి/ రామబోగి/ రామజోగులు, 16. తెర చీరల/ తెల్వూరి/ బైకాని, 17. తోలుబొమ్మలవారు/ బొప్పలకులాల సంచారజాతుల వాళ్లు ఇప్పటిదాకా అనుభవించిన బాధలు అలవికానివి. వీళ్లది ఏ కులమో బీసీ కులపట్టికలో లేకపోవటంతో ఏ రెవెన్యూ అధికారి వీళ్లకు కులసర్టిఫికెట్లు ఇచ్చేవారు కాదు. బళ్లలో, హాస్టళ్లలో చేర్చుకునేటప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. రుణాలు పొందే సౌకర్యాలు ఉండేవి కావు. విద్యా, ఉద్యోగ విషయాలలో రిజర్వేషన్లు లేవు. ఇప్పుడు వీటన్నింటి నుంచి విముక్తి కలగబోతోంది. తరతరాలుగా సామాజిక చరిత్రను మోస్తున్న, గానం చేస్తున్న సంచార జాతులకు మంచి రోజులు రావాలి. పటం కథలు చెప్పుకుంటూ తిరిగే వారి పిల్లలు ఖగోళశాస్త్ర రంగంలోకి అడుగులు మోపాలి. తెలం గాణ రాష్ట్రం వస్తే ఏమవుతుందంటే, సంచార జాతుల బహుజనానికి విముక్తి లభిస్తుంది. జూలూరు గౌరీశంకర్, తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు -
బీసీలకు ద్రోహం చేసింది మీరు కాదా?
-
నాడు రాజన్న.. నేడు జగనన్న..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర అంటేనే వెనుకబడిన ప్రాంతం.. ఇక్కడ అత్యధికంగా ఉన్న బీసీలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో అనేక సంక్షేమ ఫలాలు అందేవి. బీసీ రుణాలతో ఆ సామాజిక వర్గం వారు ఆర్థికాభివృద్ధి సాధించేవారు. టీడీపీ అధికంలోకి వచ్చిన తరువాత బీసీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. బీసీలను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన మాజీ సీఎం చంద్రబాబు వారి సంక్షేమాన్ని అటకెక్కించారు. ఆ సమయంలో ప్రజా సంకల్పయాత్ర చేపట్టి బీసీల కష్టాలను తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ను ప్రకటించారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో అదనంగా పదిశాతం సీట్లను బీసీలకు కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ సామాజిక వర్గం వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం సంచలన నిర్ణయం ఎన్నికల్లో సీట్లు కేటాయింపులో బీసీ, ఉపకులాలకు సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యమిచ్చారు. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు పెంచినప్పటికీ టీడీపీ వేసిన పిటిషన్ల కారణంగా ఆ ప్రయత్నం ఫలించలేదు. 50 శాతానికే రిజర్వేషన్లు నిర్ణయించాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో కోర్టు తీర్పును గౌరవించిన అధికారపార్టీ ఇచ్చిన మాటను నిలుపుకోవడంలోనూ వెనుకంజ వేయలేదు. జనరల్కు కేటాయించిన స్థానాల్లో కొన్నింటిని బీసీలకు ఇవ్వడం ద్వారా మరో కోర్టు తీర్పు వల్ల కోల్పోయిన 10 శాతం రిజర్వేషన్లను పార్టీ తరఫున ఇస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సంచలన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వైఎస్ అలా.. చంద్రబాబు ఇలా.. బీసీ వర్గాల్లో చదువుకునే విద్యార్థులకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఒక్కరంటే ఒక్కరికీ ఫీజులు గానీ, ఫీజు రీయింబర్స్మెంట్గానీ పెండింగ్ లేకుండా అందజేసేవారు. చంద్రబాబు హయాంలో జిల్లాలో 74,800 మంది విద్యార్థులు ఫీజులు, రీయింబర్స్మెంట్కోసం ఎదురుతెన్నులు చూసేవారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఫీజులు కట్టలేక అల్లాడారు. ఉన్నత తరగతులకు వెళ్లాల్సిన వారు, ఇతర కళాశాలలకు వెళ్లాల్సిన వారికి ఫీజులు కట్టడం లేదని ఆయా కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధించాయి. ఎంతో ఉన్నత ఆశయంతో ఆనాడు వైఎస్ తలపెట్టిన ఈ ఫీజురీఎంబర్స్మెంట్ పథకాన్ని అమలు కానివ్వలేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి ఫీజులకు ఎంత మొత్తం ఉంటే అంత మొత్తం చెల్లించేవారు. దీంతో పూర్తిగా విద్యార్థుల పేరిట కళాశాలలకు ఫీజులందేవి. తల్లిదండ్రులకు కూడా ఎటువంటి ఆవేదన కానీ, ఇబ్బందులు కానీ పడేవారు కాదు. చంద్రబాబు హయాంలో విద్యార్థి సంఘాలు పోరాడుతుంటే పోలీసులతో వారిని చావగొట్టించారు. వైఎస్ హయాంలో కొన్ని కులాలను బీసీల్లోకి చేర్చి వారికి అన్ని రంగాలలోను అభివృద్ధి చెందేలా దోహదపడ్డారు. కొన్ని కులాల వర్గీకరణ లేకపోతే వర్గీకరణ చేసి వారికి వివిధ పథకాల ద్వారా న్యాయం జరిగింది. ప్రతి కుటుంబానికి పింఛన్, పేద రైతుకు ఉచిత విద్యుత్ని అందజేసి ఆదుకున్నారు. చంద్రబాబు హయాంలో బీసీలకు దిశా, దశాలేని కులాలకార్పొరేషన్ ఏర్పాటు ప్రకటన చేశారు. తండ్రిని మించిన తనయుడు... మళ్లీ ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారు. బీసీల్లో 135 ఉపకులాలు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 14.40 లక్షల బీసీ జనాభా ఉంది. తూర్పుకాపు, యాదవ, కుమ్మరి, చాకలి, వండ్రంగి, కంసాలి, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, యాత, ఈడిగ, తదితర కులాలు అధికంగా ఉన్నారు. ఎన్నికల ముందు ఏలూరులో బీసీ గర్జన సదస్సు నిర్వహించిన జగన్ వారికి భరోసా ఇచ్చారు. బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చాచు. అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వారికి తీపి కబురు చెప్పారు. క్షౌ రశాలలకు 250 యూనిట్లు విద్యుత్ ఉచితం ఇస్తామన్నారు. డొమెస్టిక్ పర్పస్ 500 యూనియట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దేవాలయాల్లో ఉద్యోగులకు ట్రస్టుబోర్డులో నామిటెడ్పోస్టులో అవకాశం ఇస్తామన్నారు. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం ఇవ్వని ప్రాధాన్యత వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు ఇచ్చారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పదిశాతం అదనంగా సీట్లు కేటాయించిన వైఎస్ జగన్ మడమ తిప్పని నైజంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఔదార్యం మరువలేనిదని, ఆయన రుణం తీర్చుకోలేమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశ్వసనీయతకు నిదర్శనం సీఎం ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలుచేస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డి. ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన నాటి నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మాదిరిగా బీసీల గుర్తింపు, అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టారు. ఇప్పుడు వాటిని నెరవేర్చారు. ఇక బీసీల పయనమంతా ఆయన వెంటే. – ముద్దాడ మధు, ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, విజయనగరం తండ్రిని మించిన తనయుడు తండ్రిని మించిన తనయుడిగా సీఎం జగన్మోహన్రెడ్డి పేరుతెచ్చుకున్నారు. అతి తక్కువ సమయంలో మంచి సీఎంగా మన్ననలు పొందుతున్నారు. జనాభా ప్రాతిపదికతో పాటు మానవతా దృక్పథంతో బీసీల అభ్యున్నతికి చట్టబద్ధంగా అడుగులు వేయడం అభినందనీయం. బీసీల అభివృద్ధిని కాంక్షించే సీఎంగా పేరుకెక్కారు. – సానమునేటి శ్రీనివాసరావు, నగరాల సంఘం జిల్లా అధ్యక్షుడు, విజయనగరం సముచిత స్థానం బీసీలకు రాజ్యాధికారం దిశగా సీఎం అడుగులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో బీసీలకు మరింత సేవ చేస్తారని అనిపిస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ కూర్పులోగాని, బడ్జెట్ కేటాయింపుల్లో గాని బీసీలకు సముచిత స్థానం కలి్పంచారు. గత 30 ఏళ్ల కాలంలో ఏ ముఖ్యమంత్రి బీసీలకు చేయలేని విధంగా చేస్తున్నారు. ఇప్పటికే అనేక పథకాలు అమలవుతున్నాయి. ఆయనలో అద్భుతమైన ఆలోచనలు, ఆచరణలు కనిపిస్తున్నాయి. – రామేశ్వరపు రామారావు, నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విజయనగరం బీసీల అభివృద్ధి జగన్తోనే సాధ్యం బీసీల అభివృద్ధి, సంక్షేమం సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం. గతంలో అధికారంలో లేకపోయినా బీసీల పక్షపాతిగా సేవలందించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బీసీలకు పెద్దపీట వేసి గుర్తింపునిచ్చారు. ఎన్నికల్లో బీసీలంతా జగన్మోహన్రెడ్డికి ఏకపక్షంగా ఓట్లు వేశారు. – లెంక అప్పలరాజు, పూల్భాగ్కాలనీ, విజయనగరం -
ఇది బీసీలకు దక్కిన అరుదైన గౌరవం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాజ్యసభలో నలుగురికి అవకాశం లభిస్తే అందులో రెండింటిని వెనకబడిన తరగతుల వారికి కేటాయించడం చరిత్రాత్మక సందర్భంగా చెప్పుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. బీసీల పట్ట చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించుకున్నారన్నారు. ప్రధానమైన రెండు వెనుకబడిన తరగతుల అగ్నికుల క్షత్రియ), పిల్లి సుభాష్చంద్రబోష్ (శెట్టిబలజ)లను రాజ్యసభ సభ్యత్వానికి ఎంపిక చేయడం గొప్ప విషయమన్నారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇదొక చరిత్ర అని, సమైక్య రాష్ట్రంలో కూడా బీసీలకు ఇటువంటి అవకాశం రాలేదన్నారు. బీసీలపై జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధిని ప్రత్యేకంగా చెప్పుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీల కోసం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయడంలో చూపిన శ్రద్ధ చెప్పలేనిదన్నారు. రాష్ట్రంలో బీసీంతా హర్షించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన సమయంగా భావిస్తున్నానన్నారు. నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు బీసీలకు ఇచ్చారంటే ఎంత గొప్ప నిర్ణయమో ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం బీసీల్లో ఉత్సాహం నింపిందని అభిప్రాయపడ్డారు. ఇదే టీడీపీ విషయానికి వస్తే ఏం చేసిందో అందరికీ తెలుసునన్నారు. అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన బీసీలకు ఎప్పుడైనా ఈ రకమైన గుర్తింపు, అవకాశాలు కలి్పంచిందా? అని ప్రశ్నించారు. టీడీపీ పల్లకీ మోసిన బీసీలను తొక్కేసారు తప్ప నిలబెట్టిన దాఖలాల్లేవన్నారు. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందు ఏలూరులో జరిగిన బీసీ సదస్సులో స్పష్టం చేశానన్నారు. బీసీలకు టీడీపీ చేసిన అన్యాయాన్ని, అధికారంలోకి వస్తే వైఎస్సార్సీపీ చేసే న్యాయాన్ని వివరించానని, ఇప్పుడది అమలు కావడంతో తనకెంతో గర్వంగా ఉందన్నారు. -
బీసీల కోటాపై టీడీపీ ఆట
సాక్షి, అమరావతి: బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగకుండా ప్రతిపక్ష టీడీపీ అడుగడుగునా అడ్డుపడుతోందనే వాదనకు బలం చేకూర్చేలా న్యాయ వివాదాలకు పురిగొల్పుతుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా విపక్షం కుట్రపూరితంగానే బీసీ రిజర్వేషన్లపై వివాదం రాజేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలకు ఆటంకాలు కల్పించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.5 వేల కోట్లకుపైగా నిధులను అడ్డుకునే దుర్బుద్ధి దీని వెనక దాగుందని పేర్కొంటున్నారు. అన్ని రాష్ట్రాలు తగ్గిస్తున్నా.. ధైర్యంగా ముందుకే జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఇచ్చే రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని 2010లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దేశంలో 24 రాష్ట్రాలు ఒక్కొక్కటిగా బీసీలకిచ్చే రిజర్వేషన్లను 16–25 శాతం వరకు తగ్గించుకున్నాయి. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించటాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. అయినప్పటికీ ఆ తర్వాత 2019 డిసెంబరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ధైర్యంగా ముందుకెళ్లి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో కలిపి మొత్తం 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు క్యాబినెట్లో ఆమోదించి జీవో కూడా జారీ చేసింది. ఆ జీవో మేరకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర హైకోర్టు కూడా ఆమోదం తెలిపింది. అయితే టీడీపీ నేతలు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 59.85%రిజర్వేషన్ల జీవోతో ఎన్నికలు జరపడంపై స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు సూచనతో తిరిగి దీనిపై హైకోర్టులో విచారణ జరగడంతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తీర్పు వెలువడింది. 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు మొదట రాష్ట్ర హైకోర్టు ఆమోదం తెలిపిన తర్వాత టీడీపీ నేత సుప్రీంకోర్టులో కేసు వేయకుంటే బీసీలకు 34 శాతంతోనే ఎన్నికలు జరిగేవని పేర్కొంటున్నారు. ఎన్నికలు, నిధులను అడ్డుకోవడమే విపక్షం ధ్యేయం రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టుతో ముగిసినప్పటికీ నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు గ్రామ పంచాయతీలకు తిరిగి ఎన్నికలు నిర్వహించలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకాగా టీడీపీ హయాంలో నామినేటెడ్ పదవి పొందిన ఆ పార్టీ నేత బిర్రు ప్రతాప్రెడ్డి సుప్రీంకోర్టు, హైకోర్టులలో వరుసగా కేసులు వేయడంతో వాయిదా పడుతూ వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడం, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.5,100 కోట్ల నిధులను అడ్డుకోవడమే టీడీపీ ధ్యేయమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్లో చట్టమే మార్గం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై వివాదాలకు రాజ్యాంగ బద్ధతే శాశ్వత పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. పార్లమెంట్లో చేసిన చట్టం కారణంగా తమిళనాడులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం గతంలోనే కేంద్రంపై ఒత్తిడి తేవడంతో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించి 9వ షెడ్యూల్లో చేర్చారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సీఎం జగన్ సూచన మేరకు వైఎస్సార్సీపీ ఎంపీలు గతేడాది మార్చిలో పార్లమెంట్లో బిల్లు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇప్పుడు సుప్రీంకు వెళితే ప్రయోజనమా? బీసీ రిజర్వేషన్లపై టీడీపీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలైన కర్ణాటకలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రముఖ బీసీ ఉద్యమ నాయకుడు సిద్ధరామయ్య హయాంలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారు. బీసీ నేతలైన బిహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం చౌహాన్ కూడా 2013–2014లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 18 – 22 శాతం తగ్గించారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు వాదనలో పసలేదు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వాదనలో పసలేదు, ఉపయోగం లేదు. గత ప్రభుత్వాలు చాలాసార్లు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాయి. ప్రతి కేసులో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతం మించరాదని తీర్పు చెప్పింది. అలాంటప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు వెళితే ఆ తీర్పు పునరావృతం అవుతుంది. చంద్రబాబు చర్యలతో కాలయాపన తప్ప బీసీలకు ఒరిగేదేమీ ఉండదు’ – ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో టీడీపీ పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు, మాజీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప తదితరులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరారు. -
‘బీసీల ఎదుగుదల ఓర్చుకోలేకపోతున్నారు’
సాక్షి, విజయవాడ: బీసీలను టీడీపీ ఓటుబ్యాంకుగానే చూసిందని.. వారి అభివృద్ధికి పాటు పడలేదని దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బీసీల ఎదుగుదలను ఓర్చుకోలేక నారా లోకేష్ అనుచరులు అడ్డుపడటమే అందుకు నిదర్శనమని ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజుకో వార్డులో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టిపెడుతున్నారు. మంగళవారం 26వ డివిజన్లో మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించిన మంత్రి.. సమస్యలపై ఆరాతీసారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో సీఎం వైఎస్ జగన్ కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను హెచ్చరించారు. (చంద్రబాబు వల్లే బీసీలకు అన్యాయం..) టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డుపడ్డారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే ప్రతిపక్ష టీడీపీ మోకాలడ్డే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలని సీఎం భావిస్తే టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డు పడ్డారని ఆరోపించారు. బీసీల పై టీడీపీ కి ఉన్న ప్రేమ ఏపాటిదో బట్టబయలు అయిందని చెప్పారు. (బడుగుల ద్రోహి చంద్రబాబు) ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప టీడీపీ కి ప్రజా సంక్షేమం అవసరం లేదన్న విషయం తేటతెల్లం అవుతోందంటున్నారు. టీడీపీ హయాంలో 44 నాలుగు లక్షల మందికి పెన్షన్ లు ఇస్తే సీఎం జగన్ 60 లక్షల మందికి అందిస్తున్నారని పేర్కొన్నారు. పదహారు లక్షల మందికి కొత్తగా పెన్షన్ లు ఇస్తుంటే ఉన్నవి తొలగిస్తున్నారంటూ టీడీపీ నేతలు గ్లోబల్ ప్రచారం చేయటం సిగ్గుచేటని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. -
రాయికల్ మినహా నాలుగింట్లో వారే..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు నాలుగింట్లో మహిళలకే పట్టాభిషేకం జరిగింది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురిలో చైర్పర్సన్లుగా మహిళలు ప్రమాణస్వీకారం చేశారు. ఒక్క రాయికల్లోనే జనరల్కు రిజర్వ్ కావడంతో మోర హన్మాండ్లు చైర్మన్గా ఎన్నికయ్యారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో బీసీలే చైర్మన్ పీఠాలను అలంకరించారు. వీరిలో నలుగురు మహిళలు ఉండడం గమనార్హం. మెట్పల్లిలో వరుసగా మూడోసారి మహిళలే చైర్పర్సన్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. రాయికల్లో చైర్మన్ పదవి జనరల్ కాగా.. వైస్ చైర్పర్సన్ పదవి మహిళకు దక్కింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జగిత్యాలలో గులాబీ జెండా రెపరెపలాడింది. సాక్షి, జగిత్యాల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికైన కౌన్సిలర్లు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం చైర్మన్, వైస్చైర్మన్లను ఎన్నుకున్నారు. జగిత్యాల చైర్పర్సన్గా డాక్టర్ బోగ శ్రావణి, కోరుట్లలో అన్నం లావణ్య, మెట్పల్లిలో రణవేణి సుజాత, రాయికల్లో మోర హన్మండ్లు, ధర్మపురి మున్సిపాలిటీ చైర్పర్సన్గా సంగి సత్తెమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. జగిత్యాలలో వైస్చైర్మన్గా గోలి శ్రీనివాస్, కోరుట్లలో గడ్డమీది పవన్, మెట్పల్లిలో బోయినిపల్లి చంద్రశేఖర్రావు, రాయికల్లో గండ్ర రమాదేవి, ధర్మపురిలో ఇందారపు రామన్న మున్సిపల్ వైస్చైర్మన్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. సామాజికవర్గాల వారీగా.. మున్సిపల్ చైర్మన్లు, వైస్చైర్మన్ల పదవులను సామాజికవర్గాల వారీగా సర్దుబాటు చేశారు. జగిత్యాలలో పద్మశాలి సామాజికవర్గానికి చెందిన డాక్టర్ బోగ శ్రావణికి చైర్మన్ పదవి దక్కగా.. ఓసీ సామాజికవర్గంలోని వైశ్యులు గోలి శ్రీనివాస్ వైస్చైర్మన్ పదవి సొంతం చేసుకున్నారు. కోరుట్లలో చైర్మన్ పదవి బీసీల్లోని గౌడ సామాజిక వర్గానికి చెందిన అన్నం లావణ్యకు దక్కగా, వైస్చైర్మన్గా బీసీల్లోని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన గడ్డమీది పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. మెట్పల్లిలో చైర్మన్ పీఠం బీసీల్లోని ముదిరాజ్కు చెందిన రణవేణి సుజాత దక్కించుకోగా, ఓసీకి చెందిన బోయినపల్లి చంద్రశేఖర్రావు వైస్చైర్మన్గా ప్రమాణస్వీకారం చేశారు. రాయికల్లో బీసీ పద్మశాలి వర్గానికి చెందిన మోర హన్మండ్లు చైర్మన్కాగా ఓసీకి చెందిన గండ్ర రమాదేవి వైస్చైర్పర్సన్ అయ్యారు. ధర్మపురిలో బీసీల్లోని మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన సంగి సత్తెమ్మ చైర్పర్సన్ కాగా ఓసీకి చెందిన ఇందారపు రామన్న వైస్చైర్మన్గా ప్రమాణస్వీకారం చేశారు. ఊహించినట్లే.. జిల్లాలోని మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ముందుగా ఊహించినట్లుగానే జరిగినా వైస్ చైర్మన్ల విషయంలో కాస్త సస్పెన్స్ ఏర్పడింది. కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ చైర్మన్లను ఎమ్మెల్యేలు ముందుగానే ప్రకటించారు. ధర్మపురి, జగిత్యాలలో చైర్పర్సన్ పీఠానికి పలువురు పోటీలో ఉన్నప్పటికీ ముందు నుంచి ప్రచారంలో ఉన్నవారే చైర్మన్ పదవులను అలంకరించారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జగిత్యాలలో టీఆర్ఎస్ మొదటి సారిగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. కొంగొత్త ఆశలు.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గతంలో గ్రామపంచాయతీలుగా ఉన్న రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలుగా అవతరించాయి. ఇక్కడ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్ల స్థానంలో చైర్మన్, వైస్చైర్మన్, కౌన్సిలర్లతో కొత్త పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. నూతనంగా ఏర్పడిన పాలకవర్గాలతో పట్టణాల్లో కొత్త శోభ సంతరించుకుంది. పట్టణాలు అభివృద్ధి చెందుతాయనే ఆశలు కొత్త పాలకవర్గాలపై పట్టణవాసులు పెట్టుకున్నారు. -
‘పురపాలక మొదటి దశ రిజర్వేషన్లు పూర్తి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలక రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తైంది. ఆయా వర్గాలవారీగా మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు పుర్తి అయ్యాయి. రిజర్వేషన్ల వివరాలను శనివారం తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు పంపించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు మున్సిపల్ వార్డుల పదవుల్లో రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. ఎస్టీల జనాభా ఒక్కశాతం తక్కువగా ఉన్నా కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లోనూ ఒక వార్డు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. 50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లను కల్పించారు. రేపు( ఆదివారం) వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. -
‘తీన్మార్ మల్లన్నకు రక్షణ కల్పించాలి’
గన్ఫౌండ్రీ: తీన్మార్ మల్లన్నకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని బీసీ కులాల సమన్వయ వేదిక విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జూలూరి మహేష్గౌడ్ అన్నారు. సోమవారం నిజాం కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ పాలనలో జరుగుతున్న అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ సమాజాన్ని చైతన్యం చేస్తున్న మల్లన్నను కొందరు నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారి నుంచి మల్లన్నకు ప్రాణాపాయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట చేస్తున్న ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరుపై ప్రజలకు వివరిస్తున్నందుకే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. సమావేశంలో లక్ష్మీనారాయణ, సందీప్, మల్లేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు
సాక్షి, అమరావతి: సామాజికంగా వెనుకబడిన బీసీలకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్నారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాలనలో బీసీలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదని ఆయన పేర్కొన్నారు. బీసీలను కేవలం కులవృత్తులకు పరిమితం చేయాలనే దురాలోచన చంద్రబాబుకు ఉందని ఆయన మండిపడ్డారు. బీసీల్లో అనేకమైన సంచార జాతులు ఉన్నాయని పేర్కొన్నారు. బీసీల సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి టీడీపీకి లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఉన్నతమైన స్థానంలో చూడాలనే దృఢ సంకల్పం సీఎం వైఎస్ జగన్ది అని ఆయన స్పష్టం చేశారు. -
‘జగన్ బీసీల ముఖ్యమంత్రి అనిపించుకున్నారు’
సాక్షి, అమరావతి : మాజీ సీఎం చంద్రబాబు బీసీలను మోసం చేస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు అన్నారు ఎమ్మెల్యే పార్థసారధి. రాష్ట్ర బడ్జెట్పై ఆయన స్పందిస్తూ.. చరిత్రలో బీసీలకు ఇన్ని నిధులను ఎప్పుడు కేటాయించలేదని తెలిపారు. బీసీ డిక్లరేషన్లో చెప్పిన మాట ప్రకారం బడ్జెట్లో రూ. 15 వేల కోట్లు కేటాయించారన్నారు. ఆటోడ్రైవర్లు, టైలర్లు, చేనేతలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారికి అండగా నిలిచారని ప్రశంసించారు. ఈ బడ్జెట్ బీసీల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు దోహదం చేస్తుందన్నారు. -
‘టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే ఆ హత్య జరిగింది’
సాక్షి, పశ్చిమ గోదావరి : కొవ్వూరులో బీసీ వర్గానికి చెందిన గోపాల కృష్ణ అనే వ్యక్తి హత్య తెలుగుదేశం నాయకుల కనుసన్నల్లోనే జరిగిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వర రావు ఆరోపించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోపాల కృష్ణ హత్య కేసును న్యాయ విచారణ జరిపించి దోషులను శిక్షిస్తానని టీడీపీ నాయకుడు ముళ్లపూడి బాపిరాజు హామీ ఇచ్చారన్నారు. కానీ ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఈ హత్య టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరిగిందని అందరికి తెలుసన్నారు. అందుకే మంత్రి జవహర్, బాపిరాజులు జనాల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని పేర్కొన్నారు. అంతేకాక ఏలూరులో ఇందుమతి అనే రజక స్త్రీ స్నానానికి వెళ్తే నిప్పు పెట్టి హత్య చేశారని వెంకటేశ్వర రావు ఆరోపించారు. ఈ దారుణాన్ని జిల్లా ఎస్పీ ఆత్మహత్యగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఇలాంటి టీడీపీ నాయకులకు బీసీలను ఓట్లు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెంలో 400 మంది బీసీలు లోన్లకు దరఖాస్తు చేస్తే కేవలం ముగ్గిరికి మాత్రమే లోన్ ఇచ్చారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
బీసీ మహిళలను కారుతో ఢీకొట్టీన టీడీపీ నేతలు
-
బీసీ ద్రోహి చంద్రబాబు
సాక్షి, కోరుకొండ (రాజానగరం): ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీ ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. కోరుకొండలో వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజ్యాధికారంలో వాటా కోసం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడాది కిందటే పార్లమెంట్లో బిల్లు పెట్టిందన్నారు. అంతేకాకుండా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 41, లోక్సభలో 7 సీట్లు కేటాయించడం హర్షించదగిన విషయమన్నారు. వడ్డెర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, వాల్మీకి, కురుబ, మత్స్యకారుల్లాంటి అత్యంత వెనుకబడిన కులాలకు జగన్ అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వడం సాహసోపేతమైన నిర్ణయమన్నారు. బీసీల విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నట్టు జగన్ ప్రకటించారన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించడడం జగన్తోనే సాధ్యమని చెప్పారు. చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడిచారని, ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు గుర్తింపు లేదన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలందరూ చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజానగరం అసెంబ్లీ అభ్యర్థి జక్కంపూడి రాజాను, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్లను సీలింగ్ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు బీసీ వ్యతిరేకి
-
జయహో బీసీ!
-
ఎన్నికల పోరుకు సిద్ధం
బీసీలే టీడీపీకి అండ అనే నినాదంతో ఇన్నాళ్లూ బలహీనవర్గాల గడ్డ సిక్కోలులో పాగా వేయగలిగారు.. కానీ ఆచరణలో బీసీల అభ్యున్నతికి టీడీపీ చేసిందేమీ లేదని తేలిపోయింది! ఇలాంటి నేపథ్యంలో బీసీలకు నేనున్నాను అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభయమిచ్చారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి సహా జిల్లాలో రాజాం (ఎస్సీ), పాలకొండ (ఎస్టీ) మినహా మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లోనూ బీసీ అభ్యర్థులకే టిక్కెట్లు ఇచ్చి తన ఉద్దేశమేమిటో చెప్పకనే చెప్పారు. మరోవైపు టీడీపీ కూడా అభ్యర్థులను ఖరారు చేయడంతో బరిలో నిలిచేదెవరో తేలిపోయింది. జగన్కో అవకాశం ఇద్దామని అన్ని వర్గాల ప్రజలూ కోరుకుంటున్న నేపథ్యంలో ప్రజల అండతో టీడీపీ కోట బద్దలుకొట్టడానికి వైఎస్సార్సీపీ అభ్యర్థులు సై అంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మరోసారి ధర్మాన వర్సెస్ గుండ శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గుండ కుటుంబంతో మరోసారి తలపడనున్నారు. 2004, 2009 ఎన్నికలలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణను ఓడించారు. 2014 ఎన్నికలలో మాత్రం చంద్రబాబు అప్పలసూర్యనారాయణను కాదని ఆయన భార్య లక్ష్మీదేవిని పోటీకి దింపారు. ఈ ఎన్నికలలో ధర్మాన ఓటమి పాలయ్యారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోనే కాదు జిల్లా మొత్తంమీద ఎక్కడా అభివృద్ధి కానరాలేదని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఇదే సమయంలో ధర్మాన హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి ఏదైనా ధర్మాననే గెలుపించుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జగన్ మరోసారి ఆయననే బరిలోకి దించారు. టీడీపీ కూడా లక్ష్మీదేవికే ఈసారీ అవకాశం ఇచ్చింది. పాత ప్రత్యర్థుల మధ్యే ఆమదాలవలస పోరు ఆమదాలవలసలో 1983, 1985, 1991 (ఉప ఎన్నిక), 1994, 1999 ఎన్నికలలో మొత్తం ఐదుసార్లు గెలిచి ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో సభ్యుడిగా వ్యవహరించిన తమ్మినేని సీతారాంకు జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. గత మూడు దఫాల్లో ఆయనకు విజయం దక్కకపోయినా ఈసారి విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చింతాడ రవికుమార్, కోట బ్రదర్స్, మున్నా సహా పలువురు నాయకులను పార్టీలోకి చేర్పిస్తూ ఆమదాలవలసలో వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేశారు. తిత్లీ తుఫానులో అనేకమంది బాధితులకు విశేషంగా సహాయం చేసిన యువ శాస్త్రవేత్త గేదెల శ్రీనుబాబు కూడా గత వారం వైఎస్సార్సీపీలో చేరారు. ఆయన కూడా ఆమదాలవలస నియోజకవర్గంలో బూర్జ మండలానికి చెందినవారే కావడం విశేషం. మరోవైపు సిటింగ్ ఎమ్మెల్యే కూన రవికుమార్నే టీడీపీ మరోసారి బరిలోకి దించింది. నాగావళి, వంశధార నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలతో చెరబట్టిన మాఫియాకు కూన అండదండలు అందించడంపై ప్రజలు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. అక్రమ సంపాదన వెదజల్లినా ప్రజలు మాత్రం ఫ్యాన్కే చాన్స్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. నరసన్నపేటలోనూ పాత ప్రత్యర్థులే.. ధర్మాన కుటుంబానికి తొలి నుంచి బాసటగా నిలుస్తున్న నరసన్నపేట నియోజకవర్గంలో కృష్ణదాస్ 2009, 2012 (ఉప ఎన్నిక) ఎన్నికలలో విజయం సాధించారు. 2014 ఎన్నికలలో ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి అండగా ఉన్నారు. గత ఎన్నికలలో కృష్ణదాస్పై గెలిచిన బగ్గు రమణమూర్తికే టీడీపీ ఈసారి కూడా టికెట్ ఇచ్చింది. పాత ప్రత్యర్థినే మరోసారి ఎదుర్కొనేందుకు కృష్ణదాస్ పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు. టెక్కలిలో త్రిమూర్తుల విశ్వరూపం టెక్కలిలో టీడీపీ అభ్యర్థిగా కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఏదిఏమైనా అచ్చెన్నపై విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ యువకుడైన పేరాడ తిలక్కు టికెట్ ఇచ్చింది. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున బరిలోకి దిగిన దువ్వాడ శ్రీనివాస్ సొంత ప్రాంతం కూడా టెక్కలే. ఇటీవలే కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్లో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా ఈ ప్రాంతవాసే. త్రిమూర్తుల్లాంటి ముగ్గురు నాయకులు సమష్టి కృషితో టీడీపీని మట్టి కరిపించడానికి కృషి చేస్తున్నారు. పలాసలో కొత్తవారి మధ్య పోటీ పలాసలో వైఎస్సార్సీపీ తరఫున యువ వైద్యుడు సీదిరి అప్పలరాజు పోటీచేస్తుండగా, ఆయనకు పోటీగా గౌతు శివాజీకి బదులు ఆయన కుమార్తె శిరీషకు టీడీపీ టికెట్ ఇచ్చింది. పలాస బరిలో పోటీ చేస్తున్న ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు కొత్తగా రాజకీయాల్లో అడుగుపెట్టినవారే. సిట్టింగ్ల వైపే వైఎస్సార్సీపీ మొగ్గు పాలకొండలో వైఎస్సార్సీపీ సిటింగ్ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతినే జగన్ మరోసారి బరిలోకి దించారు. గత ఎన్నికలలో ఆమె చేతిలో ఓడిపోయిన నిమ్మక జయకృష్ణనే టీడీపీ ఈసారి కూడా నమ్ముకుంది. రాజాంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు మరోసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అయితే గత ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన కావలి ప్రతిభాభారతిని కాదని, అదే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా కనీసం డిపాజిట్ కూడా దక్కని కొండ్రు మురళీమోహన్ను ఇటీవల టీడీపీ పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇచ్చింది. గతంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొండ్రు దూకుడు కూడా జిల్లా ప్రజలకు తెలిసిందే. అలాంటి కొండ్రు కన్నా సౌమ్యుడైన జోగులుకే రాజాం ప్రజలు పట్టం కడతారనే విశ్లేషణలు ఉన్నాయి. ఇచ్ఛాపురంలో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్కు పోటీగా టీడీపీ తరఫున బెందాళం అశోక్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఇటీవలే టీడీపీలోకి వెళ్లిన యాదవ సంఘ నాయకుడు నర్తు నరేంద్ర యాదవ్ అక్కడి పరిస్థితుల్లో ఇమడలేక మళ్లీ వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు. మరో మాజీ ఎమ్మెల్యే నరేష్కుమార్ అగర్వాల (లల్లూ) కూడా చేరడంతో ఇప్పుడు ఇచ్ఛాపురంలో వైఎస్సార్సీపీ బలీయంగా కనిపిస్తోంది. ఇక ఎచ్చెర్లలో కిమిడి కళావెంకటరావుకే టీడీపీ మరోసారి టికెట్ ఇచ్చింది. గత ఎన్నికలలో స్వల్ప తేడా ఆయన చేతిలో ఓటమి చూసిన గొర్లె కిరణ్కుమార్ ఈసారి కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అవినీతి టీడీపీ నాయకులను ప్రజలు తిప్పికొట్టి ఈసారి ఫ్యాన్కే ప్రజలు పట్టం కడతారని కిరణ్కుమార్ బలంగా చెబుతున్నారు. గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ జెండాపై గెలిచి టీడీపీ ప్రలోభాలతో ఫిరాయించిన కలమట వెంకటరమణ మరోసారి పాతపట్నంలో పోటీపడటానికి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. తాను నమ్మి వెళ్లిన టీడీపీ అధిష్టానమే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు టికెట్ ఇచ్చేందుకు తటాపటాయించాల్సి వచ్చింది. చివరి నిమిషంలో సీటు తెచ్చుకున్నా వైఎస్సార్సీపీ తరఫున రెడ్డి శాంతి రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. శాంతి ఇప్పటికే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ గ్రామగ్రామాన పార్టీని పటిష్టం చేస్తూ వచ్చారు. ఆమె కృషికి తగినట్లుగానే వైఎస్సార్సీపీలోకి చేరికలు కూడా భారీగా సాగుతున్నాయి. -
మాట తప్పని వైఎస్ జగన్
సాక్షి, పులివెందుల రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికశాతం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో బీసీలకు చెందిన నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించడంతో బీసీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకున్నారని వచ్చే ఎన్నికల్లో బీసీల సత్తా చూపించి ఆయనకు అండగా నిలుస్తామంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితేనే రాష్ట్రంలో బీసీల అభివృద్ధి సాధ్యమంటున్నారు. వైఎస్ జగన్తోనే బీసీలకు న్యాయం రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే ఒక్క వైఎస్ జగన్తోనే సాధ్యం. వైఎస్సార్సీపీ అభ్యర్ధుల జాబితాలో ఎక్కువ బాగం బీసీలకు కేటాయించారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం బీసీలు ఉండటంవల్ల వైఎస్ జగన్ ఎన్నికల అభ్యర్థుల విషయంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షణీయం. – బాబు, బీసీ సంఘం నాయకుడు, పులివెందుల అధిక శాతం సీట్లు బీసీలకే.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక శాతం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలలో బీసీలకు కేటాయించారు. పార్టీలో బీసీలకు సముచిత స్థానం కల్పించిన వైఎస్ జగన్కు ప్రత్యేక ధన్యవాదాలు. బీసీ వర్గాలకు న్యాయం జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. – అంబకపల్లె నారాయణస్వామి, వాల్మీకీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బీసీలకు అగ్రస్థానం కల్పించారు రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలంటే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఆయనతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీలపట్ల చిన్నచూపు చూస్తున్న టీడీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలే గుఠపాఠం చెబుతారు. సీట్ల కేటాయింపులో బీసీలకు అగ్రస్థానం కల్పించారు. – రసూల్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పులివెందుల అన్ని వర్గాలకు న్యాయం ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల విషయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల వారికి న్యాయం చేశారు. బీసీలు అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే జగన్తోనే సాధ్యం. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపే అందుకు నిదర్శనం. అన్ని వర్గాలకు న్యాయం కల్పిచడం హర్షణీయం. ఎన్నికల్లో జగనన్నకు బీసీలంతా అండగా నిలుస్తాం. – బాషా, బీసీ యువజన సంఘ రాష్ట్ర నాయకుడు, పులివెందుల -
బాబు డైలమా!
ఎన్నికల వేళ టీడీపీ అధినేత ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. టీడీపీకి ‘అనంత’ కంచుకోట అంటూ పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. అభ్యర్థులను మాత్రం ఎంపిక చేయలేక సతమతమవుతున్నాడు. నామినేషన్ స్వీకరణ రోజు సమీపిస్తున్నా బరిలో నిలిచే వారిని ప్రకటించలేకపోతున్నారు. ఎంపీ జేసీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోలేక.. సొంత నిర్ణయంపై మొగ్గుచూపలేక సందిగ్ధంలో పడిపోయారు. మరోవైపు కళ్యాణదుర్గం టిక్కెట్పై ఇటు ఉన్నం, అటు అమిలినేని ఆశలు పెంచుకున్నారు. ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నారు. ఇక గుంతకల్లులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: కళ్యాణదుర్గం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తనమాట నెగ్గించుకునేందుకు బ్లాక్మెయిల్కు కూడా దిగారు. సిట్టింగ్లను మార్చి తాను చెప్పిన వారికే టిక్కెట్లు కేటాయించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే జేసీ సిఫార్సు చేసిన వారికి టిక్కెట్లు ఇస్తే పార్లమెంట్ పరిధిలో జేసీ తనకంటూ ప్రత్యేక వర్గం ఏర్చరుచుకుంటారనీ, ఇది పార్టీకి ఇబ్బందిగా పరిణమించే ప్రమాదముందనే యోచనలో పార్టీ ఉంది. అందుకే జేసీ సిఫార్సులపై ఆచితూచి అడుగేయాలనే భావనలో బాబు ఉన్నారు. మళ్లీ మొదటికొచ్చిన కళ్యాణదుర్గం పంచాయితీ జేసీ సిఫార్సు చేసిన మూడు ప్రధాన నియోజకవర్గాల్లో కళ్యాణదుర్గం పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి సిద్ధమయ్యారు. సోమవారం నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు కూడా. ఇక కళ్యాణదుర్గం అభ్యర్థిత్వంపై అమిలినేని సురేంద్రకు టీడీపీ అధిష్టానం స్పష్టత ఇచ్చింది. దీంతో సురేంద్ర నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నారు. ఈ క్రమంలో చౌదరి నామినేషన్ వేస్తానని ప్రకటించడంతో సురేంద్రలో గుబులు మొదలైంది. దీనికి తోడు జేసీ దివాకర్రెడ్డి కూడా సురేంద్రను వ్యతిరేకిస్తున్నారు. బెళుగుప్పకు చెందిన ఉమామహేశ్వరనాయుడు పేరు ఖరారు చేయాలని చంద్రబాబు వద్ద పట్టుబడుతున్నారు. మరోవైపు చౌదరి వర్గం మాత్రం ఉమా, సురేంద్ర స్థానికేతులరని.. వీరిద్దరికీ కాకుండా తమలో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానానికి స్పష్టం చేశారు. తద్వారా ఇద్దరినీ వ్యతిరేకిస్తున్నామని బాహాటంగానే చెప్పారు. చౌదరికి ఎసరు పెట్టాలనీ.. ఎంపీ జేసీ కళ్యాణదుర్గం టిక్కెట్ ఉమాకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో అది తెలుసుకున్న అమిలినేని సురేంద్ర, జేసీతో మాట్లాడినట్లు తెలిసింది. తన అభ్యర్థిత్వానికి సహకరించాలని కోరగా.. ఆయన ససేమిరా అన్నట్లు సమాచారం. కావాలంటే అనంతపురం అర్బన్కు వెళ్లాలని, సీఎంకు కూడా తాను సిఫార్సు చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభాకర్చౌదరిని మార్చాలని ముందు నుంచి దివాకర్రెడ్డి అధిష్టానం వద్ద తన వాణి వినిపిస్తున్నారు. మరోవైపు చౌదరి ఏకంగా ప్రచారం సాగిస్తున్నారు. జేసీ దివాకర్రెడ్డిని గట్టిగా వ్యతిరేకిస్తున్న ప్రభాకర్ చౌదరిని వదులుకోకూడదని చంద్రబాబుకు టీడీ జానార్దన్తో పాటు మంత్రి దేవినేని సూచించినట్లు తెలుస్తోంది. ఆయన దూకుడుకు బ్రేక్ వేయాలంటే కచ్చితంగా చౌదరి ఉండాలనే అభిప్రాయానికి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. మరోవైపే జేసీ, మాజీ ఎంపీ సైఫుల్లా వర్గంతో పాటు బలిజ, కమ్మ సామాజికవర్గ నేతలు కూడా చౌదరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చౌదరికి టిక్కెట్ ఇస్తే గెలిచే అవకాశాలు లేవని సర్వే రిపోర్టులు కూడా రావడంతో చంద్రబాబు కూడా డైలమాలో ఉన్నట్లు సమాచారం. దీంతో సురేంద్ర పేరును అనంతపురం నియోజకవర్గానికి కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను చెప్పిన స్థానాల్లో అభ్యర్థులను మార్చకపోతే ఎంపీగా తాము బరిలోకి దిగమని కూడా జేసీ బాహాటంగానే చెబుతున్నారు. ఇంత నేరుగా అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న జేసీ తీరుతో ‘అనంత’ నేతలు కూడా విస్తుపోతున్నారు. అసలు ఈ ఎన్నికల్లో పార్టీకి జేసీనే మైనస్ కాబోతున్నారని, పవన్ ఎంపీగా ఓడిపోవడం ఖాయమని, ఆయన స్థానంలో మరొకరిని బరిలోకి దించితే ఎంపీగా ఓడిపోయినా కనీసం కొన్ని అసెంబ్లీ స్థానాల్లోనైనా గట్టి పోటీ ఇవ్వగలమనే అభిప్రాయాన్ని మంత్రి దేవినేనికి కొందరు నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. జితేంద్రగౌడ్ వైపే మొగ్గు ఇక గుంతకల్లు స్థానాన్ని జితేంద్రగౌడ్కే ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా పార్లమెంట్ అభ్యర్థినే బీసీని బరిలోకి దించుతోందని.. టీడీపీ తరఫున పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కాలవ మినహా మరో బీసీ నేత లేరని, గౌడ్ను తప్పిస్తే అంతా ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారే అవుతారని ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ రెండు పార్లమెంట్ సీట్లూ తలారి పీడీ రంగయ్య, గోరంట్ల మాధవ్కు కేటాయించడంతో టీడీపీ బలమైన బీసీ ఓటు బ్యాంకు దారి మళ్లిందని, ఇది పార్టీకి తీరని నష్టం చేస్తుందని చెప్పినట్లు సమాచారం. మరోవైపు జేసీ మాత్రం గౌడ్ను తప్పించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ పరిణామాలతో ‘అనంత’ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సీట్లపై చంద్రబాబు తేల్చలేకపోతున్నారని తెలుస్తోంది. రెండో జాబితా ప్రకటిస్తే అందులోనూ ‘అనంత’ పార్లమెంట్లోని స్థానాలు లేకపోతే బాగుండదని జాబితాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. -
జయహో బీసీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్లను ఆ పార్టీ ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ స్థానాల్లో 9 స్థానాలకు బరిలో నిలిచే అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. ఇందులో జిల్లాకు చెందిన రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. జిల్లాలోని బీసీల్లో మెజార్టీ వర్గంగా ఉన్న బోయ సామాజికవర్గం నుంచి రంగయ్య, కురుబ సామాజిక వర్గం నుంచి మాధవ్కు టిక్కెట్లు కేటాయించారు. దీంతో బీసీల అభ్యన్నుతికి, రాజకీయ ఉన్నతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేసినట్లయింది. ఈ నిర్ణయంపై జిల్లా వ్యాప్తంగా బీసీల్లో హర్షం వ్యక్తమవుతోంది. పైగా ఇద్దరూ రాజకీయాలకు కొత్త ముఖాలే. విద్యావంతుడైన రంగయ్యను, పోలీసు శాఖలో డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న మాధవ్లను పార్టీలో చేర్చుకుని పార్లమెంట్ బరిలో నిలపడంతో సామాన్యులు కూడా చట్టసభల్లోకి వెళ్లడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పినట్లయింది. పోలీసు నుంచి ఎంపీ అభ్యర్థి దాకా.. గోరంట్ల మాధవ్ అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీజీ, లా కోర్సు పూర్తి చేశారు. 1996 బ్యాచ్ ఎస్ఐగా పోలీసు శాఖలోకి ప్రవేశించారు. అనంతపురం నగరంలోని సిద్ధప్ప జ్యూవెలర్స్ అధినేత రేవన సిద్ధప్ప మనువరాలును వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. ఉద్యోగ నిమిత్తం పలు స్టేషన్లలో పనిచేసిన ఆయన 2003 నుంచి జిల్లాలోని పలు స్టేషన్లలో ఎస్ఐగా, ఆ తర్వాత సీఐగా విధులు నిర్వహించారు. ఉద్యోగ జీవితంలో నిజాయతీ అధికారిగా, లా అండ్ ఆర్డర్ అమలులో రాజీపడని పోలీసుగా మాధవ్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కీలకభూమిక పోషించి వారి అభ్యున్నతికి తన వంతు కృషి చేశారు. గ్రూప్–1 అధికారి నుంచి... తలారి రంగయ్య అనంతపురం జిల్లాకు పీడీ రంగయ్యగా సుపరిచితులు. 21 ఏళ్లు గ్రూప్–1 అధికారిగా పని చేశారు. ఇంకా 13 ఏళ్ల సర్వీస్ ఉంది. 2018 ఫిబ్రవరి 14న వీఆర్ఎస్ ఆమోదం పొందింది. 1997లో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్–1 అధికారిగా ఎంపికై చేనేత జౌళిశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. 1998–99 చిత్తూరు జిల్లాలో, తర్వాత 1999 నుంచి 2002 వరకు నెల్లూరు జిల్లాలో పని చేశారు. ఆ తర్వాత 2002 నుంచి 2006 వరకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలుగు ప్రాజెక్ట్లో.. 2006–07లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అడిషనల్ డైరెక్టర్గా అనంతపురంలో సేవలందించారు. 2007 నుంచి 2009 వరకు కడప మెప్మా డైరెక్టర్గా పని చేశారు. 2009లో వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్గా.. 2009 నుంచి 2012 వరకు అనంతపురం డీఆర్డీఏ పీడీగా ఉన్నారు. 2012–13లో హిందూపురం మునిసిపల్ కమిషనర్గా, 2013–14లో అనంతపురం మునిసిపల్ కమిషనర్గా పని చేశారు రాష్ట్ర భవిష్యత్తు వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు చాలా బాధిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రశ్నించలేకపోయా. రాష్ట్ర అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో కమిట్మెంట్ రాజకీయాలు చేస్తున్న యువకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు తెలిపి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలో చేరా. అత్యంత సామాన్యులకు సైతం పెద్దపీట వేసి రాజకీయ భవిష్యత్తు కల్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన్మంతా రుణపడి ఉంటా. – తలారి రంగయ్య బీసీలకు ఇచ్చిన గౌరవం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాననే ప్రకటన ఉద్వేగానికి గురిచేస్తోంది. సామాన్య కుటుంబంలో జన్మించా. పోలీసు ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం. ఎలాగైనా డిపార్ట్మెంట్లోకి రావాలనే పట్టుదలతో ఎస్ఐగా వచ్చా. ఆ తర్వాత నాయకుల పరిస్థితి, స్టేషన్లకు వచ్చే ప్రజల సమస్యలు చూసి రాజకీయాల్లోకి రావాలనే కాంక్ష ఉండేది. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరు, పట్టుదల చూసిన తర్వాత ఆయన నాయకత్వంలో పనిచేయాలనే కోరికతోనే వైఎస్సార్సీపీలో చేరా. ఇప్పుడు పురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటా. ఇది బీసీలకు మా పార్టీ ఇచ్చిన గౌరవం. అలాగే ‘అనంత’ పార్లమెంట్ అభ్యర్థి రంగయ్యకు అభినందనలు. కచ్చితంగా రెండు పార్లమెంట్ స్థానాలను గెలవబోతున్నాం. జగన్మోహన్రెడ్డి సీఎం కాబోతున్నారు. ప్రజలు మళ్లీ రాజన్న రాజ్యం చూడబోతున్నారు. – గోరంట్ల మాధవ్ -
వైఎస్సార్సీపీతోనే బీసీల అభ్యున్నతి
కర్నూలు (ఓల్డ్సిటీ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోనే బీసీల అభ్యున్నతి సాధ్యమవుతుందని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, ఘన నివాళులు అర్పించారు. అనంతరం టీజే షాపింగ్ మాల్లోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. పేరుకే టీడీపీ బీసీల పార్టీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..బడుగుల అభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు. వారిని కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏలూరులో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ చరిత్రాత్మకమన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయని సాహసాన్ని జననేత చేశారని కొనియాడారు. బీసీ అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తే రాష్ట్రవ్యాప్తంగా బడుగు వర్గాల నుంచి హర్షాతిరేకాలు వెల్లువెత్తాయన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే బీసీలు రాజకీయంగా బలపడేందుకు నామినేటెడ్ పదవుల నియామకాలు జరుగుతాయని తెలిపారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఇది తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయమన్నారు. జనంలో చంద్రబాబుపై నమ్మకం పోయిందని, రాష్ట్ర ప్రజలంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. బీసీల పునాది మీద ఏర్పడిన పార్టీగా చెప్పుకోవడమే తప్ప టీడీపీ..బడుగుల అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. బీసీల అభవృద్ధికి వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్ధన్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నాగరాజు యాదవ్, సత్యం యాదవ్, బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవపూజ ధనుంజయాచారి, రాష్ట్ర కార్యదర్శి రియల్టైం నాగరాజు, ఆదిమోహన్రెడ్డి, రఘునాథ్, రాజశేఖర్, కటారి సురేశ్, కరుణాకర్రెడ్డి, రైల్వేప్రసాద్, సాంబశివారెడ్డి, కృష్ణకాంత్రెడ్డి, హనుమంతురెడ్డి, రంగ, కిశోర్, విఠల్, మున్నా, సయ్యద్ ఆసిఫ్, మదారపు రేణుకమ్మ, ఏసన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘జగన్ సీఎం అయితేనే బీసీలకు న్యాయం’
సాక్షి, పశ్చిమగోదావరి : ఏలూరులో ఈ నెల 17న జరిగే ‘బీసీ గర్జన సభ’ను విజయవంతం చేస్తామని వైఎస్సార్సీపీ నాయకుడు ముదునూరి ప్రసాద రాజు తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు. గత నాలుగేళ్లలో బాబుకు బీసీలు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. ఇన్నాళ్లు బీసీలను పట్టించుకోని చంద్రబాబు.. ఎన్నికల ముందు ‘బీసీ కులాలకు పనిముట్లం’టూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మోసపూరిత హామీలను బీసీలు నమ్మే స్థితిలో లేరని ఆయన తెలిపారు. దివంగత వైఎస్సార్ హాయంలోనే బీసీలకు న్యాయం జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రసాద రాజు ఆశాభావం వ్యక్తం చేశారు