
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ గేమ్స్ అండర్–17 బాలికల స్క్వాష్ టోర్నమెంట్లో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ఐశ్వర్య బిమల్ పయ్యాన్ ప్రాతినిధ్యం వహించిన ఐబీఎస్ఓ జట్టు రన్నరప్గా నిలిచింది. చండీగఢ్లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ఐబీఎస్ఓ జట్టు 5–11, 4–11, 5–11తో తమిళనాడు చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన సెమీస్లో ఐబీఎస్ఓ 11–8, 11–5, 11–6తో గుజరాత్పై గెలుపొందింది.
Comments
Please login to add a commentAdd a comment