భారత్-బంగ్లా మ్యాచ్ వర్షం అంతరాయం తర్వాత తిరిగి ప్రారంభమైన కొద్ది సేపటికే తమీమ్ ఇక్బాల్ 60 పరుగులు( 62బంతులు, 7ఫోర్లు, 1సిక్సర్లు), లిటన్(8)లు అశ్విన్ బౌలింగ్ లో వెంటవెంటనే వెనుదిరిగారు.
మిర్పూర్: భారత్-బంగ్లా మ్యాచ్ వర్షం అంతరాయం తర్వాత తిరిగి ప్రారంభమైన కొద్ది సేపటికే కీలక వికెట్లని బంగ్లాదేశ్ కోల్పోయింది.తమీమ్ ఇక్బాల్ 60 పరుగులు( 62బంతులు, 7ఫోర్లు, 1సిక్సర్లు), లిటన్(8)లు అశ్విన్ బౌలింగ్ లో వెంటవెంటనే వెనుదిరిగారు. కొద్దిసేపటకే అశ్విన్ బౌలింగ్ లో భారీ షాట్ కుప్రయత్నించి ముష్ఫికర్(14) ఔటయ్యాడు.
షకీబ్(5), రహమాన్(1) లు క్రీజ్ లో ఉన్నారు. దీంతో బంగ్లాదేశ్ 25 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అశ్విన్ ఏడు ఓవర్లలో 36 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.