చిట్టగాంగ్: బంగ్లాదేశ్తో జరిగిన మూడు వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్ను ఇంగ్లండ్ 2-1తో గెల్చుకుంది. చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్లతో నెగ్గింది. తొలుత బంగ్లాదేశ్ 6 వికెట్లకు 277 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (67 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 6 వికెట్లకు 278 పరుగులు చేసి గెలిచింది. బిల్లింగ్స (62), డకెట్ (63) అర్ధ సెంచరీలు చేశారు.