
ఆసీస్ హ్యాట్రిక్
ఫైనల్లో ఇంగ్లండ్పై విజయం
మహిళల టి20 ప్రపంచకప్
సాక్షి, ఢాకా: పురుషుల విభాగంలో ఇప్పటివరకూ ఎవరూ సాధించని ఘనతను ఆస్ట్రేలియా మహిళల జట్టు సాధించింది. వరుసగా మూడోసారి మహిళల టి20 ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ నాలుగుసార్లు ఈ టోర్నీ జరిగితే ఆసీస్ మహిళలు వరుసగా 2010, 2012, 2014లలో టైటిల్స్ సాధించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్లతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది.
తొలుత ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 105 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో కోయ్టే (3/16), పెర్రీ (2/13) అద్భుతంగా బౌలింగ్ చేశారు. తర్వాత ఆస్ట్రేలియా జట్టు 15.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ లానింగ్ (44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), పెర్రీ (31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. ఆసీస్ బౌలర్ కోయ్టేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.... ఇంగ్లండ్ బౌలర్ షబ్స్రోల్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.