విజయం దిశగా ఆంధ్ర | Andhra Team Lead In Ranji Trophy | Sakshi

విజయం దిశగా ఆంధ్ర

Dec 20 2019 1:56 AM | Updated on Dec 20 2019 1:56 AM

 Andhra Team Lead In Ranji Trophy - Sakshi

సాక్షి, ఒంగోలు టౌన్‌: రికీ భుయ్‌ (313 బంతుల్లో 144 నాటౌట్‌; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీకి తోడు... బౌలింగ్‌లో చీపురుపల్లి స్టీఫెన్‌ (4/47), శశికాంత్‌ (2/24) హడలెత్తించడంతో... ఢిల్లీతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్రికెట్‌ గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో ఆంధ్ర విజయం దిశగా సాగుతోంది. 153 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఢిల్లీ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 28 ఓవర్లలో 89 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవాలంటే మరో 64 పరుగులు చేయాలి. ప్రస్తుతం లలిత్‌ యాదవ్‌ (23 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), వికాస్‌ మిశ్రా (7 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

నేడు మ్యాచ్‌కు చివరి రోజు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 249/6తో బ్యాటింగ్‌ కొనసాగించిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 127 ఓవర్లలో 368 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆంధ్రకు 153 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఒకదశలో 8 వికెట్లకు 250 పరుగులతో ఉన్న ఆంధ్ర జట్టుకు ఆధిక్యం 50 పరుగులు దాటుతుందో లేదో అనే అనుమానం కలిగింది. అయితే రికీ భుయ్‌ పట్టుదలతో ఆడి చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ స్టీఫెన్‌ (60 బంతుల్లో 19; 3 ఫోర్లు)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 76 పరుగులు... విజయ్‌ కుమార్‌ (20 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్‌)తో కలిసి పదో వికెట్‌కు 42 పరుగులు జోడించి ఆంధ్రకు భారీ ఆధిక్యం లభించడంలో కీలకపాత్ర పోషించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement