One Day
-
మూడో వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ.. సిరీస్ క్లీన్ స్వీప్ (ఫోటోలు)
-
మీరూ ఏదో ఒకరోజు సీఎం అవుతారు
నాగ్పూర్: మీరు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్నుద్దేశిస్తూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యా ఖ్యానించారు. గురువారం నాగ్పూర్లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలనుద్దేశిస్తూ గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం ఫడ్నవిస్ మాట్లాడారు. సభలో ఉన్న అజిత్ పవార్, మరో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలనుద్దేశిస్తూ ప్రసంగించారు. ‘‘ తెల్లవారుజామునే నిద్రలేచే అజిత్ పవార్ అప్పట్నుంచే ప్రజాసేవకు అంకితమవుతారు. ఫైళ్లు తిరగేస్తారు. నేను మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి పని మొదలుపెడతా. అయితే ఏక్నాథ్ షిండే మాత్రం అర్ధరాత్రిదాకా పనిచేస్తారు. చాన్నాళ్లుగా డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూ అజిత్ పవార్కు ‘శాశ్వత ఉపముఖ్యమంత్రి’ పేరు స్థిరపడిపోయింది. కానీ నేను మాత్రం ఒక్కటే ఆశిస్తున్నా. అజిత్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటారు’’ అని ఫడ్నవిస్ అన్నారు. ఎన్సీపీ చీఫ్ అయిన అజిత్ పవార్ ఈనెల ఐదో తేదీన ఆరోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం తెల్సిందే. ఎప్పట్నుంచో ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసిన అజిత్ ఆ లక్ష్యసాధనలో భాగంగా బాబాయి శరద్పవార్ సారథ్యంలోని ఎన్సీపీని చీల్చి బీజేపీతో చేతులు కలిపిన విషయం విదితమే. పార్టీని చీల్చినా సరే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తనవైపే రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో ఎన్సీపీ పార్టీ గుర్తు, ఎన్నికల చిహ్నం రెండూ అజిత్కే దక్కాయి. ఇటీవల లోక్సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అజిత్ వర్గమే అత్యధిక స్థానాల్లో గెలిచి తమదే అసలైన ఎన్సీపీ అని నిరూపించుకుంది. -
టీమిండియాలో నో ఛాన్స్.. అక్కడ మాత్రం ఇరగదీశాడు! ఎవరంటే?
ఇంగ్లండ్ దేశీవాళీ వన్డే కప్-2024లో టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా నార్తాంప్టన్షైర్ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాడ్లెట్ క్రికెట్ క్లబ్ వేదికగా మిడిలెక్స్తో జరుగుతున్న మ్యాచ్లో పృథ్వీ షా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన పృథ్వీ షా.. మిడిలెక్స్తో మ్యాచ్లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఈ మ్యాచ్లో ఓవరాల్గా 58 బంతులు ఎదుర్కొన్న షా.. 12 ఫోర్లు, ఒక సిక్స్తో 76 పరుగులు చేసి ఔటయ్యాడు.దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తాంప్టన్షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పృథ్వీతో పాటు గాస్ మిల్లర్(73), జైబ్(58) హాఫ్ సెంచరీలతో రాణించారు. పృథ్వీ షా విషయానికి వస్తే.. దాదాపుగా మూడేళ్ల నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు.ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యల కారణంగా భారత సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోవడం లేదు. దేశీవాళీ క్రికెట్లో కూడా తన మార్క్ను చూపించడంలో షా విఫలమయ్యాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అతడి ప్రదర్శన అంతంతమాత్రమే. ఈ ఏడాది సీజన్లో ఢిల్లీ తరపున షా 8 ఇన్నింగ్స్లలో 198 పరుగులు మాత్రమే చేశాడు. 10.5 | That's 50 for Prithvi Shaw! 👏The opener brings up his half-century off 33 balls.Steelbacks 75/2.Watch live 👉 https://t.co/CU8uwteMyd pic.twitter.com/JlIYPxjAjl— Northamptonshire Steelbacks (@NorthantsCCC) July 29, 2024 -
ఇండియాలో ముందుగానే రిలీజ్ కానున్న హాలీవుడ్ మూవీ!
విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ నటించిన తాజా చిత్రం బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై. ప్రముఖ ఫ్రాంచైజీలో నిర్మించిన ఈ చిత్రానికి ఆదిల్, బిలాల్ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా దేశవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఒక రోజు ముందుగానే భారతదేశం అంతటా భారీ స్థాయిలో జూన్ 6న విడుదలవుతోంది. ఈ యాక్షన్-అడ్వెంచర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు.అత్యంత జనాదరణ పొందిన యాక్షన్-కామెడీ ఫ్రాంచైజీలలో ఒకటైన బ్యాడ్ బాయ్స్ నాల్గొ విడత గురువారం రిలీజ్ కానుంది. ఈ చిత్రం జూన్ 6వ తేదీన భారతదేశంలో ఒక రోజు ముందుగా విడుదల కావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో వెనెస్సా హడ్జెన్స్, అలెగ్జాండర్ లుడ్విగ్, పావోలా న్యూనెజ్, ఎరిక్ డేన్, ఇయాన్ గ్రుఫుడ్, జాకబ్ స్కిపియో, మెలానీ లిబర్డ్, తాషా స్మిత్తో టిఫనీ హడిష్, జో పాంటోలియానో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
మిజోరంలో ఓట్ల లెక్కింపు 4న
న్యూఢిల్లీ: íఇటీవల ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న ఒకే రోజు మొదలవుతుందని ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మిజోరంలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు శుక్రవారం ఈసీ తెలిపింది. క్రైస్తవులు మెజారిటీ కలిగిన ఈ రాష్ట్రానికి చెందిన వివిధ వర్గాల ప్రతినిధులు 3వ తేదీ, ఆదివారం తమకు ఎంతో ప్రత్యేకమైనది అయినందున ఓట్ల లెక్కింపు వాయిదా వేయాలని కోరినట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు కౌంటింగ్ను ఒక రోజు అంటే 4వ తేదీకి వాయిదా వేసినట్లు వివరించింది. -
ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది?
మీరు ప్రయాణాలను ఇష్టపడేవారైతే అన్ని నగరాల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటారు. పలు నగరాలు ఎంతో చారిత్రాత్మకమైనవి. వాటి చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భారతదేశానికి కేవలం ఒక రోజు రాజధానిగా ఉన్న ఒక నగరం ఉందని, చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇది ఎప్పుడు, ఎలా, ఎక్కడ జరిగిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. భారతదేశానికి ఒక్కరోజు కోసం ఏ నగరాన్ని రాజధానిగా చేశారో.. అలా ఎందుకు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. అలహాబాద్ చరిత్ర ఇప్పుడు మన అలహాబాద్ సంగమ నగరం గురించి తెలుసుకోబోతున్నాం. దీనిని ప్రస్తుతం ప్రయాగ్రాజ్ అని పిలుస్తున్నారు. చరిత్రలొని వివరాల ప్రకారం మొఘల్ పాలకుడు అక్బర్ ఈ నగరానికి అలహాబాద్ అనే పేరు పెట్టాడు. దీని అర్థం ‘అల్లా నగరం’. తర్వాత అది అలహాబాద్గా మారింది. మొఘల్ పాలనలో ఈ నగరం ప్రాంతీయ రాజధానిగా ఉండేది. మొఘల్ పాలకుడు జహంగీర్ 1599 నుండి 1604 వరకు నగరంలో తన ప్రధాన పరిపాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్క రోజు రాజధాని మొఘలులు పతనం అనంతరం భారతదేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైనప్పుడు అలహాబాద్ ఒక రోజు రాజధానిగా ఉంది. 1772 నుంచి కలకత్తా రాజధానిగా మనదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలించింది. కాగా 1857లో మీరట్ కేంద్రంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీనినే ప్రథమ స్వాతంత్ర్యపోరాటంగా చెబుతుంటారు. దీనిని అణచివేశాక ఇండియా పాలన బాధ్యతలను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకోవాలని భావించింది. దీనిపై 1858లో క్వీన్ విక్టోరియా ఆర్డర్స్ కలిగిన లెటర్ అప్పటి వైస్రాయ్ జనరల్ లార్డ్ క్యానింగ్కు చేరింది. ఆ సమయంలో ఆయన అలహాబాద్లో ఉన్నారు. ఆయన వెంటనే అందుబాటులో ఉన్న స్థానిక రాజులు, చక్రవర్తులు, భూస్వాములతో సమావేశం ఏర్పాటుచేశారు. క్వీన్ విక్టోరియా పంపిన ఉత్తరం చదివి, పాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆ ఒక్కరోజుకు అలహాబాద్ను ఇండియాకు రాజధానిగా ప్రకటించారు. ఈ విధంగా ఇండియాకు ఒక్కరోజు రాజధానిగా అలహాబాద్ చరిత్రలో నిలిచింది. పర్యాటక కేంద్రంగా.. ప్రయాగ్రాజ్ చాలా కాలం పాటు పరిపాలన, విద్యా కేంద్రంగా ఉంది. ఇది పర్యాటక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. నగరంలో, చుట్టుపక్కల అనేక చారిత్రక, మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ నగరాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది వస్తుంటారు. ఇక్కడ మూడు పవిత్ర నదులైన గంగ, యమున, సరస్వతి సంగమిస్తాయి. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుంది. చూడవలసిన ప్రదేశాలు మీరు ప్రయాగ్రాజ్కు వెళుతున్నట్లయితే సంగమ స్థలితోపాటు ఖుస్రో బాగ్ సందర్శించవచ్చు. ఇక్కడి మొఘల్ వాస్తుశిల్పం అమితంగా ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా ఆనంద్ భవన్ కూడా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇది ఒకప్పుడు పండిట్ నెహ్రూ కుటుంబానికి చెందిన భవనం. 1970లో నాటి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈ భవనాన్ని భారత ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. అప్పటి నుండి ఈ భవనాన్ని ఆనంద్ భవన్ అని పిలుస్తున్నారు. ప్రయాగ్రాజ్లో అక్బర్ కోట కూడా సందర్శించదగిన ప్రదేశంగా నిలిచింది. ఇది కూడా చదవండి: సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం? -
ఒక్కరోజు పెళ్లికి లెక్కలేనంత డిమాండ్.. ఆనక వధువు ఏంచేస్తుందంటే..
జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పెళ్లయిన వారిని సెటిల్ అయ్యారని కూడా అంటుంటారు. అయితే పెళ్లి విషయంలో వివిధ దేశాల్లో పలు రకాలైన సంప్రదాయాలున్నాయి. కొన్ని దేశాల్లో పెళ్లి వేడుకలు రోజుల తరబడి కూడా జరుగుతుంటాయి. అయితే ఆ దేశంలో పెళ్లి వేడుక అన్ని ప్రాంతాలకన్నా భిన్నంగా జరుగుతుంది. అక్కడ యువకులు ఒక్కరోజు కోసం పెళ్లికొడుకులుగా మారతారు. అమ్మాయి కూడా ఒక్కరోజు కోసం వధువుగా మారుతుంది. ఇంతకీ ఇలాంటి వింత వివాహం ఎక్కడ జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? పూర్తి వివరాలు.. ఇటువంటి వింత వివాహం చైనాలో జరుగుతుంది. ఇటీవలి కాలంలో చైనాలో వింత వివాహాలు జరుగుతున్నాయి. గతంలో ఇటువంటి విధానం లేదు. తాజాగా ఒక్కరోజు కోసమే ఇక్కడ వివాహాలు జరుగుతున్నాయి. ఇటువంటి వివాహాల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లేమీ జరగవు. సాదాసీదాగా, రహస్యంగా ఈ వివాహాలు జరుగుతుంటాయి. గత కొంతకాలంగా చైనాలో ఇటువంటి వివాహాల తంతు పెరిగిపోయింది. ఈమధ్య కాలంలొ చైనాలలోని యువకులకు వివాహం జరగడం అత్యంత కష్టదాయకంగా మారింది. పెళ్లికి అత్యధికంగా సొమ్ము ఖర్చుపెట్టాల్సి రావడంతో చాలామంది వివాహాలకు దూరంగా ఉంటున్నారు. అయితే చైనాలో పురుషులు బ్రహ్మచారులుగా మరణించడాన్ని అశుభంగా పరిగణిస్తారు. దీనిని అధిగమించేందుకే యువకులు ఒకరోజు పెళ్లికి సిద్దం అవుతున్నారు. తద్వారా తమ బ్రహ్మచర్యాన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు. చైనాలోని కొన్ని ప్రాంతాలలోనైతే ఎవరైనా వ్యక్తి పెళ్లికాకుండా మరణిస్తే, ఆ మృతదేహానికి వివాహం జరిపిస్తారు. ఇటీవలి కాలంలో చైనాలో ఒక్కరోజు పెళ్లిపేరట భారీ వ్యాపారం జరుగుతోంది. పెళ్లికాని యువకులకు ఒక్క రోజు కోసం పెళ్లి జరిపిస్తున్నారు. పెళ్లి అయిన తరువాత ఆ వధువు తిరిగి తన ప్రాంతానికి వెళ్లిపోతుంది. ఇలాంటి ఒక్కరోజు వధువులకు కూడా చైనాలో డిమాండ్ పెరుగుతోంది. ఇది కూడా చదవండి: ‘నా జీవితం ఇంకొకరికి అంకితం’.. నర్సు ఉద్యోగం రాగానే భర్తను గెంటేసి.. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒకరోజుకే పరిమితమయ్యాయి. జూలై ఎఫ్అండ్ఓ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడంతో బ్యాంకింగ్, ఇంధన, ఆటో షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు., అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పతనం సెంటిమెంట్పై ఒత్తిడి పెంచాయి. ఉదయం సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 66,629 వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 19,851 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. దేశీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలతో సూచీలు రోజంతా బలహీనంగా కదలాడాయి. సెన్సెక్స్ ఒక దశలో 646 పాయింట్లు క్షీణించి 66,326 వద్ద, నిఫ్టీ 174 పాయింట్లు పతనమై 19,604 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఆఖర్లో కొంత కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాల కొంత భర్తీ అయ్యాయి. చివరికి సెన్సెక్స్ 440 పాయింట్లు నష్టపోయి 66,267 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయి 19,660 వద్ద నిలిచింది. నష్టాల మార్కెట్లో ఫార్మా, రియలీ్ట, టెలికాం, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,979 కోట్ల షేర్లు విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,528 కోట్ల షేర్లను కొన్నారు. ఈసీబీ, బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల వెల్లడికి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► దేశీయంగా సర్వర్లు తయారు చేసే నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా బంపర్ లిస్టింగ్ సాధించింది. బీఎస్ఈ ఇష్యూ ధర (రూ.500)తో పోలిస్తే 82.40% భారీ ప్రీమియంతో రూ.942.50 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్లో 91% ర్యాలీ చేసి రూ. 942.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 82.10% లాభంతో రూ.910.50 వద్ద స్థిరపడింది. ► జూన్ క్వార్టర్లో నికర లాభం 21% వృద్ధి సాధించడంతో ఆర్ఈసీ లిమిటెడ్ షేరు 7% పెరిగి రూ. 186 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో తొమ్మిదిశాతం ర్యాలీ చేసి రూ.189 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► తొలి త్రైమాసిక ఫలితాలు మెప్పించలేకపోవడంతో టెక్ మహీంద్రా షేరు నాలుగుశాతం నష్టపోయి రూ.1,100 వద్ద ముగిసింది. -
పాకిస్థాన్ లేకుండానే ఆసియా కప్ ఇండియా ఆలా చేస్తే పాకిస్థాన్ కి బారి నష్టమే..!
-
ఒక్క సిరీస్ తో వరల్డ్ కప్ కి యశస్వి జైస్వాల్..
-
పతిరణకి ధోని సలహా...మండి పడుతున్న మలింగ
-
రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేవాణ్ని: ట్రంప్
వాషింగ్టన్: 2020 ఎన్నికల్లో మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా–ఉక్రెయిన్ల యుద్ధం జరిగి ఉండేదే కాదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో తనకున్న మంచి సంబంధాల దృష్ట్యా, అసలు ఈ యుద్ధం మొదలయ్యేదే కాదన్నారు. ఇటీవల ఫాక్స్ న్యూస్కిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా రష్యా–ఉక్రెయిన్ సంక్షోభానికి 24 గంటల్లోనే ముగింపు పలికి ఉండేవాడినని చెప్పుకున్నారు. ‘‘2024 దాకా యుద్ధం కొనసాగితే, నేను మళ్లీ అధ్యక్షుడినైతే ఒక్క రోజులోనే శాంతి ఒప్పందం కుదురుస్తా. నాకు, పుతిన్కు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు చాలా ఈజీ వ్యవహారం. సంక్షోభం ఇలాగే కొనసాగితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటికి మూడో ప్రపంచయుద్దానికి దారితీసి, అణుయుద్ధంగా మారే ప్రమాదముంది. రెండు ప్రపంచ యుద్ధాలు మూర్ఖుల కారణంగా స్వల్ప కారణాలతోనే జరిగాయి’’ అన్నారు. -
దక్షిణాఫ్రికా గడ్డపై అర్చర్ సరికొత్త చరిత్ర.. 30 ఏళ్ల రికార్డు బద్దలు
దక్షిణాఫ్రికా గడ్డపై ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోప్రా అర్చర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికాలో ప్రోటీస్ జట్టుపై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్గా అర్చర్ నిలిచాడు. కింబర్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో అర్చర్ దుమ్మురేపాడు. ఈ మ్యాచ్లో 9.1 ఓవర్లు బౌలింగ్ చేసిన జోఫ్రా.. 40 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను అర్చర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట ఉండేది. 1993లో దక్షిణాఫ్రికాలో ప్రోటీస్తో జరిగిన ఓ వన్డేలో అక్రమ్ 16 పరుగులకే 5 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్తో 30 ఏళ్ల అక్రమ్ రికార్డును అర్చర్ బ్రేక్ చేశాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రెండో మ్యాచ్లోనే అర్చర్ ఈ ఘనత సాధించడం విశేషం. ఇక అర్చర్కు వన్డేల్లో ఇదే కెరీర్ బెస్ట్ కూడా. తొలి ఇంగ్లండ్ బౌలర్గా.. అదే విధంగా విదేశీ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి ఇంగ్లండ్ బౌలర్గా అతడు నిలిచాడు.అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ పేరిట ఉండేది. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ వన్డే మ్యాచ్లో క్రిస్ వోక్స్ 45 పరుగులిచ్చి 6 వికెట్లు సాధించాడు. తాజా మ్యాచ్లో 40 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన అర్చర్.. 12 ఏళ్ల వోక్స్ రికార్డు బ్రేక్ చేశాడు. చదవండి: IND vs NZ: 'తీవ్రంగా నిరాశపరిచాడు.. స్పిన్నర్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలి’ -
జింబాబ్వేపై ఆస్ట్రేలియా ఘన విజయం..
18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన జింబాబ్వే ఓటమితో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. టౌన్స్ విల్లే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొలత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 47.3 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఆల్రౌండర్ మాధేవేరే 72 పరుగులతో రాణించడంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోర్ అయినా చేయగల్గింది. ఇక ఆసీస్ బౌలర్లలో యువ కామెరాన్ గ్రీన్ ఐదు వికెట్లతో చేలరేగగా.. జంపా మూడు, మార్ష్, స్టార్క్ తలా వికెట్ సాధించారు. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియా 33.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్(57) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. స్మిత్ 48 పరుగులతో(నాటౌట్)గా నిలిచాడు. జింబాబ్వే బౌలర్లలో బర్ల్ మూడు వికెట్లు పడగొట్టగా..రజా, నగర్వ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్లు మధ్య రెండో వన్డే ఇదే వేదికగా ఆగస్టు 31న జరగనుంది. చదవండి: Asia Cup Ind Vs Pak: పాకిస్తాన్తో తొలి మ్యాచ్.. దినేష్ కార్తీక్కు నో ఛాన్స్! -
ఒక్క రోజూ వేస్ట్ చేయను
ఎస్బీఎస్ నగర్ (పంజాబ్): ‘‘పంజాబ్ అభివృద్ధి కోసం ఈ రోజు నుంచే రంగంలోకి దిగుతాం. ఒక్క రోజు కూడా వృథా చేయం. మనమిప్పటికే 70 ఏళ్లు ఆలస్యమయ్యాం. అవినీతి, నిరుద్యోగాలను రాష్ట్రం నుంచి పారదోలతాం’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ సింగ్ మాన్ (48) ప్రతిజ్ఞ చేశారు. పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా బుధవారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. భగత్సింగ్ స్వగ్రామం కట్కర్కలాన్లో భారీ జన సందోహం సమక్షంలో గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. భగత్సింగ్కు అత్యంత ఇష్టమైన రంగ్ దే బసంతి పాట మారుమోగుతుండగా, జనం హర్షధ్వానాల మధ్య కార్యక్రమం జరిగింది. ఆప్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు భగత్సింగ్కు చిహ్నంగా భావించే పసుపురంగు తలపాగాలు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. జనం కూడా అవే తలపాగాలు ధరించి కన్పించారు. వారినుద్దేశించి మాన్ మాట్లాడారు. ముందుగా ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతా కీ జై, జో బోలే సో నిహాల్ అంటూ నినదించి జనాల్లో జోష్ నింపారు. వాళ్లు కూడా ఆయనతో ఉత్సాహంగా గొంతు కలిపారు. ఆప్కు బంపర్ మెజారిటీ కట్టబెట్టి రాష్ట్ర ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని మాన్ కొనియాడారు. ‘‘రాష్ట్రంలో స్కూళ్లు, ఆస్పత్రులను ఢిల్లీ తరహాలో మెరుగుపరుస్తాం. వాటిని చూసేందుకు విదేశాల నుంచి కూడా జనం వచ్చేలా చేస్తాం’’ అని చెప్పారు. అహంకారానికి తావివ్వొద్దని, వినయ విధేయతలతో మసలుకోవాలని ఆప్ ఎమ్మెల్యేలకు సూచించారు. పంజాబ్ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుందని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. అమెరికా నుంచి వచ్చిన మాన్ కూతురు సీరత్ (21), దిల్షాన్ (17) ప్రమాణ స్వీకారంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మాన్ దంపతులు 2015లో విడిపోయారు. అప్పటినుంచీ పిల్లలు తల్లితో పాటు అమెరికాలో ఉంటున్నారు. కమెడియన్ నుంచి సీఎం దాకా... ప్రమాణ స్వీకారం తర్వాత చండీగఢ్లోని సీఎం కార్యాలయంలో మాన్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆయనొక్కరే ప్రమాణం చేశారు. ఆయన మంత్రివర్గం శనివారం రాజ్భవన్లో బాధ్యతలు స్వీకరిస్తుందని ఆప్ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు, ఒడిశా సీఎంలు ఎంకే స్టాలిన్, నవీన్ పట్నాయక్ తదితరులు మాన్ను అభినందించారు. పంజాబ్ సంక్షేమానికి, రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కలిసి పని చేద్దామని మాన్తో మోదీ చెప్పారు. కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన మాన్ ఆ తర్వాత రాజకీయాల్లోకి దిగి రెండుసార్లు సంగ్రూర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2022 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లకు ఏకంగా 92 స్థానాల్లో ఆప్ ఘనవిజయం సాధించడం తెలిసిందే. -
మీరూ కావచ్చు.. ఒక్కరోజు బ్రిటిష్ హైకమిషనర్!
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ హైకమిషనర్గా పనిచేయాలని ఉందా?.. అయితే ఒక్క రోజు మాత్రమే. హైదరాబాద్లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ కార్యాలయం ఈ అవకాశం కలి్పస్తూ సోమవారం ప్రకటన జారీ చేసింది. దీనికి 18 నుంచి 23 ఏళ్ల వయసున్న యువతులు మాత్రమే అర్హులు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, అర్హులైన యువతులు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దరఖాస్తుదారులు.. ‘యువజనం వాతావరణ మార్పుల్లాంటి సమస్యల పరిష్కారంలో ఏ రకంగా మెరుగైన మద్దతు ఇవ్వగలరు’అన్న అంశంపై నిమిషం నిడివి ఉన్న వీడియో తీసి ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రా మ్లో పోస్ట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో@UKinIndiaMýకు ట్యాగ్ చేయడంతోపాటు # DayoftheGirl హ్యష్ట్యాగ్ను ఉపయోగించాలి. సెప్టెంబర్ 28న విజేత వివరాలు వెల్లడి ‘భారత ప్రధాని నరేంద్ర మోదీ బాలిక సాధికారతకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. యూకే ప్రభుత్వం ఇచ్చే ఛీవెనింగ్ ఫెలోషిప్లో 60 శాతం, స్కాలర్ షిప్ల్లో 52 శాతం మహిళలకు దక్కుతుండటం సంతోషదాయకం. ‘హై కమిషనర్ ఫర్ ఎ డే’ ద్వారా మహిళలు ఏదైనా సాధించగలరు అన్న అంశాన్ని చాటిచెప్పాలని నిర్ణయించాం’అని భారత్లో బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ప్రకటనలో తెలిపారు. 2017 నుంచి బ్రిటిష్ హై కమిషన్ ‘హై కమిషనర్ ఫర్ ఎ డే’ను నిర్వహిస్తోందని, గత ఏడాది 18 ఏళ్ల చైతన్య వెంకటేశ్వరన్ దీనికి ఎంపికయ్యారని వివరించింది. దరఖాస్తుదారులందరి వివరాలను బ్రిటిష్ హైకమిషన్ నేతృత్వంలోని న్యాయనిర్ణేతలు పరిశీలించి ఒకరిని ఎంపిక చేస్తారని, సెప్టెంబర్ 28న విజేత వివరాలను సామాజిక మాధ్యమాల్లో ప్రకటిస్తామని తెలిపారు. చదవండి: సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసు: పోలీసుల కీలక నిర్ణయం ఒక్కొక్కరు ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలని, ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే ఆ వ్యక్తిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత వివరాలను వీడియోలో ఉంచరాదని పేర్కొన్నారు. విజేత ఒక రోజుపాటు ఢిల్లీలో బ్రిటిష్ హైకమిషనర్గా వ్యవహరిస్తారు. దీనికి సంబంధించిన రవాణా, వసతి ఖర్చులను కమిషన్ భరించదు. విజేత ఇతర ప్రాంతాల వారైతే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఢిల్లీకి రావడం, బస చేయడం పూర్తిగా వారి బాధ్యతేనని ఎల్లిస్ స్పష్టం చేశారు. చదవండి: వైద్యుల తయారీలో అరవై ఏడు వసంతాలు -
ఉత్తరాఖండ్కు ఒక్కరోజు సీఎం
న్యూఢిల్లీ: జాతీయ బాలి కాది నోత్సవం సందర్భంగా ఆదివారం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒక రోజు ముఖ్యమంత్రిగా సృష్టి గోస్వామి వ్యవహ రించారు. సీఎం హోదాలో హరిద్వార్కు చెందిన 20 ఏళ్ల గోస్వామి ఆదివారం అధికారిక విధులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభు త్వం నిర్వహిస్తున్న పలు సంక్షేమ పథకా లను సమీక్షించారు. దేశవ్యాప్తం గా జనవరి 24న జాతీయ బాలికాది నోత్సవం జరుపుకునే విషయం తెలిసిందే. బాలికాదినోత్సవం సందర్భంగా బాలికలకు ప్రధాని మోదీ శుభాకాం క్షలు తెలిపారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను కొనియాడుతూ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బాలికలకు విద్య, వైద్యం అందించే దిశగా తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను వివరించారు. బాలికా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ట్వీటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘బాలి కలందరికీ హృదయ పూర్వక శుభా కాంక్షలు. మీ సాధికా రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు. -
ఆంధ్రప్రదేశ్ వెయిట్లిఫ్టర్ల పతకాల పంట
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో సోమవారం ఆంధ్రప్రదేశ్ వెయిట్లిఫ్టర్లు అదరగొట్టారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలను సొంతం చేసుకున్నారు. అండర్–17 బాలుర 81 కేజీల విభాగంలో షేక్ లాల్ బషీర్ (విశాఖపట్నం) స్వర్ణం నెగ్గగా... జి. రవిశంకర్ (డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా) రజతం సాధించాడు. లాల్ బషీర్ (స్నాచ్లో 112+క్లీన్ అండ్ జెర్క్లో 142) మొత్తం 254 కేజీలు బరువెత్తి చాంపియన్గా నిలిచాడు. రవిశంకర్ (స్నాచ్లో 106+క్లీన్ అండ్ జెర్క్లో 143) మొత్తం 249 కేజీలు బరువెత్తి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. అండర్–21 బాలుర 89 కేజీల విభాగంలో ఆదిబోయిన శివరామకృష్ణ యాదవ్ (డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా) రజతం గెలిచాడు. శివరామకృష్ణ యాదవ్ (స్నాచ్లో 125+క్లీన్ అండ్ జెర్క్లో 150) మొత్తం 275 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఇదే కేటగిరీలో తెలంగాణ వెయిట్లిఫ్టర్ హల్వత్ కార్తీక్ మొత్తం 269 కేజీలు బరువెత్తి మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. అండర్–17 బాలికల 76 కేజీల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన చుక్కా శ్రీలక్ష్మి కాంస్య పత కాన్ని సొంతం చేసుకుంది. శ్రీలక్ష్మి మొత్తం 156 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచింది. అండర్–21 బాలికల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో శ్రియ సాయి యనమండ్ర–గురజాడ శ్రీవిద్య (తెలంగాణ) జంట కాంస్యం సాధించింది. -
విండీస్ చేతిలో భారత్ ఘోర ఓటమి
-
మహాకూటమి గెలిస్తే రోజుకో ప్రధాని
ఖాన్పూర్: దేశంలోని విపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పడిన మహాకూటమిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా నిప్పులుచెరిగారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రోజుకో ప్రధాని మారతారని అన్నారు. ఉత్తరప్రదేశ్లో బుధవారం బీజేపీ క్షేత్ర స్థాయి కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మహాకూటమి గెలిస్తే ప్రధానమంత్రిగా సోమవారం మాయావతి, మంగళవారం అఖిలేశ్ యాదవ్, బుధవారం మమతా బెనర్జీ, గురువారం శరత్ పవార్, శుక్రవారం దేవెగౌడ, శనివారం ఎంకే స్టాలిన్ ఉంటారని.. ఆదివారం ప్రధాని పదవికి సెలవిస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ముందు తమ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని మహాకూటమిని డిమాండ్ చేశారు. బీజేపీలో నాలుగు ‘బీ’లు ఉన్నాయని.. ‘భడ్తా భారత్’, ‘బన్తా భారత్’అని అన్నారు. ఇక మహాకూటమిలో కూడా నాలుగు ‘బీ’లు ఉన్నాయని అవి బువా (ఆంటీ), భతీజా (అల్లుడు), భాయ్ (సోదరుడు), బెహెన్ (సోదరి) అని అన్నారు. -
వైజాగ్ వన్డేకు మాథ్యూస్ ఫిట్
విశాఖ స్పోర్ట్స్: శ్రీలంక జట్టుకు నిజంగానే ఇది ఊరటనిచ్చే వార్త. సీనియర్ ఆల్రౌండర్ మాథ్యూస్ నిర్ణాయక మూడో వన్డే కోసం ఫిట్గా ఉన్నాడు. ఆదివారం అతను బరిలోకి దిగుతాడని లంక టీమ్ మేనేజర్ అసంక గురుసిన్హా తెలిపారు. మొహాలిలో జరిగిన రెండో వన్డేలో మాథ్యూస్ అజేయ సెంచరీ సాధించాడు. అయితే తొడ కండరాలు పట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కానీ శుక్రవారం అతను ప్రాక్టీస్ సెషన్లో ఇబ్బంది లేకుండా పాల్గొన్నాడు. ‘మాథ్యూస్ కండరాల నొప్పి నుంచి కోలుకున్నాడు. నెట్స్లో బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతనే కాదు... మా ఆటగాళ్లందరూ ఫిట్గానే ఉన్నారు’ అని గురుసిన్హా అన్నారు. ప్రాక్టీస్కు భారత్ ఆటగాళ్లు దూరం సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డేకు ముందు శ్రీలంక ఆటగాళ్లు ముమ్మర ప్రాక్టీస్ చేశారు. మరోవైపు భారత ఆటగాళ్లు శుక్రవారం ప్రాక్టీస్ చేయలేదు. పూర్తిగా విశ్రాంతికే పరిమితమయ్యారు. ఇది ఆప్షనల్ ప్రాక్టీస్ కావడంతో ఆటగాళ్లెవరూ నెట్స్ వైపు కన్నెత్తి చూడలేదు. శనివారం మాత్రం ప్రాక్టీస్లో చెమటోడ్చుతారని జట్టు వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం భారత ఆటగాళ్లను చూసేందుకు వైజాగ్ వాసులు స్టేడియానికి పోటెత్తారు. అయితే టీమిండియా ఆటగాళ్లెవరూ హోటల్ గదుల నుంచి ప్రాక్టీస్కు రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. దీంతో కాసేపు లంక ఆటగాళ్ల ప్రాక్టీస్ను తిలకించి నిష్క్రమించారు. ఆల్రౌండర్ మాథ్యూస్, కెప్టెన్ పెరీరా నెట్స్లో బ్యాటింగ్ చేశారు. మూడు వన్డేల సిరీస్లో ఇరు జట్లు చెరో విజయం సాధించి 1–1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలకమైన చివరి వన్డే ఆదివారం ఉక్కునగరంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగనుంది. -
క్లీన్ స్వీప్ 'సిక్సర్'
శ్రీలంక గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా ఇక్కడ జరిగిన ద్వైపాక్షిక సిరీస్లలో ఒక్కసారి కూడా శ్రీలంక ఏ జట్టు చేతిలోనూ క్లీన్స్వీప్ కాలేదు. ఇప్పుడు తొలిసారిగా కోహ్లి సేన ఆ జట్టును వైట్వాష్ చేసింది. మూడు టెస్టుల సిరీస్ను కూడా ఇదివరకే కోల్పోయిన లంకకు ఇది వరుసగా రెండో దెబ్బ. ఏకపక్షంగా జరిగిన చివరి వన్డేలోనూ భారత్ చెలరేగింది. కోహ్లి రెండో శతకంతో రాణించగా... భువనేశ్వర్ కెరీర్లో తొలిసారిగా ఐదు వికెట్లతో లంకను బెంబేలెత్తించాడు. ఓవరాల్గా ఐదు వన్డేల సిరీస్లను భారత జట్టు 5–0తో క్లీన్స్వీప్ చేయడం ఇది ఆరోసారి కావడం విశేషం. గతంలో భారత్ స్వదేశంలో 2008లో ఇంగ్లండ్పై, 2010లో న్యూజిలాండ్పై, 2011లో ఇంగ్లండ్పై, 2013లో జింబాబ్వేలో జింబాబ్వేపై, 2014లో స్వదేశం లో శ్రీలంకపై 5–0తో సిరీస్లను సొంతం చేసుకుంది. ఐదు వన్డేల సిరీస్ను ఆరోసారి క్లీన్స్వీప్ చేసిన భారత్ ⇒ విరాట్ కోహ్లి 30వ శతకం ⇒ చివరి మ్యాచ్లోనూ శ్రీలంకపై భారీ విజయం కొలంబో: నాలుగు వన్డేల్లో ఇప్పటిదాకా జరిగినట్టుగానే చివరి వన్డేలోనూ అదే ఫలితం పునరావృతమైంది. భారత్ ఎప్పటిలాగే గెలిచింది... శ్రీలంక ఎప్పటిలాగే ఓడింది. కనీసం చివరి మ్యాచ్లోనైనా కోహ్లి సేనకు పోటీ ఇస్తారని భావించినా అలాంటి సంచలనానికి లంక తావీయలేదు. ముందుగా భువనేశ్వర్ (5/42) పేస్ దెబ్బకు కకావికలమైన ఆతిథ్య జట్టు ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి (116 బంతుల్లో 110 నాటౌట్; 9 ఫోర్లు) అజేయ శతకంతో కోలుకోలేకపోయింది. ఫలితంగా ఆదివారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేదార్ జాదవ్ (73 బంతుల్లో 63; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ముందుగా శ్రీలంక 49.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తిరిమన్నె (67; 3 ఫోర్లు, 1 సిక్స్), మాథ్యూస్ (55; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించాడు. కెప్టెన్ ఉపుల్ తరంగ (34 బంతుల్లో 48; 9 ఫోర్లు) వేగంగా ఆడాడు. బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 239 పరుగులు చేసి నెగ్గింది. భారత జట్టు ఈ మ్యాచ్ కోసం ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. ధావన్, రాహుల్, పాండ్యా, అక్షర్ స్థానంలో రహానే, కేదార్ జాదవ్, భువనేశ్వర్, చాహల్ ఆడారు. భువనేశ్వర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు లభించాయి. ఇరు జట్ల మధ్య ఏకైక టి20 మ్యాచ్ ఈనెల 6న (బుధవారం) జరుగుతుంది. తిరిమన్నె, మాథ్యూస్ సెంచరీ భాగస్వామ్యం టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన లంకకు ఈసారి కూడా శుభారంభం అందలేదు. మూడో ఓవర్లోనే డిక్వెలా (2)ను భువనేశ్వర్ రిటర్న్ క్యాచ్తో అవుట్ చేశాడు. కొద్దిసేపటికే మునవీర (4)ను కూడా భువీనే అవుట్ చేశాడు. మరోవైపు దూకుడు మీదున్న తరంగను బుమ్రా బోల్తా కొట్టించాడు. దీంతో జట్టు 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ తిరిమన్నె, మాథ్యూస్ అద్భుతంగా ఆడి నాలుగో వికెట్కు 122 పరుగులు జోడించారు. 39వ ఓవర్లో భువీ బౌలింగ్లో తిరిమన్నె అవుటవ్వడంతో లంక ఇన్నింగ్స్ మళ్లీ తడబడింది. చివర్లో భారత బౌలర్ల విజృంభణకు లంక 53 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయింది. కోహ్లి వరుసగా రెండోసారి... తక్కువ స్కోరే అయినా భారత్ కూడా ప్రారంభంలో తడబడింది. సిరీస్లో తొలిసారిగా అవకాశం దక్కించుకున్న రహానే (5) విఫలమయ్యాడు. అటు వరుసగా రెండు సెంచరీలతో ఊపు మీదున్న రోహిత్ (16) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లి, మనీశ్ పాండే (53 బంతుల్లో 36; 2 ఫోర్లు) కుదురుగా ఆడి మూడో వికెట్కు 99 పరుగులు జోడించారు. పాండే అవుటయ్యాక వచ్చిన కేదార్ జాదవ్ మెరుగైన ఆటతీరును కనబరిచాడు. 52 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇక కోహ్లి 107 బంతుల్లో కెరీర్లో 30వ సెంచరీని అందుకున్నాడు. విజయానికి మరో రెండు పరుగులు కావాల్సి ఉండగా జాదవ్ అవుటయ్యాడు. అనంతరం ధోనితో కలిసి కోహ్లి మ్యాచ్ను ముగించాడు. 1. ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగులు (18 మ్యాచ్ల్లో) పూర్తి చేసిన తొలి ఆటగాడిగా కోహ్లి. 2. వన్డే క్రికెట్లో 100 స్టంపింగ్లు పూర్తి చేసిన తొలి వికెట్ కీపర్గా ధోని. 3. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ జాబితాలో పాంటింగ్ సరసన కోహ్లి (30 సెంచరీలు). సచిన్ (49) అగ్రస్థానంలో ఉన్నాడు. స్కోరు వివరాలు:- శ్రీలంక ఇన్నింగ్స్: డిక్వెలా (సి అండ్ బి) భువనేశ్వర్ 2; తరంగ (సి) ధోని (బి) బుమ్రా 48; మునవీర (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 4; తిరిమన్నె (బి) భువనేశ్వర్ 67; మాథ్యూస్ (సి) ధోని (బి) కుల్దీప్ 55; సిరివర్దన (సి) శార్దుల్ (బి) భువనేశ్వర్ 18; హసరంగ (రనౌట్) 9; ధనంజయ (స్టంప్డ్) ధోని (బి) చాహల్ 4; పుష్పకుమార (బి) బుమ్రా 8; ఫెర్నాండో నాటౌట్ 7; మలింగ (సి) సబ్– రాహుల్ (బి) భువనేశ్వర్ 2; ఎక్స్ట్రాలు 14; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 238. వికెట్ల పతనం: 1–14, 2–40, 3–63, 4–185, 5–194, 6–205, 7–212, 8–228, 9–228, 10–238. బౌలింగ్: భువనేశ్వర్ 9.4–0–42–5; శార్దుల్ 6–0–48–0; బుమ్రా 10–0–45–2; కుల్దీప్ 10–0–40–1; కేదార్ జాదవ్ 4–0–20–0; చాహల్ 10–0–36–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) పుష్పకుమార (బి) ఫెర్నాండో 16; రహానే (సి) మునవీర (బి) మలింగ 5; కోహ్లి నాటౌట్ 110; పాండే (సి) తరంగ (బి) పుష్పకుమార 36; జాదవ్ (సి) డిక్వెలా (బి) హసరంగ 63; ధోని నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (46.3 ఓవర్లలో 4 వికెట్లకు) 239. వికెట్ల పతనం: 1–17, 2–29, 3–128, 4–237. బౌలింగ్: మలింగ 8–1–35–1; ఫెర్నాండో 7–0–40–1; ధనంజయ 10–0–49–0; మాథ్యూస్ 3–0–14–0; పుష్పకుమార 10–0–40–1; సిరివర్దన 4–0–28–0; హసరంగ 4.3–0–29–1. -
షమీ సూపర్ షో
⇒ నాలుగు వికెట్లు తీసిన పేసర్ ⇒ వెస్టిండీస్ 205/9 కింగ్స్టన్: గాయం కారణంగా రెండేళ్లు జట్టుకు దూరంగా ఉన్న పేసర్ మొహమ్మద్ షమీ (4/48) అదరగొట్టే ప్రదర్శనతో తన ఫామ్ను చాటుకున్నాడు. 2015 వన్డే ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న తను గత మ్యాచ్తోనే పునరాగమనం చేసినా వికెట్ తీయలేకపోయాడు. అయితే గురువారం వెస్టిండీస్తో జరిగిన చివరి వన్డేలో మాత్రం చెలరేగి విండీస్ మిడిలార్డర్ను వణికించాడు. ఫలితంగా విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 205 పరుగులు చేసింది. షాయ్ హోప్ (98 బంతుల్లో 51; 5 ఫోర్లు), కైల్ హోప్ (50 బంతుల్లో 46; 9 ఫోర్లు), హోల్డర్ (34 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్), పావెల్ (32 బంతుల్లో 31; 2 సిక్సర్లు) రాణించారు. ఉమేశ్కు మూడు వికెట్లు దక్కాయి. చివర్లో తడబాటు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన విండీస్కు ఓపెనర్లు లూయిస్ (9), కైల్ హోప్ ఓ మాదిరి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా హోప్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీలతో జోరు కనబరిచాడు. ఉమేశ్, షమీ బౌలింగ్ను తను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అయితే తొమ్మిదో ఓవర్లో లూయిస్ను పాండ్యా అవుట్ చేయడంతో తొలి వికెట్కు 39 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే సిరీస్లో తొలిసారిగా పవర్ప్లేలో విండీస్ 49 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా జోరు తగ్గించని కైల్ హోప్.. షమీ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. కానీ 16వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ విండీస్కు షాక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో కైల్ హోప్, చేజ్ను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత స్పిన్నర్లను రంగంలోకి దించడంతో విండీస్ పరుగుల వేగం తగ్గగా 10 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. మొహమ్మద్ (16)ను కేదార్ జాదర్ రిటర్న్ క్యాచ్తో అవుట్ చేశాడు. ఈ దశలో షాయ్ హోప్, హోల్డర్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. పరిస్థితులకు తగ్గట్టు నిదానంగా ఆడిన షాయ్ 94 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. అయితే 40వ ఓవర్ నుంచి షమీ అనూహ్యంగా చెలరేగడంతో విండీస్ పతనం ప్రారంభమైంది. తన వరుస నాలుగు ఓవర్లలో జోరు మీదున్న హోల్డర్, షాయ్ హోప్తో పాటు నర్స్, బిషూ వికెట్లకు తీయడంతో విండీస్ వణికింది. హోల్డర్, షాయ్ హోప్ మధ్య ఐదో వికెట్కు అత్యధికంగా 48 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. చివర్లో పావెల్ కాస్త దూకుడు కనబరచగా స్కోరు 200 దాటింది. స్కోరు వివరాలు:- విండీస్ ఇన్నింగ్స్: లూయిస్ (సి) కోహ్లి (బి) పాండ్యా 9; కైల్ హోప్ (సి) ధావన్ (బి) ఉమేశ్ యాదవ్ 46; షాయ్ హోప్ (సి) రహానే (బి) షమీ 51; చేజ్ ఎల్బీడబ్లు్య (బి) ఉమేశ్ యాదవ్ 0; మొహమ్మద్ (సి అండ్ బి) కేదార్ జాదవ్ 16; హోల్డర్ (సి) ధావన్ (బి) షమీ 36; పావెల్ (సి) ధోని (బి) ఉమేశ్ 31; నర్స్ (సి) కుల్దీప్ (బి) షమీ 0; బిషూ (సి) ధోని (బి) షమీ 6; జోసెఫ్ నాటౌట్ 3; విలియమ్స్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–39, 2–76, 3–76, 4–115, 5–163, 6–168, 7–171, 8–182, 9–205. బౌలింగ్: షమీ 10–0–48–4; ఉమేశ్ యాదవ్ 10–1–53–3; పాండ్యా 6–0–27–1; జడేజా 10–1–27–0; కుల్దీప్ యాదవ్ 10–0–36–0; కేదార్ జాదవ్ 4–0–13–1. -
హైదరాబాద్లో నిరుద్యోగ జేఏసీ ఆందోళన
-
యూఎస్లో ఒక్కరోజు నలుగురు భారతీయులు హత్య
-
ఒక్క రోజు కాపురం చేసి.. పోస్టులో తలాక్!
యాకుత్పురా: రెండో వివాహం చేసుకొని ఒక్క రోజు కాపురం చేసి పోస్టుద్వారా విడాకులు పంపిన ఓ వ్యక్తిని భవానీనగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై రమేశ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. కూకట్పల్లి ప్రకాశం పంతులునగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ హనీఫ్ (38), బహదురున్నీసా (32) దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బహదురున్నీసాకు పలుమార్లు గర్భస్రావం కావడంతో పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. అయితే మగ పిల్లవాడు కావాలని నిర్ణయించుకున్న హనీఫ్ రెండో వివాహం చేసుకునేందుకు భార్య బహదురున్నీసాను ఒప్పించాడు. తలాబ్కట్టా ప్రాంతానికి చెందిన ఫర్హీన్ బేగంను రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే మొదటి భార్య నుంచి విడాకుల పత్రం లేకపోవడంతో ఖాజీ నిఖా చేసేందుకు నిరాకరించడంతో మరుసటి రోజు అందజేస్తామని చెప్పి గత నెల 9న మొఘల్పురాలోని కన్వీల్లా ఫంక్షన్ హాల్లో ఫర్హీన్ను వివాహం చేసుకున్నాడు. ఆమెను కూకట్పల్లిలోని తన ఇంటి సమీపంలోనే ఓ అద్దె ఇంట్లో ఉంచాడు. పెళ్లి రోజు రాత్రి పర్హీన్తో గడిపిన హనీఫ్ ఉదయం వెళ్లిపోయాడు. ఆ తరువాత ఫర్హీన్కు ఫోన్ చేసి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరానని అప్పటి వరకు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలని సూచించాడు. అంతేగాకుండా ఈ నెల 18న పోస్టులో విడాకుల పత్రాన్ని పంపించాడు. తాను పంపిన విడాకుల పత్రంలో పెళ్లి ఇష్టం లేదు... అనారోగ్యం కారణంగా విడాకులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. దీనిపై బాధితురాలు ఫర్హీన్ బేగం ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పాటు, గురువారం రాత్రి భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
ఒక్కరోజులో అమ్ముడైనవి.. 10,500
-
ఒక్కరోజులో అమ్ముడైనవి.. 10,500
- నగరంలో భారీగా బీఎస్–3 వాహన విక్రయాలు - ఆకట్టుకున్న ఆఫర్లు.. షోరూమ్లకు పోటెత్తిన జనం సాక్షి, హైదరాబాద్ ఆఫర్ల హోరుతో వాహన షోరూమ్లన్నీ కళకళలాడాయి. ద్విచక్ర వాహనాలు, కార్లపైన భారీ ఆఫర్లు ప్రకటించడంతో జనం షోరూమ్లకు పరుగులు తీశారు. శుక్రవారం ఒక్కరోజే 10,500 వాహనాల విక్రయాలు జరుగగా.. తాత్కాలిక రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. భారత్ స్టేజ్ –3 వాహనాల అమ్మకాల ఆఖరి రోజైన శుక్రవారం హైదరాబాద్లోని ఆటోమోబైల్ షోరూమ్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. తమ వద్ద ఉన్న స్టాక్ కంటే ఎక్కువ మంది బుకింగ్ల కోసం బారులు తీరడంతో పలుచోట్ల షోరూమ్ డీలర్లు నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. కొన్ని షోరూమ్లలో బినామీల పేరిట వాహనాలను బుక్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బీఎస్–3 వాహనాలపైన ఏప్రిల్ 1వ తేదీ శనివారం నుంచి నిషేధం కొనసాగనున్న నేపథ్యంలో వాటి అమ్మకాలకు శుక్రవారం ఒక్క రోజే గడువు మిగిలి ఉండడంతో విక్రయాలు విపరీతంగా సాగాయి. ఏప్రిల్ 1 నుంచి కేవలం బీఎస్–4 వాహనాలను మాత్రమే విక్రయించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆటోమోబైల్ కంపెనీలు ఈ వాహనాలపైన భారీ ఆఫర్లను ప్రకటించడం వినియోగదారులను ఆకట్టుకుంది. ద్విచక్రవాహనాలపై రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు డిస్కౌంట్ ఇవ్వగా, కార్లపైన రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఇచ్చారు. ఒక్క రోజే 10 వేల వాహనాల విక్రయాలు... గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 150 షోరూమ్లు, వాటి అనుబంధంగా మరో 200 సబ్షోరూమ్లు ఉన్నాయి. ప్రతి రోజు సగటున 1,000 నుంచి 1,500 వాహనాలు అమ్ముడవుతాయి. కానీ బీఎస్–3 వాహనాల రద్దు నేపథ్యంలో గురువారం 9,800 వాహనాల అమ్మకాలు జరిగితే.. శుక్రవారం ఆ సంఖ్య 10,500 దాటింది. వీటిలో 8,950 వరకు ద్విచక్రవాహనాలు కాగా మిగతా వాటిలో కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. బినామీ పేర్లతో అమ్మకాలు... మరోవైపు పలు షోరూమ్లు బినామీ అమ్మకాలకు తెరలేపినట్లు ఆరోణలు వెల్లువెత్తాయి. రెండు రోజులుగా తమ షోరూమ్లలో పని చేసే సిబ్బంది, తెలిసిన వ్యక్తుల పేరిట వాహనాలను తాత్కాలిక రిజిస్ట్రేషన్లు చేసినట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆఫర్లు ఆకర్శించినా.. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. ఇక శనివారం నుంచి అన్ని రకాల ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, ఇతర తేలికపాటి వాహనాలన్నీ బీఎస్–4 ప్రమాణాల మేరకు తయారు చేసినవి మాత్రమే విక్రయించవలసి ఉంటుంది. -
స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత
పెర్త్: ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో మూడు వేల పరుగుల్ని వేగంగా సాధించిన ఆసీస్ క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ తో జరిగిన మూడో వన్డేలో స్మిత్ మూడు వేల పరుగుల క్లబ్లో చేరాడు. తద్వారా ఆ ఘనతను వేగవంతంగా సాధించిన ఆసీస్ క్రికెటర్గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే ఆసీస్ మాజీ ఆటగాళ్లు మైకేల్ బెవాన్, బెయిలీలను స్మిత్ అధిగమించాడు. మూడు వేల వన్డే పరుగుల్ని చేయడానికి బెవాన్, బెయిలీలకు 80 ఇన్నింగ్స్ లు అవసరం కాగా, స్మిత్ తన 79 వ ఇన్నింగ్స్ లో ఆ మార్కును చేరాడు. ఈ మ్యాచ్లో స్మిత్(108 నాటౌట్;104 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్) రాణించి ఆసీస్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. పాక్ విసిరిన 264 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 45 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన తరుణంలో స్మిత్ ఆదుకున్నాడు. హ్యాండ్ స్కాంబ్(82;84 బంతుల్లో 6 ఫోర్లు) తో కలిసి మూడో వికెట్ కు 183 పరుగుల భాగస్వామ్యాన్నిసాధించి జట్టుకు చక్కటి విజయాన్ని అందించాడు. వీరిద్దరూ రాణించడంతో ఆసీస్ 45. 0 ఓవర్లలో నే మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో విజయంతో ఆసీస్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డేలో ఆసీస్ గెలవగా, రెండో వన్డేలో పాకిస్తాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఐదు వన్డేల సిరీస్ లో నాల్గో మ్యాచ్ ఆదివారం జరుగనుంది. -
యువరాజ్ ‘మళ్లీ’ వచ్చాడు
► భారత వన్డే, టి20 జట్టులో స్థానం ► టి20ల్లో నెహ్రా పునరాగమనం ► రిషభ్ పంత్కు తొలి అవకాశం ► పూర్తి స్థాయి కెప్టెన్గా కోహ్లి యువరాజ్ సింగ్ భారత జట్టు తరఫున వన్డేలు ఆడి మూడేళ్లు దాటింది. ఈ ఫార్మాట్లో తన చివరి రెండేళ్లలో 19 మ్యాచ్లు ఆడిన అతని బ్యాటింగ్ సగటు 18.53 మాత్రమే. బహుశా అతను కూడా తన పునరాగమనంపై ఆశలు పెట్టుకొని ఉండకపోవచ్చు. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ అతనిలోని వన్డే ఆటగాడిని చూసింది. దాంతో మరోసారి యువరాజ్ భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఆశ్చర్యకరంగా గత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బాగా ఆడినప్పుడు వన్డేలను కాదని భారత టి20 జట్టులోకి ఎంపిక చేసిన సెలక్టర్లు, ఈసారి రంజీ ట్రోఫీ ప్రదర్శనను బట్టి వన్డే జట్టులోకి అవకాశం కల్పించారు. ముంబై: సీనియర్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, ఆశిష్ నెహ్రా భారత జట్టులోకి తిరిగి వచ్చారు. యువీకి వన్డే, టి20 జట్లలో చోటు లభించగా, గాయం నుంచి కోలుకున్న నెహ్రాకు టి20 టీమ్లో అవకాశం దక్కింది. ఇంగ్లండ్తో జరిగే వన్డే, టి20 సిరీస్లలో తలపడే భారత జట్లను ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. రంజీ ట్రోఫీలో చెలరేగిన ఢిల్లీ క్రికెటర్ రిషభ్ పంత్కు తొలి అవకాశం దక్కడం ఎంపికలో మరో విశేషం. సెలక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కాలేకపోయిన కోహ్లి... స్కైప్ ద్వారా ఎంపికలో భాగమయ్యాడు. రంజీ ప్రదర్శనతో... భారత్ తరఫున ఆఖరి సారిగా యువరాజ్ టి20 ప్రపంచ కప్లో ఆడి చివరి లీగ్ మ్యాచ్ సమయంలో గాయంతో తప్పుకున్నాడు. ఆ టోర్నీలో 13.00 సగటు, 100 స్ట్రైక్రేట్తో 52 పరుగులతో అతను అతి సాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత విండీస్తో సిరీస్కు అతను ఎంపిక కాలేదు. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో మాత్రం యువీ మెరుగ్గా రాణించాడు. 8 ఇన్నింగ్స్లలో 64.36 సగటుతో 672 పరుగులు సాధించాడు. ఇందులో బరోడాపై చేసిన 260 పరుగుల ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచింది. దీనిని గుర్తిస్తూనే యువరాజ్ను ఎంపిక చేసినట్లు ఎమ్మెస్కే స్పష్టం చేశారు. మరోవైపు ఆరు నెలల క్రితం మోకాలి ఆపరేషన్ చేయించుకున్న నెహ్రా ఎలాంటి స్థాయిలోనూ పోటీ క్రికెట్ ఆడలేదు. అయితే గత ఏడాది పునరాగమనం చేసిన తర్వాత టి20ల్లో విశేషంగా రాణించిన అతడిపై సెలక్టర్లు నమ్మకముంచారు. రహానే వన్డేలకే పరిమితం... మరోవైపు గత కొన్నాళ్లుగా మూడు ఫార్మాట్లలో రెగ్యులర్గా జట్టులో ఉన్న కొద్ది మందిలో ఒకడైన అజింక్య రహానేపై టి20ల్లో వేటు వేసి సెలక్టర్లు హెచ్చరించారు. వన్డేల్లో మాత్రం రోహిత్ శర్మ ఇంకా కోలుకోకపోవడంతో రహానే స్థానానికి ముప్పు రాలేదు. అదే విధంగా గాయం నుంచి కోలుకున్నా టెస్టుల్లో అవకాశం అందుకోలేకపోయిన శిఖర్ ధావన్ వన్డేల్లోకి తిరిగొచ్చాడు. సురేశ్ రైనాకు కూడా టి20 టీమ్లోనే చోటు లభించింది. నిజానికి కివీస్తో వన్డే సిరీస్కు అతను ఎంపికైనా, అనారోగ్యంతో ఆడలేకపోయాడు. ఫలితంగా ఇప్పుడు అతని వన్డే స్థానం పోయింది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ తర్వాత వన్డేల కోసం తగినంత విశ్రాంతి లభించడంతో అశ్విన్, రవీంద్ర జడేజాలాంటి సీనియర్లకు విరామం ఇవ్వలేదు. ఇంకా ఫిట్ కాకపోవడంతో షమీని పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు రాహుల్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, యజువేంద్ర చహల్, హార్దిక్ పాండ్యా కూడా తమ స్థానాలు నిలబెట్టుకోగా, చెన్నై టెస్టుతో దూసుకొచ్చిన కరుణ్ నాయర్కు మాత్రం నిరాశే ఎదురైంది. ఫిట్నెస్ను నిరూపించుకోవాలి... వన్డే సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టు భారత ‘ఎ’తో రెండు వన్డే వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. అందులో ఒక మ్యాచ్కు ధోని కూడా కెప్టెన్గా వ్యవహరించనుండగా, మరో మ్యాచ్కు రహానే కెప్టెన్గా ఉంటాడు. గాయాల నుంచి కోలుకొని ఈ రెండు జట్లలో ఎంపికైన ఆటగాళ్లంతా తమ ఫిట్నెస్ను నిరూపించుకునేందుకు ఈ మ్యాచ్లో ఆడే విధంగా బోర్డు అవకాశం కల్పించింది. యువరాజ్, నెహ్రా, రహానే, ధావన్లతో పాటు చాలా రోజులుగా మ్యాచ్ ప్రాక్టీస్ లేని కారణంగా ధోని కూడా బరిలోకి దిగుతున్నాడు. లాంఛనం పూర్తి... భారత వన్డే, టి20 జట్ల కెప్టెన్గా వి రాట్ కోహ్లిని ఎంపిక చేసినట్లు కూడా సెలక్టర్లు ప్రకటించారు. ధోని తప్పుకోవడంతో విరాట్ ఎంపిక లాంఛనమే అయినా, అధికారికంగా అతడిని పూర్తి స్థాయి కెప్టెన్గా ఇప్పు డే ప్రకటించారు. గతంలో కోహ్లి టీమిండియాకు 17 వన్డేల్లో కెప్టెన్గా వ్యవహరించాడు. ఇందులో భారత్ 14 మ్యాచ్లు గెలిచి, 3 ఓడింది. ఈ మ్యాచ్లలో కోహ్లి 70.83 సగటుతో 850 పరుగులు చేశాడు. వీటిలో 4 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. విరాట్ టి20ల్లో ఒక మ్యాచ్కు కూడా కెప్టెన్గా వ్యవహరించలేదు. సమావేశం ఆలస్యం సుప్రీం కోర్టు ‘తొమ్మిదేళ్ల నిబంధన’ నేపథ్యంలో సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి హాజరు కావచ్చా లేదా అనే అంశంపై లోధా కమిటీ నుంచి బోర్డు స్పష్టత కోరే క్రమంలో సెలక్షన్ కమిటీ సమావేశం దాదాపు మూడు గంటలు ఆలస్యమైంది. చివరకు సుప్రీం మార్గదర్శకాల ప్రకారం ఆయన కూడా అనర్హుడేనని లోధా కమిటీ తేల్చేయడంతో ఆయన లేకుండానే కమిటీ జట్టును ప్రకటించింది. జట్ల వివరాలు వన్డే, టి20 రెండు జట్లలోనూ ఉన్నవారు: విరాట్ కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, అశ్విన్, జడేజా, బుమ్రా, భువనేశ్వర్ వన్డేలకు మాత్రమే: శిఖర్ ధావన్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, రహానే, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్ టి20లకు మాత్రమే: మన్దీప్ సింగ్, రైనా, రిషభ్ పంత్, చహల్, నెహ్రా. సూపర్ ఫామ్తో... 19 ఏళ్ల రిషభ్ పంత్ ఈ సీజన్ రంజీల్లో చెలరేగిన తర్వాత కూడా ఆసీస్లో పర్యటించిన భారత ‘ఎ’ జట్టులోనూ చోటు దక్కలేదు. కానీ ఇప్పుడు నేరుగా సీనియర్ టీమ్కే అతను ఎంపికయ్యాడు. వికెట్ కీపర్ అయిన రిషభ్ ఈ ఏడాది రంజీల్లో 12 ఇన్నింగ్స్లలో 972 పరుగులతో చెలరేగాడు. ముఖ్యంగా ఒక మ్యాచ్లో 326 బంతుల్లో 308 పరుగులు, మరో మ్యాచ్లో 48 బంతుల్లో సెంచరీ చేసి తన మెరుపు బ్యాటింగ్ను కూడా ప్రదర్శించాడు. ఇదే అతనికి టి20 టీమ్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా చోటు కల్పించింది. ధోని మార్గనిర్దేశనంలో వికెట్ కీపర్ బ్యాట్స్మన్గా అతనికి ఎదిగే అవకాశాన్ని సెలక్టర్లు ఇచ్చారు. ‘దేశవాళీ క్రికెట్లో యువరాజ్ సింగ్ ఆడిన తీరును మనం అభినందించక తప్పదు. కొన్నాళ్లుగా అతను సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడటం లేదనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ అతను డబుల్ సెంచరీ సాధించాడు. పైగా బౌలర్లకు విపరీతంగా అనుకూలించే లాహ్లి వికెట్పై 177 పరుగులు చేశాడు. కోహ్లితో చర్చించిన తర్వాతే టీమ్ను ఎంపిక చేశాం. మా ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది మా దృష్టిలో అత్యుత్తమ జట్టు. విజయాలైనా, వైఫల్యాలైనా సెలక్షన్ కమిటీ బాధ్యత వహిస్తుంది. –ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్ సెలెక్టర్ ‘నువ్వు ఎప్పటికీ నాకు కెప్టెన్వే’ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనిపై విరాట్ కోహ్లి తన అభిమానాన్ని ప్రదర్శించాడు. ‘ఒక యువ ఆటగాడు కోరుకునే విధంగా, అతనికి అండగా నిలిచిన నాయకుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు. నాకు ఎప్పటికీ నువ్వే కెప్టెన్వు ధోని భాయ్’ అని కోహ్లి ట్వీట్ చేశాడు. మరోవైపు బెంగళూరు ఉదంతం జరిగిన సమయంలో అక్కడే ఉండి స్పందించనివారు అసలు మగాళ్లే కాదని కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఆ ఘటనతో నేను తీవ్రంగా కలత చెందాను. దానిని చూస్తూ ఉండిపోవడం పశుప్రవృత్తికి సంకేతం. మీ కుటుంబంలో ఎవరికైనా అలా జరిగితే స్పందించకుండా ఉంటారా? ఇలాంటి సమాజంలో భాగమైనందుకు నేను సిగ్గు పడుతున్నా. మహిళలను గౌరవించడం నేర్చుకోండి’ అని అతను వ్యాఖ్యానించాడు. -
ధోనికి ‘సిరీస్’ పరీక్ష
⇒ ధోనిపై తీవ్రమైన ఒత్తిడి ⇒ చివరి వన్డేకు సిద్ధమైన విశాఖ ⇒ ఇరు జట్ల లక్ష్యం సిరీస్ విజయం ⇒ భారత జట్టులో ఒక మార్పు ⇒ ఆత్మవిశ్వాసంతో కివీస్ భారత కెప్టెన్గా ధోని సాధించిన విజయాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అరుుతే అతని నాయకత్వంలో గతంలోనూ చాలా సార్లు జట్టు ఘోరంగా విఫలమైంది. కానీ అలాంటి సందర్భాల్లోనూ ఏనాడూ అతను ఇంతటి శల్య పరీక్షను ఎదుర్కోలేదు. కానీ ఇప్పుడు మాత్రం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. కారణం... కోహ్లి అనూహ్య వేగంతో ఎదిగి పోవడం. ఒక వైపు టెస్టుల్లో అతను క్లీన్స్వీప్ కిరీటాన్ని తగిలించుకొని వస్తే, ఇప్పుడు ధోని వన్డే సిరీస్ గెలవడానికి శ్రమించాల్సి వస్తోంది. వెంటనే కెప్టెన్సీ పోయే ప్రమాదం లేకున్నా... ఆటగాడిగా, కెప్టెన్గా కూడా ఒక అద్భుతం చేస్తే గానీ ధోనిపై నమ్మకం పెరిగేలా లేదు. వైజాగ్తో ధోని అనుబంధం ప్రత్యేకమైంది. అతనిలోని సూపర్ హీరోను ప్రపంచానికి పరిచయం చేసిన మ్యాచ్ అతను ఇక్కడే ఆడాడు. ఇప్పుడు కెరీర్ చివరి దశలో అతను మరోసారి విశాఖ వేదికగా కీలక విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. మరో వైపు కివీస్ కూడా తొలిసారి భారత గడ్డపై సిరీస్ విజయంపై దృష్టి పెట్టడంతో సాగర తీరంలో మ్యాచ్పై ఒక్కసారిగా ఆసక్తి పెరిగిపోరుుంది. మరి ఇరు జట్లలో ఎవరిది పైచేరుు కానుందో! విశాఖపట్నం: భారత్తో టెస్టు సిరీస్లో న్యూజిలాండ్ జట్టు ఆటతీరు చూస్తే వన్డే సిరీస్ ఫలితం కోసం చివరి దాకా వేచి ఉండాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ మెరుగైన ప్రదర్శనతో కివీస్ వన్డేల్లో రాత మార్చుకుంది. అనూహ్యంగా పటిష్ట భారత్కు గట్టి పోటీనిస్తూ సిరీస్లో 2-2తో సమంగా నిలిచింది. గతంలో సొంతగడ్డపై ఏనాడూ కివీస్ చేతిలో సిరీస్ ఓడిపోని భారత్, ఇప్పుడు ఆ రికార్డును నిలబెట్టుకునేందుకు పోరాడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య చివరిదైన ఐదో వన్డే నేడు (శనివారం) ఇక్కడి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనుంది. విజయం తోనే సిరీస్ను ముగించాలని ధోనిసేన పట్టుదలతో ఉండగా, గత వన్డేలో విజయం స్ఫూర్తితో మరో గెలుపు అందుకోవాలని విలియమ్సన్ బృందం భావిస్తోంది. మరి భారత క్రికెట్ అభిమానులు విజయంతో దీపావళి చేసుకోగలరా చూడాలి. బుమ్రా జట్టులోకి... రాంచీ మ్యాచ్లో పరాజయం భారత జట్టును కలవరపరిచింది. అంతకు ముందు మ్యాచ్లో చెలరేగిన ధోని సొంతగడ్డపై విఫలమయ్యాడు. ఇప్పుడు నాలుగో స్థానంలోనే కొనసాగాలని భావిస్తున్న కెప్టెన్, ఆ స్థానానికి తగినట్లుగా కీలక ఇన్నింగ్స ఆడాల్సి ఉంది. కోహ్లి తిరుగు లేని ఫామ్ జట్టు బలంతో పాటు బలహీనతగా కూడా మారింది. అతను విఫలమైతే జట్టు కుప్పకూలిపోతుందేమో అనిపిస్తోంది. సిరీస్ మొత్తం విఫలమైన రోహిత్ శర్మ చివరి మ్యాచ్లోనైనా ఆడితే భారత్కు శుభారంభం లభిస్తుంది. రహానే గత వన్డేలో చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చినా, ఓపెనర్గా ఆడుతున్న అతను భారీ స్కోరు చేయాల్సి ఉంది. మనీశ్ పాండే, కేదార్ జాదవ్ నాలుగో వన్డే వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుంటారని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. బౌలింగ్లో ధావల్ కులకర్ణి స్థానంలో పూర్తి ఫిట్గా ఉన్న బుమ్రా రానున్నాడు. మరో పేసర్గా ఉమేశ్ ఉన్నా, జట్టు మరో సారి స్పిన్నర్లు అక్షర్, మిశ్రాలపై ఆధారపడుతోంది. జాదవ్ ఆఫ్స్పిన్ కూడా జత కలిస్తే కివీస్ను కట్టడి చేయవచ్చు. తొలి మ్యాచ్ బౌలింగ్ ప్రదర్శన స్థారుులో మళ్లీ బంతులు వేయలేకపోరుున పాండ్యా కూడా ఆల్రౌండర్గా మరింత బాధ్యతాయుతంగా ఆడాలి. సిరీస్ ఫలితం ఆఖరి వన్డే దాకా వెళ్లడంతో ఇక జయంత్ యాదవ్, మన్దీప్ సింగ్లకు తొలి మ్యాచ్ ఆడే అవకాశం దాదాపుగా లేనట్లే. బ్యాట్స్మెన్దే భారం తొలి టెస్టు నుంచి విఫలమవుతూ వచ్చిన గప్టిల్ గత మ్యాచ్ను గెలిపించాడు. వరుసగా విఫలమైన టేలర్ కూడా చివరి రెండు వన్డేల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వడంతో కివీస్ శిబిరానికి ఊరట లభించింది. ఫామ్లో ఉన్న విలియమ్సన్, లాథమ్లతో ఆ జట్టు బ్యాటింగ్ మెరుగ్గా కనిపిస్తోంది. బ్యాటింగ్ బలం పెంచేందుకు... గత మ్యాచ్లో పక్కన పెట్టిన అండర్సన్ను కూడా మళ్లీ తీసుకునే అవకాశం ఉంది. ఆల్రౌండర్గా నీషమ్ తన పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. రాంచీ మ్యాచ్లో ముగ్గురు రెగ్యులర్ స్పిన్నర్లను ఆడించిన కివీస్, ఈ సారి సోధి స్థానంలో పేసర్ హెన్రీని ఎంచుకోవచ్చు. ఇక బౌలింగ్లో సౌతీ ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. కివీస్ గెలిచిన రెండు మ్యాచ్లను చక్కటి స్వింగ్తో మలుపు తిప్పింది సౌతీనే. ఐసీసీ నంబర్వన్ బౌలర్ బౌల్ట్నుంచి కూడా మన బ్యాట్స్మెన్కు ప్రమాదం పొంచి ఉంది. కోహ్లిని నిరోధిస్తే మ్యాచ్పై పట్టు బిగించవచ్చని కివీస్ గుర్తించింది. ఈ సారి కూడా అదే తరహా వ్యూహంతో విలియమ్సన్ టీమ్ బరిలోకి దిగుతోంది. మూడు టెస్టులు, తొలి వన్డే తర్వాత భారత్తో పోలిస్తే ఎంతో బలహీనంగా కనిపించిన న్యూజిలాండ్ ఇప్పుడు సిరీస్ గెలుపుపై కూడా ఆశలు పెంచుకుందంటే ఆ జట్టు సమష్టి ప్రదర్శనే కారణం. ఇప్పుడు మరోసారి దానిని పునరావృతం చేయాలని జట్టు భావిస్తోంది. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, రహానే, కోహ్లి, పాండే, జాదవ్, పాండ్యా, అక్షర్, మిశ్రా, ఉమేశ్, బుమ్రా. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, లాథమ్, టేలర్, వాట్లింగ్, నీషమ్, అండర్సన్, సాన్ట్నర్, సౌతీ, బౌల్ట్, హెన్రీ. ⇒విరాట్ కోహ్లి ఇక్కడ ఆడిన మూడు వన్డేలలో వరుసగా 118, 117, 99 పరుగులు చేయడం విశేషం. ⇒విశాఖపట్నంలో భారత్ 5 వన్డే మ్యాచ్లు ఆడింది. ఇందులో 4 గెలిచి, 1 మ్యాచ్లో ఓడింది. పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్లపై ఒక్కోసారి నెగ్గిన జట్టు, వెస్టిం డీస్ చేతిలో ఓడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం విండీస్తో జరగాల్సిన వన్డే హుదూద్ కారణం గా రద్దరుుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టి20లో భారత్, శ్రీలంకను చిత్తు చేసింది. వాన గండం వీడలేదు... తుఫాన్ బలహీన పడటంతో చివరి వన్డేకు ఇక ఇబ్బంది ఉండదని అనిపించింది. అరుుతే ఏ సమయంలోనైనా వాన కారణంగా మ్యాచ్కు అంతరాయం కలగవచ్చు. మ్యాచ్ జరిగే శనివారం రోజు కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అరుుతే అవుట్ఫీల్డ్ను మొత్తం కవర్ చేశామని, వర్షం వచ్చినా మ్యాచ్కు సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని క్యురేటర్ నాగమల్లయ్య చెప్పారు. పిచ్పై ఎలాంటి పచ్చిక లేదు. బ్యాటింగ్కు అనుకూలించడంతో పాటు కొంత బౌన్సకు అవకాశం ఉంది. విరాట్ గొప్ప ఆటగాడు. ప్రతీ సారి అతని పరుగులు జట్టుకు ఉపయోగపడుతున్నారుు. దాని వల్ల కోహ్లి తర్వాత వచ్చే ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. అరుుతే మేం అతనిపై అతిగా ఆధారపడటం లేదు. జట్టులో మంచి బ్యాట్స్మెన్ చాలా మంది ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు మంచి ఆట ప్రదర్శించడం ముఖ్యం. గత మ్యాచ్ వైఫల్యంనుంచి నేను, పాండే నేర్చుకుంటాం. కెప్టెన్ బౌలింగ్ చేయమని కోరినప్పుడు పార్ట్టైమర్లా కాకుండా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం ముఖ్యం. -కేదార్ జాదవ్ మా జట్టులో అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. గతంలో ఏ కివీస్ జట్టుకు సాధ్యం కాని ఘనతను సాధించాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. చాలా మందికి ఇదో సుదీర్ఘ పర్యటన. దీనిని విజయంతో ముగించాలని భావిస్తున్నాం. కోహ్లితో పాటు ఇతర బ్యాట్స్మెన్ వికెట్లు తీయడం కూడా కీలకం. గత మ్యాచ్లో చివరి జోడీ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అరుుతే రాంచీ ప్రదర్శనను పునరావృతం చేయగలమని విశ్వాసంతో ఉన్నాం. - టిమ్ సౌతీ -
కీలక వన్డేకు వైజాగ్ సిద్ధం
-
కీలక వన్డేకు వైజాగ్ సిద్ధం
తుపాను ప్రమాదం లేనట్లే నగరానికి చేరుకున్న జట్లు విశాఖపట్నం: భారత్, న్యూజిలాండ్ల మధ్య సిరీస్ ఫలితాన్ని నిర్ణరుుంచే ఆఖరి వన్డేకు ఆతిథ్యమిచ్చేందుకు విశాఖపట్నం సిద్ధమైంది. తుపాను నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందో లేదో అనే అనుమానాలు తొలగిపోయారుు. తుపాను బలహీనపడటం వల్ల నగరానికి భారీ వర్షాలు లేవని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వర్గాలలో ఉత్సాహం పెరిగింది. ధోని సారథ్యంలోని భారత జట్టు, విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ బృందం గురువారం సాయంత్రం నగరానికి చేరుకున్నారుు. శుక్రవారం ఉదయం ఇరు జట్లు నెట్ ప్రాక్టీస్లో పాల్గొంటారుు. పిచ్పై ఇంకా కవర్లు తొలగించలేదు. ఒకవేళ మ్యాచ్ రోజు వర్షం పడ్డా... స్టేడియంలో ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. దీనికి తోడు సూపర్ సాపర్స్ కూడా సిద్ధం చేశారు. కాబట్టి వాతావరణంలో ఏవైనా అనుకోని మార్పులు జరిగితే తప్ప మ్యాచ్కు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇటీవల నగరంలో జరిగిన రంజీట్రోఫీ మ్యాచ్కు పిచ్ సరిగా లేదనే వార్తలు వచ్చారుు. ఒక దశలో వైజాగ్ వన్డేను తరలిస్తారని కూడా వినిపించింది. అన్ని ప్రతికూలతలను అధిగమించి ఏసీఏ మ్యాచ్ నిర్వహణకు సిద్ధమైంది. 260 పైచిలుకు పరుగులు వచ్చేలా పిచ్ ఉంటుందని క్యురేటర్ అంటున్నారు. -
ఆడుతూ... పాడుతూ...
తొలి వన్డేలో భారత్ ఘనవిజయం 6 వికెట్లతో న్యూజిలాండ్ చిత్తు కోహ్లి అర్ధసెంచరీ, రాణించిన పాండ్యా గురువారం రెండో మ్యాచ్ ఫార్మాట్ మారినా భా రత జోరులో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. టెస్టుల్లో ఘన విజయాల తర్వాత రంగు దుస్తుల్లోనూ మన టీమ్ మెరిసింది. అక్కడ సారథిగా ముందుండి నడిపించిన కోహ్లి, ఇక్కడ అలవాటైన రీతిలో ఆటగాడిగా మరో చూడచక్కటి ఇన్నింగ్స ఆడాడు. అంతకుముందు మన బౌలర్లు కూడా అంచనాలకు మించి రాణించారు. ఫలితంగా వన్డే సిరీస్ను ఏకపక్ష గెలుపుతో ప్రారంభించిన టీమిండియా సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచ్ ఆడుతున్న హార్దిక్ పాండ్యాకుతోడు ఉమేశ్, అమిత్ మిశ్రా దెబ్బకు కివీస్ విలవిల్లాడింది. చివరకు పార్ట్టైమర్ కేదార్ జాదవ్కు కూడా వికెట్లు ఇచ్చేయడంతో ఒక దశలో న్యూజిలాండ్ ఇన్నింగ్స 100లోపే ముగిసేలా అనిపించింది. అరుుతే లాథమ్, సౌతీ కాస్త పోరాడటంతో ఆ జట్టు పరువు నిలిచింది. అరుుతే తుది స్కోరు మాత్రం భారత్ను నిలువరించేందుకు సరిపోలేదు. ఛేదనలో మేటి అరుున విరాట్ ముందు లక్ష్యం చాలా చిన్నదిగా మారిపోరుుంది. ధర్మశాల: సొంతగడ్డ మీద ప్రత్యర్థి న్యూజిలాండ్పై భారత్ అప్రతిహత విజయాలు కొనసాగుతున్నారుు. టెస్టుల్లో కివీస్ను క్లీన్స్వీప్ చేసిన మన జట్టు ఇప్పుడు వన్డేల్లోనూ శుభారంభం చేసింది. ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా మరో 101 బంతులు మిగిలి ఉండగానే అలవోక విజయాన్ని అందుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 43.5 ఓవర్లలో 190 పరుగులకే ఆలౌటైంది. టామ్ లాథమ్ (98 బంతుల్లో 79 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్స్), టిమ్ సౌతీ (45 బంతుల్లో 55; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (3/31), అమిత్ మిశ్రా (3/49) కివీస్ను దెబ్బ తీశారు. అనంతరం భారత్ 33.1 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (81 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో చివరి వరకు నిలిచాడు. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఈ నెల 20న న్యూఢిల్లీలో జరుగుతుంది. టపటపా... భారత్ తరఫున 16 టి20 మ్యాచ్లు ఆడిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. పిచ్ నుంచి చక్కటి సహకారం లభించడంతో మన పేసర్లు ఆరంభంలోనే పట్టు బిగించారు. తన తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు బాదిన గప్టిల్ (12)ను అదే ఓవర్ చివరి బంతికి అవుట్ చేసి పాండ్యా కెరీర్లో మొదటి వికెట్ తీశాడు. ఆ తర్వాత ఉమేశ్ ధాటికి కివీస్ కష్టాల్లో పడింది. తన వరుస ఓవర్లలో అతను విలియమ్సన్ (3), టేలర్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా, మరో ఎండ్లో లాథమ్ పట్టుదలగా నిలబడ్డాడు. అరుుతే పాండ్యా రెండు వికెట్లతో మరోసారి న్యూజిలాండ్ను దెబ్బ తీశాడు. మిడాఫ్లో ఉమేశ్ అద్భుత క్యాచ్కు అండర్సన్ (4) వెనుదిరగ్గా, తర్వాతి ఓవర్లో రోంచీ (0) కూడా ఉమేశ్కే క్యాచ్ ఇచ్చాడు. పార్ట్టైమర్ కేదార్ జాదవ్ కూడా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ వరుస బంతుల్లో నీషమ్ (10), సాన్ట్నర్ (0)లను అవుట్ చేయడంతో కివీస్ స్కోరు 19 ఓవర్లకే 65/7 వద్ద నిలిచింది. ఆదుకున్న లాథమ్, సౌతీ... ఈ దశలో లాథమ్ పట్టుదల ప్రదర్శిస్తూ చక్కటి షాట్లు ఆడాడు. అతనికి కొద్ది సేపు బ్రేస్వెల్ (15) అండగా నిలిచాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్కు 41 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ క్రమంలో 77 బంతుల్లో లాథమ్ అర్ధ సెంచరీ పూర్తరుుంది. మిశ్రా ఈ జోడీని విడదీసిన అనంతరం క్రీజ్లోకి వచ్చిన సౌతీ దూకుడుగా ఆడాడు. 2 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్లో అతను ఇచ్చిన సునాయాస క్యాచ్ను ఫైన్లెగ్లో ఉమేశ్ వదిలేయడం సౌతీకి కలిసొచ్చింది. అదే ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను పటేల్, మిశ్రా ఓవర్లలో చెరో సిక్సర్ బాదాడు. ఉమేశ్ ఓవర్లో కూడా వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన సౌతీ 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 100వ వన్డే ఆడుతున్న అతని కెరీర్ లో ఇదే తొలి అర్ధ సెంచరీ కావడం విశేషం. ఎట్టకేలకు చక్కటి బంతితో సౌతీని వెనక్కి పంపి మిశ్రా తొమ్మిదో వికెట్ భాగస్వామ్యానికి తెర దిం చాడు. లాథమ్, సౌతీ 58 బంతుల్లోనే 71 పరుగులు జోడించడం విశేషం. సోధి (1)ని కూడా మిశ్రా అవుట్ చేయడంతో 37 బంతులు మిగిలి ఉండగానే కివీస్ ఇన్నింగ్స ముగిసింది. ఓపెనర్గా వచ్చిన చివరి వరకు నాటౌట్గా ఉన్న తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా లాథమ్ నిలిచాడు. అలవోకగా ఛేదన... సాధారణ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు రహానే (34 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ (14) శుభారంభం ఇచ్చారు. రోహిత్ నెమ్మదిగా ఆడినా, బ్రేస్వెల్ బౌలింగ్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో రహానే దూకుడు ప్రదర్శించాడు. అరుుతే పదో ఓవర్లో రోహిత్ అవుట్ కావడంతో జట్టు తొలి వికెట్ కోల్పోరుుంది. ఆ తర్వాత కొద్ది సేపటికే రహానే కూడా వెనుదిరగ్గా, మనీశ్ పాండే (17) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. మరో ఎండ్లో కోహ్లి ప్రశాంతంగా తన పని చేసుకుంటూ పోయాడు. ఎక్కడా ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా ఆడిన అతను, తనదైన శైలిలో అలవోకగా పరుగులు సాధించాడు. మరో ఎండ్లో ధోని (21)నుంచి అతనికి మద్దతు లభించింది. ఇదే జోరులో 55 బంతుల్లోనే తన కెరీర్లో 37వ అర్ధ సెంచరీని అందుకున్నాడు. తన ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అనంతరం కోహ్లి ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను సౌతీ అందుకోవడంలో విఫలం కాగా... మరుసటి ఓవర్లోనే ధోని రనౌటయ్యాడు. సాన్ట్నర్ బౌలింగ్లో ధోని ముందుకొచ్చి షాట్ ఆడాడు. బంతి అతని కాలికి తగిలి ఫీల్డర్ వైపు వెల్లింది. అరుుతే సింగిల్ తీయడంలో కోహ్లి సందేహించడంతో ధోని వెనక్కి వెళ్లే ప్రయత్నం చేసినా లాభం లేకపోరుుంది. ఆ తర్వాతా తన ధాటిని కొనసాగించిన కోహ్లి 34వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ కొట్టి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. చాంపియన్స ట్రోఫీకి ముందు మేం ఎనిమిది మ్యాచ్లు మాత్రమే ఆడబోతున్నాం. కాబట్టి పరిస్థితులను బట్టి బౌలర్లు ఎలా ఆడగలరో పరీక్షించేందుకు పాండ్యాకు అవకాశం ఇచ్చాం. కొత్త బంతిని సమర్థంగా ఉపయోగిస్తే ముగ్గురు ప్రధాన పేసర్లలో ఒకడిగా అతనికి తప్పక చోటు ఉంటుంది. కొంత మంది ఇతర బౌలర్లతో పోలిస్తే పాండ్యా ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచి స్వింగ్ రాబట్టగలడు. ఉమేశ్లో కూడా నిలకడ పెరగడం మంచి పరిణామం. ఇంగ్లండ్ పిచ్లు అతనికి బాగా అనుకూలిస్తారుు. అవసరం ఉన్న సమయంలో ప్రత్యామ్నాయంగా పనికి రావాలంటే ప్రాక్టీస్ ఉండాలనే పార్ట్ టైమర్లతో బౌలింగ్ చేరుుంచా. -ధోని, భారత కెప్టెన్ -
ఇంగ్లండ్దే వన్డే సిరీస్
చిట్టగాంగ్: బంగ్లాదేశ్తో జరిగిన మూడు వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్ను ఇంగ్లండ్ 2-1తో గెల్చుకుంది. చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్లతో నెగ్గింది. తొలుత బంగ్లాదేశ్ 6 వికెట్లకు 277 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (67 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 6 వికెట్లకు 278 పరుగులు చేసి గెలిచింది. బిల్లింగ్స (62), డకెట్ (63) అర్ధ సెంచరీలు చేశారు. -
సురేశ్ రైనా వచ్చాడు!
యువరాజ్కు నిరాశ కివీస్తో వన్డేలకు భారత జట్టు ప్రకటన న్యూఢిల్లీ: దాదాపు ఏడాది క్రితం భారత్ తరఫున ఆఖరి వన్డే ఆడిన సురేశ్ రైనా తిరిగి జట్టులోకి ఎంపికయ్యాడు. న్యూజిలాండ్తో జరిగే తొలి మూడు వన్డేల కోసం భారత జట్టును గురువారం సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వరుస వైఫల్యాలతో ఆస్ట్రేలియా, జింబాబ్వేలతో జరిగిన వన్డే సిరీస్లలో స్థానం కోల్పోరుున రైనా, ఇప్పుడు పునరాగమనం చేశాడు. రైనా పార్ట్టైమ్ స్పిన్ కూడా అతని ఎంపికకు కారణమని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పారు. మరో వైపు జట్టులో స్థానాన్ని ఆశించిన యువరాజ్ సింగ్కు నిరాశే ఎదురైంది. అతని పేరును సెలక్టర్లు పరిశీలించలేదు. సీనియర్లతో పాటు ఇటీవల భారత్ ‘ఎ’ తరఫున నిలకడగా ఆడిన యువ ఆటగాళ్లపై కమిటీ విశ్వాసం ఉంచింది. తాజాగా జట్టులోకి ఎంపికై న మన్దీప్ సింగ్, జయంత్ యాదవ్, హార్దిక్ పాండ్యా భారత్ తరఫున టి20లు ఆడినా...ఇప్పటి వరకు వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. గాయాల కారణంగా ధావన్, రాహుల్, భువనేశ్వర్ పేర్లను పరిశీలించలేదు. టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యులైన అశ్విన్, జడేజా, షమీలు మున్ముందు చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉన్నందున వారికి వన్డేలనుంచి విశ్రాంతి కల్పిస్తున్నట్లు సెలక్టర్లు ప్రకటించారు. అక్టోబరు 16 నుంచి న్యూజిలాండ్తో ఐదు వన్డేల సిరీస్ జరుగుతుంది. తొలి మూడు వన్డేలకు జట్టు: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, రహానే, కోహ్లి, మనీశ్ పాండే, రైనా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, అమిత్ మిశ్రా, బుమ్రా, ధావల్ కులకర్ణి, ఉమేశ్ యాదవ్, మన్దీప్ సింగ్, కేదార్ జాదవ్. -
సఫారీల సూపర్ ఛేజ్
372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కైవసం మిల్లర్ సంచలన సెంచరీ సరిగ్గా పదేళ్ల క్రితం... 2006లో ఆస్ట్రేలియా జట్టు 434 పరుగులు చేస్తే... దక్షిణాఫ్రికా 438 పరుగులతో దానిని ఛేదించి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ వన్డేల్లో ఏ జటై్టనా భారీ స్కోరు చేస్తే ఆ మ్యాచ్ను గుర్తు చేసుకుంటారు. పదేళ్లరుునా ఆ రికార్డు చెక్కుచెదరలేదు. మళ్లీ ఇన్నాళ్లకు 2016లో... ఆస్ట్రేలియా జట్టు 371 పరుగులు చేస్తే... దక్షిణాఫ్రికా జట్టు అలవోకగా 372 పరుగులు బాది మళ్లీ గెలిచింది. నాటి 435 పరుగుల లక్ష్యం తర్వాత... రెండో అతిపెద్ద లక్ష్య ఛేదన (372)తో రికార్డుల పుస్తకంలో రెండో స్థానంలోకి వచ్చేసింది. 2013లో ఆస్ట్రేలియాపై భారత్ 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ రికార్డు ఇంతకాలం రెండో అత్యధిక లక్ష్య ఛేదనగా ఉంది. దీనిని కూడా సఫారీలు ఊదేశారు. డర్బన్: కలయా... మాయా...! ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఆటతీరు చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఎదురుగా భారీ లక్ష్యం... 265 పరుగుల దగ్గర మిల్లర్ మినహా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అంతా అవుటయ్యారు. ఈ దశలో కిల్లర్ మిల్లర్ సంచలన ఇన్నింగ్స (79 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడాడు. బౌలర్ను అండగా పెట్టుకుని దక్షిణాఫ్రికాను గెలిపించాడు. కింగ్సమీడ్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 371 పరుగుల భారీస్కోరు చేసింది. వార్నర్ (107 బంతుల్లో 117; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (107 బంతుల్లో 108; 9 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీలు చేశారు. దక్షిణాఫ్రికా జట్టు 49.2 ఓవర్లలో 6 వికెట్లకు 372 పరుగులు చేసి గెలిచింది. చివర్లో మిల్లర్కు తోడుగా ఫెలుక్వాయో (39 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా ఆడాడు. డికాక్ (49 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మిల్లర్, ఫెలుక్వాయో ఏడో వికెట్కు అజేయంగా 70 బంతుల్లో 107 పరుగులు జోడించడం విశేషం. ఐదు వన్డేల సిరీస్ను దక్షిణాఫ్రికా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో కై వసం చేసుకుంది. నాలుగో వన్డే ఆదివారం జరుగుతుంది. 7 దక్షిణాఫ్రికా జట్టు ఏడు సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ గెలిచింది. 743 ఈ మ్యాచ్లో రెండు జట్లు కలిసి చేసిన పరుగులు. గతంలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా (872 పరుగులు; 2006), భారత్-శ్రీలంక (825 పరుగులు, 2009), ఇంగ్లండ్-శ్రీలంక (763 పరుగులు, 2015) మ్యాచ్లలో మాత్రమే ఇంతకంటే ఎక్కువ పరుగులు వచ్చారుు. 69 మిల్లర్ 69 బంతుల్లో సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున ఇది ఏడో వేగవంతమైన సెంచరీ. అరుుతే మిల్లర్కు ముందు ఉన్న ఆరు ఫాస్టెస్ట్ సెంచరీలన్నీ డివిలియర్స్ ఒక్కడే చేశాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స: వార్నర్ (సి) డుమిని (బి) తాహిర్ 117; ఫించ్ (సి) రబడ (బి) తాహిర్ 53; స్టీవ్ స్మిత్ (బి) స్టెరుున్ 108; బెరుులీ (సి) డుప్లెసిస్ (బి) ఫెలుక్వాయో 28; మిషెల్ మార్ష్ (సి) మిల్లర్ (బి) స్టెరుున్ 2; హెడ్ (సి) అండ్ (బి) రబడ 35; వేడ్ నాటౌట్ 17; ఎక్స్ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 371. వికెట్ల పతనం: 1-110; 2-234; 3-280; 4-300; 5-325; 6-371. బౌలింగ్: స్టెరుున్ 10-0-96-2; రబడ 10-0-86-1; ప్రెటోరియస్ 6-0-42-0; తాహిర్ 10-0-54-2; ఫెలుక్వాయో 8-0-58-1; డుమిని 6-0-32-0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స: డికాక్ (సి) వోరల్ (బి) ట్రైమెన్ 70; ఆమ్లా ఎల్బీడబ్ల్యు (బి) హాస్టింగ్స 45; డు ఫ్లెసిస్ (సి) వార్నర్ (బి) హెడ్ 33; రోసో ఎల్బీడబ్ల్యు (బి) జంపా 18; డుమిని (సి) ఫించ్ (బి) హాస్టింగ్స 20; మిల్లర్ నాటౌట్ 118; ప్రెటోరియస్ (సి) వార్నర్ (బి) మార్ష్ 15; ఫెలుక్వాయో నాటౌట్ 42; ఎక్స్ట్రాలు 11; మొత్తం (49.2 ఓవర్లలో 6 వికెట్లకు) 372. వికెట్ల పతనం: 1-66; 2-140; 3-164; 4-179; 5-217; 6-265. బౌలింగ్: ట్రైమెన్ 10-0-65-1; వోరల్ 9-0-78-0; హాస్టింగ్స 10-0-79-2; మార్ష్ 10-0-61-1; జంపా 7.2-1-55-1; హెడ్ 3-0-31-1. -
స్వర్ణకారుల ఒకరోజు దీక్ష
నకిరేకల్ః తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నకిరేకల్లోని మెయిన్ సెంటర్లో స్వర్ణకారులు మంగళవారం ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో కేతేపల్లి, నకిరేకల్, కట్టంగూర్, నార్కట్పల్లి, చిట్యాల మండలాల స్వర్ణకారులు పాల్గొన్నారు. స్వర్ణకారులకు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వృత్తి నైపుణ్యం కోసం రూ.5లక్షల వరకు సబ్సిడీ ఇవ్వాలని కోరారు. ఈ దీక్ష కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షుడు చింతోజు నవీన్కుమార్, పానగంటి ఉపేంద్రచారి, ఓంకార చారి, గందసిరి రామకృష్ణ, నరేంద్రచారి ఉన్నారు. -
పాక్కు ఊరట విజయం
కార్డిఫ్: ఇంగ్లండ్తో జరిగిన చివరి వన్డేలో పాకిస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (87), స్టోక్స్ (75) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం పాక్ 48.2 ఓవర్లలో 6 వికెట్లకు 304 పరుగులు చేసింది. సర్ఫరాజ్ అహ్మద్ (90), షోయబ్ మాలిక్ (77) నాలుగో వికెట్కు 163 పరుగులు జోడించి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలి నాలుగు వన్డేలు గెలిచిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్ను సొంతం చేసుకోగా, తాజా ఫలితంలో ఈ ఆధిక్యం 4-1కి తగ్గింది. ఇరు జట్లు బుధవారం మాంచెస్టర్లో జరిగే ఏకైక టి20లో తలపడతారుు. -
విజయంతో వీడ్కోలు
వన్డే కెరీర్ను ముగించిన మెకల్లమ్ఆసీస్తో చివరి మ్యాచ్లో కివీస్ గెలుపు 2-1తో సిరీస్ కైవసం హామిల్టన్: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్కు వన్డేల్లో ఘనమైన వీడ్కోలు లభించింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 55 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను కివీస్ 2-1తో దక్కించుకుంది. ఎనిమిదేళ్ల అనంతరం ఆసీస్పై కివీస్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. మరోవైపు ఈ మ్యాచ్ మెకల్లమ్కు ఆఖరి అంతర్జాతీయ వన్డే కావడం విశేషం. 12 నుంచి వెల్లింగ్టన్లో జరగబోయే రెండు టెస్టుల అనంతరం తను అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకోనున్నాడు. ఇక ఈ మ్యాచ్లో ఎప్పటిలాగే తన సహజశైలిలోనే చెలరేగిన మెకల్లమ్ 27 బంతుల్లోనే 47 పరుగులు సాధించాడు. ఇందులో 6 ఫోర్లు; 3 సిక్సర్లున్నాయి. అలాగే వన్డేల్లో 200 సిక్సర్లు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. తొలిస్థానంలో ఆఫ్రిది (351) ఉన్నాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. గప్టిల్ (61 బంతుల్లో 59; 4 ఫోర్లు; 3 సిక్సర్లు), ఎలియట్ (62 బంతుల్లో 50; 1 ఫోర్; 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. మిషెల్ మార్ష్కు మూడు.. హాజెల్వుడ్, హేస్టింగ్స్, బోలండ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. బ్యాట్స్మెన్ వైఫల్యంతో ఆసీస్ 43.4 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. ఖవాజా (36 బంతుల్లో 44; 4 ఫోర్లు; 2 సిక్సర్లు), మార్ష్ (42 బంతుల్లో 41; 4 ఫోర్లు; 1 సిక్స్) మాత్రమే ఆడగలిగారు. హెన్రీకి మూడు.. అండర్సన్, సోధి రెండేసి వికెట్లు తీశారు. మెకల్లమ్ వన్డే కెరీర్ మ్యాచ్లు : 260 పరుగులు : 6,083 అర్ధసెంచరీలు : 32 సెంచరీలు : 5 క్యాచ్లు : 262 సగటు : 30.41 -
షమీ, జడేజాలకు చోటు?
* రేసులో ఇషాంత్, విజయ్ * ఆసీస్తో వన్డే, టి20లకు జట్టు ఎంపిక నేడు న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో అద్భుతంగా రాణించిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టులోనూ చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరిలో ఆసీస్తో జరగనున్న ఐదు వన్డేలు, మూడు టి20ల కోసం నేడు (శనివారం) సెలక్టర్లు జట్టును ఎంపిక చేయనున్నారు. గాయంతో దూరమైన పేసర్ మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మలతో పాటు బ్యాట్స్మన్ మురళీ విజయ్ కూడా రేసులో ఉన్నారు. జట్టు ఎంపిక టి20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకునే జరుగుతుందని క్రికెట్ వర్గాల సమాచారం. రెండు ఫార్మాట్లకు కలిపి 12 మంది ఎంపికకానున్నారు. టెస్టుల్లో రాణిస్తున్న ఇషాంత్.. వన్డేలు ఆడక ఏడాది కావొస్తుంది. సఫారీలతో సిరీస్కు ఎంపికైనా కాలిపిక్క గాయంతో విశ్రాంతికి పరిమితమయ్యాడు. ప్రపంచకప్ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ దాదాపు ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగినా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే షమీ ఫిట్గా ఉంటే చాలని సెలక్టర్లు భావిస్తుండటంతో అతని చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే నిలకడలేని పేస్ బౌలింగ్కు షమీ రాకతో మరింత బలం చేకూరుతుందని వాళ్ల భావన. ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్, మోహిత్ శర్మ మిగతా స్థానాలకు ఎంపికకానున్నారు. మూడో స్పిన్నర్ ఉంటాడా? ప్రధాన స్పిన్నర్గా అశ్విన్తో పాటు రెండో స్పిన్నర్గా జడేజా వైపే సెలక్టర్లు మొగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సౌరాష్ట్ర ఆల్రౌండర్ ప్రొటీస్పై 23 వికెట్లతో పాటు కీలక సమయాల్లో మొత్తం 109 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇక ప్రధాన చర్చ అంతా మూడో స్పిన్నర్ను తీసుకుంటారా? లేదా? అన్నది తేలాలి. ఆసీస్ పిచ్లను దృష్టిలో పెట్టుకుంటే ఇది ఉండకపోవచ్చు. ఒకవేళ తీసుకుంటే మాత్రం వెటరన్ హర్భజన్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రాల మధ్య పోటీ ఉంటుంది. జడేజా లెఫ్టార్మర్ కావడంతో సహజంగానే అక్షర్ పటేల్కు అవకాశం దక్కకపోవచ్చు. ఇక మిగిలింది హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రాలలో ఎవరికి స్థానం దక్కుతుందో చూడాలి. రాయుడుకు కష్టమే! గతేడాది కాలంగా అంబటి రాయుడు ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. దీంతోపాటు మిడిలార్డర్ కోసం విజయ్ గట్టిపోటీ ఇస్తున్నాడు. ఫామ్లో లేని ఓపెనర్ ధావన్కు ప్రత్యామ్నాయంగా కూడా ఆడగలడు. కాబట్టి ఈ విషయాన్ని సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటే రాయుడుకు చోటు కష్టమే. స్వదేశంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీని పక్కనబెట్టే సూచనలు ఉన్నాయి. ఇక బ్యాటింగ్ లైనప్లో ధావన్, రోహిత్, కోహ్లి, రహానే, రైనా, ధోనిల స్థానాలు ఖాయం. ఒకవేళ 16 మందిని ఎంపిక చేస్తే మాత్రం గురుకీరత్ సింగ్ మన్ అదనపు బ్యాట్స్మన్గా రావొచ్చు. -
‘ఏడు’పు ఆగేదెలా?
పరిమిత ఓవర్ల భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ‘ఏడు’ అదృష్ట సంఖ్య. జెర్సీ నంబర్ మొదలు బ్యాటింగ్ కిట్నుంచి పెర్ఫ్యూమ్ బాటిల్స్ వరకు అంతటా ‘7’ కనిపిస్తుంది. అదేంటో గానీ కెప్టెన్గా మైదానంలో మాత్రం అతనికి ఇప్పుడు అదే అంకె అచ్చి రావడం లేదనిపిస్తోంది. దానిని అతను పదే పదే గుర్తు చేస్తున్నాడు కూడా. భారత జట్టుకు ఏడో స్థానంలో ఆడగల సమర్థుడైన ‘ఆల్రౌండర్’ లేడని... అతను దొరికే వరకు ఫలితాలు ఇలాగే ఉంటాయని కెప్టెన్ చెప్పేశాడు. మరి రాబోయే రోజుల్లో టీమిండియా ఈ సమస్యకు పరిష్కారం వెతకగలదా... అసలు జట్టు ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటి? భారత జట్టుకు ఆల్రౌండర్ కొరత * వన్డేలు, టి20ల్లో తీరని సమస్య * ఏడో స్థానంలో ఆటగాడి కోసం అన్వేషణ సాక్షి క్రీడా విభాగం: భారత జట్టు ఇటీవల దక్షిణాఫ్రికాతో పరాజయానికి ముందు సొంతగడ్డపై 16 వన్డే సిరీస్లు ఆడితే 2 మాత్రమే ఓడింది. అయితే ఆ రెండు సార్లూ వెంటనే కోలుకొని ప్రపంచకప్ను, ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. బంగ్లాదేశ్లో ఓటమి అనంతరం స్వదేశంలో సఫారీల చేతిలోనూ చిత్తయ్యాక మరోసారి టీమిండియా మేనేజ్మెంట్ తమను తాము సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఇందులో అన్నింటికంటే ముఖ్యమైంది ‘ఆల్రౌండర్’ సమస్యకు పరిష్కారం. సుదీర్ఘ కాలంగా వన్డేలు, టి20ల్లో భారత బ్యాటింగ్ ఆర్డర్ను పరిశీలిస్తే ఐదో స్థానం వరకు ఢోకా లేకుండా రెగ్యులర్ బ్యాట్స్మన్, ఆ తర్వాత ఆరో స్థానంలో ధోని ఆడటం కనిపిస్తోంది. చివరి నాలుగు స్థానాలు బౌలర్లకు పోగా, మధ్యలో ఏడో స్థానంలో మాత్రం నిఖార్సయిన ఆల్రౌండర్ కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అయితే ఎన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేసినా రెండు విభాగాల్లోనూ జట్టుకు ఉపయోగపడగల ‘సవ్యసాచి’ మాత్రం దొరకలేదు. యువీ లేకపోవడంతో... 2012 డిసెంబర్లో పాకిస్తాన్తో వన్డేలో ధోని ఆఖరిసారిగా ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. భారత్ స్కోరు 29/5 ఉన్న దశలో అతను అద్భుత సెంచరీ సాధించాడు. అప్పటి బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో యువరాజ్ ఆడాడు. అగ్రశ్రేణి బ్యాట్స్మన్ కావడంతో పాటు బౌలింగ్లో కనీసం 7-8 ఓవర్ల వేయగల యువీ ఉన్నంత వరకు జట్టుకు సమస్య ఎదురు కాలేదు. అయితే ప్రస్తుత టీమ్లో టాప్-5 రెగ్యులర్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేలు కలిపి 14 ఓవర్లు మాత్రమే వేసిన రైనానుంచి ఎక్కువగా ఆశించలేం. పైగా ఐసీసీ కొత్త నిబంధనలు వచ్చాక పార్ట్టైమర్లను వాడుకోవడం ధోనికి ఇబ్బందిగానే మారింది. గత మూడేళ్లుగా ధోని ఆరో స్థానంలో ఆడుతుండటంతో ఏడో నంబర్ ఆటగాడి పాత్ర కీలకంగా మారింది. అటు బౌలర్గా ఉపయోగపడటంతో పాటు ఇన్నింగ్స్ చివరి దశలో భారీ హిట్టింగ్ చేయగల ఆటగాడు అవసరం. గతంలో యూసుఫ్ పఠాన్ సరిగ్గా ఇలాంటి పాత్ర పోషించాడు. ఫామ్ కోల్పోయి అతను చోటు కోల్పోయాక అలాంటి హిట్టర్ మరొకరు దొరకలేదు. అంతకుముందు ఇర్ఫాన్ పఠాన్ కూడా కొంత వరకు అలాంటి ఆట ప్రదర్శించినా గాయాలతో దూరమయ్యాడు. ఈ సీజన్లో అతను ఇంతవరకు దేశవాళీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ ముగ్గురే దిక్కా? ‘చాలా ప్రయోగాలు చేశాం. మీకు నచ్చినా నచ్చకపోయినా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అంటే బిన్నీ, స్పిన్ ఆల్రౌండర్ అంటే జడేజా, అక్షర్లే’ అని ధోని నేరుగా వ్యాఖ్యానించాడు. ఇందులో ఏ మాత్రం వాస్తవం ఉందనేది ఆసక్తికరం. 14 వన్డేల్లో 230 పరుగులు చేసిన బిన్నీ 20 వికెట్లు పడగొట్టాడు. ఇందులో బంగ్లా, జింబాబ్వేలపై కలిపి తీసినవి 13 ఉన్నాయి. అయితే జట్టుకు అవసరమైన కీలక దశలో అతను బ్యాటింగ్లో ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కాన్పూర్ వన్డే ఓటమిలో అతని పాత్ర కూడా ఉంది! ఇక ధోని ఆత్మీయుడు రవీంద్ర జడేజా చాంపియన్స్ ట్రోఫీ సహా అనేక మ్యాచ్లలో బౌలర్గా తన బాధ్యతను బాగా నిర్వహించాడు గానీ బ్యాటింగ్లో అతను చేసిందేమీ లేదు. తన చివరి 16 వన్డేల్లో అతను ఒక్కసారి కూడా కనీసం 40 పరుగులు చేయలేదు. ఓవర్లు అందుబాటులో ఉండి ముందుగా బ్యాటింగ్ అవకాశం వచ్చినా ఐపీఎల్లాంటి విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇక బౌలింగ్లో పర్వాలేదనిపించిన అక్షర్ పటేల్ 15 ఇన్నింగ్స్లలో కలిపి చేసింది 91 పరుగులే. మరి ఇంతకంటే ఎవరూ లేరనడం భారత క్రికెట్కు అవమానకరం. కొత్తగా ప్రయత్నించరా... దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు గుర్కీరత్ మాన్ను ఎంపిక చేసినా ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వలేదు. దేశవాళీలో గుర్కీరత్ రికార్డు చాలా బాగుంది. ఆరో స్థానం, అంతకంటే దిగువన ఆడుతూ 20 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 50 సగటు, 80 స్ట్రయిక్ రేట్ ఉన్న అతను...40 వన్డేల్లో 90 స్ట్రయిక్ రేట్, 46 సగటుతో పరుగులు సాధించాడు. తన ఆఫ్స్పిన్తో ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఇలాంటి ఆటగాడే ఇప్పుడు భారత్కు కావాలి. అక్షర్కు బదులు అతనికి అవకాశం ఇచ్చి ఉంటే ఆట గురించి తెలిసేది. ఇక రిషి ధావన్ కూడా నిలకడకు మారుపేరు. దేశవాళీ వన్డేల్లో 90 స్ట్రయిక్ రేట్తో పరుగులు చేసిన అతను బౌలింగ్లో 31 సగటుతో రెగ్యులర్గా వికెట్లు తీస్తున్నాడు. హిమాచల్ప్రదేశ్ ఆటగాడిగా రంజీల్లో గ్రూప్ ‘సి’లో ఉండటంతో అతని ప్రతిభకు గుర్తింపు దక్కనట్లు కనిపిస్తోంది. అయితే అదే నిజమైతే ఇటీవల జడేజా 37 వికెట్ల రికార్డుకు కూడా విలువ ఉండదు! గత ఏడాది మీడియం పేసర్గా రం జీల్లో 40 వికెట్లు తీసిన అతను, ఈసారి 3 మ్యాచుల్లోనే 16 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల బంగ్లాదేశ్ ‘ఎ’తో జరిగిన సిరీస్లోనూ అతను రాణించాడు. ఇక రెండు వారాల క్రితం రైల్వేస్తో మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన బరోడా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్గా భారత ‘ఎ’ జట్టు తరఫున ఆకట్టుకున్న తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ల రూపం లో యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. మాకున్న ముగ్గురు చాలు... అం టూ బిగదీసుకోకుండా ఇలాంటి ఆటగాళ్లను పరీక్షిస్తేనే ఆల్రౌండర్లు వెలుగులోకి వస్తారు. జట్టు ‘ఏడు’పు ఆగుతుంది. -
మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
కొలిక్కి వచ్చిన 'మాంసం' గొడవ
ముంబై: మాంసం అమ్మాకాల నిషేధంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కొలిక్కి వచ్చింది. మొదట ఎనిమిది రోజులు అన్నారు.. అది కనుమరుగైంది. తర్వాత దాన్ని నాలుగు రోజులకు కుదించారు. అది కాస్త తాజాగా శుక్రవారం సాయంత్రానికి ఒక్కరోజే చాలు అని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సాయంత్రం ప్రతినిధులతో చర్చించిన అనంతరం ఈ సమాచారాన్ని వెల్లడించింది. ముంబైలో ఈనెల 17న మాత్రమే మాంసం అమ్మకాలను నిలిపేయాలని ఆదేశాలు జారీచేసింది. జైనుల పవిత్ర దీంతో మొత్తం నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాంసం అమ్మకాలు నిషేధించినట్లయింది. -
ఒక్కరోజుకి 30 లక్షల హిట్లు
వాషింగ్టన్: యూట్యూబ్లో విడుదలైన ఒక్కరోజులోనే 'డెడ్పూల్' చిత్రం ట్రైలర్కు 30 లక్షల హిట్లు వచ్చాయి. టిమ్ మిల్లర్ దర్శకత్వంలో ర్యాన్ రెనాల్డ్స్ మొరినా బొకారిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ను ఇటీవల యూట్యూబ్లో విడుదల చేశారు. ట్వంటీయత్ ఫాక్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విడుదలైన తొలి రోజే ఈ చిత్రం ట్రైలర్ను దాదాపు 30 లక్షల మంది వీక్షించారు. హాలివుడ్ సూపర్ మ్యాన్ సిరీస్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సూపర్ హీరోనే ప్రతినాయకుడైతే.. అనే నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం 2016లో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం వెల్లడించింది. -
భారత్ పై బంగ్లాదేశ్ ఘనవిజయం
-
భారత్పై బంగ్లాదేశ్ ఘనవిజయం
మిర్పూర్: ఢాకాలో గురువారం ఇక్కడ భారత్ జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్లో 1-0 తేడాతో బంగ్లాదేశ్ ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు బంగ్లాదేశ్ భారత్పై మొత్తం నాలుగు వన్డేలు గెలిచింది. అయితే బంగ్లా జట్టు నిర్దేశించిన 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 228 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో వీరాట్ కోహ్లీ (1), ధోనీ (5) సింగల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, జడేజా మినహా మిగిలిన ఆటగాళ్లంతా విఫలమయ్యారు. అంతకమందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు భారత్ జట్టుకు 308 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు సర్కార్, తమీమ్ ఇక్బాల్లు ధాటిగా ఆడి తొలి వికెట్కి 102 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభాన్నిచ్చారు. ఈ క్రమంలో సర్కార్, తమీమ్ ఇక్బాల్లు వేగంగా ఆడి జట్టు స్కోరుని పరుగులు పెట్టించారు. సర్కార్ 54 పరుగులు(40 బంతులు, 8ఫోర్లు,1సిక్సర్)చేసి రనౌట్గా వెనుదిరిగాడు. తర్వాత వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం కలిగింది. తిరిగి మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే తమీమ్ ఇక్బాల్ 60 పరుగులు(62 బంతులు, 7ఫోర్లు, ఒక సిక్సర్) చేసి అశ్విన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. వెనువెంటనే వికెట్లు కోల్పోయిన బంగ్లాను షకీబ్, రహమాన్లు బాధ్యతాయుతంగా ఆడి తిరిగి గాడిలో పెట్టారు. రహమాన్ 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. షకీబ్(52) పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో నాసిర్ హొస్సేన్(34) భారీషాట్కి యత్నించి క్యాచ్ రూపంలో ఔట్ అయ్యాడు. చివర్లో వచ్చిన బ్యాట్స్మెన్లు వేగంగా పరుగులు రాబట్టడానికి ప్రయత్నించి వెనువెంటనే ఔటయ్యారు. దీంతో బంగ్లా 49.4 ఓవర్లలో 307 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. -
నిలకడగా భారత్ బ్యాటింగ్
మిర్పూర్: 308 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. 10 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 66పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ(41), ధావన్(16)లు క్రీజ్ లో ఉన్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లా సమిష్టిగా రాణించడంతో భారత్ ఎదుట 308 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. -
భారత్ ఎదుట భారీ లక్ష్యం
మిర్పూర్: భారత్తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు సమిష్టిగా రాణించారు. దీంతో భారత్ ఎదుట 308 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. తొలుత టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు సర్కార్, తమీమ్ ఇక్బాల్లు ధాటిగా ఆడి తొలి వికెట్కి 102 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభాన్నిచ్చారు. ఈ క్రమంలో సర్కార్, తమీమ్ ఇక్బాల్లు వేగంగా ఆడి జట్టు స్కోరుని పరుగులు పెట్టించారు. సర్కార్ 54 పరుగులు(40 బంతులు, 8ఫోర్లు,1సిక్సర్)చేసి రనౌట్గా వెనుదిరిగాడు. తర్వాత వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం కలిగింది. తిరిగి మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే తమీమ్ ఇక్బాల్ 60 పరుగులు(62 బంతులు, 7ఫోర్లు, ఒక సిక్సర్) చేసి అశ్విన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. వెనువెంటనే వికెట్లు కోల్పోయిన బంగ్లాను షకీబ్, రహమాన్లు బాధ్యతాయుతంగా ఆడి తిరిగి గాడిలో పెట్టారు. రహమాన్ 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. షకీబ్(52) పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో నాసిర్ హొస్సేన్(34) భారీషాట్కి యత్నించి క్యాచ్ రూపంలో ఔట్ అయ్యాడు. చివర్లో వచ్చిన బ్యాట్స్మెన్లు వేగంగా పరుగులు రాబట్టడానికి ప్రయత్నించి వెనువెంటనే ఔటయ్యారు. దీంతో బంగ్లా 49.4 ఓవర్లలో 307 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. -
37 ఓవర్లలో బంగ్లా స్కోరు 226/4
మిర్పూర్: భారత్- బంగ్లాదేశ్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే లో బంగ్లాదేశ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ 200 పరుగులను దాటింది. వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం తర్వాత..బంగ్లాదేశ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన షకీబ్(41), రహమాన్(40)లు బాధ్యతాయుతంగా ఆడి బంగ్లా స్కోరుని పరుగులు పెట్టించారు. దీంతో 37 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. -
25 ఓవర్లలో బంగ్లా స్కోరు 149/4
మిర్పూర్: భారత్-బంగ్లా మ్యాచ్ వర్షం అంతరాయం తర్వాత తిరిగి ప్రారంభమైన కొద్ది సేపటికే కీలక వికెట్లని బంగ్లాదేశ్ కోల్పోయింది.తమీమ్ ఇక్బాల్ 60 పరుగులు( 62బంతులు, 7ఫోర్లు, 1సిక్సర్లు), లిటన్(8)లు అశ్విన్ బౌలింగ్ లో వెంటవెంటనే వెనుదిరిగారు. కొద్దిసేపటకే అశ్విన్ బౌలింగ్ లో భారీ షాట్ కుప్రయత్నించి ముష్ఫికర్(14) ఔటయ్యాడు. షకీబ్(5), రహమాన్(1) లు క్రీజ్ లో ఉన్నారు. దీంతో బంగ్లాదేశ్ 25 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అశ్విన్ ఏడు ఓవర్లలో 36 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. -
వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం
మిర్పూర్: భారత్- బంగ్లా తొలివన్డే మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. భారత్తో గురువారం జరుగుతున్న వన్డే మ్యాచ్లో తొలూత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగన బంగ్లాదేశ్ ధాటిగా బ్యాటింగ్ చేసే సమయంలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ఓపెనర్లుగా వచ్చిన తమీమ్, సర్కార్లు వేగంగా ఆడుతూ పరుగులు రాబట్టి తొలి వికెట్ కి 102 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. మొదట నిధానంగా బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లా ఓపెనర్లు...6వ ఓవర్లో ఉమేష్ యాదవ్ బౌలింగ్లో తమీమ్ ఇక్బాల్ 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. తర్వాత ఓపనర్లు ఇద్దరు ధాటిగా ఆడటంతో స్కోరు వేగం పెరిగింది. ఈ క్రమంలో సర్కార్ 54 పరుగులు(40 బంతులు, 8ఫోర్లు,1సిక్సర్)చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. తమీమ్ ఇక్బాల్ 57 పరుగులు(52 బంతులు, 7ఫోర్లు, ఒక సిక్సర్), లిటన్ 3 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. స్కోర్ వివరాలు: 15.4 ఓవర్లలో బంగ్లాదేశ్ స్కోరు 119/1 సర్కార్- 54 పరుగులు(40 బంతులు, 8ఫోర్లు,1సిక్సర్) తమీమ్ ఇక్బాల్- 57 పరుగులు(52 బంతులు, 7ఫోర్లు, ఒక సిక్సర్) లిటన్-3 భారత్ బౌలింగ్: భువనేశ్వర్ 4-0-27-0 ఉమేశ్ 3-0-28-0 అశ్విన్ 3-0-26-0 మోహిత్ 2.4-0-29-0 రైనా 3-0-8-0 -
ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్
మిర్పూర్: భారత్తో గురువారం జరుగుతున్న వన్డే మ్యాచ్లో తొలూత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగన బంగ్లాదేశ్ ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లుగా దిగిన తమీమ్(36), సర్కార్(38)లు వేగంగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. మొదట నిధానంగా బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లా ఓపెనర్లు...6వ ఓవర్లో ఉమేష్ యాదవ్ బౌలింగ్లో తమీమ్ ఇక్బాల్ 3 ఫోర్లు, ఒక సిక్సర్ బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. తర్వాత ఓపనర్లు ఇద్దరు ధాటిగా ఆడటంతో బంగ్లా 10 ఓవర్లలో 79 పరుగులు చేసింది. స్కోర్ వివరాలు: బంగ్లాదేశ్:79/0 తమీమ్(36 పరుగులు ,31 బంతులు,4 ఫోర్లు,1 సిక్సర్) సర్కార్(38 పరుగులు ,27 బంతులు,7 ఫోర్లు) భారత్ బౌలింగ్: భువనేశ్వర్ 4-0-27-0 ఉమేశ్ 3-0-28-0 అశ్విన్ 2-0-11-0 మోహిత్ 1-0-10-0 -
నిబంధనలు మార్చాలి: ధోని
మెల్బోర్న్: వన్డేల్లో బ్యాట్స్మెన్కు ఎక్కువ అనుకూలంగా ఉన్న ప్రస్తుత నిబంధనలు మార్చాలని భారత కెప్టెన్ ధోని అన్నాడు. ఐసీసీ అనుసరిస్తున్న నలుగురు ఫీల్డర్ల వ్యూహం వల్ల 50 ఓవర్ల ఫార్మాట్లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవాల్సి వస్తుందన్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ మండలి నిబంధన ప్రకారం మ్యాచ్ మొత్తంలో 30 యార్డ్ సర్కిల్ బయట నలుగురికంటే ఎక్కువ మంది ఫీల్డర్లను ఉంచరాదు. ఈ నిబంధన భారత్ బౌలింగ్పై తీవ్ర ప్రభా వం చూపిందని చెప్పిన మహీ సరైన సీమర్ ఆల్రౌండర్ లేకపోవడం సెమీస్లో దెబ్బతీసిందన్నాడు. ‘ఈ నిబంధనలను మార్చాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. వన్డేల్లో గత చరిత్రను పరిశీలిస్తే డబుల్ సెంచరీలను చూడలేదు. కానీ ఇప్పుడు మూడేళ్ల వ్యవధిలో మూడు ద్విశతకాలు నమోదయ్యాయి. ఎక్స్ట్రా ఫీల్డర్ను సర్కిల్ లోపలికి తీసుకురావడంతో చాలా డాట్ బాల్స్ నమోదవుతున్నాయని చాలా మంది అంటున్నారు. అదే లాజిక్ అయితే మరి 11 మందిని సర్కిల్లోనే ఉంచితే మరిన్ని డాట్ బాల్స్ వస్తాయి కదా’ అని ధోని విమర్శించాడు. వన్డేల్లో ఎక్కువ ఫోర్లు, సిక్సర్లు ఉంటే ఆట బోరింగ్గా ఉంటుందన్నాడు. ‘తొలి, చివరి 10 ఓవర్లలో ఎలాగూ టి20ల మాదిరిగా ఆడతాం. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్పైనే వన్డేలు ఆధారపడి ఉండాలి. కాబట్టి ప్రస్తుత నిబంధన చాలా కఠినంగా ఉంది. స్పిన్నర్లకు ఇది మరింత భారంగా మారింది. ప్రతి బ్యాట్స్మన్ స్వీప్, రివర్స్ స్వీప్లతో పాటు ఇతరత్రా షాట్స్ అన్నీ అడుతున్నారు’ అని మహీ వ్యాఖ్యానించాడు. -
వెంకన్న రికార్దు