
'పాకిస్తాన్ తో పోరుకు ఆతృతగా ఉన్నా'
చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో తలపడే మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధవన్ స్పష్టం చేశాడు.
లండన్:చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ తో తలపడే మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు భారత క్రికెట్ జట్టు ఓపెనర్ శిఖర్ ధవన్ స్పష్టం చేశాడు. అన్ని కళ్లూ ఆ మ్యాచ్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నాయో, తాను కూడా పాక్ తో బిగ్ మ్యాచ్ కోసం నిరీక్షిస్తున్నట్లు తెలిపాడు.
'ఈ నెల 4వ తేదీన పాక్ తో మ్యాచ్ కోసం ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఉన్నారు. నేను కూడా ఆ రోజు బ్యాట్కు బంతికి జరిగే మ్యాచ్ కోసం చాలా ఎక్కువగా ఎదురుచూస్తున్నా' ధవన్ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నాడు.