Shikhar Dhawan
-
శ్రీలంకను చిత్తు చేసిన శిఖర ధవన్ సేన
ఆసియా లెజెండ్స్ లీగ్ ఆరంభ ఎడిషన్లో (2025) శిఖర్ ధవన్ నేతృత్వంలోని ఇండియన్ రాయల్స్ బోణీ కొట్టింది. నిన్న (మార్చి 11) శ్రీలంక లయన్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ 46 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.5 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. వన్డౌన్ బ్యాటర్ ఫయాజ్ ఫజల్ (52) మెరుపు అర్ద సెంచరీ సాధించి భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్లో శిఖర్ ధవన్ 16, రాహుల్ యాదవ్ 21, మనోజ్ తివారి 3, యోగేశ్ నగర్ 0, మన్ప్రీత్ గోని 28, జకాతి 23, అనురీత్ సింగ్ 2 పరుగులు చేయగా.. రోహన్ రతి, మునాఫ్ పటేల్ డకౌట్లయ్యారు. లంక బౌలర్లలో సంజయ 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను ఇబ్బంది పెట్టాడు. తిలకరత్నే దిల్షన్ 2, అరుల్ ప్రగాసమ్, ఉపుల్ ఇంద్రసిరి, తుషారా, కెప్టెన్ తిసారి పెరీరా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో జకాతి 3 వికెట్లు పడగొట్టగా.. మనోజ్ తివారి, అనురీత్ సింగ్, మన్ప్రీత్ గోని తలో 2 వికెట్లు తీశారు. లంక ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 పరుగులు చేసిన లసిత్ లక్షన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. మెవన్ ఫెర్నాండో (20 నాటౌట్), రవీన్ సాయర్ (18), తిసారి పెరీరా (10) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ బ్యాటర్ తిలకరత్నే దిల్షన్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఈ టోర్నీలో భారత్ మొన్న (మార్చి 10) జరగాల్సిన మ్యాచ్లో బంగ్లాదేశ్ టైగర్స్తో తలపడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నిన్న జరగాల్సిన మరో మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్పై ఆసియా స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.కాగా, ఆసియా లెజెండ్స్ లీగ్ తొలి ఎడిషన్ (2025) మార్చి 10న ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు (ఏషియన్ లయన్స్, శ్రీలంక లయన్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్, ఇండియన్ రాయల్స్, బంగ్లాదేశ్ టైగర్స్) పాల్గొంటున్నాయి. ఏషియా ప్రాంతానికి చెందిన మాజీ స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియన్ రాయల్స్ తరఫున టీమిండియా స్టార్లు శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, మనోజ్ తివారి, మునాఫ్ పటేల్ తదితర స్టార్లు ఆడుతున్నారు. -
హెచ్టీ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అవార్డుల వేడుకలో తారల సందడి (ఫొటోలు)
-
దేశవాళీలో ఆడితే మంచిదే కానీ...
దుబాయ్: భారత క్రికెటర్లకు దేశవాళీ క్రికెట్ ఆడటం తప్పనిసరి చేయడం సరైన నిర్ణయమేనని మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఆడే ప్లేయర్లకు తగినంత విశ్రాంతి కూడా అవసరమనే అంశాన్ని విస్మరించరాదని కూడా అతను గుర్తు చేశాడు. ఈ విషయంలో బీసీసీఐ సమతూకం పాటించాలని శిఖర్ చెప్పాడు. ‘ఇది చాలా చక్కటి నిర్ణయం. నా దృష్టిలో ప్రస్తుత క్రికెటర్లంతా దేశవాళీ మ్యాచ్లలో ఆడాలి. అప్పుడే ఆ మ్యాచ్లకు ఆకర్షణ వస్తుంది. కోహ్లి ఢిల్లీ తరఫున ఆడితే స్టేడియం ఎలా నిండిపోయిందో మనం చూశాం. అయితే కీలక ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి కూడా అవసరం. వారిపై అధిక భారం వేయరాదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సంబంధిత వ్యక్తులు పర్యవేక్షించాలి’ అని ధావన్ వ్యాఖ్యానించాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీలో 363 పరుగులతో శిఖర్ ధావన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోరీ్న’గా నిలిచాడు. తాజా టోర్నీ కోసం ఐసీసీ ఎంపిక చేసిన నలుగురు ఈవెంట్ బ్రాండ్ అంబాసిడర్లలలో అతను కూడా ఒకడు. గత ఏడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన ధావన్... ఆటకు దూరమైనందుకు తాను ఏమాత్రం చింతించడం లేదని వెల్లడించాడు. ‘నేను చాలా బాగా ఉత్సాహంగా ఉన్నాను. ఎలాంటి చింతా లేదు. ప్రస్తుతం జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నా ఆట గురించి నాకు బాగా తెలుసు. దేవుడు చాలా సుదీర్ఘ కెరీర్ ఇచ్చినందుకు కృతజ్ఞుడను’ అని స్పష్టం చేశాడు. గత కొన్నేళ్లుగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్లు ఏకపక్షంగా మారిపోవడంపై కూడా అతను స్పందించాడు. ‘మ్యాచ్పై అంచనాలు, ఆసక్తి, మైదానంలో తీవ్రత అలాగే ఉన్నాయి. గతంలో వారు వరుసగా గెలిచేవారు. ఇప్పుడు మనం గెలుస్తున్నాం. అంతే తేడా ఉంది’ అని శిఖర్ విశ్లేíÙంచాడు. ప్రస్తుతం జట్టు వైస్ కెపె్టన్గా ఉన్న శుబ్మన్ గిల్ ఆ హోదాకు అర్హుడని... మున్ముందు అతను కచ్చితంగా భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడని ధావన్ అభిప్రాయపడ్డాడు. -
మిస్టరీ గర్ల్తో శిఖర్ ధవన్.. సోషల్మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy 2025) అఫీషియల్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఫిబ్రవరి 20న దుబాయ్లో జరిగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్కు హాజరయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా క్రికెటర్లతో కలియ తిరిగిన ధవన్.. ఆతర్వాత వీఐపీ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ను వీక్షించాడు. Who is this lady with Shikhar Dhawan?🥲 #ShikharDhawan #IndvsBan #RohitSharma𓃵 #ChampionsTrophy pic.twitter.com/JqFTeY4kAp— lei 🌼 (@sakshimadik03) February 20, 2025ఆ సమయంలో ధవన్ పక్కనే ఓ విదేశీ యువతి తారసపడింది. ధవన్.. సదరు విదేశీ యువతి పక్కపక్కనే కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ధనవ్ కొత్త అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. Hahahha such a cute video 😆😆😆 #ShikharDhawan pic.twitter.com/P0PSrC9ydc— Prernaa (@theprernaa) February 21, 2025ఇంతకీ ఆ విదేశీ అమ్మాయి ఎవరని ఆరా తీయగా.. ఆమె పేరు సోఫీ షైన్ అని తెలిసింది. ఐర్లాండ్కు చెందిన ఈ యువతిని ధవన్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా చేస్తున్నట్లు బయటపడింది. దీంతో సోఫీ, ధవన్ మధ్య ఏదో నడుస్తుందని నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ధవన్ కొద్ది రోజుల కిందట ఇదే యువతితో ఎయిర్పోర్ట్లో కూడా కనిపించాడని అంటున్నారు.కాగా, 39 ఏళ్ల ధవన్.. తన మాజీ భార్య, ఆసీస్ పౌరురాలైన అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకుని ప్రస్తుతం సింగిల్గా ఉంటున్నాడు. ధవన్, ఆయేషాకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. అయేషాతో విడిపోయాక ధవన్ ఎక్కువగా తన కుమారుడి గురించి సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నాడు. అయేషా.. బిడ్డను తనతో కలువనివ్వట్లేదని ధవన్ పలు సందర్భాల్లో వాపోయాడు. ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాక ధవన్ ప్రస్తుతం పలు ప్రైవేట్ లీగ్ల్లో పాల్గొంటున్నాడు. ధవన్ ఇటీవలే నేపాల్ క్రికెట్ లీగ్లో ఆడాడు. ధవన్ 2012లో అయేషాను పెళ్లాడాడు. వీరిద్దరికి సోషల్మీడియాలో పరిచయం ఏర్పడింది. అయేషా ధవన్ కంటే పదేళ్లు పెద్దది. ధవన్తో పెళ్లి కాక ముందే అయేషాకు వేరే వ్యక్తితో వివాహమైంది. అయేషా ఆ వ్యక్తితో ఇద్దరు కుమార్తెలను కనింది. అయేషా మాజీ కిక్ బాక్సింగ్ ఛాంపియన్.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్లో పాకిస్తాన్ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. -
చాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్గా శిఖర్ ధావన్
దుబాయ్: భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan)... చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) అంబాసిడర్గా (Ambassador) నియమితుడయ్యాడు. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నలుగురు అంబాసిడర్లను ఎంపిక చేసింది. ఇందులో ధావన్తో పాటు పాకిస్తాన్ జట్టుకు చాంపియన్స్ ట్రోఫీ అందించిన కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్, న్యూజిలాండ్ దిగ్గజ పేసర్ టిమ్ సౌతీ చోటు దక్కించుకున్నారు.2013లో భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన శిఖర్... ఈ టోర్నీ చరిత్రలో వరుసగా రెండుసార్లు ‘గోల్డెన్ బ్యాట్’ అవార్డు గెలుచుకున్న ఏకైక ప్లేయర్గా నిలిచాడు. ‘చాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్గా ఎంపికవడం గౌరవంగా భావిస్తున్నా. ఏదో తెలియని కొత్త అనుభూతి కలుగుతోంది. ప్రపంచంలోని 8 అత్యుత్తమ జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని ధావన్ పేర్కొన్నాడు.చాంపియన్స్ ట్రోఫీలో 701 పరుగులు చేసిన శిఖర్... భారత్ తరఫున ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీలో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన ధావన్... ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గానూ కొనసాగుతున్నాడు. -
కోచ్లకు ‘టీ’ అందించేవాడిని.. ఇంకా: శిఖర్ ధావన్
క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చుకునే క్రమంలో తాను చేసిన పనుల గురించి శిఖర్ ధావన్(Shikhar Dhawan) తాజాగా వెల్లడించాడు. పిచ్ను రోల్ చేయడం సహా కోచ్లకు ‘టీ’లు అందించడం వరకు అన్నీ తానే చేసేవాడినని తెలిపాడు. పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేసేందుకు రోజంతా ఎండలో నిలబడేవాడినని గుర్తు చేసుకున్నాడు.కాగా ఢిల్లీకి చెందిన శిఖర్ ధావన్ ఎడమచేతి వాటం బ్యాటర్. అండర్-19 వరల్డ్కప్-2004లో సత్తా చాటడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. నాటి టోర్నీలో మూడు శతకాల సాయంతో 505 పరుగులు చేసి సత్తా చాటాడు. అయినప్పటికీ టీమిండియాలోకి రావడానికి ధావన్ చాలా రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.ఢిల్లీ తరఫున ఓపెనర్గావీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్లతో కలిసి ఢిల్లీ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన ధావన్.. ఎట్టకేలకు 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా తరఫున మొత్తంగా 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేసిన గబ్బర్.. 68 టీ20లలో 1759 పరుగులు సాధించాడు. ఇక టెస్టు ఫార్మాట్లో 34 మ్యాచ్లు ఆడి 2315 రన్స్ చేశాడు. 2022లో చివరగా భారత్కు ప్రాతినిథ్యం వహించిన శిఖర్ ధావన్కు.. ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి.టీమిండియాలో చోటు కరువుశుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ తదితర యువ బ్యాటర్లు ఓపెనర్లుగా టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకోవడంతో ధావన్కు మొండిచెయ్యి ఎదురైంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగష్టులో అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు కూడా గుడ్బై చెప్పాడు.ఇక ప్రస్తుతం లెజెండ్స్ లీగ్, నేపాల్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీలలో పాల్గొంటున్న శిఖర్ ధావన్ తాజాగా చిన్నారులతో ముచ్చటించాడు. శిఖర్ ధావన్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ పిల్లాడు.. ‘‘మీ క్రికెట్ ప్రయాణం ఎలా మొదలైంది’’ అని అడిగాడు.కోచ్లకు ‘టీ’ అందించేవాడినిఇందుకు బదులిస్తూ.. ‘‘చిన్నతనంలో క్లబ్ క్రికెట్ ఆడేవాడిని. అక్కడ దాదాపు ఏడాది పాటు సాధన చేశాను. ఆ మరుసటి ఏడాది నాకు టోర్నమెంట్లో ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఖాళీగా ఉన్న ఆ ఏడాదిలో నేను ఎన్నెన్నో చిత్రమైన పనులు చేశాను.పిచ్ను రోల్ చేయడం, కోచ్ల కోసం టీ తీసుకురావడం.. పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేసేందుకు గంటల పాటు ఎండలో నిల్చోవడం.. ఇలాంటివి చాలానే చేశాను’’ అని శిఖర్ ధావన్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.కుమారుడికి దూరంగా.. కాగా శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయేషా ముఖర్జీ అనే ఆస్ట్రేలియా మహిళను అతడు 2012లో పెళ్లాడాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ధావన్తో కలిసి జోరావర్కు జన్మనిచ్చింది. అయితే, ఎంతో అన్యోన్యంగా ఉండే ఆయేషా- శిఖర్ ధావన్ రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఇక కుమారుడు జొరావర్ను ఆయేషా తనతో పాటు ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లగా.. ధావన్ తన గారాలపట్టిని మిస్సవుతున్నట్లు చాలాసార్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలిపాడు. ధావన్ తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నట్లు సమాచారం.చదవండి: ఇలాంటి కెప్టెన్ను ఎప్పుడూ చూడలేదు: రోహిత్ శర్మపై టీమిండియా స్టార్ కామెంట్స్ -
శిఖర్ ధవన్ సుడిగాలి శతకం
బిగ్ క్రికెట్ లీగ్లో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ చెలరేగి ఆడుతున్నాడు. ఈ లీగ్లో నార్తర్న్ ఛార్జర్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ధవన్.. యూపీ బ్రిడ్జ్ స్టార్స్తో జరిగిన మ్యాచ్లో సుడిగాలి శతకంతో మెరిశాడు. ఈ మ్యాచ్లో 49 బంతుల్లోనే శతక్కొట్టిన ధవన్.. ఓవరాల్గా 63 బంతులు ఎదుర్కొని 14 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేశాడు. SHIKHAR DHAWAN CENTURY. 🙇♂️🔥pic.twitter.com/CntrgLAf4L— Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2024ధవన్కు జతగా మరో ఎండ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ సమీవుల్లా షెన్వారీ కూడా విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. షెన్వారీ 46 బంతుల్లో 11 సిక్స్లు, 7 ఫోర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధవన్-షెన్వారీ జోడీ తొలి వికెట్కు 207 పరుగులు జోడించింది. ధనవ్, షెన్వారీ సుడిగాలి శతకాలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు చేసింది.పరుగుల వరద పారిస్తున్న ధవన్బిగ్ క్రికెట్ లీగ్లో శిఖర్ ధవన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ లీగ్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన ధవన్ 170కి పైగా స్ట్రయిక్రేట్తో 301 పరుగులు చేశాడు. ఈ లీగ్లో ధవన్ లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా కూడా ధవన్లో జోరు ఏమాత్రం తగ్గలేదు. రిటైర్మెంట్ అనంతరం ధవన్ ప్రతి చోటా లీగ్లు ఆడుతున్నాడు. ఇటీవలే అతను నేపాల్ క్రికెట్ లీగ్లోనూ పాల్గొన్నాడు. ధవన్ అక్కడ కూడా మెరుపు ఇన్నింగ్స్లు ఆడి అభిమానులను అలరించాడు. -
శిఖర్ ధావన్ ఫిట్నెస్ సీక్రెట్ తెలిస్తే కంగుతినాల్సిందే..!
భారత మాజీ క్రికెటర్, ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ మైదానంలో అడుపెడితో ధనాధన్ సిక్సర్ల వర్షం కురవాల్సిందే. ధావన్ పరుగుల విధ్వంసానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అంతలా తన ఆటతో కట్టిపడేసే ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్తో పాటు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం నేపాల్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఇంతలా శక్తిమంతంగా ఆడలాంటే అంతే స్థాయిలో బాడీని, ఆరోగ్యాన్ని ఫిట్గా ఉంచుకోవాలి. అందుకోసం ధావన్ ఎలాంటి వర్కౌట్లు, డైట్ తీసుకుంటారో తెలుసా..!.శిఖర్ ధావన్ వారంలో రెండు నుంచి మూడు కఠినమైన జిమ్ సెషన్లు తప్పనిసరిగా చేస్తాడు. వాటిలో కార్డియో వర్కౌట్లు కూడా ఉంటాయట. అంతేగాదు ఓ ఇంటర్వ్యూలో ప్రాథమిక వ్యాయామానికి ముందు బాడీ చురుకుగా ఉండేలో గ్లూట్ వ్యాయమాలు, మొబిలిటీ ట్రైనింగ్, స్ట్రెచింగ్ వంటివి చేస్తానని చెప్పుకొచ్చాడు. ధావన్ యోగా ప్రేమికుడు కూడా. యోగాసనాలు రోజువారీ దినచర్యలో కచ్చితంగా ఉంటాయి. అయితే ధావన్ ఎక్కువగా రన్నింగ్ ఎక్సర్సైజుని ఎంజాయ్ చేస్తానని చెబుతున్నారు. ఇది శరీరం అంతటా రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా చేస్తుందట. ఏదైన వర్కౌట్లు చేయడానికి ముందు కనీసం 30 నిమిషాలు శరీరం వేడెక్కేలా రన్నింగ్ లేదా జాగింగ్ చేయాలని సూచిస్తున్నాడు ధావన్. చివరిగా మానసిక ఆరోగ్యం కోసం శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, సూర్యనమస్కారాలు కూడా చేస్తానని అంటున్నారు ధావన్. డైట్..గబ్బర్గా పిలిచే ధావన్ ఎక్కువగా కాల్చిన చికెన్, బంగాళదుంపలు, సాల్మన్, బ్రోకలీ తదితర కూరగాయాలను ఇష్టంగా తింటారు. వీటితోపాటు ఆలూ పరాటాలు, దోసెలు, చికెన్ కర్రీ వంటివి కూడా తింటానని చెబుతున్నారు. ఈ ఫుడ్ తనకు కఠినమైన వ్యాయామాల సమయంలో హెల్ప్ అవుతుందని చెబుతున్నాడుప్రోటీన్ రిచ్ డైట్కి ప్రాధాన్యత ఇవ్వనని చెబుతున్నారు. శక్తి కోసం పిండి పదార్థాలు తప్పనసరి అని వాదించారు కూడా. తాను ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు కలిగిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటానని చెప్పారు.అథ్లెట్లకు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం అవసరమనే అపోహ ప్రజల్లో ఉంది. కానీ "శక్తిని పెంచడానికి కార్బోహైడ్రేట్లే ప్రధానమని నమ్ముతా అని చెప్పారు ధావన్.(చదవండి: స్నానం చేయడం పాత ట్రెండ్! ఇలా మూడ్ని బట్టి..) -
శిఖర్ ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్.. సిక్సర్ల వర్షం.. 51 బంతుల్లోనే..
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం నేపాల్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఎన్పీఎల్ ఆరంభ ఎడిషన్లో కర్నాలీ యాక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న గబ్బర్.. బుధవారం నాటి మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు.ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్ కీర్తిపూర్ వేదికగా ఖాట్మండూ గుర్ఖాస్తో జరిగిన మ్యాచ్లో శిఖర్ ధావన్.. 51 బంతుల్లోనే 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. గబ్బర్ ఇన్నింగ్స్లో ఐదు సిక్సర్లు, నాలుగు బౌండరీలు ఉండటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నాలీ యాక్స్.. ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.గబ్బర్ మెరుపుల వీడియో వైరల్అయితే, ఖాట్మండూ గుర్ఖాస్ బ్యాటర్ల విజృంభణ కారణంగా.. కర్నాలీ యాక్స్కు మూడు వికెట్ల తేడాతో ఓటమి తప్పలేదు. ఏదేమైనా ఈ మ్యాచ్లో శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచింది. గబ్బర్ పరుగుల విధ్వంసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అభిమానులను ఆకర్షిస్తోంది.ఎనిమిది జట్లుకాగా ఈ ఏడాది మొదలైన నేపాల్ ప్రీమియర్ లీగ్లో చిట్వాన్ రైనోస్, జనక్పూర్ బోల్ట్స్, సుదుర్పశ్చిమ్ రాయల్స్, ఖాట్మండూ గుర్ఖాస్, లుంబిని లయన్స్, కర్నాలీ యాక్స్, బీరట్నగర్ కింగ్స్, పొఖరా అవెంజర్స్ జట్లు పాల్గొంటున్నాయి. కర్నాలీ యాక్స్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో రెండూ ఓడిపోయింది.ఇదిలా ఉంటే.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్తో పాటు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు శిఖర్ ధావన్. అనంతరం లెజెండ్స్ లీగ్లో భాగమైన గబ్బర్.. నేపాల్ లీగ్ క్రికెట్లోనూ ఆడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్లలో కలిపి పదివేలకు పైగా పరుగులు చేసిన 38 ఏళ్ల ధావన్.. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాలో సభ్యుడు.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి DHA-ONE HAS ARRIVED! 🌪️Shikhar Dhawan scored an unbeaten 72, including 5 huge sixes, powering Karnali Yaks to a competitive total 🤩#NPLonFanCode pic.twitter.com/lPVx9uUYPz— FanCode (@FanCode) December 4, 2024 -
భార్యతో విడాకులు.. ‘మిస్టరీ గర్ల్’తో శిఖర్ ధావన్! వీడియో వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ వార్తల్లోకి వచ్చాడు. ముంబై విమానాశ్రయంలో ‘మిస్టరీ గర్ల్’తో కలిసి అతడు కెమెరాలకు చిక్కడమే ఇందుకు కారణం. కాగా భారత క్రికెట్ జట్టు ఓపెనర్గా అద్భుత రికార్డు కలిగి ఉన్న శిఖర్ ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.శుబ్మన్ గిల్ రాకతోఐసీసీ టోర్నీల్లో నిలకడగా రాణించి అభిమానులను అలరించిన ధావన్.. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిసి 269 మ్యాచ్లు ఆడి 10867 పరుగులు చేశాడు. ఇందులో 24 శతకాలు.. 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, శుబ్మన్ గిల్ రాకతో గబ్బర్ కెరీర్ నెమ్మదించింది. ఒకవైపు తన ఫామ్లేమి.. మరోవైపు గిల్ అద్భుత ఆట తీరు కనబరచడంతో సెలక్టర్లు ధావన్ను పక్కనపెట్టారు.ఈ క్రమంలో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా గిల్ పాతుకుపోవడమే కాదు.. ఏకంగా టీమిండియా భవిష్య కెప్టెన్ అనేంతగా దూసుకుపోయాడు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా అవకాశాలు కరువైన శిఖర్ ధావన్ ఆగష్టులో రిటైర్మెంట్ ప్రకటించాడు.ఆయేషా ముఖర్జీతో వివాహంఇక ధావన్ వ్యక్తిగత విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని పెళ్లాడాడు. అప్పటికే ఆమెకు మొదటి భర్తతో ఇద్దరు ఆడపిల్లలు జన్మించగా.. వారిని కూడా తన కూతుళ్లుగానే ధావన్ స్వీకరించాడు. ఇక ఆయేషాతో ధావన్కు ఒక కుమారుడు కలిగాడు. అతడికి జొరావర్గా నామకరణం చేశారు.భార్యతో విడాకులు.. కుమారుడు దూరంధావన్- ఆయేషా ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు. అయితే, అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరడంతో 2023లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో జొరావర్ను తీసుకుని ఆయేషా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. అంతేకాదు.. తన కుమారుడితో మాట్లాడేందుకు కూడా ఆమె ఒప్పుకోవడం లేదని.. కొడుకును తనకు పూర్తిగా దూరం చేస్తోందని ధావన్ సోషల్ మీడియా పోస్టుల్లో పరోక్షంగా వెల్లడించాడు.ఆ అమ్మాయి ఎవరు?ఈ క్రమంలో ధావన్ తాజాగా ముంబై ఎయిర్పోర్టులో ఓ అమ్మాయితో కలిసి కనిపించడం హాట్టాపిక్గా మారింది. ఇద్దరూ కలిసి ఒకే కారులో రాగా.. ఆ అమ్మాయి మాత్రం ధావన్తో కలిసి ఒకే ఫ్రేములో కెమెరా కళ్లకు చిక్కకుండా పక్కకు వెళ్లిపోయింది. అయితే, కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసి విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో గబ్బర్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరి జంట ముచ్చటగా ఉందని.. ఆ అమ్మాయి ఎవరోగానీ ధావన్ జీవితంలోకి వస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. కాగా ధావన్ బాలీవుడ్లోనూ తన అదృష్టం పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె మోడల్ లేదంటే నటి అయి ఉంటుందని.. ఇద్దరూ కలిసి షూటింగ్కు వెళ్తున్నారేమోనంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. గబ్బర్ నోరు విప్పితే కానీ.. అసలు విషయం బయటకు రాదు మరి!చదవండి: IPL 2025: మెగా వేలం ముహూర్తం ఖరారు! ఇప్పటికి రూ. రూ. 550.5 కోట్లు.. ఇక View this post on Instagram A post shared by HT City (@htcity) -
‘రోహిత్ గొప్ప నాయకుడు.. ఆసీస్తో తొలి మ్యాచ్ ఆడకపోయినా..’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గొప్ప నాయకుడని మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రశంసలు కురిపించాడు. ఆటలో గెలుపోటములు సహజమని.. సహచర ఆటగాళ్ల పట్ల సారథి వ్యవహరించే తీరే అన్నికంటే ముఖ్యమైనదని పేర్కొన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది.ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా.. కివీస్కు 0-2తో సిరీస్ సమర్పించుకుంది. దీంతో స్వదేశంలో టీమిండియా టెస్టు సిరీస్ల విజయాల(18) పరంపరకు బ్రేక్ పడింది. పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్ ఓడిన భారత జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ స్పందించాడు. ‘‘క్రికెటర్లుగా మేము కేవలం ఆడటంపైనే దృష్టి పెడతాం. గెలుపే మా లక్ష్యం. ఇక రోహిత్ గురించి చెప్పాలంటే.. అతడొక గొప్ప నాయకుడు. మ్యాచ్లు గెలిచామా? ఓడిపోయామా? అన్న ఫలితంతో సంబంధం లేకుండా.. ఒక జట్టును తీర్చిదిద్దడంలో కెప్టెన్గా తన వంతు పాత్ర చక్కగా పోషిస్తాడు.సహచర ఆటగాళ్లతో అతడి బంధం ఎలా ఉందనేదే ముఖ్యం. అవసరమైన వేళ వాళ్లకు అండగా ఉన్నాడా? లేడా అన్నది కూడా ప్రధానం’’ అని శిఖర్ ధావన్ రోహిత్ శర్మను కొనియాడాడు. ఇక కివీస్తో సిరీస్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రోహిత్ ఆసీస్తో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయం గురించి మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో టీమిండియా గొప్పగా రాణిస్తుంది. రోహిత్ తొలి మ్యాచ్ ఆడతాడా? లేదా అన్న అంశంపై స్పష్టత లేదు. ఒకవేళ అతడు జట్టుతో లేనట్లయితే కచ్చితంగా ఆటగాళ్లు అతడి కెప్టెన్సీని మిస్సవుతారు.అయితే, రోహిత్ లేకపోయినా జట్టులోని ప్రతి ఆటగాడు తమ బాధ్యతను నెరవేరుస్తూ ముందుకు సాగుతారు. ప్రస్తుత టీమ్ ఆసీస్లోనూ బాగా ఆడుతుందనే నమ్మకం ఉంది’’ అని ధీమా వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య నామమాత్రపు మూడో టెస్టు ముంబై వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు నవంబరులో ఆస్ట్రేలియా వెళ్తుంది. -
రాణించిన గబ్బర్.. అయినా డీకే జట్టు చేతిలో ఓటమి
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా సథరన్ సూపర్ స్టార్స్తో నిన్న (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్లో శిఖర్ ధవన్ సారథ్యం వహిస్తున్న గుజరాత్ గ్రేట్స్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ధవన్ హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ.. దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని సథరన్ సూపర్ స్టార్స్పై పైచేయి సాధించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. చతురంగ డిసిల్వ మెరుపు అర్ద సెంచరీతో (28 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మార్టిన్ గప్తిల్ 22, హమిల్టన్ మసకద్జ 20, దినేశ్ కార్తీక్ 18 పరుగులు చేశారు. కేదార్ జాదవ్ (1), పార్థివ్ పటేల్ (4),పవన్ నేగి (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. గుజరాత్ గ్రేట్స్ బౌలర్లలో మనన్ శర్మ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ప్లంకెట్, ప్రసన్న తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ గ్రేట్స్.. శిఖర్ ధవన్ మినహా ఎవరూ రాణించకపోవడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధవన్ 48 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. గత మ్యాచ్లో సెంచరీ చేసిన మోర్నీ వాన్ విక్ ఈ మ్యాచ్లో 15 పరుగులకే ఔటయ్యాడు. లెండిల్ సిమన్స్ 7, మొహమ్మద్ కైఫ్ 5, అస్గర్ అఫ్ఘాన్ 3, మనన్ శర్మ 10 పరుగులు చేశారు. సథరన్ సూపర్ స్టార్స్ బౌలర్లలో పవన్ నేగి 3, అబ్దుర్ రజాక్ 2, చతురంగ డిసిల్వ, కేదార్ జాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. చదవండి: ఆస్ట్రేలియాను మట్టికరిపించిన టీమిండియా -
వాన్ విక్ మెరుపు సెంచరీ.. రైనా టీమ్పై ధవన్ జట్టు ఘన విజయం
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్లో తొలి సెంచరీ నమోదైంది. తొయమ్ హైదరాబాద్తో ఇవాళ (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్లో గుజరాత్ గ్రేట్స్ ఓపెనర్ మోర్నీ వాన్ విక్ మెరుపు శతకం సాధించాడు. వాన్ విక్ 69 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సురేశ్ రైనా సారథ్యం వహిస్తున్న తొయమ్ హైదరాబాద్పై శిఖర్ ధవన్ జట్టు గుజరాత్ గ్రేట్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 27 బంతుల్లో 44 పరుగులు చేసిన సురేశ్ రైనా టాప్ స్కోరర్గా నిలిచాడు. పీటర్ ట్రెగో 36 (నాటౌట్), గుర్కీరత్ సింగ్ 26, వాల్టన్ 17, క్లార్క్ 15, వర్కర్ 13 పరుగులు చేశారు. షాన్ మార్ష్ (1), స్టువర్ట్ బిన్ని (7) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్లంకెట్, మనన్ శర్మ, ప్రసన్న తలో రెండు వికెట్లు తీయగా.. గాబ్రియెల్ ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. వాన్ విక్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వాన్ విక్ ఒంటిరి పోరాటం చేయగా.. శిఖర్ ధవన్ (21), లెండిల్ సిమన్స్ (20), యశ్పాల్ శర్మ (13 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఇసురు ఉడాన, గుర్కీరత్ మాన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్ -
టీమిండియా స్టార్ రీ ఎంట్రీ.. ఆ జట్టులో చేరిక
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కీలక ప్రకటన చేశాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్లో తాను భాగం కానున్నట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన తర్వాత కూడా ఆటగాడిగా కొనసాగే అవకాశం టీ20 లీగ్ల ద్వారా దక్కిందని.. మరోసారి మైదానంలో దిగి అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీకే వెల్లడించాడు.ఇటీవలే రిటైర్మెంట్కాగా ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన ఈ చెన్నై క్రికెటర్.. సీజన్ ముగిసిన తర్వాత క్యాష్ రిచ్ లీగ్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు డీకే ఈ ఏడాది జూన్ 1న ప్రకటన విడుదల చేశాడు. అనంతరం సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్తో జట్టు కట్టిన దినేశ్ కార్తిక్.. ఈ లీగ్లో ఆడనున్న భారత తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.ఆ జట్టులో చేరిన డీకేఇక తాజాగా లెజెండ్స్ లీగ్లోనూ పాల్గొనన్నుట్లు తెలిపాడు. ఈ టీ20 లీగ్లో సదరన్ సూపర్స్టార్స్కు ప్రాతినిథ్యం వహించనున్నట్లు మంగళవారం వెల్లడించాడు. అభిమానుల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నానని.. తనలో ఆడగల సత్తా ఉన్నంత కాలం క్రికెటర్గా కొనసాగుతానని డీకే పేర్కొన్నాడు. మైదానంలో దిగేందుకు శారీరకంగా, మానసికంగా సన్నద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు.కాగా 2004 నుంచి 2022 వరకు టీమిండియాకు ఆడిన దినేశ్ కార్తిక్.. 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లలో భాగమయ్యాడు. టెస్టుల్లో 1025, వన్డేల్లో 1752, టీ20లలో 686 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో 257 మ్యాచ్లు ఆడి 4842 రన్స్ స్కోరు చేశాడు.ఇక శనివారం రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం తాను లెజెండ్స్ లీగ్లో పాల్గొననున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గబ్బర్ సోమవారం ప్రకటించాడు.తాజాగా డీకే సైతం ఇదే బాటలో నడవడం విశేషం. ఈ లీగ్లో ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, క్రిస్ గేల్,ఆరోన్ ఫించ్ తదితర మాజీ క్రికెటర్లు ఇప్పటికే భాగమయ్యారు. కాగా సెప్టెంబరు 29న లెజెండ్స్ లీగ్ వేలం జరుగనుంది. ఇందులో 200కు పైగా ఆటగాళ్లు పాల్గొననున్నారు. చదవండి: టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టు ప్రకటన -
’మిగతా సెలక్టర్లు అతడిని వద్దన్నారు... అయినా నేను వినలేదు’
ఫామ్లో ఉన్న యువ క్రికెటర్లకు అవకాశం ఇస్తేనే వారి సత్తా బయటపడుతుందని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ అన్నాడు. ప్రతిభను గుర్తించడం ఎంత ముఖ్యమో.. సరైన సమయంలో జట్టుకు ఎంపిక చేయడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నాడు. అప్పుడే సెలక్టర్లు తమ పాత్రకు న్యాయం చేసిన వాళ్లవుతారని అభిప్రాయపడ్డాడు.సెహ్వాగ్ను కాదని ధావన్ను ఆడించాశిఖర్ ధావన్ అరంగేట్రం విషయంలో తన అంచనా తప్పలేదని.. తన నిర్ణయం సరైందేనని గబ్బర్ నిరూపించాడని సందీప్ పాటిల్ ఈ సందర్భంగా వెల్లడించాడు. సహచర నలుగురు సెలక్టర్లు వ్యతిరేకించినా.. నాడు వీరేంద్ర సెహ్వాగ్ను కాదని ధావన్ను తుదిజట్టుకు ఎంపిక చేసిన విషయాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు. కాగా 2013లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ వరుసగా తొలి రెండు మ్యాచ్లలో విఫలమయ్యాడు.అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డుఈ క్రమంలో మూడో టెస్టులో వీరూ భాయ్పై వేటు వేసిన సెలక్టర్లు ధావన్కు టెస్టు అరంగేట్రం అవకాశం కల్పించారు. అయితే, వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కేవలం 85 బంతుల్లోనే శతకం బాదాడు. తద్వారా టెస్టు అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆసీస్తో మూడో టెస్టులో మొత్తంగా 174 బంతులు ఎదుర్కొన్న గబ్బర్.. 187 పరుగులతో అదరగొట్టాడు. ఆ తర్వాత టీమిండియాలో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు ఈ మొహాలీ హ్యారికేన్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘యువ క్రికెటర్లు ఫామ్లో ఉన్నపుడే వారికి అవకాశాలు ఇవ్వాలి.నన్ను కాపాడాడుసరైన సమయంలో పిలుపునిస్తేనే వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆ సమయంలో శిఖర్ సౌతాఫ్రికా టూర్లో ఇండియా-ఏ తరఫున డబుల్ సెంచరీ, సెంచరీ బాదాడు. అప్పుడు అతడిని జాతీయ జట్టుకు ఆడించాలని నేను భావించాను. సెహ్వాగ్ను కాదని.. ధావన్ను ఆడించాలనే నా నిర్ణయాన్ని నా సహచర సెలక్టర్లు వ్యతిరేకించారు.అయితే, ఆ తర్వాత వారిని ఒప్పించగలిగాను. అలా శిఖర్ జట్టులోకి వచ్చి తొలి టెస్టులోనే రికార్డు సెంచరీ బాదాడు. నా నిర్ణయం సరైందని నిరూపించాడు. అయినా.. నేనేమీ క్రెడిట్ తీసుకోవాలనుకోలేదు. నిజానికి శిఖర్ శతకం చేసి ఒకరకంగా నన్ను రక్షించాడనుకోండి(నవ్వుతూ)’’ అంటూ గత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాడు. కాగా సందీప్ పాటిల్ టీమిండియా తరఫున 29 టెస్టులు, 45 వన్డేలు ఆడాడు. 2012- 2016 మధ్య బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా పనిచేశాడు. చదవండి: Duleep Trophy: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లపైనే! -
అభిమానులకు శుభవార్త!.. శిఖర్ ధావన్ రీఎంట్రీ
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన క్రికెటింగ్ కెరీర్లో నూతన అధ్యాయాన్ని మొదలుపెట్టనున్నట్లు తెలిపాడు. తాను ఇంకా ఫిట్గానే ఉన్నానని.. ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ)లో భాగం కానున్నట్లు ధావన్ వెల్లడించాడు.వినోదం పంచేందుకు సిద్ధంరిటైర్మెంట్ తర్వాత కూడా తాను ఆటగాడిగా ముందుకు సాగేందుకు దొరికిన గొప్ప అవకాశం ఇది అని పేర్కొన్నాడు. క్రికెట్ తన జీవితంలో భాగమని.. త్వరలోనే తన స్నేహితులతో కలిసి మళ్లీ బ్యాట్ పట్టి మైదానంలో దిగనున్నట్లు తెలిపాడు. తన అభిమానులకు వినోదం పంచేందుకు సిద్ధంగా ఉన్నానని.. వారితో కలిసి కొత్త జ్ఞాపకాలు పోగు చేసుకునేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు గబ్బర్ తెలిపాడు.రిటైర్మెంట్ అనంతరంఇందుకు సంబంధించి శిఖర్ ధావన్ పేరిట ఎల్ఎల్సీ సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా తాను అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ధావన్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. పద్నాలుగేళ్లకు పైగా టీమిండియా క్రికెటర్గా కొనసాగిన ఈ మాజీ ఓపెనర్కు గత రెండేళ్లుగా అవకాశాలు కరువయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ జోడీగా శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ జట్టులో పాతుకుపోగా.. గబ్బర్కు నిరాశే ఎదురైంది.ఈ నేపథ్యంలో 38 ఏళ్ల ధావన్ అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, క్రికెటర్గా మాత్రం తాను కొనసాగుతానని.. అందుకు లెజెండ్స్ లీగ్ రూపంలో కొత్త అవకాశం వచ్చిందని తాజాగా వెల్లడించాడు. కాగా 2010లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 2022లో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. మొత్తంగా టీమిండియా తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 2315, 6793, 1759 పరుగులు సాధించాడు ధావన్.లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆరు జట్లుటీ20 ఫార్మాట్లో నిర్వహిస్తోన్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భిల్వారా కింగ్స్, గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, సదరన్ సూపర్స్టార్స్, అర్బనైజర్స్ హైదరాబాద్ పేరిట ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత మాజీ స్టార్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ కైఫ్, పార్థివ్ పటేల్, శ్రీశాంత్ సహా విదేశీ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, ఉపుల్ తరంగ, డ్వేన్ స్మిత్, మార్టిన్ గప్టిల్ తదితరులు భాగమవుతున్నారు. తాజాగా శిఖర్ ధావన్ కూడా ఈ జాబితాలో చేరాడు. అయితే, అతడు ఏ జట్టుకు ఆడనున్నది తెలియాల్సి ఉంది. సెప్టెంబరులో ఈ లీగ్ ఆరంభం కానుంది. -
థాంక్యూ శిఖర్.. లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించావు: కోహ్లి
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇంటర్ననేషనల్ క్రికెట్తో పాటు దేశీవాళీ క్రికెట్ నుంచి ధావన్ తప్పుకున్నాడు. ఈ క్రమంలో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, గౌతం గంభీర్ వంటి దిగ్గజ క్రికెటర్లు విషెస్ తెలపగా.. తాజాగా ఈ జాబితాలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చేరాడు. ధావన్ను ఉద్దేశించి కోహ్లి ఓ భావోద్వేగ పోస్టును షేర్ చేశాడు. గబ్బర్తో ఉన్న అనుబంధాన్ని అభిమానులతో కింగ్ కోహ్లి పంచుకున్నాడు. "శిఖర్.. నీ ఘనమైన అరంగేట్రం నుంచి టీమిండియా అద్భుతమైన ఓపెనర్లలో ఒకడిగా మారేవరకు మాకు ఎన్నో లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించావు. ఆట పట్ల మీ అభిరుచి, క్రీడాస్ఫూర్తి, నీ చిరునవ్వును మేము కచ్చితంగా మిస్ అవుతాము. కానీ మీ లెగసీ మాత్రం కొనసాగుతుంది. ఎన్నో జ్ఞాపకాలు, మరపురాని ప్రదర్శనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆఫ్ది ఫీల్డ్ మొదలు పెట్టబోయే నీ రెండో ఇన్నింగ్స్కు ఆల్ దిబెస్ట్ అని" ఎక్స్లో కోహ్లి రాసుకొచ్చాడు. కాగా కోహ్లి, ధావన్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ఢిల్లీ తరపున జూనియర్ క్రికెట్ కూడా ఆడారు. కాగా టీమిండియాకు 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20ల్లో ధావన్ ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో 6,793, టెస్టుల్లో 2,315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1,759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు శిఖర్ ధావన్ ఖాతాలో ఉన్నాయి. Shikhar @SDhawan25 from your fearless debut to becoming one of India's most dependable openers, you've given us countless memories to cherish. Your passion for the game, your sportsmanship and your trademark smile will be missed, but your legacy lives on. Thank you for the…— Virat Kohli (@imVkohli) August 25, 2024 -
తొడగొట్టి చెబుతున్నా...
ఓపెనర్గా శిఖర్ ధావన్ భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు అతని ఖాతాలో చేరాయి. ధావన్ కెరీర్లో కొన్ని ఆసక్తికర గణాంకాలను చూస్తే...‘నా క్రికెట్ ప్రయాణాన్ని ముగిస్తున్నాను. లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలు, అభిమానం మూటగట్టుకున్నాను. జీవితంలో ముందుకు వెళ్లాలంటే పేజీలకు తిప్పక తప్పదు. అందుకే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ నుంచి నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఎన్నో ఏళ్లు భారత్ తరఫున ఆడగలిగినందుకు నా హృదయంలో ప్రశాంతత ఉంది. వెనక్కి తిరిగి చూస్తే అన్నీ గుర్తుంచుకునే క్షణాలే. ఆటను దాటి బయటకు చూస్తే అంతా కొత్త ప్రపంచమే. నా జీవితంలో భారత్కు ఆడాలనే ఒకే ఒక లక్ష్యం ఉండేది. అది సాధించగలిగాను. భారత్కు ఇకపై ఆడబోవడం లేదని బాధపడవద్దు. ఇన్నేళ్లు ఆడగలిగానని సంతోంచు అనేది నా మాట. దాని పట్ల గర్వంగా ఉన్నా. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. జై హింద్’ –శిఖర్ ధావన్ 187 తన తొలి టెస్టులో ధావన్ చేసిన పరుగులు. అరంగేట్ర టెస్టులో భారత్ తరఫున ఇదే అత్యధిక స్కోరు కాగా...85 బంతుల్లో సాధించిన శతకం భారత ఆటగాళ్లందరిలో వేగవంతమైంది. 65.15 ఐసీసీ టోరీ్నల్లో (వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ కలిపి) ధావన్ సగటు అందరికంటే అత్యధికం. 20 ఇన్నింగ్స్లలో అతను 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలతో 1238 పరుగులు చేశాడు.18 రోహిత్తో కలిసి నెలకొల్పిన సెంచరీ భాగస్వామ్యాల సంఖ్య. సచిన్–గంగూలీ (21) తర్వాత ఇది రెండో స్థానం.109 తన 100వ వన్డేలో సెంచరీ సాధించిన ధావన్, ఈ ఫీట్ నమోదు చేసిన పది మంది ఆటగాళ్ళలో ఒకడు.12 విదేశాల్లో ధావన్ సెంచరీల సంఖ్య. భారత్లో 5 శతకాలు మాత్రమే అతను సాధించాడు. 6769 ఐపీఎల్లో ధావన్ పరుగులు. ఓవరాల్గా కోహ్లి (8004) తర్వాత రెండో స్థానం. 5 ఐపీఎల్లో ఐదు సీజన్లలో ధావన్ 500కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. వన్డేల్లో కనీసం 40కు పైగా సగటు, 90కి పైగా స్ట్రయిక్ రేట్తో 5 వేలకు పైగా పరుగులను సాధించిన ఎనిమిది మంది బ్యాటర్లలో ధావన్ ఒకడు -
ఓవైపు గాయం.. అయినా 'గబ్బర్' వీరోచిత సెంచరీ(వీడియో)
టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశీవాళీ క్రికెట్కు కూడా గబ్బర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010లో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ధావన్.. చివరగా డిసెంబర్ 2022లో భారత జెర్సీలో కన్పించాడు. యువ క్రికెటర్ల రాకతో పాటు ఫామ్ లేమి కారణంగా గబ్బర్ భారత జట్టులో చోటు కోల్పోయాడు. అయితే గత రెండేళ్లగా టీమిండియాలో ధావన్ ఆడకపోయినప్పటకి.. ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. భారత జట్టుకు ఎన్నో చారిత్రత్మక విజయాలను సైతం శిఖర్ అందించాడు.వన్డే ప్రపంచకప్-2019లో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్ ధావన్ కెరీర్లో చిరస్మరణీయంగా మిగిలిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓ వైపు గాయంతో బాధపడుతూనే ధావన్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. అది కూడా తన పుట్టిన రోజున కావడం విశేషం.పోరాట యోదుడు..2019 వన్డే ప్రపంచకప్లో భాగంగా లీగ్ మ్యాచ్లో డిసెంబర్ 5న ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. అయితే ఈ మ్యాచ్ ఆరంభంలోనే ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ వేసిన ఓ బంతి శిఖర్ ధావన్ బొటన వేలికి బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు.ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటకి నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో అతడి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరుగుతాడని అంతా భావించారు. కానీ ధావన్ మాత్రం తన ఆటను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఓ వైపు గాయంతో బాధపడుతూనే ఆసీస్ బౌలర్లపై గబ్బర్ ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో నొప్పిని భరిస్తూనే అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యంత వేగంగా సెంచరీ సాధించిన తొలి ఆసియా ప్లేయర్గా చరిత్రకెక్కాడు. ఓవరాల్గా ఆ మ్యాచ్లో 109 బంతులు ఎదుర్కొన్న ధావన్.. 16 పరుగులతో 117 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం ధావన్ను స్కానింగ్కు తరలించగా.. బొటన వేలు విరిగినట్లు తేలింది. దీంతో టోర్నీ మధ్యలోనే గబ్బర్ వైదొలగాడు. అతడి స్ధానాన్ని రిషబ్ పంత్తో బీసీసీఐ భర్తీ చేసింది. అయితే 2019 వరల్డ్కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. కాగా ధావన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ అతడి ఐకానిక్ ఇన్నింగ్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 🔸 117 runs from 109 balls🔸 16 foursCelebrating @SDhawan25 on his birthday 🎉Relive his match-winning 💯 against Australia from the 2019 ICC Men's Cricket World Cup 📽️ pic.twitter.com/bJ8phF2RpJ— ICC Cricket World Cup (@cricketworldcup) December 5, 2020 -
అంతర్జాతీయ క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై
-
అంతర్జాతీయ క్రికెట్కు 'గబ్బర్' గుడ్ బై (ఫోటోలు)
-
అరంగేట్రంతోనే వరల్డ్ రికార్డు!
భారత క్రికెట్లో మరో శకం ముగిసింది. టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికాడు. అదే విధంగా దేశవాళీ క్రికెట్ నుంచి కూడా ధావన్ తప్పుకున్నాడు. అతడి నిర్ణయం క్రికెట్ అభిమానులకు షాక్కు గురిచేసింది. 14 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ధావన్.. ఎన్నో అద్భుత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్లో ఎన్నో ఘనతలను కూడా అందుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్గా భారత్కు ఎన్నో అద్భుత ఆరంభాలను ఇచ్చిన ధావన్ క్రికెట్ జర్నీపై ఓ లుక్కేద్దాం.తొలి మ్యాచ్లోనే డకౌట్.. అయినా2010లో వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో ధావన్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే తన తొలి మ్యాచ్లో సిల్వర్ డకౌటై అందరని నిరాశపరిచాడు. కానీ ఆ తర్వాత తన నిలకడ ప్రదర్శనతో ధావన్ జట్టులో తన స్ధానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే వన్డేల్లో తొలి సెంచరీ మార్క్ను అందుకోవడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాపై తన మొదటి వన్డే సెంచరీ మార్క్ను ధావన్ అందుకున్నాడు. ఆ తర్వాత ధావన్ వరుసగా శతకాలు మ్రోత మోగించాడు.టెస్టు అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు..అప్పటికే వన్డేల్లో తన మార్క్ను చూపించిన ధావన్.. మార్చి 14, 2013న మొహాలీలో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు. అయితే తన అరంగేట్రంలోనే గబ్బర్ సత్తాచాటాడు. ఆసీస్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 85 బంతుల్లోనే తన తొలి సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా టెస్టుల్లో తొలి మ్యాచ్లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.ఇక ఈ మ్యాచ్లో ఓవరాల్గా 33 ఫోర్లు, 2 సిక్స్లతో 187 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తన డెబ్యూలో భీబత్సం సృష్టించిన ధావన్ 'మొహాలీ హరికేన్గా పేరు గాంచాడు. ధావన్ డెబ్యూ ఇన్నింగ్స్ను అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుపులు..2013లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడడంలో ధావన్ది కీలక పాత్ర. ఆ టోర్నీ అసాంతం గబ్బర్ మెరుపులు మెరిపించాడు. 5 మ్యాచుల్లోనే గబ్బర్ ఏకంగా 90.75 సగటుతో 363 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు. ఈ టోర్నీలో వరుసగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్పై సెంచరీలతో చెలరేగాడు.చివరి మ్యాచ్ అదే.. భారత స్టార్ ఓపెనర్గా ఒక వెలుగు వెలిగిన ధావన్ నెమ్మదిగా తన ఫామ్ను కోల్పోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. అంతేకాకుండా యువ క్రికెటర్ల రాకతో ధావన్ను సెలక్టర్లు పూర్తిగా పక్కన పెట్టేశారు. ధావన్ చివరగా భారత్ తరుపన 2022లో బంగ్లాదేశ్పై వన్డేల్లో ఆడాడు.ఓవరాల్గా టీమిండియాకు 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20ల్లో గబ్బర్ ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో 6,793, టెస్టుల్లో 2,315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1,759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు శిఖర్ ధావన్ ఖాతాలో ఉన్నాయి.మిస్యూ గబ్బర్..ఇక ధావన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. మిస్యూ గబ్బర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ధావన్ ఇకపై కేవలం ఐపీఎల్లో మాత్రం ఆ -
IPL 2025: ఈ ముగ్గురు కెప్టెన్లను రిలీజ్ చేయనున్న ఫ్రాంఛైజీలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం-2025 నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. పది జట్ల ఫ్రాంఛైజీలు- భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారుల మధ్య జూలై 31 నాటి సమావేశంలో ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఫ్రాంఛైజీ యజమానుల్లో అధికులు ఆరుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరగా.. బీసీసీఐ ఇందుకు సానుకూలంగా స్పందించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు ఫ్రాంఛైజీలు మాత్రం తమ కెప్టెన్లను విడిచిపెట్టి.. వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోవాలనే యోచనలో ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది.ఆర్సీబీఐపీఎల్-2025 నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తమ సారథిని మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. వేలానికి ముందు ఫాఫ్ డుప్లెసిస్ను విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 36 ఏళ్ల డుప్లెసిస్ ఐపీఎల్-2024లో 438 పరుగులు చేయడంతో పాటు.. జట్టును ప్లే ఆఫ్స్ వరకు చేర్చగలిగాడు.అయితే, డుప్లెసిస్ వయసు రీత్యా కెప్టెన్గా అతడిని కొనసాగించేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని.. యువ టీమిండియా ఆటగాడిని సారథిగా నియమించుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.పంజాబ్ కింగ్స్ఐపీఎల్ టాప్ రన్ స్కోర్లలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఒకడు. అయితే, పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉన్న అతడు గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2024లో ఆరంభ మ్యాచ్ల తర్వాత గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు.ధావన్ స్థానంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ పంజాబ్ కింగ్స్ను ముందుకు నడిపించాడు. అయితే, ప్లే ఆఫ్స్మాత్రం చేర్చలేకపోయాడు. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కూడా ఉందన్న విషయం తెలిసిందే.ఇందుకు ప్రధాన కారణం సరైన నాయకుడు లేకపోవడమే. ఇక ధావన్ ఇప్పటికే జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అంతేకాదు దేశవాళీ క్రికెట్లోనూ ఆడటం లేదు. అలాంటి ఆటగాడిని సారథిగా కొనసాగించడంలో అర్థం లేదని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 38 ఏళ్ల ధావన్ను కెప్టెన్గా తప్పించి.. అతడి స్థానంలో యువ నాయకుడిని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.లక్నో సూపర్ జెయింట్స్ఐపీఎల్లో 2022లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్కు మూడేళ్లుగా టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. 2022, 2023 సీజన్లలో లక్నోను టాప్-4లో నిలబెట్టిన రాహుల్.. 2024లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆటగాడినూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. పద్నాలుగు మ్యాచ్లలో కలిపి 520 పరుగులు చేసినప్పటికీ.. స్ట్రైక్రేటు(136.12) పరంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ సందర్భంగా ఓనర్ సంజీవ్ గోయెంకా రాహుల్పై బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంతా బాగానే ఉందని సంజీవ్ గోయెంకా సంకేతాలు ఇచ్చినా.. రాహుల్ మాత్రం బాగా హర్టయినట్లు సమాచారం. జట్టును వీడాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఫ్రాంఛైజీ సైతం రాహుల్ను రిలీజ్ చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2025: గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం.. ఆశిష్ నెహ్రాపై వేటు! -
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఐపీఎల్-2024లోనూ పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది పంజాబ్ కింగ్స్. ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఈ జట్టు.. ఈసారి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచింది.కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం బారిన పడటం.. కొన్ని మ్యాచ్లలో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడం ప్రభావం చూపింది. ధావన్ స్థానంలో తాత్కాలికంగా కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన సామ్ కరన్ ఫర్వాలేదనిపించినా.. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్లలో పంజాబ్ కేవలం నాలుగే గెలిచింది.ఇంకో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో గెలిస్తే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ కోచ్ టామ్ మూడీ విమర్శనాస్త్రాలు సంధించాడు.‘‘మైదానం లోపలా.. వెలుపలా నాయకత్వ మార్పులే వాళ్ల పేలవ ప్రదర్శనకు కారణం. అదే నిలకడలేమి కూడా ఓ కారణం. మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే మైదానంలోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయి’’ అని టామ్ మూడీ పంజాబ్ కింగ్స్ను విమర్శించాడు.కాగా 58 ఏళ్ల టామ్ మూడీ 2008లో పంజాబ్ కోచ్గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో ఆ ఏడాది జట్టు సెమీస్ వరకు చేరింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన కనబరచడంలో విఫలమవుతోంది. ఇక పంజాబ్ను వీడిన తర్వాత 2013- 2019 వరకు సన్రైజర్స్ హైదరాబాద్కు కోచ్గా ఉన్నాడు. 2016లో జట్టుకు టైటిల్ అందించాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరింది. చదవండి: IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా -
కొడుకు దూరం.. టీమిండియాలో చోటు కరువు.. ఐపీఎల్లోనూ అలా!
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. భార్య ఆయేషా ముఖర్జీ నుంచి విడాకులు తీసుకున్న ధావన్ కొడుకు జొరావర్కు కూడా దూరమయ్యాడు.జొరావర్ ప్రస్తుతం తన తల్లి దగ్గరే ఆస్ట్రేలియాలో ఉంటున్న కారణంగా ధావన్ కనీసం అతడిని నేరుగా కలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కుమారుడిని తలచుకుంటూ ధావన్ భావోద్వేగ పోస్టులు పెడుతూ ఉన్నాడు. మరోవైపు.. టీమిండియాలోనూ ధావన్కు చోటు కరువైంది.యువ ఓపెనర్లు శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్లతో పోటీలో వెనుకబడ్డ ధావన్.. 2022లో ఆఖరిసారిగా బంగ్లాదేశ్తో సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున వన్డే ఆడాడు.ఆ తర్వాత మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు శిఖర్ ధావన్. ఆ తర్వాత ఆసియా క్రీడలు- 2023 జట్టులో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు ధావన్ సారథ్యం వహిస్తాడని విశ్లేషకులు భావించగా.. బీసీసీఐ మాత్రం మరోసారి ఈ ఢిల్లీ బ్యాటర్కు మొండిచేయి చూపింది.ఈ మెగా టోర్నీలో తొలిసారి పాల్గొనే టీమిండియాకు రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. అతడి నేతృత్వంలో భారత్ స్వర్ణం సాధించింది. ఇదిలా ఉంటే.. అసలే కొడుకుకు దూరమై.. టీమిండియాలో చోటు కరువైన శిఖర్ ధావన్కు ఐపీఎల్-2024లోనూ కష్టాలే ఎదురయ్యాయి.పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా బరిలోకి దిగిన శిఖర్ ధావన్ తొలి ఐదు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండగలిగాడు. భుజం నొప్పి కారణంగా మిగతా మ్యాచ్లకు గబ్బర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ పంజాబ్ను ముందుకు నడిపించాడు.అయితే, ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్లో 60 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.ఇదిలా ఉంటే.. గబ్బర్ శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. తన పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘జీవితంలోని చిన్న సంతోషాలు ఇలా వీటితో కలిసి ఆస్వాదిస్తున్నాను’’ అంటూ ధావన్ క్యాప్షన్ ఇచ్చాడు.ఇది చూసిన గబ్బర్ అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘పైకి నవ్వుతున్నా.. నీ మనసు లోతుల్లో ఎంత బాధ ఉందో అర్థం చేసుకోగలం’’ అంటూ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్లో ధావన్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల గురించి కామెంట్లు చేస్తున్నారు. -
IPL 2024: కేకేఆర్ను ఢీకొట్టనున్న పంజాబ్.. స్టార్క్ ఔట్, ధవన్ ఇన్..?
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 26) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. టేబుల్ సెకెండ్ టాపర్ అయిన కేకేఆర్ను వారి సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్లో ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ పంజాబ్కు చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్ లెక్కల్లో ఉంటుంది.లేకపోతే మరో సీజన్లో టైటిల్ లేకుండా రిక్త హస్తాలతో వైదొలగాల్సి ఉంటుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు కేకేఆర్ ఏడింట ఐదు మ్యాచ్లు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో కేకేఆర్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ మూడో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. పంజాబ్పై కేకేఆర్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి.బలాబలాల విషయానికొస్తే.. పంజాబ్తో పోలిస్తే కేకేఆర్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పెట్టి సొంతం చేసుకున్న మిచెల్ స్టార్క్ మినహా కేకేఆర్కు పెద్ద సమస్యలేమీ లేవు. స్టార్క్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లో తేలిపోయాడు. వికెట్లు తీయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. నరైన్, రసెల్తో పాటు కుర్ర బౌలర్లు రాణిస్తుండటంతో స్టార్క్ వైఫల్యాలు హైలైట్ కావడం లేదు.పంజాబ్తో నేటి మ్యాచ్లో స్టార్క్ పక్కకు కూర్చోవాల్సి రావచ్చు. అతను ఆర్సీబీ గత మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు (వేలికి). స్టార్క్ గత రెండు రోజులుగా ప్రాక్టీస్ సెషన్స్లోనూ కనబడలేదు. దీన్ని బట్టి చూస్తే.. పంజాబ్తో మ్యాచ్లో అతను ఆడకపోవచ్చని తెలుస్తుంది.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు మిడిలార్డర్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మపై అందరి చూపు ఉంది. ఈ సీజన్లో ఈ ఇద్దరు అద్భుతమైన పోరాటాలతో పంజాబ్ ఆడిన ప్రతి మ్యాచ్ను రక్తి కట్టించారు. వీరిద్దరి నుంచి అభిమానులు మరోసారి సంచలన ఇన్నింగ్స్లు ఆశిస్తున్నారు. వీరిద్దరు మినహా ఈ సీజన్లో పంజాబ్కు చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. ఈ మ్యాచ్లో పంజాబ్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధవన్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరంగా శిఖర్ తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్స్లో యాక్టివ్గా కనిపించాడు. దీన్ని బట్టి అతని రీఎంట్రీ ఖాయమని తేలిపోయింది. నేటి మ్యాచ్లో స్టార్క్ ఆడకపోతే అతడి స్థానంలో దుష్మంత చమీర ఆడే అవకాశం ఉంది. తుది జట్లు (అంచనా)..కేకేఆర్: ఫిల్ సాల్ట్ (వికెట్కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్/దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ. [ఇంపాక్ట్ ప్లేయర్: వెంకటేష్ అయ్యర్]పంజాబ్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రన్ సింగ్, సామ్ కర్రన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), లియామ్ లివింగ్స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్. [ఇంపాక్ట్ ప్లేయర్: అర్ష్దీప్ సింగ్] -
IPL 2024: పంజాబ్ కింగ్స్కు భారీ ఎదురుదెబ్బ
వరుసగా రెండు మ్యాచ్ల్లో చివరి ఓవర్లో ఓటములు ఎదుర్కొన్న పంజాబ్ కింగ్స్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్కు దూరం కానున్నాడు. ధవన్ పంజాబ్ తదుపరి ఆడబోయే ఒకట్రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండడని ఆ జట్టు క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ సంజయ్ బాంగర్ తెలిపాడు. రాజస్తాన్ రాయల్స్తో నిన్నటి (ఏప్రిల్ 13) మ్యాచ్కు ముందు చివరి నిమిషంలో ధవన్ డ్రాప్ అయ్యాడు. ధవన్ ఏప్రిల్ 26న కేకేఆర్తో మ్యాచ్ సమయానికి అందుబాటులోకి వస్తాడని తెలుస్తుంది. ఈ మధ్యలో పంజాబ్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీలతో కీలక మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్లకు ధవన్ దూరం కావడం పంజాబ్కు భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ధవన్ గైర్హాజరీలో పంజాబ్ను సామ్ కర్రన్ ముందుండి నడిపించనున్నాడు. రాయల్స్తో మ్యాచ్, గత ఐపీఎల్ సీజన్లోనూ కర్రన్ పంజాబ్ కెప్టెన్గా వ్యవహరించాడు. కాగా, రాయల్స్తో నిన్నటి మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో చివరి ఓవర్ ఐదో బంతికి సిక్సర్ కొట్టి హెట్మైర్ (10 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) రాయల్స్ను గెలిపించాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో హెట్మైర్ మరో సిక్సర్ కూడా బాదాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఆఖర్లో అశుతోష్ శర్మ (16 బంతుల్లో 31; ఫోర్, 3 సిక్సర్లు) బ్యాట్ను ఝులిపించడంతో పంజాబ్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. రాయల్స్ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో రాయల్స్ కూడా తడబడింది. అయితే హెట్మైర్ మెరుపులు మెరిపించి రాయల్స్ను గెలిపించాడు. రాయల్స్ ఇన్నింగ్స్లో కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు లేవు. 39 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ (4-0-18-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. -
ఆ ఇద్దరితో రూమ్ అస్సలు షేర్ చేసుకోను: రోహిత్ శర్మ
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కపిల్.. హిట్మ్యాన్, శ్రేయస్లను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. వీటికి రోహిత్, శ్రేయస్ తమదైన శైలిలో బదులిచ్చారు. ఈ సందర్భంగా రోహిత్, శ్రేయస్ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఆ ఇద్దరు పరమ గలీజ్గాళ్లు.. షో సందర్భంగా కపిల్ హిట్మ్యాన్తో సంభాషిస్తూ ఓ ఆసక్తికర ప్రశ్నను అడిగాడు. రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఎవరితో కలసి షేర్ చేసుకుంటారని రోహిత్ను అడిగాడు. ఇందుకు రోహిత్ బదులిస్తూ.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గది కేటాయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తే శిఖర్ ధవన్, రిషబ్ పంత్లతో మాత్రం అస్సలు ఉండనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఆ ఇద్దరు గదిని చాలా మురికిగా ఉంచుతారు. ప్రాక్టీస్ నుంచి వచ్చాక బట్టలను మంచంపైనే పడేస్తారు. వారి గది తలపుపై ఎప్పుడూ డు నాట్ డిస్టర్బ్ (DOD) అనే బోర్డు దర్శనమిస్తుంది. ఈ ఇద్దరు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పడుకుంటారు. ఉదయమే రూమ్ క్లీనింగ్కు వచ్చే వాళ్లు DOD బోర్డును చూసి వెనక్కు వెళ్లిపోతారు. మూడు నాలుగు రోజుల వరకు వాళ్ల రూమ్ చండాలంగా ఉంటుంది. ఈ కారణంగా వీళ్లతో రూమ్ షేర్ చేసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. నేను కూడా వారితో ఉండాలని అస్సలు అనుకోనంటూ హిట్మ్యాన్ బదులిచ్చాడు. ఇదే సందర్భంగా రోహిత్ మరిన్ని విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఓటమి అనంతరం అభిమానుల కోపానికి గురవుతానని భయపడ్డానని తెలిపాడు. కానీ ప్రజలు తమను బాగా ఆడామని ప్రశంసించడంతో ఊపిరి పీల్చుకున్నామని అన్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ (మధ్యాహ్నం 3:30).. లక్నో-గుజరాత్ (రాత్రి 7:30) తలపడుతున్నాయి. -
IPL 2024 GT vs PBKS : గుజరాత్పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం..
IPL 2024 GT vs PBKS Live Updates: గుజరాత్పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం.. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. పంజాబ్ విజయంలో శశాంక్ సింగ్(61) కీలక పాత్ర పోషించాడు. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 73 పరుగులకే 4 వికెట్లు పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటి అతడు మాత్రం తన హిట్టింగ్ను కొనసాగించి పంజాబ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శశాంక్ 6 ఫోర్లు, 4 సిక్స్లతో 61 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ఆశుతోష్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్తో 31 పరుగులు చేసి పంజాబ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఫలితంగా 200 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి పంజాబ్ ఛేదించింది. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, మొహిత్ శర్మ, నల్కండే తలా వికెట్ సాధించారు. 19 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 193/6 19 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 193/6. క్రీజులో శశాంక్ సింగ్(57), అశుతోష్ శర్మ(31) పరుగులతో ఉన్నారు. పంజాబ్ విజయానికి ఆఖరి ఓవర్లో 7 పరుగులు కావాలి. ఆరో వికెట్ డౌన్.. జితేష్ శర్మ ఔట్ 150 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన జితేష్ శర్మ.. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 15. 3 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 150/6. క్రీజులో శశాంక్ సింగ్(33) పరుగులతో ఉన్నారు. ఐదో వికెట్ డౌన్.. 111 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన సికిందర్ రజా.. మొహిత్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 119/5. క్రీజులో శశాంక్ సింగ్(33), జితేష్ శర్మ(1) ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్.. సామ్ కుర్రాన్ ఔట్ 71 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. ఒమర్జాయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. మూడో వికెట్ డౌన్.. ప్రభు సిమ్రాన్ ఔట్ ప్రభు సిమ్రాన్ సింగ్ రూపంలో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 35 పరులు చేసిన ప్రభు సిమ్రాన్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 7.2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 65/3. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్.. బెయిర్ స్టో ఔట్ పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. నూర ఆహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. సామ్ కుర్రాన్ క్రీజులోకి వచ్చాడు. 6 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 54/2. క్రీజులో ప్రభ్ సిమ్రాన్ సింగ్(29), సామ్ కుర్రాన్(1) పరుగులతో ఉన్నారు. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ 200 పరుగులు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రాహుల్ తెవాటియా ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. కేవలం 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 23 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు పడగొట్టగా.. హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. నాలుగో వికెట్ డౌన్.. 164 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన విజయ్ శంకర్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్: 166/4 శుబ్మన్ గిల్ ఫిప్టీ.. శుబ్మన్ గిల్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 31 బంతుల్లో గిల్ 5 ఫోర్లు, 2 సిక్స్లతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 134/3 మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్.. సాయి సుదర్శన్ ఔట్ 123 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన సాయి సుదర్శన్.. హర్షల్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో శుబ్మన్ గిల్(46) ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. కేన్ మామ ఔట్ 69 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్.. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్ల్లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్ : 52/1 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్(16), శుబ్మన్ గిల్(19) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వృద్దిమాన్ సాహా.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఓవర్లకు గుజరాత్ స్కోర్: 29/0 2 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 18/0 టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ రెండు ఓవర్లు ముగిసే వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(8), వృద్దిమాన్ సాహా(6) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. గుజరాత్ జట్టులోకి కేన్ విలియమ్సన్ రాగా.. పంజాబ్ జట్టులోకి సికిందర్ రజా వచ్చాడు. తుది జట్లు పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్) జానీ బెయిర్స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ప్రభ్సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్దీప్ సింగ్ గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే -
IPL RCB Vs PBKS Highlights Photos: పంజాబ్ కింగ్స్పై బెంగళూరు విజయం (ఫొటోలు)
-
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. ఇందులోనైనా ఆర్సీబీ గెలుస్తుందా..?
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 25) పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఆర్సీబీ భావిస్తుండగా.. పంజాబ్ సీజన్లో వరుసగా రెండో విజయంపై కన్నేసింది. ఆర్సీబీ సీజన్ తొలి మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓటమిపాలు కాగా.. పంజాబ్ తమ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ఆయా జట్ల ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం.. ఆర్సీబీ కంటే పంజాబ్ అన్ని విభాగాల్లో మెరుగ్గా కనిపించింది. ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పేపర్పై బలంగా కనిపించినప్పటికీ తొలి మ్యాచ్లో స్టార్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. 8 ఫోర్లు బాది డుప్లెసిస్ (35) ప్రమాదకరంగా కనిపించినప్పటికీ.. ఆ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ముస్తాఫిజుర్ అతన్ని పెవిలియన్కు పంపాడు. విరాట్ విషయానికొస్తే.. ఆ మ్యాచ్లో అతని బ్యాటింగ్ నత్త నడకను తలపించింది. అతను 20 బంతులను ఎదుర్కొని కేవలం 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రజత్ పాటిదార్, మ్యాక్స్వెల్ డకౌటై దారుణంగా నిరాశపర్చగా.. కోట్లు పెట్టి అరువు తెచ్చుకున్న కెమారూన్ గ్రీన్ తుస్సుమనిపించాడు. వికెట్కీపర్లు అనూజ్ రావత్ (48), దినేశ్ కార్తీక్ (38 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడకపోయుంటే ఆర్సీబీ 100 పరుగులు చేయడం కూడా కష్టంగా ఉండేది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు కూడా తేలిపోయారు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. అల్జరీ జోసఫ్, కర్ణ్ శర్మ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మయాంక్ డాగర్ కాస్త పర్వాలేదనిపించగా.. గ్రీన్ 2 వికెట్లు తీసి నాట్ బ్యాడ్ అనిపించాడు. పంజాబ్తో ఇవాల్టి మ్యాచ్లో ఆర్సీబీ అదనపు పేసర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. కర్ణ శర్మ స్థానంలో ఆకాశదీప్ తుది జట్టులోకి రావచ్చు. పంజాబ్ విషయానికొస్తే.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చి విజయం సొంతం చేసుకుంది. అర్ష్దీప్ సింగ్, రబాడ, రాహుల్ చాహర్ తమ కోటా ఓవర్లు పూర్తి చేసి పర్వాలేదనిపించగా.. హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. హర్ప్రీత్ బ్రార్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్లో సత్తా చాటిన సామ్ కర్రన్ ఒకే ఓవర్ బౌల్ చేశాడు. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు పర్వాలేదనిపించారు. కర్రన్ (63) అర్దసెంచరీతో రాణించగా.. లివింగ్స్టోన్ (38 నాటౌట్), శిఖర్ ధవన్ (22), ప్రభ్సిమ్రన్ సింగ్ నాట్ బ్యాడ్ అనిపించారు. ఆర్సీబీతో ఇవాల్టి మ్యాచ్ పంజాబ్ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఢిల్లీతో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. ఆర్సీబీ తుది జట్టు (అంచనా): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్కీపర్), అల్జరీ జోసెఫ్, ఆకాశ్దీప్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్ పంజాబ్ తుది జట్టు (అంచనా): శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ -
PBKS Vs DC Photos: ఢిల్లీపై పంజాబ్ ఘన విజయం (ఫొటోలు)
-
PBKS vs DC: బోణీ కొట్టిన పంజాబ్.. ఢిల్లీపై ఘన విజయం
IPL 2024 PBKS vs DC- Updates: బోణీ కొట్టిన పంజాబ్.. ఢిల్లీపై ఘన విజయం ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. చంఢీఘర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. కేవలం 6 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో సామ్ కుర్రాన్(63) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. లివింగ్ స్టోన్(38) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఖాలీల్ అహ్మద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. షాయీ హోప్ 33 పరుగులతో ఢిల్లీ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ►100 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జితేష్ శర్మ.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. మూడో వికెట్ డౌన్.. 84 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన ప్రభు సిమ్రాన్ సింగ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి జితేష్ శర్మ వచ్చాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఒకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్లో శిఖర్ ధావన్(22) బౌల్డ్ కాగా.. బెయిర్ స్టో(9) రనౌటయ్యాడు. 5 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 53/2. క్రీజులో ప్రభ్ సిమ్రాన్ సింగ్(16), సామ్ కుర్రాన్(3) పరుగులతో ఉన్నారు. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఆహ్వానం మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. షాయీ హోప్ 33 పరుగులతో ఢిల్లీ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలవగా.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అభిషేక్ పోరెల్ మెరుపులు మెరిపించాడు. కేవలం 10 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో 32 పరుగులతో 21 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ కారణంగా ఢిల్లీ ఈ మేరకు స్కోరు చేయగలిగింది. తొమ్మిదో వికెట్ డౌన్ 19.6: హర్షల్ పటేల్ బౌలింగ్లో అభిషేక్తో సమన్వయలోపంతో కుల్దీప్ యాదవ్(1) రనౌట్ 18.3: ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ అర్ష్దీప్ బౌలింగ్లో సుమిత్ కుమార్(2) వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఫలితంగా ఢిల్లీ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 149-8(19) 17.1: ఏడో వికెట్ డౌన్ అక్షర్ పటేల్(21) రనౌట్ కావడంతో ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. అభిషేక్ పోరెల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 138/7 (17.1) 15.4: ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ రాహుల్ చహర్ బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్(5) శశాంక్ సింగ్కు క్యాచ్ ఇచ్చాడు. సుమిత్ కుమార్క్రీజులోకి వచ్చాడు. అక్షర్ 12 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 128-6(16) 13.2: ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో రికీ భుయ్(3) ఐదో వికెట్గా వెనుదిరిగాడు. స్కోరు: 117-5(14). అక్షర్ ఐదు, స్టబ్స్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. 12.4: నాలుగో వికెట్ డౌన్ దాదాపు ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పంత్ హర్షల్ పటేల్ బౌలింగ్లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 13 బంతుల్లో 18 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఫలితంగా ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోగా ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 111-4 (13) మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ షాయీ హోప్(33) మూడో వికెట్గా పెవిలియన్ చేరాడు. కగిసో రబడ బౌలింగ్లో హర్ప్రీత్ బ్రార్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అతడి స్థానంలో రికీ భుయ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 95-3(11). పంత్ నాలుగు పరుగులతో క్రీజులో ఉన్నాడు. పది ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు: 86-2 షాయీ హోప్ 26, పంత్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. క్రీజులోకి పంత్ 7.6: హర్షల్ పటేల్ బౌలింగ్లో వార్నర్(29) అవుట్. పంత్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 74-2(8) పవర్ ప్లేలో స్కోరు? ఓపెనర్ వార్నర్ దంచి కొడుతున్నాడు. పవర్ ప్లే ముగిసే సరికి అతడు 14 బంతుల్లో 22 రన్స్, హోప్ 10 బంతుల్లో 4 పరుగులు చేశాడు. స్కోరు: 54-1(6 ఓవర్లలో). 3.2: తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ అర్ష్దీప్ బౌలింగ్లో మిచెల్ మార్ష్ తొలి వికెట్(20(12)గా వెనుదిరిగాడు. షాయీ హోప్ క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్లుగా వార్నర్, మార్ష్ ఢిల్లీ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి ఓవర్ ముగిసే సరికి స్కోరు: 10-0 రిషభ్ పంత్ రీఎంట్రీ ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో రెండో మ్యాచ్కు రంగం సిద్ధమైంది. చండీగఢ్లో కొత్తగా నిర్మించిన ముల్లన్పూర్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. టాస్ గెలిచిన ఆతిథ్య పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. డిసెంబరు 2022లో ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్రగాయాలపాలైన రిషబ్ పంత్ ఈ మ్యాచ్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఢిల్లీ కెప్టెన్గా, వికెట్ కీపర్గా తన బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మరోవైపు.. పంజాబ్ శిఖర్ ధావన్ నేతృత్వంలో బరిలోకి దిగనుంది. ఇక ఇరుజట్లు గత సీజన్లో దారుణంగా విఫలమయ్యాయి. పంజాబ్ కింగ్స్ పద్నాలుగింట కేవలం ఆరు గెలిచి ఎనిమిదో స్థానంలో.. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచాయి. తాజా ఎడిషన్ను గెలుపుతో ఆరంభించాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షాయ్ హోప్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/ కెప్టెన్), రికీ భుయ్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ. పంజాబ్ కింగ్స్ శిఖర్ ధావన్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో, సామ్ కరన్, లియామ్ లివింగ్స్టోన్, జితేశ్ శర్మ( వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్. చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీకిది తగునా కోహ్లి? -
విధ్వంసం సృష్టించిన శిఖర్ ధవన్.. ఐపీఎల్కు ముందు ప్రత్యర్దులు హడల్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఫామ్లోకి వచ్చాడు. డీవై పాటిల్ టీ20 టోర్నీలో డీవై పాటిల్ బ్లూ జట్టుకు ఆడుతున్న గబ్బర్.. సీఏజీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన శిఖర్ కేవలం 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా డీవై పాటిల్ బ్లూ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గబ్బర్ తాజా ప్రదర్శనతో ఐపీఎల్ జట్లు హడలిపోతున్నాయి. ధవన్ ఇదే భీకర్ ఫామ్ను కొనసాగిస్తే తిప్పలు తప్పవని మదనపడుతున్నాయి. బ్లూ జట్టులో గబ్బర్ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. ఓపెనర్ అభిజిత్ తోమర్ (20 బంతుల్లో 31 పరుగులు), అయాజ్ ఖాన్ (9 బంతుల్లో 16), పరిక్షిత్ (6 బంతుల్లో 11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సీఏజీ బౌలర్లలో సన్వీర్ సింగ్, రిత్విక్ చటర్జీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రధాన్, అంకిత్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన సీఏజీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వరుణ్ లవండే (70) అర్దసెంచరీతో రాణించగా.. సన్వీర్ సింగ్ (48 నాటౌట్), ఆబిద్ ముస్తాక్ (17 నాటౌట్) సీఏజీని విజయతీరాలకు చేర్చారు. సీఏజీలో సంజయ్ 11, సేనాపతి 4, సచిన్ బేబీ 20 పరుగులు చేశారు. బ్లూ బౌలర్లలో విపుల్ కృష్ణన్ 2, కర్ష్ కొఠారి ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో సీఏజీ సెమీఫైనల్కు చేరుకుంది. ఇవాళే జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో ఇండియన్ అయిల్ జట్టు టాటా స్పోర్ట్స్ క్లబ్పై గెలుపొంది సెమీస్కు చేరింది. ఈ టోర్నీలో మరో రెండు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఇవాళే జరుగనున్నాయి. -
శిఖర్ ధావన్ విధ్వంసం.. చెలరేగిన దినేష్ కార్తీక్
డివై పాటిల్ టీ20 కప్-2024లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి చెలరేగాడు. ఈ టోర్నీలో డివై పాటిల్ బ్లూ జట్టుకు ధావన్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్బీఐతో జరిగిన మ్యాచ్లో ధావన్ సత్తాచాటాడు. డివై పాటిల్ బ్లూ జట్టు విజయంలో గబ్బర్ కీలక పాత్ర పోషించాడు. 9 వికెట్ల తేడాతో ఆర్సీఐని బ్లూ జట్టు చిత్తు చేసింది. 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన డివై పాటిల్ బ్లూ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్గా బరిలోకి దిగిన ధావన్ కేవలం 29 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 45 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్బీఐ జట్టు కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ఆర్బీఐ బ్యాటర్లలో ప్రణయ్ శర్మ(33) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. పాటిల్ బ్లూ జట్టులో పరీక్షిత్ వల్సంకర్ 4 వికెట్లతో సత్తాచాటగా.. కొథారీ 3 వికెట్లు పడగొట్టాడు. -
రీ ఎంట్రీలో చెలరేగిన శిఖర్ ధావన్.. అయినా పాపం! ఒకే ఒక్క పరుగు
టీమిండియా వెటరన్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖన్ ధావన్ ఏడాది తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. డివై పాటిల్ టీ20 కప్లో డివై పాటిల్ బ్లూ జట్టుకు ధావన్ ప్రాతినిథ్యం వహించాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం పూణే వేదికగా టాటా స్పోర్ట్స్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో ధావన్ సత్తాచాటాడు. ఈ మ్యాచ్లో ధావన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లుతో 39 పరుగులు చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ ధావన్ ఇన్నింగ్స్ వృథాగా మిగిలిపోయింది. ఈ మ్యాచ్లో డివై పాటిల్ బ్లూ జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టాటా స్పోర్ట్స్ క్లబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. టాటా బ్యాటర్లలో అపూర్వ వాంఖడే(83) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. డివై పాటిల్ బ్లూ బౌలర్లలో కెప్టెన్ విపుల్ కృష్ణణ్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డివై పాటిల్ బ్లూ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీంతో తమ విజయానికి కేవలం ఒక్కపరుగు దూరంలో డివై పాటిల్ బ్లూ జట్టు నిలిచిపోయింది. చదవండి: Babar Azam AFG Captain Photo Viral: అఫ్గానిస్తాన్ కెప్టెన్గా బాబర్ ఆజం..!? -
BCCI Central Contracts: ఆ నలుగురి ఖేల్ ఖతమైనట్లేనా..?
2023-24 సంవత్సరానికి గాను బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్ చతేశ్వర్ పుజారా, శిఖర్ ధవన్, ఉమేశ్ యాదవ్ చోటు కోల్పోయారు. వీరిలో పుజారా ఒక్కడు దేశవాలీ, ఇతరత్రా టోర్నీల్లో యాక్టివ్గా ఉంటూ మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉమేశ్ దేశవాలీ క్రికెట్లో అడపాదడపా దర్శనమిస్తున్నాడు. శిఖర్ అయితే మొత్తానికే క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. కేవలం ఐపీఎల్ కోసమే అతను గేమ్లో కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు మరో వెటరన్ అజింక్య రహానేను కూడా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో పరిగణలోకి తీసుకోలేదు. రహానే రంజీల్లో పూర్తి స్థాయిలో ఆడుతున్నప్పటికీ.. అతని నుంచి చొప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా లేదు. దీంతో చేసేదేమీ లేక బీసీసీఐ అతన్ని పక్కకు పెట్టి ఉంటుంది. ఈ నలుగురిలో ఒక్క పుజారా మినహా మిగతా ముగ్గురి విషయంలో బీసీసీఐ కరెక్ట్గానే వ్యవహరించిందనుకోవచ్చు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోతే వీరి కెరీర్లు ఖతమైనట్లేనా..? ఈ నలుగురు తిరిగి పుంజుకుని టీమిండియాలో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉందా..? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు నో అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే టీమిండియాలో ఈ నలుగురి పాత్రలకు న్యాయం చేస్తున్న వారి సంఖ్య చాంతాండంత ఉంది. వీరి భవితవ్యం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. పై పేర్కొన్న నలుగురితో పాటు సరైన అవకాశాలు రాని చహల్, దీపక్ హుడాలపై కూడా బీసీసీఐ వేటు వేసింది తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, సిరాజ్లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. ఇటీవలికాలంలో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, ప్రసిద్ద్ కృష్ణ , అవేశ్ ఖాన్ , రజత్ పాటిదార్ , జితేశ్ శర్మ , ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్లకు కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. -
అత్యంత అరుదైన ఘనత సాధించిన టీమిండియా బ్యాటర్
అండర్-19 వరల్డ్కప్లో సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తూ, పరుగుల వరద పారిస్తున్న యంగ్ ఇండియా బ్యాటర్ ముషీర్ ఖాన్.. న్యూజిలాండ్తో నిన్న జరిగిన మ్యాచ్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్కప్లో ఇప్పటికే ఓ సెంచరీతో (ఐర్లాండ్పై 106 బంతుల్లో 118 పరుగులు) చెలరేగిన ముషీర్.. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మరో సెంచరీతో (126 బంతుల్లో 131 పరుగులు) విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో ముషీర్ సింగిల్ వరల్డ్కప్ ఎడిషన్లో ఒకటికంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ముషీర్కు ముందు టీమిండియా తరఫున సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ మాత్రమే సింగిల్ వరల్డ్కప్ ఎడిషన్లో రెండు సెంచరీలు చేశాడు. తాజా ప్రదర్శనతో ముషీర్.. శిఖర్ సరసన నిలిచాడు. న్యూజిలాండ్పై సెంచరీతో ముషీర్ మరో ఘనతను కూడా సాధించాడు. ముషీర్.. ప్రస్తుత వరల్డ్కప్లో లీడింగ్ రన్ స్కోరర్గా అవతరించాడు. ముషీర్ ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ (యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు) సాయంతో 325 పరుగులు చేశాడు. అన్న అడుగుజాడల్లో.. ఇటీవలే టీమిండియాకు ఎంపికైన ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్కు సొంత తమ్ముడైన ముషీర్ అన్న అడుగుజాడల్లో నడుస్తున్నాడు. 2016 అండర్-19 వరల్డ్కప్లో సర్ఫరాజ్ కూడా లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. వరుస సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్న ముషీర్.. తర్వలో టీమిండియా తలుపులు కూడా తట్టే అవకాశం ఉంది. తాజా ప్రదర్శనలతో ముషీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని సైతం ఆకర్శించాడు. 2024 సీజన్ వేలంలో అన్ సోల్డ్గా మిగిలిపోయిన ముషీర్ను అవకాశం ఉంటే పంచన చేర్చుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన 18 ఏళ్ల ముషీర్.. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేసిన ముషీర్.. ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడి కేవలం 96 పరుగలు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో నిన్న జరిగిన గ్రూప్-1 సూపర్ సిక్స్ మ్యాచ్లో యువ భారత్ 214 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఫిబ్రవరి 2న ఆడనుంది. ఆ మ్యాచ్లో భారత్.. నేపాల్తో తలపడుతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్న భారత్.. సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. -
ఆ జట్టులోనూ నా పేరు లేదు.. షాకయ్యాను! అందుకే: ధావన్
"ఆ జట్టులో నా పేరు లేకపోవడంతో షాక్కు గురయ్యాను. కానీ అంతలోనే మనసుకు సర్దిచెప్పుకొన్నాను. వాళ్ల ఆలోచనా విధానం మరోలా ఉందేమో అని నన్ను నేను తమాయించుకున్నాను. ఏదేమైనా సెలక్టర్ల నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప నేనేమీ చేయలేను కదా! నిజానికి నా భవితవ్యం గురించి సెలక్టర్లతో నేను ఇంత వరకు మాట్లాడింది లేదు. ఇప్పటికీ జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి వెళ్తూ ఉంటాను. అక్కడ క్వాలిటీ టైమ్ ఎంజాయ్ చేస్తాను. అక్కడ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నా కెరీర్ రూపకల్పనలో ఎన్సీఏది కీలక పాత్ర. నిజానికి అక్కడి నుంచే నా కెరీర్ మొదలైంది. అందుకే నేనెల్లప్పుడూ ఎన్సీఏ పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటాను" అని టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఆసియా క్రీడలు-2023 జట్టులో తనకు చోటు లభిస్తుందని ఆశించానని.. కానీ అలా జరుగలేదంటూ గబ్బర్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా టీమిండియా తరఫున పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ బ్యాటర్ శిఖర్ ధావన్కు ఏడాదికి పైగా జట్టులో చోటు కరువైంది. యువ ఓపెనర్లకు పెద్దపీట బంగ్లాదేశ్తో 2022, డిసెంబరు వన్డేలో ఆఖరిసారిగా అతడు టీమిండియాకు ఆడాడు. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఓపెనర్లకు పెద్దపీట వేస్తున్న సెలక్టర్లు ధావన్ను పక్కనపెట్టేశారు. ఈ నేపథ్యంలో.. వన్డే ప్రపంచకప్-2023కి ముందు జరిగిన ఆసియా క్రీడలతో అతడు రీఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరిగింది. చోటు ఆశించి భంగపడ్డా మెగా టోర్నీ నేపథ్యంలో చైనాకు వెళ్లే భారత ద్వితీయ శ్రేణి క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ధావన్ ఉంటాడనే వార్తలు వినిపించాయి. కానీ.. అనూహ్యంగా రుతురాజ్కు పగ్గాలు అప్పగించిన మేనేజ్మెంట్ ధావన్కు మొండిచేయి చూపింది. ఇక ఆ తర్వాత మళ్లీ అతడికి టీమిండియాలో చోటు దక్కనేలేదు. ఈ నేపథ్యంలో.. 38 ఏళ్ల ధావన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ఆసియా క్రీడల జట్టులో చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డానని తెలిపాడు. అయితే, తాను సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానన్నాడు. అందుకే ఇలా ఇక వన్డేలు, టీ20లు ఆడేందుకే టెస్టు క్రికెట్కు పూర్తిగా దూరమయ్యానని ధావన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా 2013లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో ధావన్ది కీలక పాత్ర. నాటి ఐసీసీ టోర్నీలో 363 పరుగులతో ఈ లెఫ్టాండర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. -
జొరావర్..నిన్ను చూసి ఏడాదవుతోంది : శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన కెరీర్తో పాటు.. తన వ్యక్తిగత జీవితంలోనూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే భారత జట్టులో చోటు కోల్పోయిన ధావన్.. తన భార్య అయేషా ముఖర్జీ నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. ఇటీవలే ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు శిఖర్ దావన్, ఆయేషా ముఖర్జీకి విడాకులు మంజారు చేసింది. అప్పటి నుంచి తన కుమారుడు జొరావర్ను శిఖర్ కలుసుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా తన కుమారుడి పుట్టిన సందర్భంగా ధావన్ ఎమోషనల్ అయ్యాడు. జొరావర్కు బర్త్డే విషెస్ చెప్తూ ఇన్స్టాగ్రామ్లో ధావన్ భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం జొరావర్ ఆస్ట్రేలియాలో అయేషాతో కలిసి ఉన్నాడు. 'నిన్ను నేరుగా చూసి ఏడాదవుతోంది. దాదాపు మూడు నెలలుగా అన్ని చోట్లా (సోషల్ మీడియాలో) నన్ను బ్లాక్ చేశారు. నీ నుంచి నన్ను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నీతో వీడియో కాల్లో కూడా మాట్లాడి చాలా రోజులైంది. అందుకే నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి పాత ఫోటోనే పోస్ట్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే మై డియర్ బాయ్. నేను నీతో నేరుగా మాట్లాడలేకపోయినా.. ఎల్లప్పుడూ టెలీపతి(కమ్యూనికేషన్) ద్వారా నేను నిన్ను కనెక్ట్ అవుతాను. నిన్ను చూసి గర్విస్తున్నా.. నువ్వు బాగున్నావని నాకు తెలుసు. ఈ నాన్న నిన్నెప్పుడూ మిస్సవుతాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ దేవుని దయతో మనం మళ్లీ కలుసుకునే సమయం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటాను. లవ్ యూ జొరా అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చాడు. కాగా ఈ ఏడాది ఆక్టోబర్లో ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు ధావన్- అయేషా విడాకులు మంజూరు చేసింది. జనవరిలో ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసిస్తోందని ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో ధావన్ విడాకుల పిటిషన్ ధాఖలు చేశాడు. అనంతరం తన భార్యపై ధావన్ చేసిన ఆరోపణలు అన్నీ వాస్తవమైనవని విశ్వసించిన న్యాయస్దానం విడాకులు మంజూరు చేసింది. ధావన్, ఆయేషా దంపతుల కుమారుడి శాశ్వత కస్టడీపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. కానీ ధావన్కు భారత్ లేదా ఆస్ట్రేలియాలో తన కుమారుడిని కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా వీడియో కాల్ ద్వారా కూడా ధావన్ తన కుమారుడితో మాట్లాడవచచ్చని పేర్కొంది. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
IPL 2024: సామ్ కర్రన్ కొనసాగింపు.. భారీ హిట్టర్కు షాకిచ్చిన పంజాబ్
ఐపీఎల్ 2024 సీజన్కు సంబంధించి కొనసాగించే ఆటగాళ్ల జాబితాను (Retention), రిలీజ్ (Release) చేసే ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు ఇవాళ (నవంబర్ 26) ప్రకటించాయి. పంజాబ్ కింగ్స్ మొత్తంగా 5 మంది ఆటగాళ్లను విడుదల చేసి, 19 మందిని కొనసాగించింది. పంజాబ్ కెప్టెన్గా శిఖర్ ధవన్ను కొనసాగించింది. పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లలో హార్డ్ హిట్టర్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. షారుఖ్ ఖాన్ భానుక రాజపక్స మోహిత్ రతీ బల్తేజ్ ధందా రాజ్ అంగద్ బవా పంజాబ్ కింగ్స్ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే.. శిఖర్ ధవన్ (కెప్టెన్) జానీ బెయిర్స్టో జితేశ్ శర్మ ప్రభ్సిమ్రన్ సింగ్ మాథ్యూ షార్ట్ హర్ప్రీత్ బ్రార్ అథర్వ తైడే రిషి ధవన్ సామ్ కర్రన్ సికంబర్ రజా లియామ్ లివింగ్స్టోన్ గుర్నూర్ సింగ్ బ్రార్ శివమ్ సింగ్ రాహుల్ చాహర్ అర్షదీప్ సింగ్ హర్ప్రీత్ బ్రార్ విధ్వత్ కావేరప్ప కగిసో రబాడ నాథన్ ఇల్లిస్ -
జద్రాన్ సూపర్ ఇన్నింగ్స్.. అఫ్గన్ రికార్డు స్కోరు..
ICC WC 2023- Ibrahim Zadran: వన్డే వరల్డ్కప్-2023లో అఫ్గనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పటిష్ట పేస్ దళం ఉన్న కంగారూ జట్టు బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొని అజేయ శతకంతో మెరిశాడు. మొత్తంగా 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 129 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో అఫ్గన్ తరఫున ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసి తొలి బ్యాటర్గా నిలిచిన 21 ఏళ్ల ఇబ్రహీం.. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. వరల్డ్కప్ టోర్నీలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్ల జాబితాలో ధావన్ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో జింబాబ్వే ఆటగాడు నీల్ జాన్సన్ 132* పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ హ్యారిస్ 130 పరుగులతో రెండో స్థానం ఆక్రమించాడు. కష్టాల్లో ఆసీస్ కాగా అఫ్గనిస్తాన్ విధించిన 292 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడుతోంది. 25 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు నష్టపోయి 126 పరుగులు మాత్రమే చేసింది. అయితే, ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అద్భుత ఆట తీరుతో అర్ధ శతకం పూర్తి చేసుకుని ఆసీస్ శిబిరంలో ఆశలు రేకెత్తిస్తున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన టాప్-5 క్రికెటర్లు 1. నీల్ జాన్సన్(జింబాబ్వే)- 132* పరుగులు- 1999లో లార్డ్స్ మైదానంలో 2. క్రిస్ హ్యారిస్(న్యూజిలాండ్)- 130 పరుగులు- 1996లో చెన్నైలో 3. ఇబ్రహీం జద్రాన్(అఫ్గనిస్తాన్)- 129* పరుగులు- 2003 ముంబైలో 4. శిఖర్ ధావన్(ఇండియా)- 117 పరుగులు- 2019లో ది ఓవల్లో 5. రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్)- 116 పరుగులు- 2023లో ధర్మశాలలో. అఫ్గనిస్తాన్కు ఇదే భారీ స్కోరు: ముంబైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా.. అఫ్గనిస్తాన్ వరల్డ్కప్ టోర్నీలో తమ అత్యధిక స్కోరు నమోదు చేసింది. జద్రాన్ అజేయ శతకం కారణంగా 291 పరుగులు సాధించి ఈ మేరకు తమ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. వరల్డ్కప్ టోర్నీలో ఇప్పటి వరకు అఫ్గనిస్తాన్ సాధించిన టాప్-5 స్కోర్లు ఇవే ►ఆస్ట్రేలియా మీద- 2023లో ముంబైలో- 291/5. ►వెస్టిండీస్ మీద- 2019లో లీడ్స్లో- 288. ►పాకిస్తాన్ మీద- 2023లో చెన్నైలో- 286/2. ►ఇంగ్లండ్ మీద- 2023లో ఢిల్లీలో- 284. ►టీమిండియా మీద- 2023లో ఢిల్లీలో- 272/8. చదవండి: వరల్డ్కప్లో అఫ్గన్ తరఫున ఒకే ఒక్క సెంచరీ.. సచిన్, కోహ్లికి కూడా సాధ్యం కాని రికార్డు View this post on Instagram A post shared by ICC (@icc) -
Pak Vs Aus: మాకిది అలవాటే! పాక్పై ధావన్ సెటైర్లు.. వీడియో వైరల్
ICC Cricket World Cup Warm-up Matches 2023- Pakistan vs Australia: పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పాకిస్తాన్- ఫీల్డింగ్.. ఈ జంట ప్రేమకథ ఎప్పటికీ ముగిసిపోదంటూ సెటైర్లు వేశాడు. వన్డే వరల్డ్కప్-2023 నేపథ్యంలో బాబర్ ఆజం బృందం ఇప్పటికే భారత్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్లో సన్నాహక మ్యాచ్లు ఆడుతోంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్తో తొలి వార్మప్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఓడిన పాక్.. మంగళవారం(అక్టోబరు 3) ఆస్ట్రేలియాతో తలపడుతోంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (77), కామెరాన్ గ్రీన్(50- నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడం సహా మిగతా బ్యాటర్లలో అలెక్స్ క్యారీ మినహా మిగతా వాళ్లంతా రాణించారు. మిస్ఫీల్డింగ్.. వీడియో వైరల్ ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది కంగారూ జట్టు. పాక్ బౌలర్ల, ఫీల్డర్ల తప్పిదాలను క్యాష్ చేసుకుని పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో ఆసీస్తో మ్యాచ్లో పాక్ ఫీల్డర్లు మహ్మద్ వాసిం జూనియర్, మహ్మద్ నవాజ్ సమన్వయలోపంతో ఎక్స్ట్రా పరుగులు ఇవ్వడం ఆ జట్టు అభిమానులకు చిరాకు తెప్పించింది. పాకిస్తాన్- ఫీల్డింగ్.. నెవర్ ఎండింగ్ లవ్స్టోరీ ఇందుకు సంబంధించిన వీడియోను హైలైట్ చేస్తూ.. ‘‘పాకిస్తాన్- ఫీల్డింగ్.. నెవర్ ఎండింగ్ లవ్స్టోరీ’’ అంటూ ధావన్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. గబ్బర్ కామెంట్ నెట్టింట వైరల్గా మారింది. లైకులు, షేర్లతో దూసుకుపోతోంది. కాగా పాక్ టీమ్కు ఇలాంటివి కొత్తేం కాదు. మిస్ఫీల్డింగ్ కారణంగా ఆ జట్టు భారీ మూల్యం చెల్లించిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2023 భారత జట్టులో శిఖర్ ధావన్కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యువకులతో పోటీలో ఈ వెటరన్ ఓపెనర్ వెనుబడిపోయాడు. ఇక అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. టీమిండియా అక్టోబరు 8న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో చెన్నైలో పోటీ పడనుంది. ఇక అక్టోబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొట్టనుంది. చదవండి: 1987లో జన్మించిన కెప్టెన్దే ఈసారి వరల్డ్కప్ ట్రోఫీ! లిస్టులో ఎవరంటే! Pakistan & fielding never ending love story 🥰😄😄 #PakistanFielding #PakCricket pic.twitter.com/AJzT90hgNM — Shikhar Dhawan (@SDhawan25) October 3, 2023 -
Asia Cup 2023: ఆశావహులతో భారత జట్టు.. కెప్టెన్గా ధవన్..!
ఆసియా కప్-2023 కోసం సెలెక్టర్లు నిన్న (ఆగస్ట్ 21) 17 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో చోటు కోసం ధవన్, చహల్, శాంసన్, యశస్వి లాంటి ఆశావహులు ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికీ.. వీరికి నిరాశే మిగిలింది. గాయాల నుంచి కోలుకున్న సీనియర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లతో పాటు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్లకు సెలెక్టర్లు పెద్దపీట వేశారు. ట్రావెలింగ్ రిజర్వ్గా సంజూ శాంసన్ను ఎంపిక చేసినప్పటికీ.. ఈ ఎంపిక నామమాత్రమే. ఇదిలా ఉంటే, ఆసియా కప్ ఆశావహులతో రూపొందించబడిన ఓ నమూనా భారత జట్టు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ జట్టు ఆసియా కప్ను ఎంపిక చేసిన 17 మంది సభ్యుల భారత జట్టుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఈ జట్టుకు శిఖర్ ధవన్ కెప్టెన్గా ఉంటే.. చహల్, శాంసన్ లాంటి ఆసియా కప్ ఆశావహులు మిగతా సభ్యులుగా ఉన్నారు. ఈ జట్టుకు ఓపెనర్లుగా ధవన్, రుతురాజ్ ఉండగా.. వన్డౌన్లో యశస్వి జైస్వాల్, నాలుగో స్థానంలో సంజూ శాంసన్, ఆతర్వాత రింకూ సింగ్, శివమ్ దూబే, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, పేసర్ల కోటాలో దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. ఆసియా కప్ ఆశావహులతో రూపొందించబడిన ఈ జట్టును చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ధవన్ నేతృత్వంలోని ఈ జట్టు బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్లను సునాయాసంగా ఓడిస్తుందని, ఈ జట్టు టీమిండియాకు ఏమాత్రం తీసిపోదని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే, ఆసియా కప్కు ఎంపిక చేసిన భారత జట్టుతో పోలిస్తే ఈ జట్టు చాలా సమతూకంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఐసీసీ సభ్య దేశాలైన చాలా జట్లకంటే ఈ జట్టు మెరుగ్గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ జట్టు సోషల్మీడియాలో నెటిజన్లకు మాంచి టాపిక్గా మారింది. ఆసియాకప్ భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ట్రావెలింగ్ రిజర్వ్: సంజూ శాంసన్ ఆసియా కప్ ఆశావహుల భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (వికెట్కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, దీపక్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్ -
WC 2023: ధావన్ కెరీర్కు ఎండ్కార్డ్? అంతేనన్న అగార్కర్! వీడియో వైరల్
End of road for Shikhar Dhawan! Ajit Agarkar confirms: వన్డేల్లో అద్భుత రికార్డులు.. ద్వితీయ శ్రేణి జట్టు కెప్టెన్గా టీమిండియాను ముందుకు నడిపించి చరిత్ర సృష్టించిన సందర్భాలు.. మేటి ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపు.. కానీ.. ఇవేమీ వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ పొడిగించుకునేందుకు దోహదం చేయలేదు.. కొత్త నీరు వచ్చె.. పాత నీరు పోయె! కొత్త నీరు రాగానే.. పాత నీరు పోవాలన్న చందంగా.. శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యువ బ్యాటర్ల నుంచి ఎదురైన పోటీ ముందు 37 ఏళ్ల గబ్బర్ నిలవలేకపోయాడు. మెరుగైన ప్రదర్శనలతో వీరిద్దరు ఓపెనర్లుగా స్థానం సుస్థిరం చేసుకుంటున్న క్రమంలో ధావన్కు అవకాశాలు కరువయ్యాయి. వాళ్లు ముగ్గురే మా ప్రాధాన్యం అయితే.. ఇటీవల వీరిద్దరు విఫలమవుతున్న తరుణంలో ఆసియా కప్-2023 రూపంలో గబ్బర్కు మరో ఛాన్స్ దక్కుతుందని అతడి అభిమానులు ఆశపడ్డారు. కానీ.. బీసీసీఐ సెలక్టర్లు వాళ్ల ఆశలపై నీళ్లు చల్లారు. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మకు జోడీగా శుబ్మన్ గిల్ను ఎంపిక చేశారు. ఇషాన్ కిషన్కు కూడా జట్టులో చోటిచ్చారు. ఈ క్రమంలో గబ్బర్కు నిరాశే మిగిలింది. జట్టు ప్రకటన సమయంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ‘‘శిఖర్ ధావన్ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఎన్నో ఆడాడు. కానీ ప్రస్తుతం.. రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్లకు మాత్రమే ఓపెనర్లుగా మా ప్రాధాన్యం ఉంటుంది’’ అని కుండబద్దలు కొట్టాడు. ధావన్ కెరీర్కు ఎండ్కార్డ్? ఇక ఆసియా కప్ జట్టే వన్డే వరల్డ్కప్ ప్రొవిజినల్ టీమ్ అన్న అంచనాల నడుమ ధావన్ కెరీర్ ముగిసినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో.. ‘‘అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడు. ఎప్పుడూ ఎవరినీ నిందించలేదు. సెలక్టర్ల విషయంలో ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. జట్టుకు అవసరమైన సమయంలో 100 శాతం కష్టపడ్డాడు. గబ్బర్ను తలచుకుంటే బాధేస్తోంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా టీమిండియా తరఫున శిఖర్ ధావన్.. 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేశాడు. ఇందులో17 సెంచరీలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 143. చదవండి: అందుకే చహల్పై వేటు.. ఇకపై: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు Asia Cup: వరల్డ్కప్లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్న్యూస్.. Asia Cup: అయ్యర్, రాహుల్ వచ్చేశారు.. తిలక్ వర్మ ఇన్.. పాపం సంజూ! #WATCH | At the moment, Rohit Sharma, Shubman Gill and Ishan Kishan are our preferred openers...Shikhar Dhawan has been a terrific player for India, says BCCI chief selector Ajit Agarkar. pic.twitter.com/TqF6gV4869 — ANI (@ANI) August 21, 2023 -
ఆసియా కప్, వరల్డ్కప్లలో రోహిత్కు జత ఎవరు..? కొత్తగా రేసులోకి మరో ఆటగాడు
టీమిండియాను ఓపెనర్ల సమస్య చాలా కాలంగా వేధిస్తూనే ఉంది. సచిన్-గంగూలీ, సచిన్-సెహ్వాగ్, గంభీర్-సెహ్వాగ్ల శకం ముగిసాక కొంతకాలం పాటు రోహిత్ శర్మ-శిఖర్ ధవన్ల జోడీ విజయవంతంగా సాగింది. అయితే కాలక్రమంలో ధవన్ ఫామ్ కోల్పోవడం, కేఎల్ రాహుల్ లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ధవన్ క్రమేనా కనుమరుగైపోయాడు. రాహుల్ అన్ని ఫార్మాట్లలో రాణించడంతో ధవన్ స్థానాన్ని ఆక్రమించాడు. అయితే ఇటీవలి కాలంలో బీసీసీఐ ఫార్మాట్కు ఓ జట్టును ప్రకటిస్తుండటం.. సిరీస్, సిరీస్కు కీలక ఆటగాళ్లను రెస్ట్ పేరుతో పక్కకు పెడుతుండటం.. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తరుచూ గాయాల బారిన పడుతుండటంతో ఓపెనర్ల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఈ క్రమంలో రాహుల్కు ప్రత్యామ్నాయంగా ఐపీఎల్ హీరో శుభ్మన్ గిల్ తెరపైకి వచ్చాడు. రోహిత్కు జతగా గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడి రాహుల్ను మరిపించాడు. అయితే గిల్ ఫామ్ కూడా ఇటీవలికాలంలో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య పునరావృతం అయ్యింది. త్వరలో ఆసియా కప్, వన్డే వరల్డ్కప్ లాంటి మెగా ఈవెంట్లు ఉండటంతో బీసీసీఐకి ఓపెనర్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం, ఐపీఎల్-2023కి ముందు ఆతర్వాత జరిగిన సిరీస్ల్లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లాంటి యువ ఓపెనర్లు సత్తా చాటడంతో సమస్య మరింత తీవ్రతరమైంది. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్లో మరో యంగ్ ఓపెనర్ పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటం (డబుల్ సెంచరీ, సెంచరీ) బీసీసీఐని మరింత ఇరకాటంలో పడేసింది. మరోవైపు వెటరన్ శిఖర్ ధవన్కు ఆఖరి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు కూడా తీవ్రతరమవుతుండటంతో బీసీసీఐకి ఏం చేయాలో పాలుపోక స్తబ్ధతలో ఉండిపోయింది. ప్రస్తుతం లైమ్లైట్లో ఉన్న అందరు ఓపెనర్లను పరిగణలోకి తీసుకుంటే 90 శాతం అర్హులే ఉండటంతో సెలక్టర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఓపెనింగ్ స్థానాల కోసం రోహిత్తో పాటు మొత్తం 8 మంది (పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, శిఖర్ ధవన్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్) లైన్లో ఉన్నారు. వీరితోనే సతమతమవుతుంటే యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్లు మేము సైతం అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో భారత సెలెక్టర్లు ఆసియా కప్, వన్డే వరల్డ్కప్లకు రోహిత్కు జతగా ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. -
'నా పేరు లేకపోవడం చూసి షాక్ అయ్యా.. కానీ ఆ విషయంలో మాత్రం హ్యాపీ'
టీమిండియా వెటరన్ వికెట్ ఓపెనర్ శిఖర్ ధావన్ గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే చైనా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్కు వెళ్లే భారత జట్టుకు ధావన్ సారధ్యం వహిస్తాడని అంతా భావించారు. కానీ గబ్బర్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఆసియా క్రీడల్లో పాల్గోనే భారత జట్టుకు యువ ఓపెనర్ రుత్రాజ్ గైక్వాడ్ను సారధిగా ఎంపిక చేశారు. కాగా గతంలో చాలా సిరీస్ల్లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు ధావనే నాయకత్వం వహించాడు. ఇక ఆసియాగేమ్స్కు చోటు దక్కకపోవడంపై ధావన్ తాజాగా స్పందించాడు. ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో నా పేరు లేకపోవడం చూసి నేను షాక్ అయ్యాను. అయితే సెలక్టర్లు వేరే ఆలోచనతో జట్టును ఎంపిక చేశారని నేను భావించాను. దాన్ని మనం అంగీకరించక తప్పదు. రుత్రాజ్ గైక్వాడ్ నాయకత్వం వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. జట్టు మొత్తం యువకులతో కూడి ఉంది. వారు బాగా రాణిస్తారని ఆశిస్తున్నాను.. జట్టుకు అవసరమైతే ఇప్పుడైనా రీఎంట్రీ ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పటికప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తూనే ఉంటాను. అక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి. నేను ఇప్పటికీ ఫిట్నెస్గా ఉన్నాను. అయితే నా ఫ్యూచర్ కోసం ఏ సెలక్టరు కూడా ఇప్పటివరకు నాతో ఏమి మాట్లాడలేదు. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్కు టైటిల్ను అందించడమే నా లక్ష్యమని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధావన్ పేర్కొన్నాడు. చదవండి: 'అతడొక అద్భుతం.. కచ్చితంగా కోహ్లి అంతటివాడవుతాడు' -
తిలక్ వద్దు!? వరల్డ్కప్ టోర్నీలో నంబర్ 4లో సూర్య సరైనోడు! అతడిని ఆడిస్తే..
World Cup 2023: మిడిలార్డర్లో కీలక స్థానమైన నాలుగో నంబర్పై టీమిండియాలో నెలకొన్న అనిశ్చితి గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ నం.4లో సమస్య ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ రిటైర్ అయిన తర్వాత అక్కడ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారని పేర్కొన్నాడు. అయ్యర్ గాయాల బారిన పడటం వల్ల ఇక శ్రేయస్ అయ్యర్ ఆ లోటును భర్తీ చేయగల సత్తా ఉన్నవాడే అయినా.. గాయాల బెడద వల్ల అతడు అందుబాటులో లేకపోవడం అనిశ్చితికి కారణమైందని పేర్కొన్నాడు. అయ్యర్ జట్టుకు దూరమైన తరుణంలో వేర్వేరు ఆటగాళ్లతో ప్రయోగాలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆసియా వన్డే కప్-2023, వన్డే వరల్డ్కప్-2023 వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో టీమిండియాను వేధిస్తున్న ఈ ప్రధాన సమస్య గురించి వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ టోర్నీలో నాలుగో స్థానంలో టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ను ఆడించాలని సూచించాడు. నా ఛాయిస్ సూర్యనే.. ఎందుకంటే ‘‘నేనైతే నం.4లో సూర్యనే ఎంచుకుంటాను. గత కొంతకాలంగా అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. అనుభవజ్ఞుడు. కాబట్టి నా ఛాయిస్ సూర్యనే’’ అని వ్యాఖ్యానించాడు. కాగా టీ20లలో సుదీర్ఘకాలంగా ప్రపంచ నంబర్ 1 బ్యాటర్గా కొనసాగుతున్న ముంబై బ్యాటర్ సూర్యకుమార్ వన్డేల్లో మాత్రం రాణించలేకపోతున్న విషయం తెలిసిందే. వన్డేల్లో సో సోగా.. వెస్టిండీస్తో సిరీస్లోనూ వచ్చిన అవకావాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మూడు వన్డేల్లో వరుసగా 19, 24, 35 పరుగులు చేయగలిగాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు మొత్తంగా 26 వన్డే మ్యాచ్లు ఆడిన సూర్య 511 పరుగులు మాత్రమే చేశాడు. తిలక్ గురించి మాట్లాడుతుంటే! ఈ నేపథ్యంలో 50 ఓవర్ ఫార్మాట్లో తన గణాంకాలు చెప్పుకోదగినవిగా లేవని, ఈ విషయం చెప్పేందుకు సిగ్గుపడనని సూర్య వాస్తవాన్ని అంగీకరించాడు కూడా! ఇదిలా ఉంటే.. విండీస్తో టీ20 సిరీస్తో ఎంట్రీ ఇచ్చిన యువ సంచలనం తిలక్ వర్మ నాలుగో స్థానంలో మెరుగ్గా ఆడుతున్న వేళ అతడిని వన్డేల్లోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, ధావన్ మాత్రం అనుభవం పేరిట సూర్య పేరును ఎంచుకోవడం విశేషం. ఇక భారత్ వేదికగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు వన్డే వరల్డ్కప్ టోర్నీ జరుగనుంది. అంతకంటే ముందు టీమిండియా.. ఆగష్టు 30న ఆరంభం కానున్న ఆసియా వన్డే కప్-2023లో పోటీపడనుంది. చదవండి: దూకుడు నేర్పిన దాదా.. భారత క్రికెట్కు స్వర్ణయుగం.. అగ్రశ్రేణి జట్లకు వణుకు -
ఐసీసీ టోర్నీల్లో ఘనమైన రికార్డు.. అతనికి వరల్డ్కప్ ఆడే ఛాన్స్ ఇవ్వండి..!
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఆస్ట్రేలియా అయితే ఏకంగా తమ కోర్ టీమ్ను కూడా ప్రకటించేసింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సైతం టీమిండియాను ఎంపిక చేసేందుకు భారీ కసరత్తు చేస్తుంది. వరల్డ్కప్కు ఎంపిక చేసే భారత జట్టులో ఎవరెవరు ఉండాలన్న అంశంపై అభిమానులు సోషల్మీడియా వేదికగా ఇప్పటికే విస్తృత స్థాయి చర్చలు మొదలుపెట్టారు. పలానా ఆటగాడు ఉండాలని కొందరు, పలానా ఆటగాడు ఉండకూడదని మరికొందరు తమతమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. మరోవైపు గాయాల బారిన పడి గతకొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆటగాళ్లపై (కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్) కూడా చర్చ నడుస్తుంది. ఒకవేళ వారు జట్టులోకి తిరిగి వస్తే ప్రస్తుతమున్న యువ ఆటగాళ్ల పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. రోహిత్కు జతగా మరో ఓపెనర్ ఎవరు.. కోహ్లితో పాటు మిడిలార్డర్లో ఎవరెవరు ఉంటారు.. ఒకవేళ కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని వరల్డ్కప్కు అందుబాటులోకి వస్తే అతను వికెట్కీపింగ్ కూడా చేస్తాడా, లేదా.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఎవరుంటారు.. ఆల్రౌండర్ల కోటాలో జడేజాతో పాటు ఎవరెవరు జట్టులో ఉంటారు.. పేస్ విభాగం ఎలా ఉండబోతుంది..? ఇలా సవాలక్ష ప్రశ్నలు అభిమానుల మెదళ్లను తొలిచి వేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా రోహిత్ శర్మ పార్ట్నర్ ఎవరనే డిస్కషన్ తారా స్థాయిలో జరుగుతుంది. ఇటీవల యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ తరుచూ విఫలమవుతుండటంతో ఈ చర్చ పతాక స్థాయికి చేరింది. ఈ క్రమంలో గిల్ ప్రత్యామ్నాయంగా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ పేరు వినిపిస్తుంది. ఐసీసీ టోర్నీల్లో ధవన్కు ఘనతమైన రికార్డు ఉండటం అతనికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ధవన్ ఐసీసీ టోర్నీల్లో 27 ఇన్నింగ్స్ల్లో 50.4 సగటున 97.25 స్ట్రయిక్ రేట్తో 6 సెంచరీలు, 4 అర్ధసెంచరీల సాయంతో 1312 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూపించి ధవన్ అభిమానులు అతన్ని వరల్డ్కప్కు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వయసు పైబడిన రిత్యా ధవన్కు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ అవుతుందని, అందుకైనా అతనికి చివరి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ధవన్కు పోటీగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ యశస్వి వన్డే అరంగేట్రం చేసి రాణిస్తే, ధవన్కు మొండిచెయ్యి ఎదురుకావచ్చు. మరి ఇన్ని సమీకరణల నేపథ్యంలో వరల్డ్కప్లో రోహిత్కు జోడీగా ఎవరిని బరిలోకి దిగుతారో వేచి చూడాలి. -
కోహ్లి, రోహిత్లకు సాధ్యం కాలేదు.. తొలి భారత బ్యాటర్గా సూర్య ఆల్టైం రికార్డు
West Indies vs India, 3rd T20I: వెస్టిండీస్తో తొలి టీ20లో 21 పరుగులు.. రెండో టీ20లో ఒకే ఒక్క పరుగు చేసి రనౌట్.. టీమిండియా స్టార్ సర్యకుమార్ యాదవ్ తొలి రెండు టీ20 మ్యాచ్లలో విఫలం కావడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. టీ20 నంబర్ 1 బ్యాటర్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించలేదంటూ అభిమానులే పెదవి విరిచారు. ఈ రెండు మ్యాచ్లలోనూ టీమిండియా ఓటమి చెందడం విమర్శల పదునును మరింత పెంచింది. అయితే, తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సూర్య విజృంభించాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి తన విలువేంటో చాటుకున్నాడు. స్కై వీరవిహారం విండీస్తో మంగళవారం నాటి మూడో టీ20లో స్కై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుబ్మన్ గిల్ విఫలమైన వేళ తిలక్ వర్మతో కలిసి జట్టును ఆదుకున్నాడు. 44 బంతుల్లోనే 83 పరుగులతో సత్తా చాటాడు. 10 ఫోర్లు, 4 సిక్స్లు బాది వింటేజ్ సూర్యను గుర్తు చేశాడు. సిక్స్ల సెంచరీ జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడమే గాకుండా.. టీ20లలో మరో అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా ‘సిక్స్ల సెంచరీ’ కొట్టిన తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. కోహ్లిని అధిగమించాడు. అంతేకాదు.. భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ను వెనక్కి నెట్టి అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానం ఆక్రమించాడు. కాగా శిఖర్ ధావన్ 68 టీ20 మ్యాచ్లలో 126కు పైగా స్ట్రైక్రేటుతో 1759 పరుగులు సాధించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు 49 ఇన్నింగ్స్ ఆడి.. 174కు పైగా స్ట్రైక్రేటుతో 1780 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 14 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సూర్య అత్యధిక స్కోరు 117. అంతర్జాతీయ టీ20లలో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న భారత బ్యాటర్లు ►సూర్యకుమార్ యాదవ్- 49 ఇన్నింగ్స్లో 101 సిక్సర్లు ►విరాట్ కోహ్లి- 107 ఇన్నింగ్స్లో 117 సిక్సర్లు ►రోహిత్ శర్మ- 140 ఇన్నింగ్స్లో 182 సిక్సర్లు వీళ్లు కూడా.. ఇక ఇతర బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 68 ఇన్నింగ్స్లో 99, యువరాజ్ సింగ్ 51 ఇన్నింగ్స్లో 74, హార్దిక్పాండ్యా 70 ఇన్నింగ్స్లో 68, సురేశ్ రైనా 66 ఇన్నింగ్స్లో 58, మహేంద్ర సింగ్ ధోని 85 ఇన్నింగ్స్లో 52, శిఖర్ ధావన్ 66 ఇన్నింగ్స్లో 50 సిక్స్లు బాదారు. ఇదిలా ఉంటే.. విండీస్తో మూడో టీ20 సందర్భంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన సూర్య.. ఈ అవార్డు అందుకోవడం ఇది పన్నెండోసారి. ఈ జాబితాలో కోహ్లి 15 అవార్డులతో అగ్రస్థానంలో ఉండగా.. సూర్య.. రోహిత్తో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: రన్రేట్ అవసరం లేదు.. హార్దిక్ చేసింది ముమ్మాటికీ తప్పే! Form is temporary. Surya is permanent! .#INDvsWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/QRdE8Eg8BQ — FanCode (@FanCode) August 8, 2023 -
వెటరన్ జోడీ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్- గిల్! దాదా- వీరూల తర్వాత..
West Indies vs India, 3rd ODI: వెస్టిండీస్పై తొలి రెండు వన్డేల్లో ప్రదర్శన భారత జట్టు ఆటతీరుపై సందేహాలు రేకెత్తించినా... తమ స్థాయి ఏమిటో చివరి పోరులో టీమిండియా చూపించింది. ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఆడకపోయినా, ప్రత్యర్థిని చిత్తు చేయగల సత్తా తమకుందని నిరూపించింది. ఆఖరి వన్డేలో భారీ విజయంతో సిరీస్ను సొంతం చేసుకున్న జట్టు ఇప్పుడు టి20 పోరుకు సిద్ధమైంది. హాఫ్ సెంచరీలతో మెరిసి ఇక్కడా సీనియర్లు లేకపోవడంతో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు యువ ఆటగాళ్లకు ఇది సరైన అవకాశం. ఇదిలా ఉంటే.. మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్ అర్ధ శతకాలతో మెరిసిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ 64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు రాబట్టగా.. గిల్ 92 బంతుల్లో 11 బౌండరీలు బాది మొత్తంగా 85 రన్స్ చేశాడు. వెటరన్ జోడీ రికార్డు బద్దలు మొదటి వికెట్కు 19.4 ఓవర్లలో వీరిద్దరు కలిసి 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ క్రికెటర్లు శిఖర్ ధావన్- అజింక్య రహానే పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. కాగా 2017లో ఈ జోడీ వెస్టిండీస్తో వన్డే మ్యాచ్లో మొదటి వికెట్కు 132 పరుగులు జతచేశారు. ఈ క్రమంలో ఆరేళ్ల తర్వాత వీరి రికార్డును లెఫ్ట్- రైట్ కాంబినేషన్ ఓపెనింగ్ పెయిర్ బ్రేక్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది. దాదా- వీరూల తర్వాత అదే విధంగా.. కరేబియన్ దీవిలో పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యధిక భాగస్వామ్యం(ఏ వికెట్పై అయినా) నమోదు చేసిన రెండో భారత జోడీగా నిలిచింది. 2007 వరల్డ్కప్ మ్యాచ్ సందర్భంగా బెర్ముడాపై సౌరవ్ గంగూలీ- వీరేంద్ర సెహ్వాగ్ రెండో వికెట్కు 202 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో వీరి తర్వాతి స్థానాన్ని ఇషాన్- గిల్ ఆక్రమించారు. బ్యాటింగ్ ఆర్డర్ కకావికలం కాగా వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను 2–1 తేడాతో భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మూడో వన్డేలో భారత్ 200 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. 352 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా గుడకేశ్ మోటీ (34 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా, అలిక్ అతనజ్ (50 బంతుల్లో 32; 3 ఫోర్లు), అల్జారి జోసెఫ్ (39 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్లు) కొద్దిగా పోరాడగలిగారు. శార్దుల్ ఠాకూర్ వన్డేల్లో తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (4/37) నమోదు చేయగా, ముకేశ్ 3, కుల్దీప్ 2 వికెట్లు తీశారు. శుబ్మన్ గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా, ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచారు. శార్దూల్ చెలరేగాడు 2007 నుంచి ఇప్పటి వరకు వెస్టిండీస్పై భారత్కు ఇది వరుసగా 13వ వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. పదునైన బౌలింగ్తో చెలరేగిన పేసర్ ముకేశ్ కుమార్ తొలి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని ధాటికి కింగ్ (0), మేయర్స్ (4), హోప్ (5) అవుట్ కావడంతో స్కోరు 17/3 వద్ద నిలిచింది. పదేళ్ల తర్వాత ఉనాద్కట్ ఆ తర్వాత విండీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. పదేళ్ల తర్వాత తొలి వన్డే ఆడిన ఉనాద్కట్... కార్టీ (6)ని అవుట్ చేయగా... తన వరుస ఓవర్లలో శార్దుల్ రెండు వికెట్లు తీయడంతో స్కోరు 50/6కు చేరింది. అనంతరం తన వరుస ఓవర్లలో కుల్దీప్ తర్వాతి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ దశలో మోతీ, జోసెఫ్ కొద్ది సేపు పట్టుదల కనబర్చి తొమ్మిదో వికెట్కు 60 బంతుల్లో 55 పరుగులు జోడించారు. అయితే ఈ జోడీని విడదీసిన శార్దుల్ తన తర్వాతి ఓవర్లో ఆఖరి వికెట్ కూడా తీసి విండీస్ ఆట ముగించాడు. చదవండి: క్రికెట్కు గుడ్బై చెప్పిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ అరుదైన రికార్డుకు చేరువలో శాంసన్.. కోహ్లి, రోహిత్ సరసన చేరేందుకు! కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచి.. ఇన్కమ్టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా! -
వరల్డ్కప్ జట్టులో అతడు తప్పకుండా ఉంటాడు! అక్కడే దిక్కులేదంటే..
Wasim Jaffer picks his Indian squad for World Cup 2023: వన్డే వరల్డ్కప్-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుష్కరకాలం తర్వాత భారత గడ్డపై ఈ మెగా ఈవెంట్ జరుగుతున్న తరుణంలో అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా తన జట్టును ఎంపిక చేసుకున్నాడు. తన టీమ్లో 15 మందికి చోటిచ్చిన ఈ మాజీ బ్యాటర్.. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్కు తగిన ప్రాధాన్యం ఉండాలని నొక్కి వక్కాణించాడు. ‘‘రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, శిఖర్ ధావన్.. ఈ ముగ్గురే నా ఓపెనర్లు. తుది జట్టులో ధావన్కు చోటు దక్కనప్పటికీ బ్యాకప్ ఓపెనర్గా అతడు ఎంతో కీలకం. మిడిలార్డర్లో.. మూడో స్థానంలో విరాట్ కోహ్లి.. ఆ తర్వాతి స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఉండాలి. సంజూ కూడా.. ఇక బౌలర్ల విభాగంలో ముగ్గురు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ నా ప్లేయింగ్ 11లో ఉంటారు.పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఉంటారు. అయితే, వీరితో పాటు హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేయడం ముఖ్యం. ఇక బ్యాకప్ ప్లేయర్లుగా శార్దూల్ ఠాకూర్(పేసర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్)కు చోటిస్తాను’’ అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. యువకులు పాతుకుపోతున్నారు కాగా శిఖర్ ధావన్ గతేడాది డిసెంబరులో ఆఖరిసారిగా టీమిండియాకు ఆడాడు. అప్పటి నుంచి జాతీయ జట్టులో అతడికి చోటే కరువైంది. కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా యువ ఆటగాళ్లు శుబ్మన్ గిల్(రెగ్యులర్), ఇషాన్ కిషన్ పాతుకుపోతున్నారు. టెస్టుల్లో ఘనమైన ఎంట్రీ ఇచ్చిన యశస్వి జైశ్వాల్ కూడా పోటీకి వస్తున్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ సైతం రేసులో ఉండనే ఉన్నాడు. ద్వితీయ శ్రేణి జట్టులోనూ దక్కని చోటు ఈ నేపథ్యంలో ధావన్ మళ్లీ టీమిండియాలో పునరాగమనం చేయడం దాదాపు అసాధ్యం. అంతేకాదు ఇటీవల ఆసియా క్రీడలు-2023కి ఎంపిక చేసిన ద్వితీయ శ్రేణి జట్టుకు ధావన్ సారథ్యం వహించనున్నాడనే వార్తలు వట్టి పుకార్లేనని సెలక్షన్ కమిటీ నిర్ణయంతో తేలిపోయింది. ఏకంగా వరల్డ్కప్లో? రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో యువ జట్టును చైనాకు పంపనున్నారు. అలాంటిది వసీం జాఫర్ మాత్రం సీనియారిటీకి పెద్దపీట వేస్తూ ధావన్ను ఏకంగా వరల్డ్కప్-2023లో ఆడించాలనే సూచన చేయడం విశేషం. ఈ నేపథ్యంలో.. ‘‘పాపం ధావన్.. ద్వితీయ శ్రేణి టీమ్లోనే దిక్కులేదు.. మరి వరల్డ్కప్లో ఆడిస్తారా’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: తేలిపోయిన వెంకటేశ్ అయ్యర్.. రెచ్చిపోయిన రింకూ సింగ్ -
ఈసారి యశస్వి మిస్సయ్యాడు! అయితేనేం అరుదైన రికార్డుతో..
West Indies vs India, 2nd Test- Yashasvi Jaiswal Record: టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ జోరు మీదున్నాడు. వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ముంబై బ్యాటర్.. 171 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా ఈ 21 ఏళ్ల లెఫ్టాండర్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో పిన్న వయసులోనే మొదటి టెస్టులోనే 150 పరుగుల మార్కు అందుకున్న తొలి భారత బ్యాటర్గా రికార్డులకెక్కాడు. శిఖర్ ధావన్ రికార్డు బద్దలు దీనితో పాటు మరెన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇక రెండో టెస్టులోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 74 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 57 పరుగులు సాధించాడు. తన కెరీర్లో మొదటి రెండు మ్యాచ్లలో రాణించిన యశస్వి జైశ్వాల్.. రెండో టెస్టు సందర్భంగా టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ను అధిగమించాడు. రోహిత్, గంగూలీ తర్వాత భారత్ తరఫున తొలి రెండు టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. శిఖర్ ధావన్ను వెనక్కినెట్టి రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ తర్వాతి స్థానం ఆక్రమించాడు. ఈసారి సెంచరీ మిస్ అయినా ఇదిలా ఉంటే వెస్టిండీస్తో తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ట్రినిడాడ్ వేదికగా గురువారం ఆరంభమైన రెండో టెస్టులోనూ పట్టు బిగించింది. తొలిరోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో యశస్వి జేసన్ హోల్డర్ బౌలింగ్లో అవుటయ్యాడు. అయితే, ఈసారి సెంచరీ మిస్ అయినా అర్ధ శతకంతో మెరిసి మరో అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కెరీర్లో మొదటి రెండు టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 బ్యాటర్లు వీరే! 1.రోహిత్ శర్మ- 288 పరుగులు 2.సౌరవ్ గంగూలీ- 267 పరుగులు 3.యశస్వి జైశ్వాల్- 228 పరుగులు 4.శిఖర్ ధావన్- 210 పరుగులు 5.పృథ్వీ షా- 204 పరుగులు. చదవండి: Ind vs WI: ధోని భయ్యా లేడు కదా.. ఇలాగే ఉంటది! ఇప్పటికైనా వాళ్లను పిలిస్తే.. -
ధావన్ పేరును కనుమరుగు చేసే పనిలో యశస్వి! ఏకైక బ్యాటర్గా గబ్బర్.. కానీ
Yashasvi Jaiswal: అరంగేట్ర మ్యాచ్లోనే అద్భుత శతకం సాధించి అనేకానేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్. వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ 21 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్.. 387 బంతులు ఎదుర్కొని 171 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ(103)కు జోడీగా ఓపెనర్గా బరిలోకి దిగిన యశస్వి.. డబుల్ సెంచరీకి దూరమైనా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తన మొదటి మ్యాచ్లోనే అవార్డు అందుకున్నాడు. మరి విండీస్తో రెండో టెస్టులోనూ అతడు ఓపెనింగ్ చేయడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రినిడాడ్ వేదికగా జూలై 20న ఆరంభం కానున్న ఈ మ్యాచ్ నుంచి యశస్వి జైశ్వాల్ ఇదే దూకుడు కొనసాగిస్తే టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉన్న మూడు రికార్డులు బద్దలవడం ఖాయం. అవేంటంటే.. తొలి 10 టెస్టు ఇన్నింగ్స్లో.. టీమిండియా తరఫున మొదటి 10 టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ధావన్ (532 రన్స్) ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నాడు. వినోద్ కాంబ్లీ(880), సునిల్ గావస్కర్(831), మయాంక్ అగర్వాల్(605) ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. యశస్వి అరంగేట్ర మ్యాచ్లో మాదిరి చెలరేగితే ధావన్ను అధిగమించడం కష్టమేమీ కాదు. టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక స్ట్రైక్రేటు(మినిమం 100 బాల్స్) టీమిండియా తరఫున తన తొలి మ్యాచ్లో యశస్వి 44.19 స్ట్రైక్రేటుతో 171 పరుగులు సాధించాడు. మొదటి మ్యాచ్ కాబట్టి ఆచితూచి ఆడుతూనే సెంచరీ మార్కు అందుకున్న అతడు ఇకపై దూకుడు పెంచాల్సి ఉంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో మాదిరి తన అగ్రెసివ్ బ్యాటింగ్ చూపిస్తే ధావన్ రికార్డును బద్దలు కొట్టవచ్చు. టీమిండియా క్రికెటర్లలో రిషభ్ పంత్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు. 2022లో ఇంగ్లండ్తో టెస్టులో తొలి 100 బంతుల్లో 131.53 స్ట్రైక్రేటు నమోదు చేయగా.. 2009లో శ్రీలంక మీద సెహ్వాగ్ 115.35 స్ట్రైక్రేటుతో పరుగులు సాధించాడు. ఇక ధావన్ 2017లో శ్రీలంక మీద 113.09తో వీరితో పాటు ఈ జాబితాలో చేరాడు. మొదటి సెషన్లో మోస్ట్ రన్స్ టీమిండియా బ్యాటర్లెవరికీ సాధ్యం కాని రీతిలో శిఖర్ ధావన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు మ్యాచ్లో తొలి సెషన్లో అత్యధిక పరుగులు(104- నాటౌట్) సాధించిన తొలి భారత క్రికెటర్గా చరిత్రకెక్కాడు. 2018లో అఫ్గనిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా.. మొదటి సెషన్లోనే 104 పరుగులు రాబట్టాడు. అంతకు ముందు వీరేంద్ర సెహ్వాగ్ వెస్టిండీస్ మీద 2006లో 99 పరుగులు సాధించాడు. ఇక యశస్వి ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ధావన్ను వెనక్కి నెట్టడం అసాధ్యమేమీ అనిపించడం లేదు. మీరేమంటారు?! చదవండి: పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 18 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై ఇదేమి ఔట్రా అయ్యా.. పాకిస్తాన్ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్ -
Asian Games: శిఖర్ ధావన్ కాదా!? టీమిండియా కెప్టెన్గా అతడు..!
Asian Games 2023: చైనాలో ఈ ఏడాది జరుగనున్న ఆసియా క్రీడలకు భారత క్రికెట్ జట్లను పంపేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్-2023 మొదలుకానున్న నేపథ్యంలో మెన్స్ క్రికెట్కు సంబంధించి ద్వితీయ శ్రేణి జట్టును పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ జట్టుకు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా.. దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ను హెడ్కోచ్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అత్యుత్తమ క్రికెటర్ పీటీఐతో మాట్లాడిన సందర్భంగా... టీమిండియా- బీ జట్టుకు రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ అయితే బాగుంటుందని డీకే వ్యాఖ్యానించాడు. ఆసియా క్రీడల్లో భారత జట్టుకు సారథ్యం వహించే అర్హత అశూకు ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘అత్యుత్తమ, గొప్ప క్రికెటర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్కు కచ్చితంగా స్థానం ఉంటుంది. అశ్విన్- దినేశ్ కార్తిక్ ఆ హక్కు తనకు ఉంది.. అర్హుడు కూడా కనీసం ఒక్కసారైనా టీమిండియా కెప్టెన్గా వ్యవహరించే అవకాశం అతడికి రావాలి. అందుకు అతడు వందకు వందశాతం అర్హుడే. ఆ హక్కు తనకి ఉంది’’అని డీకే పేర్కొన్నాడు. ఇక ఆసియా కప్-2023లో టీమిండియా వికెట్ కీపర్ రేసులో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని 36 ఏళ్ల దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు. ఇక.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం టీమిండియా వెస్టిండీస్ పర్యటనతో బిజీకానుంది. జూలై 12 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు భారత ఆటగాళ్లు కరేబియన్ గడ్డపై అడుగుపెట్టారు. కాగా విండీస్తో టెస్టు జట్టులో వెటరన్ స్పిన్ ఆల్రౌండర్ అశ్విన్కు స్థానం దక్కిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 23- అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. వెస్టిండీస్తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: WC 2023: గొప్ప బ్యాటర్వే! కానీ నీకసలు బుర్ర లేదు.. WC 2023: వెస్టిండీస్కు ఊహించని షాకిచ్చిన స్కాట్లాండ్! మరీ ఘోరంగా.. -
ఆర్నెళ్లుగా జట్టుకు దూరం.. ఏకంగా టీమిండియా కెప్టెన్గా రీఎంట్రీ!
గతేడాది డిసెంబరులో ఆఖరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో భాగంగా ఛట్టోగ్రామ్ వేదికగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడాడు. ఆ తర్వాత గబ్బర్కు జట్టులో చోటు కరువైంది. మెరుగైన ప్రదర్శన ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ సారథిగా అవతారమెత్తిన శిఖర్ ధావన్.. బ్యాటర్గా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఆడిన 11 మ్యాచ్లలో కలిపి మొత్తంగా 373 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో అతడి అత్యధిక స్కోరు 99 నాటౌట్. అయితే, బ్యాటర్గా సఫలమైనప్పటికీ కెప్టెన్గా గబ్బర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అడపా దడపా టీమిండియా సారథిగా వ్యవహరించిన అతడు.. ఐపీఎల్లో పంజాబ్ను కనీసం టాప్-5లో కూడా నిలపలేకపోయాడు. ఐపీఎల్ పదహారో ఎడిషన్లో ఆడిన 14 మ్యాచ్లలో పంజాబ్ కేవలం ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆర్నెళ్లుగా జట్టుకు దూరం ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా జాతీయ జట్టుకు దూరమైన శిఖర్ ధావన్ ఈసారి ఏకంగా కెప్టెన్గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో జరుగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు అతడు సారథిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ధావన్ నేతృత్వంలో ద్వితీయశ్రేణి జట్టు హాంగ్జూకు వెళ్లనున్నట్లు సమాచారం. అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఆరంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్గా రీఎంట్రీ! ప్రధాన జట్టు ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉండనున్న తరుణంలో.. సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు నిర్వహించనున్న ఆసియా క్రీడలకు బీ-టీమ్ను పంపే యోచనలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ జట్టుకు కెప్టెన్ ధావన్, హెడ్కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. టీమిండియా జూలై 12 - ఆగష్టు 13 వరకు వెస్టిండీస్ పర్యటనలో గడుపనుంది. చదవండి: WC 2023: వెస్టిండీస్ కొంపముంచిన జింబాబ్వే! ఇక ఆశలు వదులుకోవాల్సిందే! టీమిండియాతో టెస్టులకు సై.. కెప్టెన్గా బ్రాత్వైట్.. వాళ్లంతా జట్టుకు దూరం -
బీసీసీఐ కీలక నిర్ణయం! వాళ్లకు ఊరటనిచ్చేలా.. ఇక ధావన్ కెప్టెన్గా..
ప్రపంచ దేశాల్లోని ఎంతో మంది క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పాల్గొని పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు సంపాదించుకుంటున్నారు. ప్రధాన జట్లతో పాటు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు కూడా ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకునేందుకు క్యాష్ రిచ్ లీగ్ దోహదం చేస్తోంది. అయితే, మన క్రికెటర్లకు మాత్రం విదేశీ టీ20 లీగ్లలో ఆడే అవకాశం లేదు. బంధం తెంచుకుంటేనే ఒకవేళ ఎవరైనా అలా చేయాలనుకుంటే భారత క్రికెట్ నియంత్రణ మండలితో బంధాలన్నీ తెంచుకోవాల్సిందే. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్కు కూడా వీడ్కోలు పలికిన తర్వాతే విదేశీ టీ20 లీగ్లలో ఆడాల్సి ఉంటుంది. ఈ మేరకు బీసీసీఐ కట్టుదిట్టమైన నిబంధనలు విధించింది. సమీక్ష నిర్వహించడం ద్వారా అయితే, తాజాగా ఈ పాలసీపై సమీక్ష నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. జూలై 7 నాటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఈ అంశంపై రివ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా అమెరికా జూలై నుంచి మేజర్ లీగ్ క్రికెట్(MLC) పేరిట టీ20 టోర్నీ నిర్వహించనుంది. మార్పులు చేసేందుకు సిద్ధం ఇటీవల ఐపీఎల్కు గుడ్బై చెప్పిన ఆటగాళ్లు కొందరు ఈ లీగ్లో భాగమయ్యేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ తమ పాత విధానంలో మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్ ప్రమాణాలు పెంచడం సహా విదేశీ టీ20 లీగ్లలో ఆడేందుకు యువ ఆటగాళ్లు బోర్డుతో బంధం తెంచుకునే పరిస్థితులను చక్కదిద్దే దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆ జట్టుకు కెప్టెన్గా ధావన్! ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన సీనియర్ ఆటగాళ్లకు దోహదం చేసేలా బోర్డు నిర్ణయం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశంతో పాటు ఏసియన్ గేమ్స్కు భారత పురుష, మహిళా జట్లను పంపే విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీనియర్ పురుషుల జట్టుకు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాన ఆటగాళ్లు వరల్డ్కప్-2023 సన్నాహకాలతో బిజీగా ఉండనున్న తరుణంలో గబ్బర్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టును చైనాకు పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు ఏసియన్ గేమ్స్ నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. చదవండి: మా వల్లే కిర్స్టన్కు పేరు.. ఆ తర్వాత అతడు సాధించింది సున్నా! మరి ద్రవిడ్.. 18 నెలలు జట్టుకు దూరం.. వచ్చి ఒక్క మ్యాచ్ ఆడగానే! జడ్డూ..: గంగూలీ -
స్టార్ క్రికెటర్ కొత్త సూపర్ లగ్జరీ కారు, ధరెంతో తెలిస్తే షాకవుతారు!
స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్కు లగ్జరీ కార్లపైమోజును మరోసారి చాటుకున్నాడు. తాజాగా అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారును కొనుగోలు చేశాడు.దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో ధావన్ ఒక వీడియను షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ 4 లక్షల,11 వేలకు పైగా లైక్స్తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ మోడళ్ల ధర రూ. 3.5 కోట్ల నుండి అత్యంత ఖరీదైన వేరియంట్ రూ. 4 కోట్ల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ధావన్ కొనుగోలు చేసిన లేటెస్ట్ వెర్షన్ విలువ 4 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఎప్పటిలాగానే తనదైన స్టయిల్లో పంజాబీ పాటతో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. సెలబ్రిటీలు మనసుపడుతున్న కార్లలో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కూడా ఒకటి. ఫీచర్లు పరివీలిస్తే ఫ్లోటింగ్-స్టైల్, పూర్తిగా డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మెరిడియన్ 35-స్పీకర్ ఆడియో సిస్టమ్, డైనమిక్ నోయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. ఇది వీల్ వైబ్రేషన్లు, ఇంజిన్ నానోయిస్, టైర్ నోయిస్, రోడ్ నోయిస్ ఇతర బ్యాక్గ్రౌండ్ నోయిస్ కంట్రోల్ చేస్తుంది. భారీ 13.1అంగుళాల స్క్రీన్, హెడ్-అప్ డిస్ప్లే, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ , బ్యాక్ సీట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. ఇంకా హెడ్ల్యాంప్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ లైట్లు , ఇంటిగ్రేటెడ్ LED DRL ఉంటాయి. ప్రీమియం లుక్తో రీడిజైన్ చేయబడిన బంపర్తోపాటు అప్గ్రేడెడ్ డోర్ హ్యాండిల్స్ ఫ్లష్ ఫిట్టింగ్ను కలిగి ఉందీ కారు. కాగా ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్ శిఖర్ ధావన్కు లగ్జరీ కార్లంటే మక్కువ ఎక్కువ. ఇప్పటికే అతని గ్యారేజ్లోమెర్సిడెస్-బెంజ్ GL-క్లాస్ BMW M8ని కొనుగోలు చేశాడు. ఈ లిస్ట్లో తాజాగా ల్యాండ్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ చేరడం విశేషం. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
అదే మా కొంపముంచింది.. చాలా విషయాలు నేర్చుకున్నాం! అందుకే అలా చేశా: ధావన్
ఐపీఎల్-2023ను పంజాబ్ కింగ్స్ ఓటమితో ముగించింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం ధర్మశాల వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ నిష్క్రమించింది. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కాపాడుకోలేకపోయింది. ఇక తమ చివరి మ్యాచ్లో ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందించాడు. ఫీల్డింగ్ తప్పిదాల వల్లే తాము ఓడిపోయామని ధావన్ తెలిపాడు. "పవర్ప్లేలో మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. అది మమ్మల్ని వెనుక్కి నెట్టింది. అయితే కుర్రాన్, జితేష్, షారుఖ్ తమ అద్భుత ఇన్నింగ్స్లతో మంచి స్కోర్ను అందించారు. దీంతో మళ్లీ మేము మ్యాచ్లో కమ్బ్యాక్ ఇచ్చాం. మా బాయ్స్ బౌలింగ్లో కూడా పర్వాలేదనపించారు. కానీ ఫీల్డింగ్లో మాత్రం నిరాశపరిచారు. ఈజీ క్యాచ్లను జారవిడవడం మా కొంపముంచింది. ఈ పిచ్పై కనీసం 200 పరుగులు చేస్తే మంచి స్కోర్ అవుతుంది. కొన్నిసార్లు బ్యాటింగ్ క్లిక్ అయితే బౌలింగ్లో విఫలమయ్యాం. మరికొన్ని సార్లు బౌలింగ్లో రాణిస్తే బ్యాటింగ్లో విఫలమయ్యాం. ఈ మ్యాచ్లోనూ ఈ రెండు విభాగాల్లో ఒక యూనిట్గా రాణించలేకపోయాం. మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. మేము ఈ సీజన్లో చాలా విషయాలు నేర్చుకున్నాము. మేము కొన్ని విభాగాల్లో అద్భుంగా రాణించాం. ఇక ఈ మ్యాచ్ను ఆఖరి వరకు తీసుకువెళ్లాలని ఉద్దేశ్యంతో మా ప్రధాన బౌలర్లను ముందే ఉపయోగించాను. కాబట్టి రాహుల్ చాహర్ చివరి ఓవర్ని వేయాల్సి వచ్చింది" అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో ధావన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఢిల్లీతో సీఎస్కే కీలక పోరు.. గెలిస్తే ప్లే ఆప్స్కు! లక్నో కూడా -
చాలా బాధగా ఉంది.. అదే మా ఓటమికి కారణం! ప్రతీ సారి ఇంతే: ధావన్
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ కథ దాదాపు ముగిసినట్లే. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైన పంజాబ్.. ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తప్పనిసారిగా గెలవాల్సిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి చవిచూసింది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్రమే చేయగల్గింది. లివింగ్స్టోన్(94) అద్బుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ తన జట్టును గెలిపించుకోలేపోయాడు. ఇక కీలక మ్యాచ్లో ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్సీ శిఖర్ ధావన్ స్పందించాడు. ఓటమికి కారణం తమ చెత్త బౌలింగే అని గబ్బర్ తెలిపాడు. "కీలక మ్యాచ్లో ఓటమి పాలవ్వడం చాలా బాధగా ఉంది. మొదటి ఆరు ఓవర్ల(పవర్ప్లే)లో మేం బాగా బౌలింగ్ చేయలేదు. తొలుత పిచ్పై బంతి అద్బుతంగా స్వింగ్ అయింది. అటువంటి సమయంలో మా పేసర్లు వికెట్లు సాధించడంలో విఫలమయ్యారు. వికెట్ల విషయం పక్కన పెడితే కనీసం పరుగులనైనా కట్టడి చేసి ఉంటే బాగుండేది. ఈ మ్యాచ్లోనే కాకుండా ప్రతీ మ్యాచ్లోనే మేం ఇంతే. పవర్ప్లేలో కనీసం 50-60 మధ్య పరుగులు సమర్పించుకుంటున్నాం. అయితే ఈ మ్యాచ్లో మేము చాలా క్లోజ్గా వెళ్లి ఓడిపోయాం. ఆఖరి ఓవర్లో నోబాల్ తర్వాత మళ్లీ మా ఆశలు చిగురించాయి. కానీ దురదృష్టవశాత్తూ అది జరగలేదు. లివింగ్ స్టోన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్లో కూడా మాకు మంచి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్ మెయిడిన్, రెండో ఓవర్లో నేను ఔటయ్యాను. దాదాపు పవర్ప్లే మేమ 12 బంతులు వరకు వృథా చేశాము. ఇక ఆఖరి ఓవర్లో స్పిన్నర్తో బౌలింగ్ చేయంచాలన్న నా నిర్ణయం విఫలమైంది. అంతకు ముందు ఫాస్ట్బౌలర్లకు ఒకే ఓవర్లో 18-20 పరుగులు రాబట్టారు. కాబట్టి నేను స్పిన్నర్తో ముందుకు వెళ్లాను అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో ధావన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: పంజాబ్ కొంపముంచిన ధావన్ చెత్త కెప్టెన్సీ.. అలా చేసి ఉంటే? -
క్రెడిట్ వారికే.. ప్రభ్సిమ్రన్ అత్యద్భుతం: పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్
ఐపీఎల్-2023లో నిన్న (మే 13) మరో లో స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకోగా.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ప్రభ్సిమ్రన్ (65 బంతుల్లో 103; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. డీసీ ఇన్నింగ్స్లో వార్నర్ (54) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ ధవన్ మాట్లాడుతూ.. తమ బౌలర్లపై, ముఖ్యంగా స్పిన్నర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. బౌలర్లే తమను తిరిగి ఆటలోకి తీసుకొచ్చారని కొనియాడాడు. క్రెడిట్ అంతా వారికే దక్కుతుందని అన్నాడు. తాము బ్యాటింగ్ చేసే సమయంలో సైతం పిచ్ స్పిన్నర్లకు సహకరించిందని, అలాంటి పిచ్పై ఓ పక్క వికెట్లు పడుతున్నా ప్రభ్సిమ్రన్ అత్యద్భుతమైన నాక్ ఆడాడని ఆకాశానికెత్తాడు. మ్యాచ్ను పంజాబ్వైపు టర్న్ చేసిన స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ (4/30)పై కూడా ధవన్ ప్రశంసల వర్షం కురిపించాడు. వికెట్లే లక్ష్యంగా నెమ్మదిగా బౌలింగ్ చేయమని బ్రార్కి చెప్పానని.. అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను ఔట్ చేసిన తీరు అమోఘమని కొనియాడాడు. డీసీపై గెలుపు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని, ప్రశాంతంగా ఉండటం తమకు బాగా సహాయపడిందని, తదుపరి రెండు మ్యాచ్ల్లో ఇలాగే ఉండేందుకు ప్రయత్నిస్తామని ధవన్ చెప్పుకొచ్చాడు. చదవండి: అదే మా కొంపముంచింది.. బౌలర్లు ఒత్తిడికి లోనయ్యారు! చెత్త కెప్టెన్సీ వల్లే ఇదంతా -
ఐపీఎల్లో ధావన్ అరుదైన రికార్డు.. కోహ్లి, వార్నర్ సరసన
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 50 హాఫ్ సెంచరీలు కొట్టిన మూడవ బ్యాటర్గా ధావన్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2023లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన ధావన్ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్లో 47 బంతులు ఎదుర్కొన్న ధావన్ 9 ఫోర్లు, ఓ సిక్సర్తో 57 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ధావన్ ఇప్పటివరకు 50 హాఫ్ సెంచరీలతో పాటు రెండు సెంచరీలు కూడా నమోదు చేశాడు.ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ధావన్ కంటే ముందు డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లి ఉన్నారు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో వార్నర్ ఇప్పటివరకు 59 హాఫ్ సెంచరీలు సాధించగా..విరాట్ కోహ్లి 50 ఆర్థశతకాలు సాధించాడు. చదవండి: #Glenn Phillips: ఫిలిప్స్ విధ్వంసకర ఇన్నింగ్స్.. అరుదైన రికార్డు! అయితే 416.66 స్ట్రైక్రేటుతో.. -
LSG VS PBKS: ఆ నిర్ణయమే పంజాబ్ కొంపముంచిందట..!
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో నిన్న (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 56 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ మీడియాతో మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. తాను తీసుకున్న ఓ నిర్ణయం మిస్ ఫైర్ అయ్యి, అదే తమ కొంపముంచిందని అభిప్రాయపడ్డాడు. ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్తో బరిలోకి దిగడమే తాము చేసిన అతిపెద్ద తప్పిదమని, అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగిన లక్నోకు అదే కలిసొచ్చిందని తెలిపాడు. రాహుల్ చాహర్ (4-0-29-0) మినహా తమ బౌలర్లంతా ధారళంగా పరుగులు సమర్పించుకున్నారని, అందుకు తగిన మూల్యం జట్టు మొత్తం చెల్లించుకుందని అన్నాడు. ఇది తమకో గుణపాఠమని చెప్పిన ధవన్.. భారీ లక్ష్య ఛేదనలో తాను త్వరగా ఔట్ కావడంపై కూడా స్పందించాడు. బంతి తాను ఊహించినంత క్విక్గా లేదని, అందుకే తానాడిన షాట్ నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లిందని తెలిపాడు. ఛేదనలో ఓ దశలో (అథర్వ ధాటిగా ఆడుతున్నప్పుడు) గెలుపుపై ఆశలు చిగురించాయని, అయితే లక్నో బౌలర్లు అద్భుతంగా చేసి తమను కట్టడి చేశారని పేర్కొన్నాడు. షారుక్ ఖాన్ను ఆఖర్లో ఆడించడంపై స్పందిస్తూ.. లివింగ్స్టోన్, సామ్ కర్రన్ లాంటి భారీ హిట్టర్లు ఉండగా, షారుక్ను ముందు పంపే సాహసం చేయలేదని చెప్పుకొచ్చాడు. కాగా, పంజాబ్తో జరిగిన మ్యాచ్లో లక్నో 56 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన పంజాబ్, తమ శక్తి మేరకు ప్రయత్నించి 201 పరుగులకు (19.5) ఆలౌటైంది. లక్నో ఇన్నింగ్స్లో కైల్ మేయర్స్ (54), ఆయూష్ బదోని (43), స్టోయినిస్ (72), పూరన్ (45) సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడగా.. పంజాబ్ తరఫున అథర్వ టైడే (66), సికందర్ రజా (36), లివింగ్స్టోన్ (23), కర్రన్ (21), జితేశ్ శర్మ (24) ఓ మోస్తరుగా రాణించారు. లక్నో బౌలర్లు యశ్ ఠాకూర్ 4, నవీన్ ఉల్ హాక్ 3, బిష్ణోయ్ 2, స్టోయినిస్ ఓ వికెట్ సాధించారు. -
పంజాబ్ కింగ్స్కు గుడ్ న్యూస్.. విధ్వంసకర ఆటగాడు వచ్చేస్తున్నాడు..!
ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ముఖ్యంగా వరుస పరాజయాల బాట పట్టిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ గెలుపు బూస్టప్ ఇస్తుంది. ఈ జట్టు ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు పంజాబ్ పరిస్థితి సైతం ఏమంత ఆశాజనకంగా లేదు. ఆ జట్టు గత మ్యాచ్లో గెలిచిందనే కాని, ఓవరాల్గా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో తుది జట్లలో ఎవరెవరు ఉండే అవకాశముందో అన్న విషయాన్ని ఓసారి పరిశీలిస్తే.. భుజం గాయం కారణంగా లక్నోతో జరిగిన గత మ్యాచ్కు దూరంగా ఉన్న పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే లేట్గా జట్టుతో చేరి, అనంతరం నెట్స్లో గాయపడిన ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్.. ఆర్సీబీతో మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. లివింగ్ స్టోన్ తుది జట్టులోకి వస్తే గత మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సికందర్ రజా, ఆసీస్ ఆల్రౌండర్ మాథ్యూ షార్ట్లలో ఎవరో ఒకరు బెంచ్కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఆర్సీబీ స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ విషయానికొస్తే.. గాయం కారణంగా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఈ ఆసీస్ పేసర్ ఇంకా కోలుకునే దశలోనే ఉన్నట్లు సమాచారం. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. గత మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓడిన జట్టునే యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. పంజాబ్ జట్టులో మాత్రం రెండు మార్పులకు ఆస్కారం ఉంది. గత మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన అథర్వ స్థానంలో ధవన్.. షార్ట్, సికిందర్ రజాలలో ఎవరో ఒకరి స్థానంలో లివింగ్స్టోన్ తుది జట్టులోకి రావచ్చు. తుది జట్లు (అంచనా).. పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రన్, మాథ్యూ షార్ట్/లివింగ్స్టోన్, హర్ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రన్, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, రబాడ, అర్షదీప్ సింగ్ ఆర్సీబీ: డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, హసరంగ, పార్నెల్, విజయ్కుమార్ వైశాఖ్, సిరాజ్ -
ధావన్ ఖలీఫా లాంటివాడు.. ఈసారి పంజాబ్ కచ్చితంగా: టీమిండియా మాజీ బ్యాటర్
IPL 2023- Shikhar Dhawan: ‘‘పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగం బాగుంది. ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల బౌలర్లు జట్టులో ఉన్నారు. ఈసారి ఐపీఎల్లో పంజాబ్ టాప్-4లో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి’’ అని టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ గురించి మాట్లాడుతూ.. ‘‘శిఖర్ ధావన్ ఐపీఎల్కు ఖలీఫా లాంటివాడు. నాయకుడు అంటే ఎలా ఉండాలో ఉదాహరణగా నిలుస్తున్నాడు’’ అని కొనియాడాడు. ఓవైపు బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండటం.. మరోవైపు సమర్థవంతమైన కెప్టెన్ ఉన్న కారణంగా పంజాబ్ కింగ్స్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరడం ఖాయమని కైఫ్ అంచనా వేశాడు. కాగా ఐపీఎల్-2023 వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్ను విడిచిపెట్టిన విషయం తెలిసిందే. బ్యాటర్గా, కెప్టెన్గా గబ్బర్ హిట్! ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది యాజమాన్యం. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో తొలి రెండు మ్యాచ్లలో ధావన్ సేన జయకేతనం ఎగురవేసింది. తమ ఆరంభ మ్యాచ్లో సొంతమైదానం మొహాలీలో కోల్కతా నైట్ రైడర్స్తో పోటీపడ్డ పంజాబ్.. డీఎల్ఎస్ పద్ధతిలో 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ధావన్ 40 పరుగులు సాధించాడు. జట్టు 191 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కోల్కతా బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమైన అర్ష్దీప్ సింగ్(3 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మిగతావాళ్లలో రాహుల్ చహర్, హర్ప్రీత్బ్రార్, సికందర్ రజా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఒకడే ఒక్కడు మొనగాడు ఇక రెండో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్తో తలపడిన పంజాబ్ విజయంలో ధావన్ (86 పరుగులు నాటౌట్) , పేసర్ నాథన్ ఎల్లిస్ (4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 4 వికెట్లు) కీలక పాత్ర పోషించారు. అయితే, సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మాత్రం పంజాబ్కు ఓటమి తప్పలేదు. కెప్టెన్ శిఖర్ ధావన్ (66 బంతుల్లో 99 పరుగులు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో రెండు విజయాలతో పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పంజాబ్ గురువారం గుజరాత్ టైటాన్స్తో పోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన మహ్మద్ కైఫ్.. ధావన్ బ్యాటింగ్ మెరుపులు, నాయకత్వ ప్రతిభను ప్రశంసించాడు. ఈసారి పంజాబ్ కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుతుందని జోస్యం చెప్పాడు. కాగా గాయం నుంచి కోలుకున్న పవర్ హిట్టర్ లియామ్ లివింగ్స్టోన్ జట్టుతో చేరడంతో పంజాబ్కు బలం పెరిగినట్లయింది. చదవండి: ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్.. తొలుత ఎవరూ కొనలేదు, ఇప్పుడు తెలిసొచ్చింది..! IPL 2023: మొన్న నోర్జే, నిన్న సందీప్ శర్మ..! -
PBKS Vs GT: పవర్ హిట్టర్ వచ్చేశాడు! అందరి కళ్లు అతడిపైనే!
IPL 2023- Punjab Kings vs Gujarat Titans: ఐపీఎల్-2023లో భాగంగా డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్తో పోరుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. సొంత మైదానంలో టైటాన్స్తో ఢొకొట్టేందుకు ధావన్ సేన పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. పవర్ హిట్టర్, ఇంగ్లంగ్ స్టార్ లియామ్ లివింగ్స్టోన్ రాకతో పంజాబ్లో జోష్ వచ్చింది. తమ స్టార్ ప్లేయర్ వచ్చేశాడని.. అందరి కళ్లు అతడిపైనే ఉన్నాయంటూ కింగ్స్ జట్టు లివింగ్స్టోన్ ఫొటోలు షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకుంది. కాగా గాయం కారణంగా సుదీర్ఘ కాలం పాటు ఆటకు దూరమైన లివింగ్స్టోన్ ఈ మ్యాచ్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు.. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ బెంచ్కే పరిమితమైన సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ కూడా గుజరాత్తో మ్యాచ్లో ఆడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్ తుది జట్టు ఎలా ఉండబోతుందన్న అంశాన్ని పరిశీలిద్దాం. గుజరాత్తో పంజాబ్ ఢీ ఓపెనర్లుగా ప్రబ్సిమ్రన్ సింగ్, కెప్టెన్ శిఖర్ ధావన్ జోడీ కొనసాగనుండగా.. లివింగ్స్టోన్ను వన్డౌన్లో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక భనుక రాజపక్స స్థానంలో గత మ్యాచ్లో వన్డౌన్లో వచ్చిన మాథ్యూ షార్ట్ బెంచ్కే పరిమితం కానున్నాడు. అదే విధంగా ఆశించిన మేర రాణించలేకపోతున్న సికందర్ రజాకు ఇదే ఆఖరి ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది. మిడిలార్డర్లో షారుక్ ఖాన్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, హర్ప్రీత్ బ్రార్ ఆడనున్నారు. వీరితో పాటు సామ్ కర్రన్ ఉండనే ఉంటాడు. గతంలో చెరోసారి ఇక.. బౌలింగ్ విభాగంలో పేసర్లు కగిసో రబడ, నాథన్ ఎల్లిస్లలో ఒకరు.. అర్ష్దీప్ సింగ్తో పాటు స్పిన్నర్ రాహుల్ చహర్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. కాగా గత మ్యాచ్లో శిఖర్ ధావన్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం కావడంతో సన్రైజర్స్ చేతిలో పంజాబ్కు ఓటమి తప్పలేదు. మరోవైపు.. గుజరాత్కు సైతం గత మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ రూపంలో ఈ సీజన్లో తొలి ఓటమి ఎదురైంది. దీంతో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. కాగా గురువారం మ్యాచ్ జరుగనున్న మొహాలీ స్టేడియంలో గతంలో ఇరు జట్లు తలపడిన రెండు సందర్భాల్లో చెరో విజయం నమోదు చేశాయి. గుజరాత్తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ తుది జట్ల(అంచనా): పంజాబ్ కింగ్స్ ప్రబ్సిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్స్టోన్, సికిందర్ రజా, జతేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, సామ్ కర్రన్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, నాథన్ ఎల్లిస్/కగిసో రబడ, అర్ష్దీప్ సింగ్. గుజరాత్ టైటాన్స్ వృద్ధిమాన్ సాహా, శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్. చదవండి: IPL 2023: నీ తప్పిదం వల్ల భారీ మూల్యం! అమ్మో ఈ ‘మహానుభావుడు’ ఉంటేనా.. సచిన్ నన్ను బ్యాట్తో కొట్టాడు.. పిచ్చివాడిని చేస్తావా అంటూ ఫైర్ అయ్యాడు: సెహ్వాగ్ All the focus is on 𝐨𝐧𝐞 𝐦𝐚𝐧! 📸@liaml4893 is ready to Roar 🦁#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/wo7boR6Qvk — Punjab Kings (@PunjabKingsIPL) April 12, 2023 -
మళ్లీ ప్రేమలో పడ్డ శిఖర్ ధవన్..? వైరల్ వీడియో
ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 9) సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో అజేయమైన 99 పరుగులు చేసి, తన జట్టు ఓడినా కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్, ఇవాళ ఓ క్రికెటేతర విషయం ద్వారా వార్తల్లోకెక్కాడు. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో ధవన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత కీలక విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకుంటూ కనిపించాడు. Love is in the air for Shikhar Dhawan! He has moved on and found someone in a Delhi Party. #ShikharDhawanLeakedVideo pic.twitter.com/TZhLUyiHBp — Salman (Mohd Ali Shaikh) (@salman3126) April 10, 2023 ఈ వీడియోలో ధవన్ మాట్లాడుతూ.. ఇటీవలే ఢిల్లీలోని ఓ ఫామ్హౌస్ పార్టీలో ఓ వ్యక్తిని కలిశానని.. ఆమెను తొలి చూపులోనే ప్రేమించానని, ఆమెను చూడగానే తన జీవితంలో ఎన్నడూ లేని క్లారిటీ వచ్చిందని, ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయానని.. ఆమె మాట్లాడుతుంటే వింటూ ఉండిపోయానని అన్నాడు. ఆతర్వాత రెండు రోజుల్లో తామిద్దరంలో కలిసి ఇంట్లో ఉన్నామని తెలిపాడు. ఓ వ్యక్తితో సెట్ అవుతుందని అనిపిస్తే వెయిట్ చేయడమెందుకు.. పాత విషయాలను మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించడమేనని చెప్పాడు. ఈ వీడియోలో ధవన్ ప్రస్తావించిన వ్యక్తి ఎవరన్న విషయం స్పష్టంగా తెలియనప్పటికీ, అతని మాటల ఆధారంగా తన కొత్త జీవితంలోకి వచ్చిన మరో మహిళ అన్న విషయం క్లియర్గా తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో, ధవన్ కొత్త ఇన్నింగ్స్ (పెళ్లి విషయంలో) ప్రారంభించాడని జనాలు అనుకుంటున్నారు. అయితే, ఇది లీక్డ్ వీడియోనా లేక ఏదైనా అడ్వర్టైజ్మెంట్లో భాగమా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, 8 ఏళ్ల వివాహ బంధం తర్వాత ధవన్ 2021లో భార్య అయేషా ముఖర్జీతో విడిపోయి, అప్పటినుంచి ఒంటిగా ఉంటున్న విషయం తెలిసిందే. -
IPL 2023: ఇంజక్షన్లు తీసుకున్నా.. అద్భుత ప్రభావం.. త్వరలోనే కలుస్తా
IPL 2023- PBKS- Liam Livingstone: పంజాబ్ కింగ్స్కు శుభవార్త. పవర్ హిట్టర్, ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్స్టోన్ త్వరలోనే జట్టుతో చేరనున్నాడు. ఈ విషయాన్ని లివింగ్స్టోన్ స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘ గత రెండు నెలలుగా కఠిన పరిస్థితులు.. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతా.. త్వరలోనే మీతో చేరతా పంజాబ్ కింగ్స్’’ అని సోమవారం ట్వీట్ చేశాడు. కాగా 11.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పంజాబ్ కింగ్స్ లివింగ్స్టోన్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గాయం కారణంగా గతేడాది డిసెంబరు నుంచి ఆటకు దూరమైన అతడు ఇన్నాళ్లు చికిత్స తీసుకున్నాడు. లియామ్ లివింగ్స్టోన్ (PC: IPL) ఇంజక్షన్లు తీసుకున్నా ఈ క్రమంలో కోలుకున్న లివింగ్స్టోన్ లంకాషైర్ క్రికెట్ టీవీ ఇంటర్వ్యూలో ఆదివారం మాట్లాడుతూ.. ‘‘గత వారం ఇంజక్షన్లు తీసుకున్నా. అవి అద్భుతమైన ప్రభావం చూపాయి. రానున్న 48 గంటల్లో ఇండియాకు పయనమవుతా’’ అని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా మరోసారి అప్డేట్ ఇచ్చాడు. దీంతో పంజాబ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పవర్ హిట్టర్ వస్తే తమ బ్యాటింగ్ ఆర్డర్ బలం పెరుగుతుందని పేర్కొంటున్నారు. కాగా ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా లివింగ్స్టోన్ సొంతమని ఇప్పటికే పలుమార్లు రుజువైన విషయం తెలిసిందే. పవర్ హిట్టర్ వచ్చేస్తున్నాడు.. ఇక 29 ఏళ్ల లివింగ్స్టోన్ 2017లో సౌతాఫ్రికాతో టీ20మ్యాచ్తో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2021లో వన్డే, 2022లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఒక టెస్టులో 16 పరుగులు, 12 వన్డేల్లో 250 పరుగులు, 20 టీ20లలో 423 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. తొలి రెండు మ్యాచ్లలో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్.. సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం నాటి మ్యాచ్లో పరాజయం పాలైంది. ప్రస్తుతం ధావన్ సేన పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. పంజాబ్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 13న గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. అన్నీ కుదిరితే ఈ మ్యాచ్లో లివింగ్స్టోన్ ఆడే అవకాశం ఉంది. చదవండి: 4 ఓవర్లలో 69 పరుగులు; తలెత్తుకో చాంపియన్.. కేకేఆర్ ట్వీట్ వైరల్! ఎవరీ యశ్ దయాల్? IPL 2023: హర్షా బోగ్లేకు ధావన్ అదిరిపోయే కౌంటర్! నవ్వుతూనే చురకలు! It’s been a long couple months but it’s time to get back to work… see you soon @PunjabKingsIPL 🙏❤️ — Liam Livingstone (@liaml4893) April 9, 2023 -
IPL 2023: హర్షా బోగ్లేకు ధావన్ అదిరిపోయే కౌంటర్! నవ్వుతూనే చురకలు!
ఐపీఎల్-2023లో భాగంగా ఎస్ఆర్హెచ్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ దావన్ మాత్రం అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్లో ధావన్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభం నుంచి చివరి వరకు క్రీజులో నిలిచి 66 బంతుల్లో అజేయంగా 99 పరుగులు చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న ధావన్ మాత్రం తన పట్టుదలను కోల్పోలేదు. ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టుకు 143 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ను అందించాడు. ఇక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన గబ్బర్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ అవార్డు అందుకునే సమయంలో ప్రముఖ మ్యాచ్ ప్రెజెంటర్, వాఖ్యత హర్షా భోగ్లే, ధావన్ మధ్య ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? ఏప్రిల్ 5న గౌహతి వేదికగా రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో 5 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ధావన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో గబ్బర్ 86 పరుగులు చేశాడు. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ అనంతరం హర్షా భోగ్లే ధావన్ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో "శిఖర్ ధావన్ను తన స్ట్రైక్ రేట్ను మరింత పెంచుకోవాలి. అతడి ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగింది. ముఖ్యంగా గహహుతి వంటి వికెట్పై మరింత దూకుడుగా ఆడాలి. ఆఖరిలో అతడు తన స్ట్రైక్ రేట్ను పెంచాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ఆరంభంలో సింగిల్స్ మాత్రమే తీశాడు. అతడి ఇన్నింగ్స్ చూస్తే..జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడా లేదా అన్న సందేహం కలుగుతుందని" భోగ్లే పేర్కొన్నాడు. ఇక తాజాగా ఎస్ఆర్హెచ్తో పోస్ట్ మ్యాచ్ ప్రేజేటేషన్ సందర్భంగా బోగ్లే వ్యాఖ్యలకు గబ్బర్ కౌంటర్ ఇచ్చాడు. "ఇప్పుడు నా స్ట్రైక్ రేట్తో మీరు సంతోషంగా ఉన్నారా" అని ధావన్ నవ్వుతూ బోగ్లేను ప్రశ్నించాడు. అందుకు బదులుగా "ఈ మ్యాచ్లో మీ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో మీరు ఆడిన ఇన్నింగ్స్ వర్ణాతీతం. నిజంగా మీ స్ట్రైక్ రేట్ పట్ల సంతోషంగా ఉన్నాను" అంటూ బోగ్లే సమాధానం ఇచ్చాడు. చదవండి: IPL 2023 GT vs KKR: నరాలు తెగ ఉత్కంఠ.. సంచలన విజయం! కన్నీళ్లు పెట్టుకున్న జుహీ చావ్లా -
పంజాబ్కు గుడ్న్యూస్.. అతడు వచ్చేశాడు! హైదరాబాద్కు చేరుకున్నధావన్ సేన
IPL 2023- Punjab Kings- Liam Livingstone- Kagiso Rabada: వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్కు శుభవార్త. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ భారత్కు వచ్చేశాడు. జట్టుతో కలిసి హైదరాబాద్కు చేరుకున్నాడు. అదే విధంగా ధావన్ సేనకు సంబంధించిన మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. భారీ మొత్తం వెచ్చించి కింగ్స్ కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ రాకకోసం మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా కోలుకోలేదు మోకాలి గాయం కారణంగా రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న లివింగ్స్టోన్ ఇంకా పూర్తి కోలుకోలేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఓల్డ్ ట్రఫోర్డ్లో చికిత్స పొందుతున్న లివింగ్స్టోన్ ఏప్రిల్ 15 తర్వాతే భారత్కు వెళ్లే అవకాశం ఉందని క్రిక్బజ్తో పేర్కొన్నారు. కాగా గాయం కారణంగా గతేడాది డిసెంబరు నుంచి లియామ్ లివింగ్స్టోన్ ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న అతడు.. ఏప్రిల్ మొదటి వారంలోనే పంజాబ్ కింగ్స్తో చేరతాడనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం అతడి రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబడ మాత్రం తదుపరి మ్యాచ్లో అందుబాటులోకి రానున్నాడు. కాగా ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్ హైదరాబాద్ వేదికగా.. సన్రైజర్స్తో మ్యాచ్లో తలపడనుంది. హైదరాబాద్కు చేరుకున్న ధావన్ సేన ఈ నేపథ్యంలో ధావన్ సేన.. హైదరాబాద్కు చేరుకుంది. సంప్రదాయ పద్ధతిలో గబ్బర్ బృందానికి స్వాగతం లభించింది. కాగా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2023 సీజన్ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై 7 పరుగుల తేడాతో గెలుపొందిన పంజాబ్.. రెండో మ్యాచ్లో రాజస్తాన్పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వల్ప తేడాలతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా 11.50 కోట్ల రూపాయల భారీ మొత్తం చెల్లించి పంజాబ్ లివింగ్స్టోన్ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక రబడ కోసం 9.25 కోట్లు ఖర్చు చేసింది. చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే కోహ్లి వచ్చాడు.. కోపంగా బ్యాట్ విసిరేశాడు.. పక్కనే కూర్చున్న నాతో.. Sadda Captain has spoken. 🫡 📍Hello, Hyderabad. 👋🏻#JazbaHaiPunjabi #SaddaPunjab #TATAIPL | @SDhawan25 pic.twitter.com/4GpSvq1Q9J — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 All eyes on KG! 👀#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL I @KagisoRabada25 pic.twitter.com/wwhpjjLRTv — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 Sadde 🦁s enjoyed a warm Hyderabadi welcome! 😊 🙏#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/wuvpq4Fyb7 — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 -
అన్నా.. ప్రతిసారీ గిట్లనే అయితాంది.. ఎందుకంటావ్?! సంజూ ట్వీట్ వైరల్
IPL 2023- RR Vs PBKS: పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. సంజూతో పాటు శిఖర్ ధావన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్- పంజాబ్ అసోంలోని గువాహటి వేదికగా బుధవారం తలపడ్డాయి. పంజాబ్ ఓపెనర్లు సూపర్ హిట్ రాయల్స్కు హోం గ్రౌండ్ అయిన బర్సపరా స్టేడియంలో టాస్ గెలిచిన సంజూ.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు ఓపెనర్లు ప్రబ్సిమ్రన్ సింగ్(60), కెప్టెన్ శిఖర్ ధావన్ (86 నాటౌట్) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. మిగిలిన వాళ్లలో జితేశ్ శర్మ(27) ఒక్కడు 20 పరుగుల మార్కు దాటాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పంజాబ్ 197 పరుగులు చేసింది. ఇక ఫీల్డింగ్ సమయంలో రాజస్తాన్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ వేలికి గాయం కావడంతో.. యశస్వి జైశ్వాల్(11)కు జతగా ఓపెనింగ్కు దిగిన అశ్విన్ డకౌట్ అయ్యాడు. ఇక వన్డౌన్లో వచ్చిన బట్లర్ సైతం తక్కువ స్కోరుకే పరిమితం కాగా కెప్టెన్ సంజూ 25 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. ఆశలు పెంచిన హెట్మెయిర్, ధ్రువ్.. కానీ పడిక్కల్ 21 , రియాన్ పరాగ్ 20 పరుగులు చేయగా.. ఆఖర్లో షిమ్రన్ హెట్మెయిర్(18 బంతుల్లో 36 పరుగులు), ధ్రువ్ జురెల్ (15 బంతుల్లో 32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి పోరాటంతో గెలుపు అంచుల వరకు వచ్చిన రాజస్తాన్ ఆఖరికి ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గెలిచే మ్యాచ్లో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో సంజూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. పంజాబ్ కెప్టెన్, టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్తో ఉన్న ఫొటోను పంచుకున్న ఈ కేరళ బ్యాటర్.. ‘‘పాజీ(అన్నా).. మన మధ్య ప్రతిసారీ ఇలాంటి ఉత్కంఠ రేపే మ్యాచ్లే ఎందుకు జరుగుతాయంటావు?’’ అని చమత్కరించాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘ఆటలో గెలుపోటములు సహజం.. కానీ ఆటగాళ్ల ప్రేమాభిమానాలు, క్రీడాస్ఫూర్తి ఇలా శాశ్వతం’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు రాజస్తాన్- పంజాబ్ ఐపీఎల్లో 25 మ్యాచ్లలో తలపడగా.. రాయల్స్ 14, కింగ్స్ 11 మ్యాచ్లలో గెలిచాయి. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్కు శ్రేయస్ అయ్యర్ దూరం.. టీమిండియాలోకి ఆంధ్ర ఆటగాడు తొలి మ్యాచ్లోనే చుక్కలు చూపించాడు.. ఎవరీ ధ్రువ్ జురెల్? వీడియో వైరల్ “Paaji, har baar itne tight matches kyun?” 🫢 pic.twitter.com/Fn6zrc9La9 — Sanju Samson (@IamSanjuSamson) April 6, 2023 That's that from Match 8. @PunjabKingsIPL win their second game on the trot as they beat #RR by 5 runs. Scorecard - https://t.co/Cmk3rElYKu #TATAIPL #RRvPBKS #IPL2023 pic.twitter.com/R9j1jFpt5C — IndianPremierLeague (@IPL) April 5, 2023 -
Sam Curran: పర్లేదు.. పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తున్నాడు..!
ఐపీఎల్-2023లో అత్యధిక ధర పలికిన పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ (18.5 కోట్లు).. తనపై పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తున్నాడు. ఇప్పటివరకు అతను ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపిస్తున్నాడు. ఐపీఎల్-2023లో ఇతర ఖరీదైన ఆటగాళ్లలా కాకుండా అంచనాలను తగ్గట్టుగా రాణిస్తూ నాట్ బ్యాడ్ అనిపిస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కర్రన్ తర్వాత అత్యంత ఖరీదైన ఆటగాళ్లు కెమారూన్ గ్రీన్ (ఎంఐ, 17.5 కోట్లు), కేఎల్ రాహుల్ (లక్నో, 17 కోట్లు), బెన్ స్టోక్స్ (16.25 కోట్లు) అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతుంటే.. కర్రన్ ఓకే అనిపిస్తున్నాడు. కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో బ్యాట్తో (17 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్సర్లు), బంతితో (1/38) ఓ మోస్తరుగా రాణించిన అతను.. నిన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఉత్కంఠ సమరంలో ఆఖరి ఓవర్లో 16 పరుగులకు డిఫెండ్ చేసి (10 పరుగులు మాత్రమే ఇచ్చాడు) తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి, రన్నింగ్ ఎడిషన్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో కర్రన్ ఆఖరి ఓవర్లో 16 పరుగులు డిఫెండ్ చేసిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఆఖరి ఓవర్ అద్భుతమైన మెచ్యూరిటీతో బౌల్ చేశాడని కితాబునిస్తున్నారు. కర్రన్ ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తే ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ టైటిల్ కల సాకారమవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే, పంజాబ్-రాజస్థాన్ జట్ల మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగిన టఫ్ ఫైట్లో పంజాబ్ విజయం సాధించింది. 198 పరుగుల లక్ష్యఛేదనలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదులుకున్న రాజస్థాన్ను హెట్మైర్ (18 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు), ఇంపాక్ట్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ (15 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ ఆటతో గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. కర్రన్ తెలివైన బౌలింగ్తో రాజస్థాన్ గెలుపును అడ్డుకున్నాడు. -
పంజాబ్ కింగ్స్లో కీలక మార్పు.. గాయపడ్డ ఆల్రౌండర్ రీప్లేస్మెంట్ ఎవరంటే..?
పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. భుజం గాయంతో బాధపడుతూ సీజన్ మొత్తానికే దూరమైన యువ ఆల్రౌండర్ రాజ్ అంగద్ బవా స్థానంలో పంజాబ్కు చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ గుర్నూర్ సింగ్ బ్రార్ను ఎంపిక చేసుకుంది పీబీఎస్కే యాజమాన్యం. బ్రార్ను బేస్ ధర 20 లక్షలకు సొంతం చేసుకున్నట్లు పంజాబ్ యాజమాన్యం వెల్లడించింది. గత ఐపీఎల్ సీజన్ (2022) రెండు మ్యాచ్లు ఆడిన బవా.. ప్రస్తుత ఎడిషన్ ప్రారంభానికి ముందే గాయపడిన విషయం తెలిసిందే. (రాజ్ అంగద్ బవా) గుర్నూర్ సింగ్ బ్రార్ విషయానికొస్తే.. ఈ పంజాబ్ ఆల్రౌండర్ 2022 డిసెంబర్లో పంజాబ్ తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ తరఫున ఇప్పటివరకు 5 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన బ్రార్ 120.22 స్ట్రయిక్రేట్తో 107 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్లో 3.80 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. (గుర్నూర్ సింగ్ బ్రార్) ఇదిలా ఉంటే, రన్నింగ్ ఎడిషన్లో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్లో కేకేఆర్పై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భానుక రాజపక్ష (50), కెప్టెన్ శిఖర్ ధవన్ (40) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన కేకేఆర్ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్థతిలో పంజాబ్ను విజేతగా ప్రకటించారు. 3 వికెట్లు పడగొట్టిన కేకేఆర్ పతనానికి బీజం వేసిన అర్షదీప్ సింగ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
RR Vs PBKS: చహల్ ఉండగా భయమేల! కానీ అసోంలో మాత్రం..
Rajasthan Royals vs Punjab Kings Predicted Playing XI: ఐపీఎల్-2023 సీజన్ను భారీ విజయంతో ఆరంభించిన రాజస్తాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్తో పోటీకి సిద్ధమైంది. గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరుగనుంది. ఇక తమ తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై స్వల్ప తేడాతో గెలుపొందిన పంజాబ్ సైతం రాజస్తాన్తో ఢీ అంటే ఢీ అంటోంది. కాగా తమకు హోం గ్రౌండ్గా ఉన్న ఈ స్టేడియంలో రాజస్తాన్ రెండు మ్యాచ్లు ఆడిన తర్వాత సొంతమైదానం జైపూర్లో మిగిలిన మ్యాచ్లు ఆడనుంది. ఇదిలా ఉంటే.. మరి అసోంలో వాతావరణం, బర్సపరా స్టేడియంలో పిచ్ పరిస్థితి, తుది జట్లు ఎలా ఉండబోతున్నాయన్న వివరాలు గమనిద్దాం. పిచ్ పరిస్థితి? గతంలో పలు అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన అసోం స్టేడియంలో వికెట్ కాస్త బౌన్సీగా ఉంటుంది. పేసర్లకు అనుకూలం. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు సహకరిస్తుంది. గతేడాది అక్టోబరులో ఇక్కడ టీమిండియా- సౌతాఫ్రికా మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో ఒక్కో జట్టు 200 పరుగుల కంటే ఎక్కువ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 16 పరుగుల తేడాతో గెలిచింది. కాబట్టి ఈసారి కూడా హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం లేకపోలేదు. వాతావరణం అసోంలో వర్ష సూచన లేదు. కాబట్టి రాజస్తాన్- పంజాబ్ మ్యాచ్కు వరుణుడి ఆటంకం ఉండకపోవచ్చు. యుజీ ఉండగా భయమేల? వాళ్ల తర్వాత చహల్ మాత్రమే పంజాబ్ కింగ్స్పై రాజస్తాన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్కు అద్భుతమైన రికార్డు ఉంది. పంజాబ్తో మ్యాచ్లో యుజీ ఇప్పటి వరకు 28 వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్(34), సునిల్ నరైన్ (33) తర్వాత పంజాబ్పై ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ చహల్. ఇక సన్రైజర్స్తో మ్యాచ్లో 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చి విశ్వరూపం చూపించిన చహల్.. పంజాబ్పై కూడా చెలరేగితే రాజస్తాన్కు తిరుగు ఉండదు. ఇక పేస్ విభాగంలో బౌల్ట్, హోల్డర్, ఆసిఫ్, సైనీ(తొలి మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్) ఉండనే ఉన్నారు. ఇక రాజస్తాన్ టాపార్డర్లో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్.. వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ఫామ్లో ఉండటం సానుకూలాంశం. వెరసి ‘హోం గ్రౌండ్’లో రాజస్తాన్దే పైచేయి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, టాపార్డర్ను దెబ్బకొట్టడం సహా ఫినిషర్ హెట్మెయిర్ను కట్టడి చేస్తే పంజాబ్ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి. ఇక మ్యాచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్లు ఎలాంటి పాత్ర పోషించనున్నారో వేచిచూడాలి. తుది జట్ల అంచనా: రాజస్తాన్ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎమ్ ఆసిఫ్, యజ్వేంద్ర చాహల్. పంజాబ్ శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్సే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సికందర్ రజా, షారుక్ ఖాన్, సామ్ కరన్, నాథన్ ఎల్లిస్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, అర్ష్దీప్ సింగ్. చదవండి: అందుకే అక్షర్తో బౌలింగ్ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు! -
సూపర్ క్రేజ్.. సంపాదన కోట్లలో.. ఐపీఎల్ కెప్టెన్ల ‘బలగం’.. బలం! పాపం అతడొక్కడే!
IPL 2023 10 Teams Captains- Families: వేసవిలో వినోదం పంచేందుకు ఐపీఎల్ పండుగ వచ్చేసింది. పది జట్ల మధ్య పోటాపోటీ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత మజాను అందించనుంది. పొట్టి ఫార్మాట్ మెగా సమరానికి శుక్రవారం(మార్చి 31) తెరలేవనుంది. గతేడాది చాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభ మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. మరి ఐపీఎల్-2023లో ఆయా జట్లకు సారథ్యం వహించనున్న కెప్టెన్లు, వారి జీతం, నికర సంపాదన.. తదితర వివరాలు.. అదే విధంగా ఫ్రాంఛైజీల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా.. వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ.. నిరాశకు లోనైన వేళ అండగా నిలిచే ‘బలగం’.. అదేనండీ వారి కుటుంబాలు, వ్యక్తిగత వివరాల గురించి తెలుసుకుందాం! గుజరాత్ టైటాన్స్ కెప్టెన్: హార్దిక్ పాండ్యా ►టీమిండియా స్టార్ ఆల్రౌండర్ ►గత సీజన్లో క్యాష్ రిచ్లో తొలిసారి అడుగుపెట్టిన గుజరాత్కు టైటిల్ అందించిన సారథి. ►గుజరాత్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ అందుకుంటున్న మొత్తం: 15 కోట్లు ►2015లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన హార్దిక్ సుదీర్ఘకాలం పాటు ముంబై ఇండియన్స్కు ఆడాడు. ముంబై జట్టులో కీలస సభ్యుడిగా ఎదిగిన పాండ్యా నికర సంపాదన సుమారు 67 కోట్లు! ముచ్చటైన కుటుంబం గుజరాత్కు చెందిన హార్దిక్ పాండ్యా మధ్యతరగతి కుటుంబం నుంచి ఈ స్థాయికి చేరుకున్నాడు. పాండ్యా సక్సెస్ జర్నీలో అతడి తల్లిదండ్రులు, సోదరుడు, టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్యతో పాటు భార్య నటాషా స్టాంకోవిక్ పాత్ర కూడా ఉంది. విరామం దొరికితే చాలు తన సమయం మొత్తాన్ని కుటుంబానికే కేటాయిస్తాడు హార్దిక్. భార్య నటాషా, కొడుకు అగస్త్యతో గడుపుతాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్: మహేంద్ర సింగ్ ధోని ►టీమిండియా మాజీ సారథి, భారత్కు మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన ఏకైక కెప్టెన్గా మిస్టర్ కూల్ ఘనత. ►చెన్నై జట్టును నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు ధోని ఐపీఎల్ సాలరీ: 12 కోట్ల రూపాయలు. ►క్రికెటర్గా, వ్యాపారవేత్తగా, ఎండార్స్మెంట్ల రూపంలోనూ చేతినిండా సంపాదించే ధోని నెట్వర్త్ 2022 నాటికి: దాదాపు 1030 కోట్లు అందమైన ఫ్యామిలీ రాంచిలోని సగటు మధ్య తరగతి కుటుంబానికి చెందిన ధోని.. అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. భార్య సాక్షి, కుమార్తె జీవాతో ఎక్కువ సమయం గడుపుతాడు ధోని. సాక్షితో పాటు జీవా కూడా తన తండ్రిని చీర్ చేస్తూ ఐపీఎల్లో సందడి చేస్తూ ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్: కేఎల్ రాహుల్ ►టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ►గతంలో పంజాబ్ కింగ్స్ సారథిగా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ప్రస్తుతం 17 కోట్ల జీతం అందుకుంటున్నాడు. ఆర్సీబీతో 2014లో ఐపీఎల్ ప్రయాణం మొదలుపెట్టిన రాహుల్ నికర సంపాదన సుమారుగా 75 కోట్లు అని అంచనా. ►కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ ఏడాది ఆరంభంలో పెళ్లి చేసుకున్నాడు. బాలీవుడ్ నటి అతియా శెట్టితో కలిసి ఏడడుగులు వేశాడు. రాహుల్ తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు. ముంబై ఇండియన్స్ కెప్టెన్: రోహిత్ శర్మ ►టీమిండియా ప్రస్తుత కెప్టెన్ ►ముంబై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించిన సారథి ►ఐపీఎల్లో అత్యధికసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్గా రోహిత్ శర్మ ఘనత ►15 సీజన్లపాటు ఐపీఎల్ ఆడిన హిట్మ్యాన్ ప్రస్తుత సాలరీ 16 కోట్లు. ►టీమిండియా సారథి అయిన రోహిత్ నికర సంపాదన దాదాపుగా 214 కోట్ల రూపాయలు. ►రోహిత్ శర్మకు భార్య రితికా సజ్దే, కుమార్తె సమైరా శర్మ అంటే ప్రాణం. ఈ మహారాష్ట్ర బ్యాటర్ను చీర్ చేస్తూ వీళ్లిద్దరు ఐపీఎల్లో చేసే సందడి అంతా ఇంతాకాదు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్: శిఖర్ ధావన్ తొలిసారి పంజాబ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన టీమిండియా వెటరన్ ఓపెనర్ ధావన్. 2008లో ఢిల్లీ డేర్డెవిల్స్తో క్యాష్ రిచ్లీగ్లో అడుగుపెట్టిన గబ్బర్.. ప్రస్తుత ఐపీఎల్ సాలరీ 8.25 కోట్లు. నెట్వర్త్ సుమారు 105 కోట్లు అని అంచనా. విఫలమైన బంధం శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాకు చెందిన అయేషాను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తర్వాత ధావన్తో ఆమెకు కలిగిన సంతానం జొరావర్. చాలా అన్యోన్యంగా మెలిగే ధావన్- అయేషా మనస్పర్థల కారణంగా గతేడాది విడిపోయారు. భార్యకు దూరమై ఒంటరిగా మిగిలిపోయిన గబ్బర్కు ఫ్యామిలీ మద్దతులగా నిలబడింది. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్: శ్రేయస్ అయ్యర్ అయ్యర్ గాయం కారణంగా దూరం కావడంతో నితీశ్ రాణాకు కేకేఆర్ పగ్గాలు. ఐపీఎల్-2023లో కోల్కతాను ముందుండి నడిపించనున్న నితీశ్(సాలరీ 3.4 కోట్ల రూపాయలు). శ్రేయస్ అయ్యర్ 2015లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అతడి ప్రస్తుత సాలరీ. 12.5 కోట్లు. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ అయిన అయ్యర్ నెట్వర్త్ దాదాపు 53 కోట్లు. అయ్యర్ ఎదుగుదలలో అతడి తల్లిదండ్రులు, సోదరి పాత్ర కూడా ఉందని పలు సందర్భాల్లో చెప్పాడు. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్: సంజూ శాంసన్ ►టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర సంజూ శాంసన్ ►కేరళకు చెందిన సంజూ రాజస్తాన్ రాయల్స్ సారథిగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. గతేడాది రాయల్స్ను ఫైనల్కు చేర్చి సత్తా చాటాడు. ►సంజూ తన స్నేహితురాలు చారులతను ప్రేమించి పెళ్లాడాడు. సంజూ ఐపీఎల్ సాలరీ 14 కోట్లు కాగా.. నికర సంపాదన దాదాపుగా 72 కోట్లు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్: ఫాఫ్ డుప్లెసిస్ సౌతాఫ్రికా బ్యాటర్ డుప్లెసిస్ ఆర్సీబీని గతేడాది ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. 2011లో చెన్నై తరఫున ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన ఫాఫ్.. ప్రస్తుత ఐపీఎల్ సాలరీ 7 కోట్లు. ఈ ప్రొటిస్ బ్యాటర్ నెట్వర్త్ సుమారు 130 కోట్ల రూపాయలు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్: రిషభ్ పంత్ గైర్హాజరీలో డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ వార్నర్ గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ సారథిగా ఉన్న వార్నర్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అందుకుంటున్న జీతం.. 6.25 కోట్లు. ముగ్గురు కుమార్తెలు డేవిడ్ వార్నర్ పక్కా ఫ్యామిలీమ్యాన్. అతడి భార్య పేరు కాండిస్. ఈ జంటకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో వెకేషన్కు చెక్కేస్తాడు వార్నర్. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్: ఎయిడెన్ మార్కరమ్ ►సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ను విజేతగా నిలిపిన మార్కరమ్. ►ఐపీఎల్-2023లో హైదరాబాద్ సారథిగా ఎంపికైన మార్కరమ్. ►అతడి ఐపీఎల్ సాలరీ 2.6 కోట్లు కాగా.. ఈ ప్రొటిస్ బ్యాటర్ నికర ఆస్తి 30 కోట్లు. ►మార్కరమ్ గర్ల్ఫ్రెండ్ నికోలీ డానియెల్ ఒ కనార్. చదవండి: IPL 2023: ఈసారి టైటిల్ గెలిచే అవకాశాలు వాళ్లకే: ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ IPL 2023: తెర వెనుక నాయకులను చూసేద్దామా.. -
అలా అయితే, తప్పక రాజకీయాల్లోకి వస్తా.. శిఖర్ ధవన్ సంచలన స్టేట్మెంట్
గత కొద్ది రోజులుగా ఏదో విషయంతో వార్తల్లో నిలుస్తున్న టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్.. తాజాగా మరో ఆసక్తికర స్టేట్మెంట్ ద్వారా క్రికెట్తో పాటు పొలిటికల్ సర్కిల్స్లోనూ హీట్ పుట్టించాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన గబ్బర్.. భగవంతుడి చిత్తమై, తన విధిలో రాసిపెట్టివుంటే, తప్పక రాజకీయాల్లోకి వస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీలో పుట్టిపెరిగిన 37 ఏళ్ల ధవన్ రాజకీయాలపై తన మనసులో మాట బయటపెట్టడంతో పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ధవన్ ఏ పార్టీలో చేరాడు, ఏ పార్టీతో టచ్లో ఉన్నాడు, ఏ పార్టీలో చేరకపోతే ఎవరు అతనికి గాలం వేస్తున్నారు..? ఇలా రకరకాల డిస్కషన్లతో గబ్బర్ అభిమానులు నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నారు. అయితే గబ్బర్ తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన వెంటనే మరో విషయం కూడా స్పష్టం చేశాడు. ఇప్పటికైతే రాజకీయాలపై తనకు ఎలాంటి ప్లాన్లు లేవని, తాను ఏ రాజకీయ పార్టీని సంప్రదించలేదని, ఒకవేళ నేను రాజకీయాల్లోకి రావడం దేవుడి చిత్తమైతే అందులోనూ వంద శాతం ఎఫర్ట్ పెట్టి సక్సెస్ సాధిస్తానని పేర్కొన్నాడు. ఐపీఎల్-2023 ప్రారంభానికి ముందు ఇలాంటి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన గబ్బర్.. మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న 16వ ఎడిషన్లో పంజాబ్ కింగ్స్కు సారధ్యం వహించనున్నాడు. కాగా, గత కొద్ది రోజులుగా ఏదో ఓ ఆసక్తికర స్టేట్మెంట్తో వార్తల్లో నిలుస్తున్న ధవన్.. తొలుత చెడిన తన ఫ్యామిలీ లైఫ్పై స్పందించాడు. ఆతర్వాత తానే సెలెక్టర్నైతే, ఓపెనర్గా తన కంటే శుభ్మన్ గిల్ బెటర్ అని వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే, టాటూ వేయించుకున్నందుకు హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్నానని చెప్పాడు. తాజాగా రాజకీయాలపై తన మనసులో మాటను బయటపెట్టి వార్తల్లో హెడ్లైన్గా మారాడు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 1న కేకేఆర్తో జరిగే మ్యాచ్తో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2023 జర్నీ ప్రారంభిస్తుంది. -
బంపర్ ఆఫర్ కొట్టిన సంజూ శాంసన్
టీమిండియాలో సమీకరణలు, ఇతరత్రా కారణాల చేత సరైన అవకాశాలు రాక నిరాశలో కూరుకుపోయిన టాలెంటెడ్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్కు బీసీసీఐ ఎట్టకేలకు ఓ విషయంలో న్యాయం చేసింది. జట్టుకు ఎంపికైనా రకరకాల కారణాల చేత తుది జట్టులో అడే అవకాశాలను కోల్పోతున్న సంజూకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చి తగిన గుర్తింపునిచ్చింది. సంజూకు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ.. గ్రేడ్ సి కేటగిరీ ఆటగాళ్ల జాబితాలో చోటు కల్పించింది. ఈ ఒప్పందం మేరకు సంజూకు రూ. కోటి వార్షిక వేతనం లభించనుంది. సంజూతో పాటు దీపక్ హుడా, కేఎస్ భరత్, అర్షదీప్ సింగ్లకు బీసీసీఐ తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది. వీరిని కూడా బీసీసీఐ గ్రేడ్ సి కేటగిరిలో చేర్చింది. వీరికి కూడా ఏటా కోటి రూపాయల వేతనం లభించనుంది. తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ల జాబితాలో చాలా మార్పులు చేసిన బీసీసీఐ.. ఏ గ్రేడ్లో ఉన్న రవీంద్ర జడేజాను ఏ ప్లస్ (7 కోట్లు) గ్రేడ్కు ప్రమోట్ చేయగా.. వరుస వైఫల్యాల బాట పట్టిన కేఎల్ రాహుల్ను ఏ గ్రేడ్ నుంచి బీ గ్రేడ్కు డిమోట్ చేసింది. ఇటీవల ఆసీస్తో జరిగిన సిరీస్లో విశేషంగా రాణించిన అక్షర్ పటేల్ను బీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్కు ప్రమోట్ చేసిన బీసీసీఐ.. వెటరన్ ఆటగాళ్లు ఆజింక్య రహానే, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్లను పూర్తిగా కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించింది. ఆశ్చర్యకరంగా ఏ ఫార్మాట్లో కూడా అవకాశాలు దక్కని మరో వెటరన్ ప్లేయర్ శిఖర్ ధవన్ బీసీసీఐతో సి గ్రేడ్ కాంట్రక్ట్ను నిలబెట్టుకున్నాడు. కాంట్రాక్ట్ జాబితా (మొత్తం 26 మంది) ►‘ఎ ప్లస్’ గ్రేడ్ (రూ. 7 కోట్లు): రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా. ►‘ఎ’ గ్రేడ్ (రూ. 5 కోట్లు): హార్దిక్ పాండ్యా, అశ్విన్, షమీ, రిషభ్ పంత్, అక్షర్ పటేల్. ►‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు): పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుబ్మన్ గిల్. ►‘సి’ గ్రేడ్ (రూ. 1 కోటి): ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కోన శ్రీకర్ భరత్. -
'మా నాన్న కొట్టాడు.. నేను హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను'
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఐపీఎల్-2023 సీజన్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో పంజాబ్ కింగ్స్కు ధావన్ నాయకత్వం వహించనున్నాడు. మయాంక్ అగర్వాల్ స్థానంలో ధావన్ను పంజాబ్ తమ కెప్టెన్గా నియమించింది. ఇప్పటికే పంజాబ్ జట్టుతో కలిసిన గబ్బర్.. తమ హోం గ్రౌండ్ మొహాలీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. పంజాబ్ తమ తొలి మ్యాచ్లో ఏప్రిల్1న కేకేఆర్తో తలపడనుంది. ఇక ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధావన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తన 15 ఏళ్ల వయస్సులో టాటూ కారణంగా హెచ్ఐవి పరీక్ష చేయించుకున్నట్లు గబ్బర్ తెలిపాడు. "నేను 15 ఏళ్ల వయస్సులో నా ఫ్యామిలీతో కలిసి మనాలి టూర్కు వెళ్లాను. అయితే నా కుటుంబ సభ్యులకు తెలియకుండా నేను నా భుజంపై టాటూ వేయించుకున్నాను. నేను అది కనిపించకుండా దాదాపు 3 నుంచి 4 నెలలవరకు దాచి ఉంచాను. ఒక రోజు మా నాన్నకు నా పచ్చబొట్టు విషయం తెలిసిపోయింది. ఆయన నన్ను తీవ్రంగా కొట్టాడు. టాటూ వేయించుకున్న తర్వాత నేను కూడా కొంచెం భయపడ్డాను. ఎందుకంటే టాటూ వేసే వ్యక్తి ఎటువంటి సూదితో శాడో నాకు తెలియదు. కాబట్టి మా నాన్నతో కలిసి వెళ్లి హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. అది నెగెటివ్గా తేలింది" అని ఆజ్ తక్ షో 'సీధీ బాత్’లో ధావన్ పేర్కొన్నాడు. చదవండి: PAK vs AFG: టీ20ల్లో పాక్ బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా -
టీమిండియాలో నో ఛాన్స్.. హిందీ సీరియల్లో నటిస్తున్న శిఖర్ ధావన్!
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ దావన్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న ధావన్ను భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో పలు సిరీస్లో కెప్టెన్గా వ్యవహరించిన ధావన్.. ఇప్పుడు పూర్తిగా జట్టులోనే చోటు కోల్పోయాడు. దావన్ చివరగా గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా తరపున ఆడాడు. అనంతరం అతడు స్థానాన్ని యువ ఓపెనర్ శుబ్మన్ గిల్తో సెలక్టర్లు భర్తీ చేశారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా దావన్ వ్యవహరించబోతున్నాడు. గత సీజన్లో తమ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ స్ధానంలో గబ్బర్ను పంజాబ్ నియమించింది. ఈ ఏడాది సీజన్కు ముందు మయాంక్ అగర్వాల్ను పంజాబ్ విడిచిపెట్టింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి31 నుంచి ప్రారంభం కానుంది. సీరియల్లో నటిస్తున్న ధావన్... కాగా ఐపీఎల్ ఆరంభానికి ముందు ధావన్ ఓ హిందీ ఓ హిందీ సీరియల్లో నటిస్తూ బిజీబీజీగా ఉన్నాడు. జీ ఛానెల్లో ప్రసారమయ్యే హిందీ సీరియల్ ‘కుండలి భాగ్య’లో ఓ పోలీస్ అధికారి పాత్రలో గబ్బర్ కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ధావన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ధావన్ పోలీస్ లూక్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇ ధావన్ క్రికెట్కు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా ఎక్టివ్గా ఉంటాడు. ఎప్పటికప్పుడు డ్యాన్స్, ఇన్స్టా రీల్స్తో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఇప్పడు మరో కొత్త రోల్లో అభిమానలను గబ్బర్ అలరించబోతున్నాడు. చదవండి: Virender Sehwag: కుంబ్లేతో గొడవలు.. హెడ్కోచ్గా నన్ను రమ్మని కోహ్లి కోరాడు View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
చేయాల్సిందంతా చేశాను.. నాకంటే బెటర్ ఆప్షన్ దొరికినప్పుడు.. శిఖర్ ధవన్ వైరాగ్యం
Shikar Dhawan: టీమిండియాలో చోటు దక్కకపోవడంపై వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ తొలిసారి స్పందించాడు. వన్డే జట్టులో స్థానం కోల్పోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధవన్ మాట్లాడుతూ.. టీమిండియా తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు చేయాల్సిందంతా చేశాను.. నా అత్యుత్తమ ప్రదర్శన కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిన వారికి టీమిండియాలో చోటు దొరికితే నాకెలాంటి ఇబ్బంది లేదు.. కెరీర్లో ఎత్తుపల్లాలు సహజం.. టీమిండియా చోటు దక్కనందుకు నాకెంత మాత్రం బాధ లేదు, యువ క్రికెటర్లు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడుతున్నారని అన్నాడు. గబ్బర్ చేసిన ఈ వ్యాఖ్యల్లో వైరాగ్యం స్పష్టమవుతున్నప్పటికీ.. భవిష్యత్తులో టీమిండియాలో చోటుపై అతను ధీమా వ్యక్తం చేయడం కొసమెరుపు. టీమిండియాలో చోటుపై ధవన్ నిజాయితీగా చేసిన ఈ వ్యాఖ్యల పట్ల క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో స్థానంపై ఇంత నిజాయితీగా మాట్లాడే క్రికెటర్ను చూడలేమని సోషల్మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. కాగా, ఫామ్ లేమి, వయసు మీద పడటం, పూర్ స్ట్రయిక్ రేట్ వంటి ప్రధాన అంశాల కారణంగా ధవన్ గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. మధ్యమధ్యలో భారత-బి జట్టుకు సారధ్యం వహించిన గబ్బర్.. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. 2018 నుంచి టెస్ట్లకు, 2021 నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న గబ్బర్.. గతేడాది స్వదేశంలో వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో జరిగిన వన్డే సిరీస్ల్లో టీమిండియాకు సారధ్యం వహించాడు. ఆ మూడు సిరీస్ల్లో గబ్బర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మధ్యలో ఇషాన్ కిషన్ (బంగ్లాదేశ్), శుభ్మన్ గిల్ (న్యూజిలాండ్)లు వన్డేల్లో డబుల్ సెంచరీలతో విరుచుకుపడటంతో ధవన్కు దారులు మూసుకుపోయాయి. ఏదో అడపాదడపా ప్రదర్శనలతో కనీసం వన్డే జట్టులోనైనా కొనసాగుదామనుకున్న ధవన్ ఆశలపై యువ క్రికెటర్లు నీళ్లుచల్లారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సమీప భవిష్యత్తులో ధవన్కు టీమిండియా నుంచి పిలుపు వచ్చే ఛాయలు కనబడటం లేదు. టీమిండియా ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ స్థానం పక్కా కాగా.. గిల్ ఫార్మాట్లకతీతంగా అత్యుత్తమ ప్రద్శనలతో సత్తా చాటుతూ జట్టులో పాతుకుపోయాడు. దీంతో ధవన్ కెరీర్కు ఎండ్ కార్డ్ పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ధవన్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉన్నాడు. -
గిల్, ఇషాన్లు ఇద్దరు స్టార్ క్రికెటర్లను తొక్కేశారు.. చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు
జీ న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సంచలన విషయాలను బహిర్గతం చేశాడు. టీమిండియా, బీసీసీఐల్లో జరిగిన, జరుగుతున్న ఎన్నో విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత క్రికెట్, బీసీసీఐల్లోని పెద్ద తలకాయలకు సంబంధించిన విషయాల్లో బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను వెల్లడించాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, టీమిండియా ప్రస్తుత, మాజీ సారధులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు సంబంధించిన ఆసక్తికర అంశాలను వివరించాడు. కెప్టెన్సీ విషయంలో నాటి బీసీసీఐ బాస్ గంగూలీ.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మధ్య వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అగ్గి రాజేశాడు. కోహ్లి టీ20 కెప్టెన్సీ వదిలేస్తానన్నప్పుడు బీసీసీఐ అతన్ని పునరాలోచించుకోవాలని కోరిందని, అలాగే వన్డే సారధ్య బాధ్యతల నుంచి తప్పించేముందు బోర్డు కోహ్లితో మాట్లాడిందని నాడు కోహ్లి ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి-రోహిత్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వారిలో ఇగో ఉందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాస్తవానికి గంగూలీకి రోహిత్ శర్మపై ఎలాంటి ప్రత్యేక ఇంట్రెస్ట్ లేనప్పటికీ.. కోహ్లిపై మాత్రం వ్యతిరేకత ఉండిందంటూ బాంబు పేల్చాడు. టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేసి కోహ్లి బీసీసీఐపై పైచేయి సాధించాలని భావించాడని, అది నచ్చక పోవడం వల్లనే గంగూలీ-కోహ్లిల మధ్య గ్యాప్ పెరిగిందని అన్నాడు. అలాగే టీమిండియా ఆటగాళ్లు ఫిట్నెస్ ప్రూవ్ చేసుకునేందుకు ఇంజక్షన్లు వాడతారని, అవి డోపింగ్ టెస్ట్కు సైతం చిక్కని అధునాతన ఔషదాలంటూ భారత క్రికెట్లో ప్రకంపనలకు ఆధ్యం పోశాడు. కొందరు ఆటగాళ్లు పూర్తి ఫిట్గా లేకపోయినా తమను ఆడించాలని బతిమాలతారంటూ సరికొత్త దుమారానికి తెరలేపాడు. ఇదే సందర్భంగా శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, శిఖర్ ధవన్ల పేర్లను ప్రస్తావిస్తూ సంచలన కామెంట్స్ చేశాడు. గిల్, ఇషాన్ కిషన్ల వల్ల కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, శిఖర్ ధవన్ల కెరీర్లు ప్రమాదంలో పడ్డాయని.. గిల్, ఇషాన్ల హవాలో రాహుల్, సంజూలకు అవకాశాలు క్రమంగా కనుమరుగవుతాయని అన్నాడు. శిఖర్ ధవన్ ట్రిపుల్ సెంచరీలు చేసినా బీసీసీఐ పట్టించునే పరిస్థితుల్లో లేదని, అతనో ఔట్డేటెడ్ ప్లేయర్ అని కామెంట్ చేశాడు. భారత క్రికెట్ గురించి.. బీసీసీఐ, టీమిండియాలో పెద్ద తలకాయల గురించి చేతన్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ సర్కిల్స్లో పెను దుమారం రేపుతున్నాయి. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన చేతన్ శర్మపై బీసీసీఐ ఏ చర్యలకు ఉపక్రమిస్తుందో వేచి చూడాలి. -
మాజీ భార్య పరువు తీస్తుంది.. టీమిండియా స్టార్ క్రికెటర్ ఆవేదన, కోర్టు అక్షింతలు
టీమిండియా స్టార్ క్రికెటర్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ కోర్టు మెట్లెక్కాడు. అతని మాజీ భార్య అయేషా ముఖర్జీ తన పరువుకు భంగం కలిగించేలా విష ప్రచారం చేస్తుందని న్యూఢిల్లీలోని పటియాలా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన స్నేహితులు, క్రికెట్కు సంబంధించిన వ్యక్తులు అలాగే ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహించే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి అయేషా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేస్తుందని ఆధారాలతో సహా కోర్టులో సమర్పించాడు. తన పరువుకు భంగం కలిగించే సమాచారాన్ని సోషల్మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తుందని వాపోయాడు. ధవన్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు అయేషాను మందలించింది. ధవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అలాగే అతని పరువుకు భంగం కలిగేలా ఎలాంటి సమాచారాన్ని మీడియాతో కానీ అతని స్నేహితులు, బంధువులతో కానీ మరే ఇతర సోషల్మీడియా ప్లాట్ఫాంలపై కానీ షేర్ చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ధవన్ సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నత వ్యక్తి అని, అంతేకాక అతను భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యుడని, అతని రెప్యుటేషన్ దెబ్బతినే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. Delhi court restrains estranged wife of Shikhar Dhawan from making defamatory allegations against the cricketer report by @NarsiBenwal #ShikharDhawan @SDhawan25 https://t.co/5MWVV4gEUe — Bar & Bench (@barandbench) February 4, 2023 భారత్, ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన అయేషా తన వాదనలను వినిపించేందుకు ఇది సరైన మార్గం కాదని, ఒకవేళ అలాంటివేవైనా ఉంటే రెండు దేశాల్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. కాగా, ధవన్ 2012లో అస్ట్రేలియాకు చెందిన అయేషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ కుమారుడు (జోరావర్) జన్మించాడు. అయేషాకు ధవన్తో పెళ్లికి ముందే వివాహం జరిగింది. వారికి రియా, ఆలియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మనస్పర్ధల కారణంగా ధవన్-అయేషా 2021లో విడిపోయారు. కోర్టు వీరికి విడాకులు కూడా మంజూరు చేసింది. కోర్టు తీర్పు మేరకు ధవన్ మెయింటెనెన్స్ సరిగ్గా చల్లించట్లేదని అయేషా ప్రస్తుతం ఆరోపిస్తుంది. కాగా, టీమిండియాలో కీలక సభ్యుడైన శిఖర్ ధవన్ ఇప్పటివరకు 34 టెస్ట్లు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. ఇందులో 2315 టెస్ట్ పరుగులు (7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు), 6793 వన్డే పరుగులు (17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు), 1759 టీ20 పరుగులు (11 హాఫ్ సెంచరీలు) ఉన్నాయి. ధవన్ పలు మ్యాచ్ల్లో టీమిండియాకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. -
న్యూజిలాండ్తో తొలి వన్డే.. సెంచరీతో రికార్డుల్లోకెక్కిన శుభ్మన్ గిల్
టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ వరుస శతకాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల (జనవరి 15) శ్రీలంకపై మూడో వన్డేలో (97 బంతుల్లో 116; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించిన గిల్.. ఇవాళ (జనవరి 18) న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలోనూ శతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్లో 87 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన గిల్.. వరుస ఇన్నింగ్స్ల్లో సెంచరీలు సాధించడంతో పాటు అతి తక్కువ వన్డేల్లో 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్ ధవన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ధవన్.. 17 వన్డేల్లో 3 సెంచరీలు పూర్తి చేయగా.. గిల్.. 19 వన్డేల్లో ఈ మార్కును చేరుకున్నాడు. ఈ రికార్డుతో పాటు గిల్ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అతి వేగంగా (19 మ్యాచ్ల్లో) 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో పాక్ ఆటగాడు ఫకర్ జమాన్ (18 వన్డేలు) అగ్రస్థానంలో ఉండగా.. గిల్, మరో పాక్ ఆటగాడు ఇమామ్ ఉల్ హాక్తో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున అతి వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో గిల్ అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్ (24 మ్యాచ్లు) సంయుక్తంగా రెండో ప్లేస్లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో 34 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 210/4గా ఉంది. గిల్ (94 బంతుల్లో 111; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (22 బంతుల్లో 11; ఫోర్) క్రీజ్లో ఉన్నారు. రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31) ఓ మోస్తరుగా రాణించగా.. విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5) నిరుత్సాహపరిచారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్, టిక్నర్, సాంట్నర్, డారిల్ మిచెల్ తలో వికెట్ పడగొట్టారు. -
లంకతో సిరీస్కు దూరమవడంపై స్పందించిన సంజూ.. ఏమన్నాడంటే..?
Sanju Samson: గాయం కారణంగా శ్రీలంక సిరీస్ (టీ20) నుంచి మిడిల్ డ్రాప్ అయిన సంజూ శాంసన్ తొలిసారి స్పందించాడు. ఆల్ ఈజ్ వెల్.. సీ యూ సూన్ అంటూ ఇన్స్టా వేదికగా తన సందేశాన్ని పంపాడు. సంజూ తన పోస్ట్లో తొలి టీ20 సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఫోటో షేర్ చేశాడు. సంజూ చేసిన ఈ పోస్ట్కు టీమిండియా ప్రస్తుత కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, వన్డే తాత్కాలిక సారధి శిఖర్ ధవన్ స్పందించారు. View this post on Instagram A post shared by Sanju V Samson (@imsanjusamson) హార్ధిక్.. హార్ట్ ఏమోజీతో రిప్లై ఇవ్వగా, ధవన్.. గెట్ వెల్ సూన్ బ్రో అంటూ బదులిచ్చాడు. సంజూ గాయం నుంచి త్వరగా కోలుకుని తిరిగి బరిలోకి దిగాలని అతని అభిమానులు సోషల్మీడియాలో పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్నారు. కాగా, లంకతో తొలి టీ20 సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ సంజూ శాంసన్ గాయపడిన విషయం తెలిసిందే. సంజూ గాయం తీవ్రమైంది కానప్పటికీ.. మున్ముందు జట్టు అవసరాల దృష్ట్యా బీసీసీఐ అతన్ని ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి విశ్రాంతినిచ్చింది. బీసీసీఐ వైద్యులు తెలిపిన వివరాల మేరకు.. సంజూ ఎడమ కాలి మోకాలి భాగంలో స్వల్ప గాయమైందని, కదలికలో సమస్య ఉన్నట్లు స్కాన్ రిపోర్ట్లో గుర్తించినందున కొద్దిరోజుల పాటు విశ్రాంతినివ్వాలని వారు బోర్డుకు సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన బోర్డు తదనుగుణంగానే సంజూకు పాక్షికంగా విశ్రాంతి కల్పిస్తూ.. లంకతో మిగతా టీ20లకు అన్క్యాప్డ్ ప్లేయర్ జితేశ్ శర్మను ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే, తొలి టీ20లో సంజూ బ్యాట్తో పాటు ఫీల్డింగ్లోనూ దారుణంగా నిరాశపర్చాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని ఈ కేరళ బ్యాటర్.. ఫీల్డింగ్లోనూ క్యాచ్ను జారవిడిచి విమర్శలెదుర్కొన్నాడు. భారత దిగ్గజ ఆటగాడు, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్.. శాంసన్ చెత్త షాట్ సెలెక్షన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. అమవాస్యకో పున్నానికో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే ఎలా అంటూ ఘాటు స్వరంతో వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చిన సంజూ.. కేవలం ఆరు బంతులు మాత్రమే ఆడి (5 పరుగులు) దారుణంగా నిరాశపరిచాడు. ధనంజయ డిసిల్వ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయిన సంజూ.. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక అదే ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో తేలిపోయిన సంజూ.. ఫీల్డింగ్ చేస్తూ కీలక క్యాచ్ జారవిడిచాడు. లంక ఇన్నింగ్స్లో హార్ధిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లో నిస్సంక ఇచ్చిన క్యాచ్ను వదిలిపెట్టి కెప్టెన్ ఆగ్రహానికి గురయ్యాడు. -
ODI WC: ధావన్పై వేటు.. వరల్డ్కప్ ఆశలు ఆవిరి! ఎండ్ కార్డ్ పడ్డట్లే?!
India Vs Sri Lanka 2023- ముంబై: సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్తో నిష్క్రమించాలనుకున్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆశలు నెరవేరేలా లేవు. శ్రీలంకతో సిరీస్ కోసం మంగళవారం ప్రకటించిన వన్డే జట్టులో ధావన్కు చోటు దక్కలేదు. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో మూడు మ్యాచ్లలో కలిపి 18 పరుగులే చేసిన శిఖర్ సెలక్టర్ల భవిష్యత్ ప్రణాళికల్లో లేడని స్పష్టమైపోయింది. ధావన్ ఈ నేపథ్యంలో ధావన్పై వేటు పడటాన్ని అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘గత దశాబ్ద కాలంగా శిఖర్ ధావన్ వన్డే క్రికెట్లో ఉత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. రోహిత్, కోహ్లితో పాటు తను కూడా ప్రశంసలకు అర్హుడు. నిన్ను మిస్ అవుతాం వరల్డ్కప్ ఆడి కెరీర్ ముగించాలనుకున్న తన కలను నెరవేరనివ్వాల్సింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ చిరునవ్వు చెదరనీయక.. అందరిలా బహిరంగంగా అసంతృప్తి ప్రదర్శించకుండా గబ్బర్ హుందాగా ప్రవర్తిస్తాడు. కావాల్సినపుడు కెప్టెన్ అంటారు.. అందరూ ఉన్నారనుకుంటే తుది జట్టులోనే చోటివ్వరు. ఏదేమైనా తొడగొడుతూ నువ్వు సెలబ్రేషన్ చేసుకునే ఆ దృశ్యాలు ఇక ముందు చూడలేమేమో! భవిష్యత్తులో టీమిండియా జెర్సీలో నిన్ను చూసే అవకాశం లేదని అర్థమవుతోంది. థాంక్యూ గబ్బర్.. ఇన్నాళ్లు మాకు వినోదాన్ని పంచావు. భారత క్రికెట్కు నువ్వు అందించిన సేవలు చిరస్మరణీయం. నిన్ను మిస్ అవుతాం’’అంటూ ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు. వాళ్ల నుంచి తీవ్రమైన పోటీ 2019 ప్రపంచకప్లో ధావన్ సెంచరీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్కప్ వరకైనా తనను ఆడిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగా శ్రీలంక తర్వాత టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతోనూ వన్డే సిరీస్లు ఆడనుంది. అయితే, రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్ జోడీ రూపంలో ఓపెనర్లు ఉండగా.. యువ ఆటగాడు ఇషాన్ కిషన్ సైతం చెలరేగుతున్నాడు. ఇటీవలే బంగ్లాతో వన్డే సిరీస్లో డబుల్ సెంచరీ చేశాడు ఈ జార్ఖండ్ డైనమెట్. ఇక మరో యువ ప్లేయర్ శుబ్మన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో.. వెటరన్ ఓపెనర్ ధావన్కు వీళ్ల నుంచి గట్టి ఎదురవుతోంది. లంకతో సిరీస్లో వచ్చిన అవకాశాల్ని వాళ్లు సద్వినియోగం చేసుకుంటే.. ఇక ధావన్ను పూర్తిగా పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. తన కెరీర్కు ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ లేకపోలేదు. భువీ అవుట్ ఇదిలా ఉంటే.. శ్రీలంకతో సిరీస్ నేపథ్యంలో మరో సీనియర్ భువనేశ్వర్ కుమార్ను కూడా టి20 జట్టులోంచి తప్పించారు. కాగా జనవరి 3నుంచి 15 మధ్య భారత్, శ్రీలంక మధ్య 3 టి20లు, 3 వన్డేలు జరుగుతాయి. చేతన్శర్మ నేతృత్వంలోనే సెలక్షన్ కమిటీ ఈ రెండు సిరీస్ల కోసం టీమ్లను ఎంపిక చేసింది. గాయంనుంచి కోలుకున్న రోహిత్ వన్డే కెప్టెన్గా బరిలోకి దిగనుండగా...హార్దిక్ పాండ్యా టి20 టీమ్కు నాయకత్వం వహిస్తాడు. వన్డే వైస్కెప్టెన్గా హార్దిక్ను ఎంపిక చేయడం కొత్త నిర్ణయం కాగా, సూర్యకుమార్ యాదవ్కు టి20 వైస్ కెప్టెన్సీ అవకాశం లభించింది. మోకాలి గాయంతో బాధపడుతున్న రిషభ్ పంత్ను రెండు టీమ్లలో ఎంపిక చేయకపోగా...మొహమ్మద్ సిరాజ్కు టి20 టీమ్లో అవకాశం ఇవ్వలేదు. షమీ పునరాగమనం గాయంనుంచి కోలుకున్న షమీ వన్డేల్లో పునరాగమనం చేశాడు. యువ పేసర్లు శివమ్ మావి, ముకేశ్ కుమార్ జట్టులోకి ఎంపికయ్యారు. రోహిత్, విరాట్, శ్రేయస్లకు టి20ల నుంచి విశ్రాంతినివ్వగా, పెళ్లి కారణంగా రాహుల్ను టి20లకు ఎంపిక చేయలేదు. వన్డే జట్టు: రోహిత్ (కెప్టెన్), హార్దిక్ (వైస్ కెప్టెన్), గిల్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్, రాహుల్, ఇషాన్ కిషన్, సుందర్, చహల్, కుల్దీప్, అక్షర్, షమీ, సిరాజ్, ఉమ్రాన్, అర్ష్దీప్ సింగ్ టి20 జట్టు: హార్దిక్ (కెప్టెన్), సూర్యకుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, గిల్, హుడా, రాహుల్ త్రిపాఠి, సంజు సామ్సన్, సుందర్, చహల్, అక్షర్, అర్ష్దీప్ సింగ్, హర్షల్, ఉమ్రాన్, మావి, ముకేశ్ కుమార్. Ever smiling,never complained about anything.Always performed like a champ when the stage was big. It's probably curtains for Shikhar Dhawan's international career. Wish he could have continued to do well, but it is what it is. Thank you Jatt ji, aka Gabbar. 💙#CricketTwitter pic.twitter.com/cgSJj9FgT9 — Sid (@sid_2893) December 27, 2022 Mr. ICC, thank you for your services Shikhar Dhawan. ❤️ Maybe there would have been some different scenes in 2019 WC if u weren't injured against Australia. 🥺#ShikharDhawan #INDvsSL pic.twitter.com/GUkT3ZVKXO — Akshat (@AkshatOM10) December 27, 2022 Shikhar Dhawan to Bcci #INDvSL #INDvsSL pic.twitter.com/ATxwp5D6d5 — Deepak Verma (@reditzgaming) December 27, 2022 Shikhar Dhawan deserves better 💔 @BCCI pic.twitter.com/7UMFhWx7qb — Shrey18 (@_kohliverse25) December 27, 2022 So is it the end of Gabbar Shikhar Dhawan? https://t.co/Ilz4gWMUTQ pic.twitter.com/mPLQ1lQ7ec — Utsav Verma 🇮🇳 Happy B-Day Yash🖤 (@Itss_Utsav) December 27, 2022 -
మేనేజ్మెంట్ అదే గనుక కోరుకుంటే ధావన్ను పక్కనపెట్టాలి: మాజీ సెలక్టర్
Ishan Kishan- Shikhar Dhawan: బంగ్లాదేశ్తో మూడో వన్డేలో తుపాన్ ఇన్నింగ్స్తో డబుల్ సెంచరీ సాధించిన చిచ్చరపిడుగు ఇషాన్ కిషన్.. ఒక్క దెబ్బతో పలు రికార్డులు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో తొలి సెంచరీనే.. ద్విశతకంగా మార్చడమే గాక మరిన్ని ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు ఈ 24 ఏళ్ల జార్ఖండ్ డైనమైట్. వాళ్లకు సవాల్ తద్వారా ఓపెనింగ్ స్థానానికి తను సరిగ్గా సరిపోతాననే సంకేతం ఇచ్చి వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఉనికిని ప్రశ్నార్థకం చేశాడు. దీంతో పాటుగా ఇతర వికెట్ కీపర్ బ్యాటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్లకు గట్టి సవాల్ విసిరాడు. ఇషాన్ సంగతి ఇలా ఉంటే.. శుబ్మన్ గిల్ సహా దేశవాళీ టోర్నీల్లో ఓపెనర్గా రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు. ధావన్ను ఆడించాల్సిన పనిలేదు! టీమిండియా గనుక ఒకవేళ వన్డేల్లో మూడు వందల పైచిలుకు పరుగులు చేయాలంటే శిఖర్ ధావన్కు జట్టులో చోటు ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు మాజీ వికెట్ కీపర్ సబా కరీం న్యూస్తో మాట్లాడుతూ.. ‘‘ఎవరిని ఆడించాలి.. ఎవరిని పక్కన పెట్టాలి అన్న విషయం మేనేజ్మెంట్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే, వన్డేల్లో జట్టు టార్గెట్ 275- 300 సరిపోతుంది అనుకుంటే వాళ్లకు శిఖర్ ధావన్ లాంటి ఆటగాడితో అవసరం ఉంటుంది. ఈ సిరీస్లో అతడు పరుగులు చేయలేదు. అయినప్పటికీ అతడికి అవకాశం ఇవ్వాలని భావిస్తే.. టార్గెట్ 275-300 వరకే ఆశించాలని గుర్తుపెట్టుకోవాలి. అలా అనుకుంటేనే ధావన్కు వరల్డ్కప్ జట్టులోనూ చోటు దక్కుతుంది. ఒకవేళ జట్టు 325- 350 వరకు స్కోరు చేయాలని కోరుకుంటే ధావన్ను పక్కనపెట్టొచ్చు’’’ అని తన అభిప్రాయాలను పంచుకున్నాడు. వాళ్లంతా ఉన్నారు కదా! ఇక యువ ఓపెనర్ల పేర్లను ప్రస్తావిస్తూ.. ‘‘జట్టు నుంచి ఏం ఆశిస్తున్నారన్న విషయంపై సెలక్టర్లు, మేనేజ్మెంట్, కెప్టెన్కు స్పష్టత ఉండాలి. శిఖర్ ధావన్ నుంచి 130- 140 స్ట్రైక్రేటుతో గనుక భారీగా పరుగులు ఆశిస్తే అది ఎప్పటికీ జరుగదు. నిజానికి మనం పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంకాస్త వెనుకబడే ఉన్నాం. ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా వంటి కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి’’ అని మాజీ సెలక్టర్ సబా కరీం బీసీసీఐకి సూచించాడు. చదవండి: Cristiano Ronaldo: ఏ టైటిళ్లు, ట్రోఫీలు అక్కర్లేదు.. దేవుడు మాకిచ్చిన వరం.. కోహ్లి భావోద్వేగం! పోస్ట్ వైరల్ Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! -
Ind Vs Ban: కచ్చితంగా గెలుస్తాం! అతడు గొప్ప ఆల్రౌండర్గా ఎదుగుతాడు!
India tour of Bangladesh, 2022- Bangladesh vs India, 2nd ODI: ‘‘సిరీస్లో మొదటి మ్యాచ్ ఓడటం మాకేమీ కొత్తకాదు. ఇదే తొలిసారి కూడా కాదు. కఠిన పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు సాగాలో మాకు తెలుసు’’ టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. బంగ్లాదేశ్తో తొలి వన్డేలో తక్కువ స్కోరుకు పరిమితం కావడం ప్రభావం చూపిందని.. అయితే, ప్రతిసారి ఇలాగే జరగదని వ్యాఖ్యానించాడు. రెండో మ్యాచ్లో కచ్చితంగా విజయం సాధించి సిరీస్ను సమం చేస్తామని గబ్బర్ ధీమా వ్యక్తం చేశాడు. బంగ్లా పర్యటనలో మూడు వన్డేల సిరీస్లో భాగంగా రోహిత్ సేన మొదటి మ్యాచ్లో ఒక వికెట్ తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢాకా వేదికగా బుధవారం రెండో వన్డేలో తలపడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ధావన్.. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామని, కచ్చితంగా తిరిగి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక ఆదివారం నాటి మ్యాచ్లో కండరాల నొప్పితో బాధపడ్డ శార్దూల్ ఠాకూర్ ప్రస్తుతం పూర్తి ఫిట్గా ఉన్నాడని.. రెండో మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని తెలిపాడు. న్యూజిలాండ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వాషీ! బంగ్లాతో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన సందర్భంగా ధావన్.. టీమిండియా యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్పై ప్రశంసలు కురిపించాడు. అతడు ప్రపంచంలోనే గొప్ప ఆల్రౌండర్గా ఎదుగుతాడని కితాబులిచ్చాడు. కాగా గాయాల బెడదతో కొన్నాళ్లపాటు జట్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్.. న్యూజిలాండ్ పర్యటనలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మొదటి వన్డేలో మెరుపు ఇన్నింగ్స్తో అర్ధ శతకం సాధించాడు. అతడు గొప్ప ఆల్రౌండర్గా ఎదుగుతాడు ఈ నేపథ్యంలో ధావన్ మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడుతున్నాడు. పునరాగమనంలో సత్తా చాటుతున్నాడు. న్యూజిలాండ్లో అతడి ప్రదర్శన మనమంతా చూశాం. తను మంచి ఆల్రౌండర్. ఆఫ్ స్పిన్నర్గా.. లోయర్ ఆర్డర్లో ఫినిషర్గా జట్టుకు ఉపయోగపడతాడు. అనుభవం గడిస్తున్న కొద్దీ తను మరింత రాటుదేలతాడు. ఒత్తిడిలోనూ రాణించగల సుందర్.. ప్రపంచంలో గొప్ప ఆల్రౌండర్గా ఎదుగుతాడని నమ్మకంగా చెప్పగలను’’ అని వాషీని ప్రశంసించాడు. కాగా బంగ్లాతో మొదటి వన్డేలో 10 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్.. 2 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. కివీస్ టూర్లో వన్డే సిరీస్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించగా.. 1-0తో టీమిండియా ట్రోఫీని ఆతిథ్య జట్టుకు అప్పగించింది. ప్రస్తుతం రెండో వన్డేలో గెలిస్తేనే బంగ్లా చేతిలో సిరీస్ ఓటమి నుంచి తప్పించుకోగలదు. చదవండి: Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్ IPL 2023: విండీస్ విధ్వంసకర ఆల్రౌండర్పై కన్నేసిన రాజస్తాన్! 🗣️ 🗣️ We know how to bounce back from tough situations.#TeamIndia batter @SDhawan25 ahead of the second #BANvIND ODI. pic.twitter.com/YgHpfI7IeZ — BCCI (@BCCI) December 6, 2022 -
పంత్కు అవకాశాలు ఇస్తూనే ఉంటాం.. సంజూ వెయిట్ చేయాల్సిందే: ధావన్
Shikhar Dhawan- Sanju Samson- Rishabh Pant: ‘‘దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దానిని బట్టే ఓ ఆటగాడికి తుది జట్టులో చోటు దక్కింది. మ్యాచ్ విన్నర్ ఎవరో వారికే అవకాశాలు వస్తాయి’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్.. యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కు మద్దతు పలికాడు. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ మరికొన్ని రోజులు జట్టులో స్థానం కోసం ఎదురుచూడక తప్పదని వ్యాఖ్యానించాడు. కాగా వికెట్ కీపర్ సంజూ గత కొన్నాళ్లుగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ అతడికి తుది జట్టులో చోటు దక్కడం లేదన్న విషయం తెలిసిందే. మీరు మారరా? న్యూజిలాండ్తో టీ20, వన్డే సిరీస్లలోనూ ఇదే పునరావృతమైంది. అదే సమయంలో వరుస మ్యాచ్లలో విఫలమవుతున్న పంత్కు మాత్రం ఛాన్స్లు వస్తూనే ఉన్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో గత తొమ్మిది ఇన్నింగ్స్లో పంత్ సాధించిన స్కోర్లు.. 10, 15, 11, 6, 6, 3, 9, 9 27. ఈ పరిణామాల నేపథ్యంలో పంత్ను ఆడిస్తూ సంజూ పట్ల కావాలనే వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కివీస్ టూర్లో సంజూకు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడే అవకాశం ఇచ్చారని.. అదే పంత్ ఆడకపోయినా వెనకేసుకొస్తున్నారంటూ ట్రోల్స్ వచ్చాయి. సంజూ వేచి చూడక తప్పదు! ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మూడో వన్డే అనంతరం కెప్టెన్ ధావన్ మాట్లాడుతూ.. సంజూ ఇంకొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగల సత్తా ఉన్న పంత్కు తప్పక మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘కెప్టెన్గా కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, నేను సరైన జట్టును ఎంపిక చేసుకోవడంలో తడబడను. సంజూ శాంసన్ తనకు వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. అయితే, కొన్నిసార్లు అవకాశాల కోసం ఓపికగా ఎదురుచూడాల్సి ఉంటుంది. పంత్ నైపుణ్యం గల ఆటగాడు. మ్యాచ్ విన్నర్. కష్టకాలంలో తనకు అండగా నిలవాల్సి ఉంటుంది’’ అని సంజూను కాదని పంత్కు అవకాశం ఇవ్వడాన్ని ధావన్ సమర్థించుకున్నాడు. కాగా తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం ఇదే తరహాలో పంత్కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: Sanju Samson: పంత్ సెంచరీ చేసి ఎన్నాళ్లైందని! అతడికి అండగా ఉంటాం.. ఎవరిని ఆడించాలో తెలుసు: వీవీఎస్ లక్ష్మణ్ Ind Vs NZ: 12 బంతుల తేడాతో టీమిండియాకు తప్పిన పరాజయం! ఎలాగంటే.. Lionel Messi: ప్రిక్వార్టర్స్లో అర్జెంటీనా! అయినా.. మెస్సీ అభిమానులకు తప్పని నిరాశ! -
12 బంతుల తేడాతో టీమిండియాకు తప్పిన పరాజయం! ఎలాగంటే..
India tour of New Zealand, 2022 - New Zealand vs India, 3rd ODI: 12 బంతుల తేడాతో పరాజయం తప్పింది. మరో రెండు ఓవర్ల ఆట జరిగి ఉంటే సిరీస్ ఫలితం 0–2గా మారేది. అయితే వానతో ఆట ఆగిపోవడంతో భారత్కు మూడో వన్డేలో ఓటమి ఎదురు కాలేదు. చివరకు భారత్ 0–1తో సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై దాదాపు మూడేళ్లుగా వన్డే సిరీస్ చేజార్చుకోని న్యూజిలాండ్ ఆ రికార్డును నిలబెట్టుకుంది. క్రైస్ట్చర్చ్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే కూడా వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (64 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (59 బంతుల్లో 49; 8 ఫోర్లు) రాణించారు. అనంతరం న్యూజిలాండ్ 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (54 బంతుల్లో 57; 8 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (51 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు) తొలి వికెట్కు 97 పరుగులు జోడించి జట్టును సునాయాస విజయం దిశగా తీసుకెళ్లారు. అయితే 18 ఓవర్ల తర్వాత కురిసిన వర్షం ఆపై తెరిపినివ్వలేదు. ఆట ఆగిపోయే సమయానికి డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కివీస్ ఏకంగా 50 పరుగులు ముందంజలో ఉంది. మరో రెండు ఓవర్ల ఆట సాగి ఉంటే.. అయితే వన్డే నిబంధనల ప్రకారం రెండో ఇన్నింగ్స్లోనూ కనీసం 20 ఓవర్ల ఆట సాగితేనే ఫలితం తేలుతుంది. మిగతా రెండు ఓవర్ల కోసం ఎంత వేచి చూసినా వాన ఆగలేదు. దాంతో మ్యాచ్ను రద్దు చేశారు. లేదంటే టీమిండియాకు మరో ఓటమిని చవిచూడాల్సి వచ్చేది. ఇక తొలి వన్డేలో కివీస్ గెలవగా, రెండో వన్డే కూడా రద్దయింది. అంతకుముందు టి20 సిరీస్లో కూడా భారత్ ఒక మ్యాచ్ నెగ్గగా, మరో మ్యాచ్ రద్దయింది. ఇంకో మ్యాచ్ కూడా వాన కారణంగానే ‘టై’గా ముగిసి భారత్ 1–0తో సిరీస్ నెగ్గింది. ఈ పర్యటనలో ఆరు మ్యాచ్లలో నాలుగు వర్షం బారిన పడ్డాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘మొత్తానికి ఈ సిరీస్లో వరణుడిదే విజయం. ఆ మ్యాచ్ టై కాకుండా ఉండే హార్దిక్కు కూడా ధావన్ పరిస్థితే వచ్చేది’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మూడో వన్డే సాగిందిలా మూడో వన్డే వర్షం కారణంగా ఆట పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (45 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) శుబ్మన్ గిల్ (22 బంతుల్లో 13; 2 ఫోర్లు) దూకుడుగా ఆడటంలో విఫలమయ్యారు. ఫలితంగా 10 ఓవర్ల పవర్ప్లేలో భారత్ 43 పరుగులే చేయగలిగింది. మరోవైపు తక్కువ వ్యవధిలో ధావన్, పంత్ (10), సూర్యకుమార్ (6) వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది. ఆ తర్వాత శ్రేయస్ అర్ధ సెంచరీ చేజార్చుకోగా, దీపక్ హుడా (12) కూడా విఫలం కావడంతో స్కోరు 149/6కు చేరింది. ఈ దశలో స్కోరు 200 పరుగులు దాటడం కూడా కష్టమనిపించింది. అయితే సుందర్ స్ఫూర్తిదాయక బ్యాటింగ్తో జట్టు కోలుకుంది. చహర్ ఓవర్లో కాన్వే నాలుగు ఫోర్లు కొట్టిన కాన్వే స్వల్ప లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఓపెనర్లు అలెన్, కాన్వే ధాటిగా ఆడారు. ముఖ్యంగా చహర్ ఓవర్లో కాన్వే నాలుగు ఫోర్లు కొట్టడం హైలైట్గా నిలిచింది. ఇద్దరి జోరుతో 10 ఓవర్లలో స్కోరు 71 పరుగులకు చేరింది. ఈ క్రమంలో సుందర్ బౌలింగ్లో భారీ సిక్స్తో 51 బంతుల్లోనే అలెన్ హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. ఎట్టకేలకు 17వ ఓవర్లో ఈ జోడీని ఉమ్రాన్ విడదీశాడు. మరో భారీ షాట్కు ప్రయత్నించి అలెన్ వెనుదిరిగాడు. అయితే మరో 9 బంతులకే ఆట ముగిసింది. చదవండి: FIFA WC 2022: అమెరికా ఆరోసారి.. ఆస్ట్రేలియా 2006 తర్వాత ఇదే తొలిసారి! ICC ODI Rankings: అదరగొట్టిన కేన్ మామ..లాథమ్! దిగజారిన కోహ్లి, రోహిత్ ర్యాంక్లు -
Ind Vs NZ: ఇదో గుణపాఠం.. కనీసం అక్కడైనా వాతావరణం అనుకూలిస్తే! చాల్లే ఆపు..
India tour of New Zealand, 2022- New Zealand vs India, 3rd ODI: టీమిండియా వన్డే సారథిగా వెస్టిండీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్కు న్యూజిలాండ్ పర్యటన కలిసిరాలేదు. ముఖ్యంగా వాతావరణం అస్సలు అనుకూలించలేదు. మొదటి వన్డేలో భారీ స్కోరు చేసినప్పటికీ ఆతిథ్య జట్టు చేతిలో ధావన్ సేన ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక వర్షం కారణంగా రెండో వన్డే.. తాజాగా బుధవారం నాటి ఆఖరి మ్యాచ్ కూడా రద్దైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో విలియమ్సన్ బృందం సొంతం చేసుకుంది. కాగా కివీస్ పర్యటన తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. పాఠాలు నేర్చుకుంటాం ఈ నేపథ్యంలో క్రైస్ట్చర్చ్లో జరిగిన మూడో వన్డే అనంతరం తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ పర్యటనలో పూర్తిగా యువ జట్టుతో బరిలోకి దిగాము. బౌలింగ్ విభాగంలో వైఫల్యాలు యువ ఆటగాళ్లకు పాఠం లాంటివి. కనీసం అక్కడైనా ఇక ఈ సిరీస్ తర్వాత మేము బంగ్లాదేశ్కు వెళ్తున్నాం. కనీసం అక్కడైనా వాతావరణం అనుకూలిస్తే బాగుండు. బంగ్లాలో సీనియర్ జట్టు ఆడనుంది. ఇక్కడ జరిగిన తప్పులు మాకు గుణపాఠాల్లాంటివి. ఇక వన్డే వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో ఆసియా పిచ్ల మీద ఆడనుండటం మాకు మేలు చేకూరుస్తుంది. తప్పిదాలు సరిదిద్దుకుని ముందడుగు వేస్తాం’’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. కాగా డిసెంబరు 4 నుంచి టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. (చదవండి: Ban Vs Ind 2022: టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు) బాగానే వెనకేసుకొచ్చావులే! కాగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ధావన్ భారత జట్టు వన్డే సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక కివీస్ పర్యటనలో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా టీ20 సిరీస్ ట్రోఫీని గెలిచింది. ఇక మూడో వన్డేలో 18 ఓవర్లలో కివీస్ వికెట్ నష్టానికి 104 పరుగులు చేయడంతో ధావన్ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. ‘‘చాల్లే ఆపు.. బౌలర్లను బాగానే వెనకేసుకొచ్చావు.. వర్షం ఆగినా లాభం ఉండేది కాదేమో గబ్బర్! మొదటి మ్యాచ్లో ఏం జరిగిందో చూశాం కదా! అప్పుడు భారీ స్కోరు చేసినా కాపాడలేకపోయారన్న విషయం గుర్తుందా? ఇప్పుడు బ్యాటర్లు కూడా చేతులెత్తేశారు. నిజానికి వర్షం మనల్ని కాపాడింది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మూడో వన్డే స్కోర్లు: టీమిండియా- 219 (47.3 ఓవర్లలో) వర్షం ఆరంభమయ్యే సమయానికి న్యూజిలాండ్ స్కోరు: 104/1 (18) వరణుడి కారణంగా ఫలితం తేలకుండా ముగిసిన మ్యాచ్ చదవండి: టీమిండియాకు వెలకట్టలేని ఆస్తి దొరికింది! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు! IND VS NZ 3rd ODI: చెత్త ఫామ్పై ప్రశ్న.. సహనం కోల్పోయిన పంత్ VHT 2022: మరోసారి విధ్వంసం సృష్టించిన రుతురాజ్.. ఈసారి భారీ శతకంతో..! -
IND VS NZ 3rd ODI: హార్ధిక్ను ఆదుకున్న వరుణుడు ధవన్ను కరుణిస్తాడా..?
మాంచి వర్షాకాలంలో న్యూజిలాండ్లో అడుగుపెట్టిన టీమిండియా.. వరుణుడి పుణ్యమా అని టీ20 సిరీస్ను గెలుచుకోగలిగింది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మూడో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మధ్యలో జరిగిన రెండో మ్యాచ్లో గెలిచిన హార్ధిక్ సేన.. వరుణుడు సహకారంతో 3 మ్యాచ్ల సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్లోనూ టీ20 సిరీస్ తరహాలోనే సమీకరణాలు మారిపోయాయి. అయితే టీ20 సిరీస్లో వరుణుడు టీమిండియా పక్షాన నిలబడగా.. వన్డే సిరీస్లో ఆతిధ్య జట్టుకు అనుకూలంగా నిలిచాడు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ గెలుపుతో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లగా, ఇవాళ (నవంబర్ 27) జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణమైంది. ఈ మ్యాచ్ రద్దుతో టీమిండియా సిరీస్ గెలుచుకునే అవకాశం కోల్పోయింది. వరుణుడు కరుణించి, ఆట సాధ్యపడి, ఈనెల 30న (బుధవారం) జరిగే మూడో వన్డేలో గెలిస్తే, సిరీస్ డ్రా చేసుకునే అవకాశం మాత్రమే టీమిండియా ముందు ఉంది. అయితే, మూడో వన్డేకు వేదిక అయిన క్రైస్ట్చర్చ్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో టీమిండియా సిరీస్పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ వరుణుడు కటాక్షించక, మూడో వన్డే రద్దైతే.. తొలి మ్యాచ్లో గెలిచిన న్యూజిలాండ్ సిరీస్ విజేతగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్లో హార్ధిక్ను ఆదుకున్న వరుణుడు.. ధవన్కు వన్డే సిరీస్ను కనీసం డ్రా చేసుకునే అవకాశాన్నైనా కల్పిస్తాడా లేదా అన్నది సందేహంగా మారింది. -
Ind vs NZ: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. అతడి వల్లే.. ఆ ఓవర్లో: ధావన్
New Zealand vs India, 1st ODI- Shikhar Dhawan Comments On Loss: న్యూజిలాండ్తో మొదటి వన్డేలో మెరుగైన స్కోరు చేసినప్పటికీ పరాజయం తప్పలేదని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ విచారం వ్యక్తం చేశాడు. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తాము ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నాడు. కాగా ఆక్లాండ్ వేదికగా శుక్రవారం నాటి వన్డేలో భారత జట్టు కివీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్ శిఖర్ ధావన్ సహా మరో ఓపెనర్ శుబ్మన్ గిల్, వన్డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకాలతో మెరిసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ముగ్గురూ అద్బుతంగా రాణించడంతో 306 పరుగులు స్కోరు చేసిన టీమిండియా.. బౌలర్ల వైఫల్యం కారణంగా ఆతిథ్య జట్టు ముందు తలవంచకతప్పలేదు. స్పష్టంగా కనిపించిన వైఫల్యం బ్యాట్తో మెరిసిన వాషింగ్టన్ సుందర్(42 పరుగులు- ఎకానమీ 4.20) మినహా మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రపంచకప్-2022లో రాణించిన అర్ష్దీప్ సింగ్ 8.1 ఓవర్లలో 68, ఉమ్రాన్ మాలిక్ 10 ఓవర్లలో 66, యజువేంద్ర చహల్ 10 ఓవర్లలో 67 పరుగులు ఇవ్వగా.. శార్దూల్ ఠాకూర్ వేసిన 40వ ఓవర్ మ్యాచ్ను కివీస్కు అనుకూలంగా మార్చివేసింది. ఆ ఓవర్లోనే అంతా తలకిందులు ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ధావన్ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలు వెల్లడించాడు. ‘‘మొదటి 10- 15 ఓవర్లు కాస్త కష్టంగా తోచింది. అయితే, పిచ్ను అంచనా వేసి మా వ్యూహాలు అమలు చేసి మెరుగైన స్కోరు నమోదు చేశాం. కానీ, ఈ రోజు మేము సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాం. ముఖ్యంగా గుడ్ లెంత్తో బౌలింగ్ చేయడంలో మా వాళ్లు విఫలమయ్యారు. ఆ బలహీనతను లాథమ్ సరిగ్గా వాడుకున్నాడు. నిజానికి 40 ఓవర్లోనే మ్యాచ్ మా చేజారి... కివీస్కు అనుకూలంగా మారింది. ఒకవేళ గెలిచి ఉంటే మేము సంతోషించేవాళ్లం. కానీ ఆటలో ఇవన్నీ సహజమే. జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వారికి ఇదొక పాఠం లాంటిది. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆట తీరు మెరుగుపరచుకుని.. తదుపరి మ్యాచ్లో మా వ్యూహాలు మరింత పక్కాగా అమలు చేస్తాం’’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. అద్భుత, అజేయ శతకం కివీస్ ఇన్నింగ్స్లో 40వ ఓవర్ వేసిన శార్దూల్ బౌలింగ్లో.. న్యూజిలాండ్ బ్యాటర్ టామ్ లాథమ్.. భారీగా పరుగులు రాబట్టాడు. మొదటి బంతిని సిక్స్గా మలిచిన అతడు.. ఆ తర్వాత వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. ఇక ఓవర్లో వైడ్ల రూపంలో రెండు పరుగులు రాగా.. ఆఖరి బంతికి ఒక పరుగు తీసి శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్లో మొత్తంగా కివీస్కు 25 పరుగులు వచ్చాయి. ఇక మొత్తంగా ఈ మ్యాచ్లో 145 పరుగులతో అజేయంగా నిలిచి న్యూజిలాండ్ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మరోవైపు శార్దూల్.. 9 ఓవర్లలో 63 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో విజయంతో విలియమ్సన్ బృందం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చదవండి: IND VS NZ 1st ODI: టీమిండియా చెత్త రికార్డు.. చరిత్రలో తొలిసారి ఇలా..! FIFA WC: బ్రెజిల్ను గెలిపించినోడు.. పొట్టకూటి కోసం ఐస్క్రీంలు అమ్మి -
Ind Vs NZ: న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమి.. భారీ స్కోరు చేసినా
India tour of New Zealand, 2022- New Zealand vs India, 1st ODI: న్యూజిలాండ్తో మొదటి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. కివీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ధావన్ సేన ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటర్లు రాణించినప్పటికీ బౌలర్లు విఫలం కావడంతో భారత జట్టుకు పరాజయం తప్పలేదు. ఇక ఈ విజయంతో విలియమ్సన్ బృందం మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. మూడు అర్ధ శతకాలు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు శుభారంభం లభించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుబ్మన్ గిల్ వరుసగా 72, 50 పరుగులు చేయగా.. వన్డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 80 రన్స్ సాధించాడు. వీరికి తోడు సంజూ శాంసన్ 36, వాషింగ్టన్ సుందర్ 37 పరుగులు చేశారు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 306 పరుగుల భారీ స్కోరు సాధించింది. టామ్ లాథమ్ అజేయ సెంచరీ లక్ష్య ఛేదనకు దిగిన కివీస్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఫిన్ అలెన్ 22, డెవాన్ కాన్వే 24 పరుగులకే అవుటయ్యారు. అయితే, ఫస్ట్డైన్లో వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. విలియమ్సన్ 98 బంతుల్లో 94 పరుగులు చేయగా.. టామ్ లాథమ్ 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 145 పరుగులతో అజేయంగా నిలిచాడు. కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్కు ఒకటి, ఉమ్రాన్ మాలిక్కు రెండు వికెట్లు దక్కాయి. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మొదటి వన్డే- మ్యాచ్ స్కోర్లు: ఇండియా- 306/7 (50) న్యూజిలాండ్- 309/3 (47.1) చదవండి: IND VS NZ 1st ODI: టీమిండియా కొంపముంచిన శార్దూల్ Tagenarine Chanderpaul: తండ్రికి తగ్గ తనయుడు -
Ind Vs NZ: కివీస్ బౌలర్లకు చుక్కలు! అయ్యర్, ధావన్, గిల్ అద్భుత ఇన్నింగ్స్
India tour of New Zealand, 2022- New Zealand vs India, 1st ODI: న్యూజిలాండ్తో మొదటి వన్డేలో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ మ్యాచ్లో 76 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతివాటం ఆటగాడు 4 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 80 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్(77 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 72 పరుగులు)తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ అర్ధ శతకంతో రాణించాడు. ఈ ముగ్గురి అద్భుత ఆట తీరుతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 306 పరుగులు స్కోరు చేసింది. టాపార్డర్ హిట్! కివీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో టాస్ ఓడిన టీమిండియా.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు కెప్టెన్ శిఖర్ ధావన్, శుబ్మన్ గిల్ హాఫ్ సెంచరీలు చేయగా.. వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 80 పరుగులు సాధించాడు. టాపార్డర్ అద్భుతంగా రాణించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన రిషభ్ పంత్ మరోసారి నిరాశపరిచాడు. 23 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఐదో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. సంజూ ఓకే.. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వాషీ ఇదిలా ఉంటే.. ఎన్నాళ్లుగానో జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్ 36 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 16 బంతుల్లో 37 పరుగులతో అజేయంగా నిలిచి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఏడు వికెట్ల నష్టానికి ధావన్ సేన 306 పరుగులు చేసి కివీస్కు భారీ లక్ష్యం విధించింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీకి మూడు, లాకీ ఫెర్గూసన్కు మూడు, ఆడం మిల్నేకు ఒక వికెట్ దక్కాయి. చదవండి: IND vs NZ: శిఖర్ ధావన్ అరుదైన రికార్డు.. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాల సరసన FIFA WC 2022: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
వన్డేల్లో పైచేయి ఎవరిదో?
ఆక్లాండ్: భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్కప్కు మరో ఏడాదికంటే తక్కువ సమయం ఉంది. వచ్చే అక్టోబర్–నవంబర్లలో ఈ టోర్నీ జరగనుంది. దాంతో ఇప్పటినుంచి జరిగే ప్రతీ మ్యాచ్ను టీమిండియా సన్నాహకాల్లో భాగంగానే చెప్పవచ్చు. రెగ్యులర్ ఆటగాళ్లతో పాటు జట్టులో అవకాశం సాధించే సత్తా ఉన్న కుర్రాళ్లను కూడా పరీక్షించేందుకు ఈ వరుస ద్వైపాక్షిక సిరీస్లు ఉపయోగపడనున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో భారత జట్టు మూడు వన్డేల సిరీస్కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే తొలి పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. టి20 సిరీస్ను గెలుచుకొని భారత బృందం జోరు మీదుంది. తుది జట్టులో చోటు కోసం... శిఖర్ ధావన్ కెప్టెన్సీలో భారత జట్టు ఈ వన్డే సిరీస్ బరిలోకి దిగుతోంది. అయితే అతని బ్యాటింగ్ ఫామ్ అంత గొప్పగా లేదు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్లోనూ విఫలమైన ధావన్...చెప్పుకోదగ్గ స్కోరు సాధించిన మ్యాచ్లలోనూ బాగా నెమ్మదిగా ఆడుతూ పేలవ స్ట్రైక్రేట్తో నమోదు చేశాడు. వచ్చే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగాలని భావిస్తున్న అతను ప్రస్తుతం ఉన్న పోటీ నేపథ్యంలో బ్యాట్ ఝళిపించాల్సిందే. రెండో ఓపెనర్గా శుబ్మన్ గిల్ ఖాయం. ఈ ఏడాది అతను 75.71 సగటుతో 9 మ్యాచ్లలోనే 530 పరుగులు సాధించిన తన సత్తాను ప్రదర్శించాడు. కోహ్లి లేకపోవడంతో మూడో స్థానంలో ఆడే శ్రేయస్ అయ్యర్కు ఇది మరో మంచి చాన్స్. టి20 సిరీస్లో రెండు మ్యాచ్లలోనూ విఫలమైన అయ్యర్ ఇక్కడైనా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత మిడిలార్డర్లో సూర్యకుమార్, పంత్లు దూకుడు ప్రదర్శించగలరు. అదనపు బౌలింగ్ ప్రత్యామ్నాయంగా ఉన్న దీపక్ హుడాను ఆడిస్తారా లేక టి20 సిరీస్లో అవకాశం దక్కని సామ్సన్ను ఎంపిక చేస్తారా చూడాలి. సుందర్ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో కీలకం కానున్నాడు. దీపక్ చహర్, శార్దుల్, అర్‡్షదీప్లు పేస్ బౌలింగ్ భారం మోస్తారు. కుల్దీప్ యాదవ్, చహల్లలో ఒకరికే రెండో స్పిన్నర్గా చాన్స్ లభిస్తుంది. విలియమ్సన్ ఫామ్లోకి వస్తాడా... టి20లతో పోలిస్తే వన్డేలకు కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ శైలి సరిగ్గా సరిపోతుంది. కాబట్టి ఈ సిరీస్లో తమ కెప్టెన్ రాణించాలని జట్టు కోరుకుంటోంది. టి20 సిరీస్తో పోలిస్తే కాన్వే కేవలం బ్యాటర్ పాత్రమే పరిమితం కానుండగా, లాథమ్ కీపింగ్ బాధ్యతలు చూస్తాడు. ఓపెనర్ అలెన్పై కివీస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మిడిలార్డర్లో లాథమ్, మిచెల్, ఫిలిప్స్ జట్టుకు భారీ స్కోరు అందించగలరు. నీషమ్, సాన్ట్నర్ రూపంలో ఆల్రౌండ్ర్లు అందుబాటులో ఉండగా...ముగ్గురు పేసర్లు సౌతీ, హెన్రీ, ఫెర్గూసన్లకు సొంత గడ్డపై ఘనమైన రికార్డు ఉంది. పిచ్, వాతావరణం ఈడెన్ పార్క్ మైదానం బ్యాటింగ్కు అనుకూలం. పిచ్కు నేరుగా ఉండే బౌండరీలు మరీ చిన్నవి కాబట్టి భారీ స్కోర్లను ఆశించవచ్చు. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. -
తొలి వన్డేకు వర్షం ముప్పు.. వరుణుడి కోసమే సిరీస్ పెట్టినట్లుంది
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సిరీస్లో వరుణుడు శాంతించేలా కనిపించడం లేదు. తాజాగా నవంబర్ 25న(శుక్రవారం) ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు వరుణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. గత కొన్ని రోజులుగా ఆక్లాండ్లో వర్షం కురుస్తున్నప్పటికి రెండు రోజులుగా చూసుకుంటే వాతావరణంలో కాస్త మార్పు కనపించింది. మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. మ్యాచ్ సమయానికి 20 శాతం మాత్రమే వర్షం పడే చాన్స్ ఉందని.. గాలిలో 62 శాతం తేమ ఉంటుందని.. గంటకు 32 కి.మీ వేగంతో గాలి వీచే అవకాశం ఉండగా.. గరిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలు.. కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ముగిసిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో ఒక్క మ్యాచ్ మాత్రమే పూర్తి స్థాయిలో జరిగింది. వర్షంతో తొలి టి20 ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కాగా.. రెండో టి20లో మాత్రం టీమిండియా 65 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఇక మూడో టి20లో కివీస్ ఇన్నింగ్స్ అనంతరం వరుణుడు అడ్డు తగలడం.. డక్వర్త్ లూయిస్ పద్దతిలో మ్యాచ్ టై అయినట్లు ప్రకటించడంతో 1-0తో సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. అయితే టీమిండియా కివీస్ టూర్ఫై మాత్రం భారత అభిమానులు సంతృప్తిగా లేరు. అసలు టీమిండియా సిరీస్ ఆడడానికి వెళ్లినట్లుగా అనిపించడం లేదని వాపోయారు. టి20, వన్డే సిరీస్లు టీమిండియా, కివీస్లు ఆడేందుకు కాకుండా వరుణుడి కోసమే ఏర్పాటు చేసినట్లుగా అనిపిస్తుందని కామెంట్స్ చేశారు. ఇక టి20లకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేపట్టగా.. వన్డేలకు మాత్రం శిఖర్ ధావన్ తిరిగి నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పటికే రోహిత్ గైర్హాజరీలో పలుసార్లు జట్టును నడపించిన ధావన్ ప్రతీసారి సక్సెస్ అవడమే గాక బ్యాట్స్మన్గానూ సత్తా చాటుతున్నాడు. ఇక కివీస్తో వన్డే సిరీస్ను కూడా నెగ్గి రానున్న వన్డే వరల్డ్కప్లో తన స్థానం మరింత సుస్థిరం చేసుకోవాలని ధావన్ చూస్తున్నాడు. Smiles, friendly banter & the trophy 🏆 unveil! #TeamIndia | #NZvIND pic.twitter.com/3R2zh0znZ3 — BCCI (@BCCI) November 24, 2022 చదవండి: చాలా ఊహించుకున్నా.. హార్ధిక్ రీ ఎంట్రీతో ఆశలన్నీ అడియాశలయ్యాయి..! -
కెప్టెన్గా కఠిన నిర్ణయాలు తీసుకుంటా! లోకాన్ని వీడేటపుడు ఏం పట్టుకుపోతాం
New Zealand vs India, 1st ODI- Shikhar Dhawan: జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు తాను వెనుకాడబోనని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ స్పష్టం చేశాడు. సారథిగా మునుపటి కంటే ఇప్పుడు ఎంతో పరిణతి సాధించానని.. కచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నానని పేర్కొన్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో ఈ వెటరన్ ఓపెనర్ భారత వన్డే సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెస్టిండీస్ గడ్డపై వన్డే సిరీస్ క్లీన్స్వీప్ చేసిన టీమిండియా కెప్టెన్గా చరిత్ర సృష్టించిన ధావన్.. ప్రస్తుతం న్యూజిలాండ్తో సిరీస్కు సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ధావన్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కెప్టెన్గా ఇటీవల నియమితుడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టడం గురించి ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన గబ్బర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ‘‘కెప్టెన్గా మ్యాచ్లు ఆడుతున్న కొద్దీ నమ్మకంగా నిర్ణయాలు తీసుకోగలం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మొదట్లో అయితే, బౌలర్ పరిస్థితి ఏమిటన్న విషయాన్ని పట్టించుకోకుండా అతడితో అదనపు ఓవర్ వేయించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, నేను ఇప్పుడు పరిణతి సాధించాను. ఒకవేళ ఓ బౌలర్ ఎంత ప్రయత్నించినా వికెట్ దొరకపోగా.. బ్యాటర్ పదే పదే బంతిని బాదుతున్నాడునుకోండి.. వెంటనే సదరు బౌలర్ దగ్గరకు వెళ్లకూడదు. ఎందుకంటే కచ్చితంగా అతడు అప్పుడు చిరాగ్గా ఉంటాడు. అందుకే కాసేపైనా తర్వాత అతడి దగ్గరికి వెళ్లి నెమ్మదిగా తప్పిదాల గురించి చెప్పాలి. సారథిగా ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్న కొద్దీ ఇలాంటివి అర్థమవుతూ ఉంటాయి. ఏదేమైనా.. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా జట్టు ప్రయోజనాల కోసం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోగల స్థాయికి నేను చేరుకున్నా. అదే నా లక్ష్యం ఒక కెప్టెన్గా జట్టును బ్యాలెన్స్ చేసుకుంటూ.. ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తూ వారి నుంచి అనుకున్న ఫలితాలు రాబట్టేలా ముందుకు సాగాల్సి ఉంటుంది’’ అని శిఖర్ ధావన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఇక కెప్టెన్ అయినంత మాత్రాన తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాదన్న గబ్బర్.. ‘‘ఇలాంటి బాధ్యతలు వస్తూపోతూ ఉంటాయి. కాబట్టి నేను వీటి గురించి ఎక్కువగా ఆలోచించను. వచ్చేటపుడు ఏమీ తీసుకురాలేదు కదా! ఈ ప్రపంచంలోకి వచ్చేటపుడు మనమేమీ తీసుకురాలేదు. అలాగే వెళ్లేటపుడు ఏమీ తీసుకుపోలేము. చివరకు అన్నీ ఇక్కడే వదిలేయాలి కదా! అందుకే కెప్టెన్సీ చేజారుతుందేమోనని నేనెప్పుడూ భయపడను. బాధపడను’’ అని వేదాంత ధోరణి అవలంబించాడు. అదే విధంగా.. ‘‘కెప్టెన్గా ఉన్నంత మాత్రాన నేనేమీ మరీ ఒత్తిడిలో కూరుకుపోను. జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా నా వంతు బాధ్యత కచ్చితంగా నెరవేర్చడంపైనే నా దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది’’ అని ధావన్ స్పష్టం చేశాడు. కాగా శుక్రవారం (నవంబరు 25) టీమిండియా- న్యూజిలాండ్ మధ్య మొదటి వన్డే జరుగనుంది. ఇక టీ20 సిరీస్ను హార్దిక్ పాండ్యా సేన 1-0తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో తొలి వన్డే.. ఎక్స్ప్రెస్ పేసర్ ఎంట్రీ! సంజూ కూడా Abu Dhabi T10: కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్లతో! -
NZ Vs Ind: టీమిండియా న్యూజిలాండ్ పర్యటన.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు
India tour of New Zealand, 2022: టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లోనే ఇంటిబాట పట్టిన టీమిండియా న్యూజిలాండ్తో ద్వైపాక్షిక సిరీస్కు సిద్ధమవుతోంది. గతేడాది వరల్డ్కప్ ముగిసిన తర్వాత స్వదేశంలో కివీస్తో తలపడ్డ భారత జట్టు.. ఈసారి న్యూజిలాండ్ గడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడబోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే టీమిండియా పర్యాటక దేశానికి చేరుకుంది. కాగా కివీస్తో టీ20 సిరీస్ ఆడనున్న భారత జట్టుకు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనుండగా.. వన్డే సిరీస్కు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా న్యూజిలాండ్ టూర్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందాం. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా టీ20 సిరీస్ మూడు మ్యాచ్ల సిరీస్ ►మొదటి టీ20: నవంబరు 18, శుక్రవారం- స్కే స్టేడియం, వెల్లింగ్టన్ ►రెండో టీ20: నవంబరు 20, ఆదివారం- బే ఓవల్, మౌంట్ మాంగనీ ►మూడో టీ20: నవంబరు 22, మంగళవారం- మెక్లీన్ పార్క్, నేపియర్ ►మ్యాచ్ల ఆరంభ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు(భారత కాలమానం ప్రకారం) న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా వన్డే సిరీస్ మూడు మ్యాచ్ల సిరీస్ ►మొదటి వన్డే: నవంబరు 25, శుక్రవారం- ఈడెన్ పార్క్, ఆక్లాండ్ ►రెండో వన్డే: నవంబరు 27, ఆదివారం- సెడాన్ పార్క్, హామిల్టన్ ►మూడో వన్డే: నవంబరు 30, బుధవారం- హాగ్లే ఓవల్, క్రైస్ట్చర్చ్ ►మ్యాచ్ల ఆరంభ సమయం: ఉదయం 7 గంటలకు(భారత కాలమానం ప్రకారం) మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే! అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్, వెబ్సైట్లో మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం ►భారత్లో- టీవీ ప్రేక్షకులు డీడీ స్పోర్ట్స్లో వీక్షించవచ్చు. ►న్యూజిలాండ్లో స్కై స్పోర్ట్స్ ఎన్జెడ్లో లైవ్ స్ట్రీమింగ్ ►అమెరికాలో- డిస్నీ+హాట్స్టార్, ఈఎస్పీఎన్+ ►యూకేలో- స్కై స్పోర్ట్స్ న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టు హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్కీపర్), శుబ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్వెల్, డెవాన్ కాన్వే (వికెట్ కీపన్), లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ (వన్డే). టామ్ లాథమ్ (వన్డే), డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి (టీ20). టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్ (టీ20) చదవండి: Pak Vs Eng: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు మరో భారీ షాక్! ‘ఆర్నెళ్ల పాటు..!’ T20 WC 2022: 'ఆఫ్రిదికి అంత సీన్ లేదు.. ఉన్నా ఇంగ్లండ్ విజయం సాధించేది -
రోహిత్, విరాట్లకు రెస్ట్.. కెప్టెన్గా హార్ధిక్
IND Tour Of NZ 2022: టీ20 ప్రపంచకప్-2022 తర్వాత నవంబర్ 18 నుంచి 30 వరకు టీమిండియా.. న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్.. 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్ల కోసం భారత జట్టును సెలెక్షన్ కమిటీ ఇవాళ (అక్టోబర్ 31) ప్రకటించింది. ఈ రెండు సిరీస్లకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్లకు రెస్ట్ ఇచ్చిన సెలెక్షన్ కమిటీ.. దినేశ్ కార్తీక్, అశ్విన్లను పక్కకు పెట్టింది. రోహిత్ స్థానంలో టీ20 సిరీస్కు హార్ధిక్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరించనుండగా.. వన్డే సిరీస్కు శిఖర్ ధవన్ సారధ్య బాధ్యతలను చేపట్టనున్నాడు. కివీస్ పర్యటనలో నవంబర్ 18న తొలి టీ20 ఆడనున్న టీమిండియా.. 20, 22 తేదీల్లో రెండు, మూడు మ్యాచ్లు ఆడనుంది. అనంతరం 25న తొలి వన్డే, 27, 30 తేదీల్లో రెండు, మూడు వన్డేలు ఆడనుంది. న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ పర్యటనకు భారత వన్డే జట్టు.. శిఖర్ ధవన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్కీపర్), శుభ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ -
Ind Vs SA: స్పిన్నర్ల మాయాజాలం.. టీమిండియాదే సిరీస్! గిల్ బ్యాడ్లక్!
South Africa tour of India, 2022 - India vs South Africa, 3rd ODI: సౌతాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా 2-1తో ధావన్ సేన ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక అంతకు ముందు టీ20 సిరీస్ను సైతం రోహిత్ సారథ్యంలోని భారత జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో భారత పర్యటనకు వచ్చిన సఫారీలు ఈసారి ఒట్టి చేతులతోనే వెనుదిరిగినట్లయింది. చెలరేగిన బౌలర్లు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాకు బౌలర్లు శుభారంభం అందించారు. మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ ప్రొటిస్ ఓపెనర్లు జానేమన్ మలన్(15), క్వింటన్ డికాక్(6) వికెట్లు పడగొట్టి ఆదిలోనే షాకిచ్చారు. అదే విధంగా షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ సైతం స్పిన్ మాయాజాలంతో సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఈ నలుగురూ చెలరేగడంతో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లకే చేతులెత్తేసింది. కేవలం 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. హెన్రిచ్ క్లాసెన్ 34 పరుగులతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. పాపం గిల్.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. తొలుత రనౌట్ రూపంలో ఓపెనర్, కెప్టెన్ శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ శుబ్మన్ గిల్.. వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్(10)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, దురదృష్టవశాత్తూ లుంగీ ఎంగిడి బౌలింగ్లో 19వ ఓవర్ రెండో బంతికి గిల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అప్పటికి అతడు సాధించిన పరుగులు 49. అర్ధ సెంచరీకి అడుగు దూరంలో నిలిచిపోయాడు. సిక్సర్తో లాంఛనం పూర్తి ఇక సంజూ శాంసన్(2, నాటౌట్)తో కలిసి శ్రేయస్ అయ్యర్(28, నాటౌట్) లాంఛనం పూర్తి చేశాడు. సిక్సర్ బాది టీమిండియా విజయం ఖరారు చేశాడు. గిల్(57 బంతుల్లో 49 పరుగులు), శ్రేయస్ అయ్యర్(23 బంతుల్లో 28 పరుగులు) రాణించడంతో 19.1 ఓవర్లలోనే ధావన్ సేన లక్ష్యాన్ని ఛేదించింది. కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మూడో వన్డే మ్యాచ్ స్కోర్లు: సౌతాఫ్రికా- 99 (27.1 ఓవర్లు) భారత్- 105/3 (19.1 ఓవర్లు) ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ధావన్ సేన కైవసం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కుల్దీప్ యాదవ్(4.1 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు) చదవండి: హ్యూమా ఖురేషీతో కలిసి చిందేసిన టీమిండియా కెప్టెన్ Ind Vs SA: వన్డేల్లో సౌతాఫ్రికా సరికొత్త ‘రికార్డు’.. ధావన్ పరిస్థితి ఇదీ అంటూ వసీం జాఫర్ ట్రోల్! Vice-captain @ShreyasIyer15 finishes off in style! 💥 An all-around performance from #TeamIndia to win the final #INDvSA ODI and clinch the series 2⃣-1⃣. 👏👏 Scorecard ▶️ https://t.co/fi5L0fWg0d pic.twitter.com/7PwScwECod — BCCI (@BCCI) October 11, 2022 -
హ్యూమా ఖురేషీతో కలిసి చిందేసిన శిఖర్ ధవన్
దక్షిణాఫ్రికాతో జరగుతున్న వన్డే సిరీస్లో టీమిండియా కెప్టెన్గా వ్యవహరిస్తున్న శిఖర్ ధవన్ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. టీ-సిరీస్ సంస్థ నిర్మిస్తున్న డబుల్ ఎక్సెల్ సినిమాతో గబ్బర్ సినిమాల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్మీడియాలో వైరలవుతుంది. View this post on Instagram A post shared by Huma Qureshi (@iamhumaq) చిత్ర కధానాయికల్లో ఒకరైన హ్యూమా ఖురేషీ.. గబ్బర్తో కలిసి రొమాంటిక్ డ్యాన్స్ చేస్తున్న సీన్ను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. క్యాట్ ఈజ్ ఔట్ ఆఫ్ ది బ్యాగ్... ఫైనల్లీ అంటూ శిఖర్ ధవన్ను ట్యాగ్ చేస్తూ క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్ క్రికెట్ అభిమానులతో పాటు బాలీవుడ్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటుంది. When Rajshri from Meerut and Saira from Delhi found each other, it was time for double trouble. Be prepared for double the fun. Double the excitement. Double the entertainment. 😍#Double XL in cinemas near you on 4th November 2022. #baatmeinWAZANhai pic.twitter.com/8SRbfxo6wI — Huma Qureshi (@humasqureshi) October 10, 2022 సినిమా విషయానికొస్తే.. సత్రమ్ రమణి దర్శకత్వంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న డబుల్ ఎక్సెల్ చిత్రం అధిక బరువు అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులు కాగా.. గబ్బర్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలోని పాత్రల కోసం హ్యూమా, సోనాక్షి భారీగా బరువు పెరిగారు. డబుల్ ఎక్సెల్ తెలుగులో ఆనుష్క నటించిన సైజ్ జీరోకు దగ్గరగా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. -
Ind Vs SA: వన్డేల్లో సౌతాఫ్రికా సరికొత్త ‘రికార్డు’.. ధావన్ పరిస్థితి ఇదీ అంటూ!
India vs South Africa, 3rd ODI: ఇప్పటికే టీ20 సిరీస్ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న దక్షిణాఫ్రికా.. నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్తో పోరాడుతోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో మంగళవారం ధావన్ సేనతో పోటీ పడుతోంది. కాగా ఈ మ్యాచ్లో ప్రొటిస్ జట్టుకు డేవిడ్ మిల్లర్ కెప్టెన్గా వ్యవహరించడం విశేషం. ఇక ఈ సిరీస్లో దక్షిణాఫ్రికా తమ సారథిని మార్చడం ఇది మూడోసారి. ముచ్చటగా మూడో కెప్టెన్ మొదటి వన్డేకు రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా సారథ్యం వహించగా.. రెండో వన్డేలో కేశవ్ మహరాజ్ కెప్టెన్సీ చేశాడు. బవుమా అనారోగ్య కారణాల వల్ల మిగిలిన రెండు మ్యాచ్లకు దూరం కాగా.. కేశవ్ మహరాజ్ సైతం విశ్రాంతి కోరుకున్నట్లు సమాచారం. దీంతో మిల్లర్ కెప్టెన్గా వచ్చాడు. ఈ నేపథ్యంలో వన్డే ఫార్మాట్లో సౌతాఫ్రికా పేరిట సరికొత్త రికార్డు నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్లో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఒక్కో మ్యాచ్కు ఒక్కో కెప్టెన్ రావడం ఇదే మొదటిసారి. ఇక సౌతాఫ్రికా ఇలా కెప్టెన్లను మార్చడంపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘టాస్ సమయంలో.. ఒక్కో గేమ్లో సౌతాఫ్రికాకు ఒక్కో కెప్టెన్ వస్తున్నపుడు శిఖర్ ధావన్ పరిస్థితి ఇది’’ అంటూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశాడు. Shikhar Dhawan at the toss with a different SA captain every game 😄 #INDvSA pic.twitter.com/28iE883xSW — Wasim Jaffer (@WasimJaffer14) October 11, 2022 కుప్పకూలిన టాపార్డర్ సిరీస్ డిసైడర్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన మిల్లర్ బృందానికి ఆరంభంలోనే భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో ప్రొటిస్ టాపార్డర్ కుప్పకూలింది. క్లాసెన్ 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు కూల్చి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డరర్ పతనాన్ని శాసించాడు. దీంతో 27.1 ఓవర్లలో 99 పరుగులు మాత్రమే చేసి ప్రొటిస్ జట్టు ఆలౌట్ అయింది. చదవండి: Central Contract for 2022- 23: జాసన్ రాయ్కు షాకిచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు Women's Asia Cup 2022: డిఫెండింగ్ చాంపియన్ అవుట్! భారత్, పాక్, శ్రీలంకతో పాటు థాయ్లాండ్.. -
ధవన్ సేన బి టీమ్ కాదు.. భారత్కు ఒకేసారి నాలుగైదు జట్లను ఆడించే సత్తా ఉంది..!
IND VS SA 2nd ODI: రాంచీ వేదికగా టీమిండియాతో రేపు (అక్టోబర్ 9) జరుగబోయే రెండో వన్డేకి ముందు దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ల గైర్హాజరీలో తమతో వన్డే సిరీస్ ఆడుతున్న శిఖర్ ధవన్ సేనను భారత-బి టీమ్ అంటే అస్సలు ఒప్పుకోనని అతను వ్యాఖ్యానించాడు. భారత ఆటగాళ్లలో చాలా టాలెంట్ ఉందని, ఒకేసారి నాలుగైదు అంతర్జాతీయ స్థాయి జట్లను బరిలోకి దించే సత్తా వారికి ఉందని టీమిండియా ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జట్టులో లేనంత మాత్రాన ధవన్ సేనను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదని పేర్కొన్నాడు. తమతో వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టులో నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారని, వారితో ఏమరపాటుగా ఉంటే అసలుకే మోసం వస్తుందని సఫారీ ప్లేయర్లను పరోక్షంగా హెచ్చరించాడు. ధవన్ సేనలో చాలా మంది కుర్రాళ్లకు ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని, వారంతా ప్రపంచ స్థాయి ఆటగాళ్లేనని సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్లను ఉద్దేశించి కామెంట్ చేశాడు. టీమిండియాతో ఆడటం ఎంతటి జట్టుకైనా సవాలుతో కూడుకున్న పనేనని, వారు ఒకేసారి నాలుగైదు జట్లను బరిలోకి దించినా వారి బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగానే ఉంటుందని కొనియాడాడు. టీ20 సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన తమ జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉందని, ఈ సిరీస్ను తామ తప్పక చేజిక్కించుకుని ఆస్ట్రేలియాకు (టీ20 వరల్డ్కప్ వేదిక) బయల్దేరుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే, లక్నో వేదికగా భారత్తో జరిగిన తొలి వన్డేలో సఫారీ జట్టు 9 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో సంజూ శాంసన్ (86 నాటౌట్) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి మ్యాచ్ను చివరి నిమిషం వరకు ఆసక్తికరంగా మార్చాడు. అయితే ఆఖర్లో టెయిలెండర్ ఆవేశ్ ఖాన్ చేసిన పొరపాట్ల వల్ల శాంసన్కు స్ట్రయిక్ రాకపోవడంతో భారత్ ఓటమిపాలైంది. 40 ఓవర్ల పాటు సాగిన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 4 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో టీమిండియా 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేయగలిగింది. -
Ind Vs SA: రాంచీకి చేరుకున్న టీమిండియా; అక్కడ ప్రాక్టీసులో రోహిత్ సేన!
India vs South Africa, 2nd ODI: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియాకు.. వన్డే సిరీస్ ఆరంభ మ్యాచ్లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. లక్నో వేదికగా గురువారం(అక్టోబరు 6) జరిగిన మ్యాచ్లో ప్రొటిస్ చేతిలో ధావన్ సేన ఓడిపోయిన విషయం తెలిసిందే. తొమ్మిది పరుగుల తేడాతో పరాజయం పాలై మూడు మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుబడింది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు వన్డేలు గెలిచి ట్రోఫీ సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది టీమిండియా. ఈ క్రమంలో రెండో మ్యాచ్ ఆడేందుకు రాంచీకి చేరుకుంది. జార్ఖండ్లోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో ఆదివారం (అక్టోబరు 9) ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ధావన్ సేనకు ఘన స్వాగతం ఇందుకోసం రాంచీకి చేరుకున్న టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. కెప్టెన్ శిఖర్ ధావన్ సహా కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ తదితరులకు హోటల్ సిబ్బంది బొట్టుపెట్టి ఆహ్వానించగా.. అభిమానులు ఆటగాళ్లను విష్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. Touchdown Ranchi 📍#TeamIndia | #INDvSA pic.twitter.com/HCgIQ9pk0M — BCCI (@BCCI) October 8, 2022 ప్రాక్టీసులో తలమునకలైన రోహిత్ సేన ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 వరల్డ్కప్-2022 టోర్నీ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చేరుకున్న విషయం తెలిసిందే. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో ఇప్పటికే ప్రాక్టీసు మొదలుపెట్టేసింది కూడా! ఇలా భారత ఆటగాళ్లు తీరికలేని షెడ్యూల్తో బిజీగా ఉన్నారు. అక్టోబరు 16 నుంచి ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదం లభించనుంది. చదవండి: Ind Vs SA: పరుగులు సాధిస్తున్నా టీమిండియాలో చోటు దక్కడం లేదు! స్వీట్లు, చైనీస్ ఫుడ్ మానేశా! ఇకపై.. #TeamIndia had a light training session yesterday at the WACA. Our strength and conditioning coach, Soham Desai gives us a lowdown on the preparations ahead of the @T20WorldCup pic.twitter.com/oH1vuywqKW — BCCI (@BCCI) October 8, 2022 -
India vs Zimbabwe 1st ODI: శుభారంభం ఓపెనర్లతోనే...
వరుస పర్యటనలో, వరుస సిరీస్ వేటలో భారత్ శుభారంభం చేసింది. చాలా కాలం తర్వాత పునరాగమనం చేసిన దీపక్ చహర్ (3/27) బౌలింగ్లో జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ను బెంబేలెత్తిస్తే... విజయవంతమైన గిల్–ధావన్ ఓపెనింగ్ జోడి మరొకరికి చాన్స్ ఇవ్వకుండా మ్యాచ్ను ముగించింది. హరారే: ఫామ్లో ఉన్న ఓపెనర్లు శుబ్మన్ గిల్, శిఖర్ ధావన్ అజేయ అర్ధసెంచరీల కంటే కూడా దీపక్ చహర్ స్పెల్ (7–0–27–3) ఈ మ్యాచ్లో హైలైట్. ఆరు నెలల తర్వాత బరిలోకి దిగిన చహర్ పిచ్ పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకొని వైవిధ్యమైన బంతులతో టాపార్డర్లో ఏ ఒక్కరిని పట్టుమని 10 పరుగులైనా చేయనివ్వలేదు. ఛేదన సులువయ్యేందుకు అతని స్పెల్ కారణమైంది. ఇదే పిచ్పై రెండు వారాల క్రితం వరుస మ్యాచ్ల్లో 290, 303 పరుగులు నమోదయ్యాయి. సులువుగా ఛేదించడం కూడా జరిగింది. అలాంటి పిచ్పై చహర్ బౌలింగ్ అసాధారణమనే చెప్పాలి. దీంతో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రెగిస్ చకాబ్వా (51 బంతుల్లో 35; 4 ఫోర్లు), రిచర్డ్ ఎన్గరవా (42 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), ఇవాన్స్ (29 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మన బౌలింగ్కు కాస్త ఎదురు నిలిచారు. స్పిన్నర్ అక్షర్ పటేల్, సీమర్లు దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ తలా 3 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 30.5 ఓవర్లలో అసలు వికెట్టే కోల్పోకుండా 192 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు శుబ్మన్ గిల్ (72 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), ధావన్ (113 బంతుల్లో 81 నాటౌట్; 9 ఫోర్లు) ఇద్దరే లక్ష్యాన్ని ఛేదించేశారు. చహర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభించింది. రేపు ఇదే వేదికపై రెండో వన్డే జరుగుతుంది. చహర్ దెబ్బకు ‘టాప్’టపా వికెట్లు కొత్త బంతితో దీపక్ చహర్ చెలరేగాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఇన్నోసెంట్ కైయా (4)ను కీపర్ క్యాచ్తో పంపాడు. తన మరుసటి ఓవర్ తొలి బంతికి మరుమని (8)ని కూడా కీపర్ క్యాచ్తోనే పెవిలియన్ చేర్చాడు. వెస్లీ మదెవెర్ (5)ను ఎల్బీగా ఔట్ చేశాడు. అంతకుముందు ఓవర్లో సిరాజ్... సియాన్ విలియమ్స్ (1) వికెట్ తీశాడు. జింబాబ్వే 31 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. మిడిలార్డర్ సంగతి ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ చూసుకోవడంతో ఒక దశలో జింబాబ్వే 110/8 స్కోరుతో ఆలౌట్కు దగ్గరైంది. బ్రాడ్ ఇవాన్స్, రిచర్డ్ తొమ్మిదో వికెట్కు 70 పరుగులు జోడించడంతో ఆమాత్రం స్కోరు చేయగలిగింది. ఇద్దరే పూర్తి చేశారు టాపార్డర్లో ఓపెనింగ్ను ఇష్టపడే కెప్టెన్ రాహుల్ తను కాదని విజయవంతమైన ధావన్–గిల్ జోడితోనే ఓపెన్ చేయించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా శిఖర్–శుబ్మన్ జోడీ ఈ రెండు నెలల్లో మూడో శతక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. విండీస్ గడ్డపై కనబరిచిన జోరునే జింబాబ్వేపై కూడా కొనసాగించారు. మైదానంలో బౌండరీలు, భారత్కు పరుగులు వస్తున్నాయి కానీ పాపం ఆతిథ్య బౌలర్లకే వికెట్ గగనమైంది. ఏకంగా ఎనిమిది మంది బౌలర్లతో వేయించిన ప్రయత్నం కూడా ఫలితాన్నివ్వలేదు. ముందుగా ధావన్ (76 బంతుల్లో 5ఫోర్లతో) ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 20వ ఓవర్లో 100 పరుగులు దాటింది. శుబ్మన్ కూడా (51 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ లక్ష్యాన్ని చేరేందుకు 30.5 ఓవర్లే సరిపోయాయి. దాదాపు 20 ఓవర్ల ముందే ఇద్దరే బ్యాటర్లు జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్: కైయా (సి) సామ్సన్ (బి) చహర్ 4; మరుమని (సి) సామ్సన్ (బి) చహర్ 8; వెస్లీ (ఎల్బీ) (బి) చహర్ 5; సియాన్ విలియమ్స్ (సి) ధావన్ (బి) సిరాజ్ 1; సికందర్ రజా (సి) ధావన్ (బి) ప్రసిధ్ 12; చకాబ్వా (బి) అక్షర్ 35; రియాన్ బర్ల్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 11; ల్యూక్ జాంగ్వే (ఎల్బీ) (బి) అక్షర్ 13; ఇవాన్స్ నాటౌట్ 33; రిచర్డ్ (బి) ప్రసిధ్ 34; విక్టర్ (సి) గిల్ (బి) అక్షర్ 8; ఎక్స్ట్రాలు 25; మొత్తం (40.3 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–25, 2–26, 3–31, 4–31, 5–66, 6–83, 7–107, 8–110, 9–180, 10–189. బౌలింగ్: దీపక్ చహర్ 7–0–27–3, సిరాజ్ 8–2–36–1, కుల్దీప్ 10–1–36–0, ప్రసిధ్ 8–0–50–3, అక్షర్ 7.3–2–24–3. భారత్ ఇన్నింగ్స్: ధావన్ నాటౌట్ 81; శుబ్మన్ గిల్ నాటౌట్ 82; ఎక్స్ట్రాలు 29; మొత్తం (30.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 192. బౌలింగ్: రిచర్డ్ ఎన్గరవా 7–0–40–0, విక్టర్ 4–0–17–0, ఇవాన్స్ 3.5–0–28–0, సియాన్ 5–0–28–0, సికందర్ రజా 6–0–32–0, ల్యూక్ జాంగ్వే 2–0–11–0, వెస్లీ 2–0–16–0, రియాన్ బర్ల్ 1–0–12–0. -
Ind Vs Zim: జింబాబ్వే గడ్డపై 23 మ్యాచ్లు ఆడిన భారత్.. 4 ఓడింది! ఈసారి..
India tour of Zimbabwe, 2022- 1st ODI: టీమిండియా మరో సిరీస్ వేటకు సిద్ధమైంది. మూడు వన్డేలు ఆడేందుకు జింబాబ్వేలో పర్యటిస్తోంది. కాగా ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో వన్డే, టీ20 సిరీస్లను 2-1తో గెలిచిన భారత జట్టు.. వెస్టిండీస్ గడ్డ మీద శిఖర్ ధావన్ సారథ్యంలో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్(3-0) చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా విండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ టూర్లలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్(విండీస్తో వన్డే సిరీస్), వెస్టిండీస్తో ఆఖరి టీ20కి హార్దిక్ పాండ్యా సారథులుగా వ్యవహరించారు. ఇక జింబాబ్వే పర్యటనకు తొలుత శిఖర్ ధావన్ కెప్టెన్గా ఎంపికైనప్పటికీ.. పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి రావడంతో గబ్బర్ను తప్పించి.. రాహుల్కు పగ్గాలు అప్పగించారు. గతంలో దక్షిణాఫ్రికా సిరీస్లో వైట్బాల్ క్రికెట్ సిరీస్కు సారథ్యం వహించిన రాహుల్.. ప్రొటిస్ గడ్డపై ఘోర పరాభవం చవిచూశాడు. అయితే, ఇప్పుడు జింబాబ్వే టూర్ రూపంలో అతడికి కెప్టెన్గా సిరీస్ గెలిచే సువర్ణావకాశం వచ్చింది. అయితే.. ఆతిథ్య జట్టు సైతం సొంతగడ్డపై బంగ్లాదేశ్ను వన్డే, టీ20 సిరీస్లలో 2-1తో మట్టికరిపించి ఆత్మవిశ్వాసంతో ఉంది. టీమిండియాకు పోటీనిస్తామని ధీమాగా చెబుతోంది. ఈ రెండు జట్ల మధ్య హరారే వేదికగా గురువారం(ఆగష్టు 18) నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మధ్యాహ్నం గం. 12:45 నుంచి సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం జరుగబోతోంది. ఈ నేపథ్యంలో మొదటి వన్డేకు తుది జట్ల అంచనా, పిచ్, వాతావరణం, ముఖాముఖి రికార్డులు తదితర అంశాలు పరిశీలిద్దాం. జింబాబ్వే వర్సెస్ భారత్ మొదటి వన్డే తుది జట్లు (అంచనా) టీమిండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, శుబ్మన్ గిల్, సంజూ సామ్సన్, దీపక్ హుడా, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ/అవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్. జింబాబ్వే: రెగిస్ చకాబ్వా (కెప్టెన్), మరుమని, కైటానో, కయా, వెస్లీ మదెవెర్/సీన్ విలియమ్స్, సికందర్ రజా, టోని మన్యొంగా, ల్యూక్ జాంగ్వే, బ్రాడ్ ఇవాన్స్, విక్టర్ న్యాయుచి, చివాంగ. పిచ్, వాతావరణం జింబాబ్వే రాజధాని హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ వన్డే సిరీస్ జరుగనుంది. ఇక బంగ్లాదేశ్తో జింబాబ్వే ఇటీవలే ఈ పిచ్ మీద ఆడింది. పర్యాటక బంగ్లా నమోదు చేసిన 303, 290 భారీ స్కోర్లను సైతం జింబాబ్వే అవలీలగా ఛేదించింది. దీనిని బట్టి చూస్తే బ్యాటర్లు చెలరేగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి పరుగుల వరద పారుతుందడనంలో సందేహం. అభిమానులకు పండగే. ఇక వాతావరణం విషయానికొస్తే.. మ్యాచ్కు వర్షం ముప్పులేదు. టీమిండియా- జింబాబ్వే ముఖాముఖి రికార్డులు: టీమిండియా- జింబాబ్వే జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 63 వన్డే మ్యాచ్లు జరిగాయి. ఇందులో భారత్ 51, జింబాబ్వే 10 గెలిచాయి. మరో రెండు మ్యాచ్లు ‘టై’గా ముగిశాయి. ఇక జింబాబ్వే గడ్డపై ఆ జట్టుతో 23 మ్యాచ్లు ఆడిన టీమిండియా 19 మ్యాచ్ల్లో విజయం సాధించింది. నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయింది. సొంతగడ్డపై జింబాబ్వే చివరిసారి 2010లో భారత్పై వన్డేలో గెలిచింది. చదవండి: జింబాబ్వేకు బీసీసీఐ ఇస్తున్న ‘ఆర్థిక బహుమతి’... మరో సిరీస్ వేటలో భారత్! కళ్లన్నీ వాళ్ల మీదే! Vinod Kambli: ఏదైనా పని ఉంటే ఇప్పించండి.. చాలీచాలని జీతంతో బ్రతుకీడుస్తున్నా..! IRE VS AFG 5th T20: ఆఫ్ఘనిస్తాన్కు షాకిచ్చిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం Deepak Hooda: ప్రపంచ రికార్డుకు చేరువలో దీపక్ హుడా.. భారత్ తరపున తొలి ఆటగాడిగా #TeamIndia ready for the first ODI against Zimbabwe 🙌#ZIMvIND pic.twitter.com/Hg0yUSGYAA — BCCI (@BCCI) August 18, 2022 -
Ind Vs Zim: నేను, నా భార్య ఖాళీగా ఉన్నపుడు చేసే పని అదే! నా ముద్దు పేరు..
India Vs Zimbabwe ODI Series- Sanju Samson: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ జింబాబ్వేతో వన్డే సిరీస్కు ఎంపికైన విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే పర్యాటక దేశానికి చేరుకున్న ఈ కేరళ ఆటగాడు తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ర్యాపిడ్ ఫైర్ సెషన్లో భాగంగా తన ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. వీడియో ప్రకారం.. పలు ప్రశ్నలకు సంజూ సరదాగా సమాధానమిచ్చాడిలా! నా ముద్దు పేరు ఏమిటంటే?! ►బప్పు మీకు ఇష్టమైన ఆహారం? కానీ ఇప్పుడు తినలేకపోతున్నది? ►చాకొలెట్లంటే నాకు ఇష్టం. అయితే, ఈ పర్యటన వల్ల చాలా రోజుల నుంచే అవి తినడం మానేశాను. నిజానికి మా అమ్మ చేతి వంట అంటే నాకు మహాప్రీతి. అయితే, ఇప్పుడు ఇక్కడున్న కారణంగా ఆమె వంటలు తినే పరిస్థితి లేదు కదా! ఇష్టమైన ప్రదేశాలు ►మా స్వస్థలం కేరళలో నదీజలాలు ఎక్కువ. బీచ్లలో సమయం గడపటం అంటే నాకెంతో ఇష్టం. మీకు ఇష్టమైన ఆటగాడు? ►చాలా మంది ఉన్నారు. వారిలో ఎంఎస్ ధోని నా ఫేవరెట్. ఒకవేళ మీకు సూపర్ పవర్స్ వస్తే! ►నాకు ఇష్టమైన ప్రదేశాలన్నింటిని క్షణకాలంలో చుట్టేసి వస్తా. వెంటనే వాటిని మాయం చేస్తా కూడా! టీమిండియా క్రికెటర్లలో ఇన్స్టాగ్రామ్లో యూజర్లను ఆకర్షించే కంటెంట్ కలిగి ఉండేది ఎవరు? ►మన సూపర్ స్టార్ యజువేంద్ర చహల్. ఖాళీగా ఉన్నపుడు మేము చేసే పని అదే! ►నేను, నా భార్య ఇంట్లో ఖాళీగా కూర్చున్నపుడు శిఖర్ భాయ్ రీల్స్ చూస్తూ ఉంటాం. నిజంగా అవెంతో ఆసక్తికరంగానూ.. సరదాగానూ ఉంటాయి. 2015లో అడుగుపెట్టి.. కాగా 1994, నవంబరు 11న త్రివేండ్రంలోని పల్లువిలలో జన్మించిన సంజూ శాంసన్ వికెట్ కీపర్ బ్యాటర్గా ఎదిగాడు. కుడిచేతి వాటం గల 27 ఏళ్ల సంజూ 2015లో జింబాబ్వేతో టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇక గతేడాది జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా శిఖర్ ధావన్ సారథ్యంలోని జట్టుకు ఎంపికైన సంజూ శాంసన్.. వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. ఇటీవలి వెస్టిండీస్ టూర్లో వన్డే సిరీస్లో ఆడిన ఈ కేరళ బ్యాటర్.. టీ20 సిరీస్లోనూ భాగమయ్యాడు. అదే విధంగా 2013లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అడుగుపెట్టిన సంజూ.. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్నాడు. ఐపీఎల్-2022లో రాజస్తాన్ను ఫైనల్కు చేర్చడంలో బ్యాటర్గానూ.. కెప్టెన్గానూ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. ప్రతిభావంతుడైన ఆటగాడిగా నిరూపించుకున్నప్పటికీ సంజూకు టీమిండియాలో తగినన్ని అవకాశాలు రాలేదనే చెప్పాలి. పలు సందర్భాల్లో అతడు రాణించినప్పటికీ సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. దీంతో.. అభిమానులు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తూ సంజూకు మద్దతుగా నిలిచారు. కాగా జింబాబ్వే టూర్కు ఎంపికైన సంజూ.. ఆసియా కప్-2022 ఆడే భారత జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక సంజూ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... తన స్నేహితురాలు చారులతను ప్రేమించిన అతడు 2018, డిసెంబరులో ఆమెను వివాహమాడాడు. చదవండి: Ind VS Zim 1st ODI: ఓపెనర్లుగా వాళ్లిద్దరే! ఇషాన్కు నో ఛాన్స్! త్రిపాఠి అరంగేట్రం! India Tour Of Zimbabwe: విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బిక్క మొహం వేసిన ధవన్ His favourite sporting personality? 🤔 Food that he loves but cannot eat now? 🍲 His one nickname that not many are aware of? 😎 All this & much more in this fun rapid-fire with @IamSanjuSamson, straight from Harare. 👌 👌 - By @ameyatilak #TeamIndia | #ZIMvIND pic.twitter.com/IeidffhtMl — BCCI (@BCCI) August 17, 2022 -
ధవన్ను ఇంతలా అవమానించడం సరికాదు.. వేరేవాళ్లయ్యుంటే రచ్చరచ్చ జరిగేది..!
జింబాబ్వేతో వన్డే సిరీస్కు టీమిండియా కెప్టెన్గా తొలుత శిఖర్ ధవన్ పేరును ప్రకటించిన భారత సెలెక్టర్లు.. కొద్ది రోజుల తర్వాత కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో సారధ్య బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే ధవన్ను రాహుల్కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) కొనసాగవలసిందిగా కోరారు. ధవన్ను అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తప్పించిన ఈ ఉదంతంపై సర్వత్ర విస్మయం వ్యక్తమవుతుండగా, తాజాగా టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ కూడా స్పందించాడు. ధవన్ విషయంలో సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జట్టులో సీనియర్ అయిన ధవన్ను అంతలా అవమానించడం సరికాదని దుయ్యబట్టాడు. రాహుల్ ఫిట్గా ఉన్నాడన్న నివేదికలు ఆలస్యంగా వచ్చి ఉంటే, ధవన్ నాయకత్వంలో రాహుల్ ఆడితే కొంపమునిగేదేం కాదని అభిప్రాయపడ్డాడు. అంతకుముందు విండీస్ సిరీస్లో టీమిండియాను 3-0 తేడాతో గెలిపించిన ధవన్ను అర్ధంతరంగా కెప్టెన్సీ నుంచి తప్పించడం సమంజసం కాదని అన్నాడు. సరైన కమ్యూనికేషన్తో ఈ పరిస్థితి తలెత్తకుండా నివారించి ఉండవచ్చని తెలిపాడు. ఆసియా కప్కు ముందు రాహుల్కు ప్రాక్టీస్ అవసరం కాబట్టి, అతన్ని జట్టులో సభ్యుడిగా ఎంపిక చేయడం తప్పేమీ కాదని పేర్కొన్నాడు. ఏది ఏమైనా అకస్మాత్తుగా కెప్టెన్సీ తొలగించడం ధవన్ లాంటి సక్సెస్ఫుల్ కెప్టెన్ విషయంలో సరికాదని చెప్పుకొచ్చాడు. ధవన్ కూల్ కాండిడేట్ కాబట్టి, ఈ విషయాన్ని రాద్ధాంతం చేయలేదని, వేరే వాళ్ల విషయంలో ఇలాగే జరిగి ఉంటే పెద్ద రచ్చే అయ్యేదని అభిప్రాయపడ్డాడు. చదవండి: విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బిక్క మొహం వేసిన ధవన్.. వైరల్ వీడియో -
Ind VS Zim: ఓపెనర్లుగా వాళ్లిద్దరే! ఇషాన్కు నో ఛాన్స్! అతడి అరంగేట్రం!
Ind Vs Zim 1st ODI- Aakash Chopra's India Probable XI: కేఎల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా జింబాబ్వేతో వన్డే సిరీస్కు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో గురువారం(ఆగష్టు 18) హరారే వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మొదటి వన్డేకు తన జట్టును ప్రకటించాడు. ఇషాన్కు నో ఛాన్స్! కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ జట్టులో ఉన్న నేపథ్యంలో శుబ్మన్ గిల్కు ఓపెనర్గా అవకాశం రాదని అంచనా వేసిన ఆకాశ్.. ఇషాన్ కిషన్కు తుది జట్టులో అసలు చోటు దక్కదని అభిప్రాయపడ్డాడు. ఇక ఈ మ్యాచ్తో 31 ఏళ్ల రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేసే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు. మిడిలార్డర్లో సంజూ శాంసన్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని ఆకాశ్ అంచనా వేశాడు. అదే విధంగా.. జింబాబ్వేతో మొదటి మ్యాచ్లో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగితే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్.. పేస్ బౌలర్లు దీపక్ చహర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణకు తన జట్టులో చోటిచ్చాడు ఈ కామెంటేటర్. ఓపెనర్లుగా వాళ్లిద్దరే! ఈ మేరకు ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘వెస్టిండీస్ పర్యటనలో వన్డే సిరీస్లో శుబ్మన్ గిల్ అద్భుతంగా రాణించాడు. అయితే, ఇప్పుడు కేఎల్ రాహుల్ కెప్టెన్గా జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు. లెఫ్ట్- రైట్ కాంబినేషన్తో వెళ్లాలనుకుంటే కచ్చితంగా వీళ్లిద్దరే ఓపెనర్లుగా వస్తారు. అయితే, రాహుల్ విలక్షణమైన బ్యాటర్.. ఏ స్థానంలోనైనా అతడు సత్తా చాటగలడు. కానీ.. ఐపీఎల్-2022 తర్వాత అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఏదేమైనా ఎప్పటిలాగే అతడు ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువ. ఇక మూడో స్థానంలో శుబ్మన్ గిల్ ఉండనే ఉన్నాడు. త్రిపాఠి అరంగేట్రం! నేనైతే సంజూ శాంసన్ను నాలుగో స్థానానికి ఎంపిక చేస్తాను. దీపక్ హుడా ఐదు, ఆ తర్వాతి స్థానంలో రాహుల్ త్రిపాఠి. నిజానికి త్రిపాఠి కూడా ఏ స్థానంలోకి బరిలోకి దిగినా తనను తాను నిరూపించుకోగలడు. రుతురాజ్, ఇషాన్ లోయర్ ఆర్డర్లో ఆడరు కాబట్టి అతడు ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉంది’’ అని బ్యాటింగ్ ఆర్డర్ గురించి అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా రాహుల్ త్రిపాఠి ఐర్లాండ్తో టీ20 సిరీస్కు ఎంపికైనా తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. జింబాబ్వేతో మొదటి వన్డేకు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టు: కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శుబ్మన్ గిల్, సంజూ శాంసన్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, అక్షర్ పటేల్, దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ. చదవండి: Ind Vs Zim ODI 2022: జింబాబ్వే పర్యటనలో టీమిండియా.. పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలు.. తాజా అప్డేట్లు! Ned Vs Pak 1st ODI: పాకిస్తాన్కు చుక్కలు చూపించిన ‘పసికూన’! వామ్మో.. బాబర్ ఏమన్నాడంటే! -
విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు బిక్క మొహం వేసిన ధవన్.. వైరల్ వీడియో
3 వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియా హరారే వేదికగా రేపు (ఆగస్ట్ 18) తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా ఆటగాళ్లు ఒక్కొక్కరుగా మీడియా కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ శిఖర్ ధవన్ తమ మ్యాచ్ ప్రణాళికలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు శిఖర్ ధవన్ ప్రదర్శించిన హావభావాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. pic.twitter.com/FEKRNyFZBW — Guess Karo (@KuchNahiUkhada) August 16, 2022 ఓ స్థానిక రిపోర్టర్ అడిగిన ప్రశ్న అర్ధం కాక ధవన్ బిక్క మొహంతో ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఇంతకీ రిపోర్టర్ ధవన్ను ఏం అడిగాడంటే.. "పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్న జింబాబ్వే లాంటి జట్టుతో ఆడటం మీకు ఏ మేరకు లాభిస్తుంది. ఇటీవలికాలంలో జింబాబ్వే మీతో పెద్దగా ఆడింది లేదు. వారిపై గెలవడం సులవునేనని భావిస్తున్నారా?" అని ప్రశ్నించారు. రిపోర్టర్ తన యాసలో వేగంగా ప్రశ్నించడంతో అయోమయానికి గురైన ధవన్.. బిక్క మొహం పెట్టాడు. ప్రశ్నను మరోసారి రిపీట్ చేయాలని రిపోర్టర్ను కోరాడు. ఈ సారి రిపోర్టర్ అడిగిన ప్రశ్నను ఏకాగ్రతతో విన్న ధవన్.. తగు సమాధానమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. కాగా, జింబాబ్వేతో వన్డే సిరీస్కు తొలుత శిఖర్ ధవన్నే కెప్టెన్గా నియమించినప్పటికీ.. అనంతరం కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకోవడంతో అతడికి బాధ్యతలు అప్పగించారు. కెప్టెన్సీ దూరమైనప్పటికీ ధవన్ ఎంతో హుషారుగా, ఆత్మవిశ్వాసంతో ఉండటం విశేషం. చదవండి: కశ్మీర్ లీగ్ ఎఫెక్ట్: హర్షల్ గిబ్స్పై వేటు.. గంగూలీపై ప్రశంసలు -
Ind Vs Zim: జింబాబ్వేకు పయనమైన టీమిండియా ఆటగాళ్లు..
Ind Vs Zim ODI Series: వరుస సిరీస్లతో బిజీ బిజీగా గడుపుతున్న భారత క్రికెట్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఈనెల 18 నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు శనివారం జింబాబ్వేకు పయనమయ్యారు. శిఖర్ ధావన్, దీపక్ చహర్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్ తదితరులు విమానంలో బయల్దేరారు. వీరితో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం పయనమయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్లో టీమిండియాను విజేతగా నిలిపిన శిఖర్ ధావన్ను తొలుతు జింబాబ్వే టూర్కు కెప్టెన్గా ఎంపిక చేశారు. అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కోలుకోవడంతో.. గబ్బర్ను తప్పించి అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు. ఇక ఈ పర్యటనలో హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు బదులు వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు మార్గరదర్శనం చేయనున్నాడు. జింబాబ్వే సిరీస్కు, ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్-2022 టోర్నీకి మధ్య తక్కువ వ్యవధి ఉండటమే ఇందుకు కారణం. ఇక హరారే వేదికగా టీమిండియా- జింబాబ్వే జట్ల మధ్య ఆగష్టు 18న మొదటి వన్డే, ఆగష్టు 20న రెండో వన్డే, ఆగష్టు 22న మూడో వన్డే జరుగనున్నాయి. కాగా ఇటీవల స్వదేశంలో జింబాబ్వే మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. తమ దేశంలో పర్యటించిన బంగ్లాదేశ్కు షాకిస్తూ టీ20, వన్డే సిరీస్లను 2-1తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు సైతం గట్టి పోటీనిస్తామంటూ జింబాబ్వే కోచ్ డేవిడ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్.. జట్టు ఇదే -
T20 WC 2022: సెలక్టర్లు ఏం ఆలోచిస్తారో మనకు తెలియదు: ధావన్
గత కొంతకాలంగా టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరును కేవలం వన్డే జట్టు ఎంపికలోనే పరిగణనలోకి తీసుకుంటున్నారు సెలక్టర్లు. ఐపీఎల్-2022లో రాణించిన వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్కు టీ20 జట్టులో చోటు కల్పిస్తున్నా.. గబ్బర్కు మాత్రం మొండిచేయి చూపుతున్నారు. అయితే వన్డేల్లో మాత్రం అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి. అంతేకాదు ఇటీవల ముగిసిన వెస్టిండీస్ సిరీస్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్గా కూడా వ్యవహరించాడు ధావన్. కానీ.. పొట్టి ఫార్మాట్లో మాత్రం గబ్బర్కు నిరాశ తప్పడం లేదు. ముఖ్యంగా టీ20 వరల్డ్కప్-2022 టోర్నీ సమయం దగ్గరపడుతున్న వేళ యువకులతో పలు ప్రయోగాలు చేస్తున్న యాజమాన్యం ధావన్ పేరును పూర్తిగా పక్కనపెట్టినట్లే కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో స్పోర్ట్స్తక్తో మాట్లాడిన శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 జట్టులో చోటు దక్కకపోవడం వల్ల తానేమీ నిరాశ చెందడం లేదని పేర్కొన్నాడు. నేనేమీ ఫీల్ కావడం లేదు ఈ మేరకు 36 ఏళ్ల గబ్బర్ మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే నేనేమీ ఫీల్ కావడం లేదు. నిరాశ పడటం లేదు కూడా! ప్రతి దానికి ఓ టైమ్ అంటూ ఉంటుంది. ఇప్పుడైతే నా టైమ్ నడవడం లేదు(నాకు పరిస్థితులు అనుకూలంగా లేవు)! ఒకవేళ నేనే బాగా ఆడలేకపోతున్నానేమో(ఇతరుల దృష్టిలో)! అయినా నేనేమీ బాధపడటం లేదు. నా వరకు నేను అత్యుత్తుమ ఆట తీరు కనబరుస్తున్నాననే అనుకుంటున్నా! ఏదేమైనా నేను సంతోషంగా ఉన్నానా లేదా అనేదే నాకు ముఖ్యం. నా పేరు జట్టులో లేకపోయినంత మాత్రాన.. అది నా ఆటపై ప్రభావం చూపదు. ఒకవేళ అవకాశం వచ్చిందంటే.. కచ్చితంగా నన్ను నేను నిరూపించుకుంటా! ఐపీఎల్లో నా సర్వశక్తులు ఒడ్డాను. అత్యుత్తమంగా రాణించాను. అక్కడ బాగా ఆడాను కాబట్టి నన్ను సెలక్ట్ చేస్తారనుకున్నా. కానీ.. నన్ను ఎంపిక చేయాలా వద్దా అన్నది సెలక్టర్ల నిర్ణయం కదా! వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో.. జట్టు ఎంపిక విషయంలో ఏ అంశాలు పరిగణనలోకి తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే ఫిట్నెస్ కాపాడుకుంటూ అవకాశం వస్తే దానిని సద్వినియోగం చేసుకునేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటా’’ అని చెప్పుకొచ్చాడు. వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని గతేడాది శ్రీలంక పర్యటనలో కెప్టెన్గా వ్యవహరించిన తర్వాత ధావన్కు జాతీయ జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇంగ్లండ్తో వన్డే సిరీస్తో పునరాగమనం చేశాడు. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో ఏకంగా సారథిగా అవకాశం వచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ధావన్ కరేబియన్ గడ్డపై యువ జట్టుతో చరిత్ర సృష్టించాడు. ఏకంగా సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలో వన్డే వరల్డ్కప్-2023 జట్టులో ధావన్కు చోటు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన శిఖర్ ధావన్ 14 ఇన్నింగ్స్లో 460 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 88 నాటౌట్. అయినా.. పొట్టి ఫార్మాట్లో అతడికి అవకాశాలు రావడం లేదు. చదవండి: CWG 2022: నన్ను క్షమించండి.. మహిళా రెజ్లర్ కన్నీటి పర్యంతం.. ప్రధాని మోదీ ట్వీట్! Rohit Sharma: ఎనిమిదింటికి ఎనిమిది గెలిచేశాడు.. 5 క్లీన్స్వీప్లు.. నువ్వు తోపు కెప్టెన్! -
స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన టీమిండియా కెప్టెన్
టీమిండియా పార్ట్ టైమ్ వన్డే కెప్టెన్ శిఖర్ ధవన్ నిన్న (ఆగస్ట్ 5) ఢిల్లీలో స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించాడు. క్షేత్ర స్థాయి క్రీడాకారుల్లో నైపుణ్యాలను కనుగొని, వారిని ఆయా విభాగాల్లో మరింత రాటుదేల్చాలనే ధ్యేయంతో ఈ అకాడమీని నెలకొల్పుతున్నట్లు ధవన్ తెలిపాడు. ఈ అకాడమీకి 'డా వన్' అనే పేరును ఖరారు చేశాడు. క్రికెట్తో పాటు మరో 8 క్రీడాంశాల్లో క్రీడాకారులకు ఈ అకాడమీ శిక్షణ ఇవ్వనుందని తెలిపాడు. ఈ అకాడమీలో క్రీడాకారులతో పాటు కోచ్లకు కూడా శిక్షణ ఉంటుందని పేర్కొన్నాడు. కోచ్లు క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇచ్చేలా సానబెడతామని అన్నాడు. దేశవ్యాప్తంగా ఉత్తమ కోచ్లను ఎంపిక చేసి డా వన్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ ఇప్పిస్తామని వివరించాడు. క్రికెట్ నాకెంతో ఇచ్చింది.. అందుకు తనవంతుగా క్రీడలకు వీలైనంత సాయం చేయాలని భావిస్తున్నానని తెలిపాడు. ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో వన్డేల్లో టీమిండియాను విజయవంతంగా ముందుండి నడిపిస్తున్న శిఖర్ ధవన్.. త్వరలో జింబాబ్వేలో వన్డే సిరీస్ కూడా కెప్టెన్గా ఎంపికైన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో శ్రీలంక, వెస్టిండీస్ పర్యటనల్లో భారత్కు అద్భుతమైన విజయాలు అందించిన ధవన్.. జింబాబ్వేతో సిరీస్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసి రెగ్యులర్ వన్డే కెప్టెన్గా కొనసాగాలని భావిస్తున్నాడు. ఒక్కో ఫార్మాట్కు ఒక్కో కెప్టెన్ అనే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్న నేపథ్యంలో ధవన్ కెప్టెన్సీ అంశం ఆసక్తికరంగా మారింది. ధవన్ సైతం తనను టీ20లకు పరిగణలోకి తీసుకోకపోవడంపై పెద్దగా స్పందించకపోవడం చూస్తుంటే అతను మున్ముందు వన్డే ఫార్మాట్కు (కెప్టెన్గా) మాత్రమే పరిమితమవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జింబాబ్వే పర్యటన వివరాలు.. తొలి వన్డే ఆగస్టు 18 రెండో వన్డే ఆగస్ట్ 20 మూడో వన్డే ఆగస్ట్ 22 జింబాబ్వే పర్యటనకు భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చహర్ చదవండి: ఆసియా కప్కు ముందు బంగ్లాదేశ్కు భారీ షాక్! -
జింబాబ్వేతో వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా మళ్లీ అతనే..!
India Tour Of Zimbabwe: వెస్టిండీస్తో ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్ ముగిసిన అనంతరం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టు 18న ప్రారంభమయ్యే ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు 15 మంది సభ్యుల బృందాన్ని ఇవాళ (జులై 30) ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్లకు విశ్రాంతి కల్పించిన సెలెక్టర్లు.. విండీస్లో వన్డే సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించిన శిఖర్ ధవన్కు మరోసారి సారధ్య బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సిరీస్ కోసం మాజీ సారథి విరాట్ కోహ్లిని ఎంపిక చేస్తారని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. కోహ్లికి విశ్రాంతిని పొడిగిస్తున్నట్లు సెలెక్టర్లు ప్రకటించారు. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ 18న, రెండు, మూడో మ్యాచ్లు 20, 22వ తేదీల్లో హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగనున్నాయి. భారత జట్టు... శిఖర్ ధవన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చహర్ చదవండి: సికందర్ రాజా ఊచకోత.. బంగ్లాకు షాకిచ్చిన జింబాబ్వే -
WC 2023: అవునా.. ప్రజ్ఞాన్ కామెంట్రీ చేస్తున్నాడా? మంచిది: రోహిత్ శర్మ
Rohit Sharma- Pragyan Ojha- Shikhar Dhawan: శిఖర్ ధావన్ విషయంలో మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో స్పందించాడు. ఓజా కామెంటేటర్గా మారాడన్న సంగతి తనకు తెలియదన్న హిట్మ్యాన్.. మైదానం లోపల, వెలుపల ఆటగాళ్ల మధ్య స్నేహ బంధం జట్టుకు కచ్చితంగా మేలు చేస్తుందని తెలిపాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన శిఖర్ ధావన్ను వెస్టిండీస్తో వన్డే సిరీస్కు సారథిగా బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. Ro about opening partnership's with @SDhawan25 pic.twitter.com/URE1boKVer — Manojkumar (@Manojkumar_099) July 28, 2022 అందుకేనేమో ధావన్కు అవకాశాలు! ఈ నేపథ్యంలో ప్రజ్ఞాన్ ఓజా మాట్లాడుతూ.. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వన్డే ప్రపంచకప్ జట్టులో ఉంటే ఉపయుక్తంగా ఉంటుందని, అందుకే బహుశా అతడికి అవకాశాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డాడు. తనకు జోడీగా ధావన్ వంటి అనుభవజ్ఞుడు ఉంటే బాగుంటుందని రోహిత్ శర్మ కోరుకుంటున్నాడని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ మాదిరి రోహిత్- ధావన్ మధ్య కూడా ఫ్రెండ్షిప్ ఉందని పేర్కొన్న ఓజా.. ఇప్పటికే వీరిద్దరి జోడీ జట్టుకు ఎన్నో విజయాలు కూడా అందించిందని పేర్కొన్నాడు. అందుకే వరల్డ్కప్-2023 భారత జట్టులో అతడికి చోటు ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. అవునా.. నిజమా? ఈ క్రమంలో విండీస్ టీ20 సిరీస్ ఆరంభానికి ముందు రోహిత్ శర్మ.. ఓజా వ్యాఖ్యలపై సరాదాగా స్పందించాడు. ‘‘అవునా...! ప్రజ్ఞాన్.. ఇప్పుడు కామెంటేటర్గా ఉన్నాడా? మంచిది. ఏదేమైనా.. మనతో కలిసి బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు ఎవరైనా సరే.. అది శిఖర్ లేదంటే మరొకరు.. ఎవరైనా.. పరస్పర అవగాహనతో ముందుకు వెళ్తాం. Sound 🔛 🔊#TeamIndia captain @ImRo45 warming up in the nets ahead of the 1st #WIvIND T20I. 👌 👌 pic.twitter.com/0V5A70l2EY — BCCI (@BCCI) July 29, 2022 అదే సమయంలో స్నేహ బంధం పెంపొందుతుంది. మైదానం వెలుపల కూడా ఆ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. నిజానికి ఆటగాళ్ల మధ్య ఇలాంటి బంధం ఉంటే డ్రెస్సింగ్రూమ్లో వాతావరణం బాగుంటుంది’’ అని పేర్కొన్నాడు. ఆటలో భాగంగానే జట్టు అవసరాలను బట్టి ప్లేయర్లకు అవకాశాలు ఇస్తామే తప్ప వారితో ఉన్న అనుబంధం కారణంగా కాదని రోహిత్ శర్మ చెప్పకనే చెప్పాడు. కాగా ప్రజ్ఞాన్ ఓజా, రోహిత్ శర్మ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు టీమిండియాతో పాటు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు దక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్కు కలిసి ఆడారు. ఇదిలా ఉంటే శుక్రవారం నుంచి వెస్టిండీస్- టీమిండియా మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది. ఇక రోహిత్ గైర్హాజరీతో ధావన్ సారథ్యంలోని వన్డే జట్టు కరేబియన్ గడ్డపై విండీస్ను మట్టికరిపించి తొలిసారి 3-0తో క్లీన్స్వీప్ చేసిన విషయం తెలిసిందే. Moments to savour for the team & moments to savour for the fans at the Queen's Park Oval, Trinidad. ☺️ 👏 Here's #TeamIndia Captain @SDhawan25 doing his bit for the fans 🎥 🔽 - by @28anand #WIvIND pic.twitter.com/gZRwB96OnV — BCCI (@BCCI) July 28, 2022 చదవండి: India Probable XI: ఓపెనర్గా పంత్.. అశ్విన్కు నో ఛాన్స్! కుల్దీప్ వైపే మొగ్గు! -
Ind Vs WI: మనమంతా ఎవరం? చాంపియన్లం! వీడియో వైరల్
India Tour Of West Indies 2022- ODI Series- 3rd ODI: వెస్టిండీస్ను వారి సొంతగడ్డపై మట్టికరిపించి ఫుల్ జోష్లో ఉంది టీమిండియా. యువ ఆటగాళ్లతో వన్డే సిరీస్ ఆడి 3-0 తేడాతో ఆతిథ్య జట్టును క్లీన్స్వీప్ చేసింది. గతేడాది శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ విజయం తర్వాత కెప్టెన్గా కరేబియన్ గడ్డపై ధావన్ సారథ్యంలోని యువ జట్టు ఇలా వైట్వాష్ చేయడం గమనార్హం. కాగా భారత్కు విండీస్లో ఈ తరహా గెలుపు ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఇండియన్ డ్రెస్సింగ్ రూంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా కెప్టెన్ శిఖర్ ధావన్.. ఆటగాళ్లను ఉద్దేశించి ప్రసంగించారు. యువ ప్లేయర్లు ఇలా రాణించడం టీమిండియాకు శుభ శకునమని పేర్కొన్నారు. మీరు సూపర్! ‘‘నిజంగా ఈ సిరీస్ చాలా గొప్పగా సాగింది. వెల్డన్. ఇంగ్లండ్లో ఆడిన చాలా మంది సీనియర్లు ఇక్కడికి రాలేదు. నిజంగా యువ జట్టుతో ఇక్కడికి వచ్చాము. అయినా సిరీస్ గెలిచాం. మీరు ఆడిన తీరు అద్భుతం. మూడు మ్యాచ్లలోనూ ప్రొఫెషనలిజం చూపించారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. మన ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ.. తీవ్ర ఒత్తిడిని అధిగమించి రాణించారు. మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. ఇది చాలా మంచి విషయం’’ అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. మనం ఎవరం? చాంపియన్లం! ఇక ధావన్ మాట్లాడుతూ.. ‘‘బ్యాటింగ్ విభాగంతో పాటు బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది. మీరు అంచనాలకు మించి రాణించారు. మెరుగైన భవిష్యత్తు అడుగులు పడ్డాయి. మీరు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. కచ్చితంగా ముందుకు సాగుతారు కూడా!’’ అని స్ఫూర్తి నింపాడు. From The #TeamIndia Dressing Room! Head Coach Rahul Dravid & Captain @SDhawan25 applaud 👏 👏 the team post the 3-0 win in the #WIvIND ODI series. 🗣 🗣 Here's a Dressing Room POV 📽 - By @28anand P.S. Watch out for the end - expect something fun when Shikhar D is around 😉😁 pic.twitter.com/x2j2Qm4XxZ — BCCI (@BCCI) July 28, 2022 ఇక ఆఖర్లో.. ‘‘ఈ ప్రసంగం ముగించేముందు ఒక్కసారి అందరం లేచి నిలబడండి అందరం కలిసి ఫొటో తీసుకుందాం. నేనేమో మనం ఎవరు అని అడుగుతానంటా.. మీరంతా కలిసి మనమంతా చాంపియన్స్ అని గట్టిగా అరవండి’’ అంటూ 36 ఏళ్ల ధావన్ యువ జట్టుతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా వరుసగా 3 పరుగులు, రెండు వికెట్లు, డక్వర్త్ లూయీస్ ప్రకారం 119 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడో వన్డేలో తృటిలో సెంచరీ చేజార్చుకున్న శుబ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మూడో వన్డే: ►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ ►టాస్: ఇండియా- బ్యాటింగ్ ►మ్యాచ్కు వర్షం ఆటంకి ►ఇండియా స్కోరు: 225-3 (36 ఓవర్లు) ►డక్వర్త్ లూయీస్ పద్ధతి(డీఎల్ఎస్)లో భారత జట్టు నిర్దేశించిన లక్ష్యం 257 పరుగులు ►వెస్టిండీస్ స్కోరు: 137-10 (26 ఓవర్లు) ►విజేత: ఇండియా- డీఎల్ఎస్ పద్ధతిలో 119 పరుగుల తేడాతో గెలుపు ►మూడు మ్యాచ్ల సిరీస్ 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసిన ఇండియా ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్మన్ గిల్(98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 98 పరుగులు- నాటౌట్) ►ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: శుబ్మన్ గిల్(64, 43, 98 పరుగులు) చదవండి: Shubman Gill: అప్పుడేమో ద్విశతకం! 91, 96, 98 నాటౌట్.. పాపం సెంచరీ గండం గట్టెక్కలేడా?! ICC ODI Rankings: సిరీస్ క్లీన్స్వీప్.. వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా స్థానం? Moments to savour for the team & moments to savour for the fans at the Queen's Park Oval, Trinidad. ☺️ 👏 Here's #TeamIndia Captain @SDhawan25 doing his bit for the fans 🎥 🔽 - by @28anand #WIvIND pic.twitter.com/gZRwB96OnV — BCCI (@BCCI) July 28, 2022 -
Shikhar Dhawan: ప్రపంచకప్ జట్టులో ధావన్ ఉండాలి! అవసరం లేదు!
India Tour Of West Indies 2022- ODI Series- 3rd ODI: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్పై భారత మాజీ క్రికెటర్ రితీందర్ సింగ్ సోధి ప్రశంసలు కురిపించాడు. బ్యాట్తో రాణిస్తున్న గబ్బర్.. ఫీల్డింగ్ నైపుణ్యాలతోనూ ఆకట్టుకుంటున్నాడని కొనియాడాడు. వన్డే ప్రపంచకప్తో పాటు టీ20 వరల్డ్కప్ టోర్నీలోనూ ఆడే అర్హత అతడికి ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా వన్డే ఫార్మాట్లో ధావన్ నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే. యువ బ్యాటర్లు దూసుకువస్తున్నా.. గత రెండేళ్లలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తొమ్మిది హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. ఇదిలా ఉంటే.. టీ20 ఫార్మాట్లోనూ గబ్బర్ మెరుగ్గానే రాణిస్తున్నాడు. ఐపీఎల్-2022లో అతడు పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆడిన 14 ఇన్నింగ్స్లో 460 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ధావన్ అత్యధిక స్కోరు 88 నాటౌట్. అయినప్పటికీ అతడికి దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్ జట్టులో చోటు దక్కలేదు. అయితే, ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ధావన్ను ఎంపిక చేశారు సెలక్టర్లు. కెప్టెన్గానే కాదు.. బ్యాటర్గా కూడా! ఇంగ్లండ్లో పెద్దగా రాణించలేకపోయినా.. అనూహ్యంగా వెస్టిండీస్తో వన్డే సిరీస్కు కెప్టెన్గా ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో యువ జట్టును ముందుకు నడిపించి విండీస్ గడ్డ మీద ఆతిథ్య జట్టును 3-0తేడాతో క్లీన్స్వీప్ చేసి చరిత్ర సృష్టించాడు. Another 50 for the skipper! Sensible batting so far from @SDhawan25. Will he up the pace of his beautiful innings? Watch the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/Ke27CnhxF5 — FanCode (@FanCode) July 27, 2022 కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ సఫలమయ్యాడు. ఈ సిరీస్లో మొత్తంగా 168(97, 13, 58) పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రితీందర్ సింగ్ సోధి ధావన్ ఆట తీరును కొనియాడాడు. ఈ మేరకు ఇండియా న్యూస్ స్పోర్ట్స్తో మాట్లాడిన ఈ మాజీ బ్యాటింగ్ ఆల్రౌండర్.. ‘‘50 ఓవర్ల వరల్డ్కప్(వన్డే ప్రపంచకప్) గురించి మాట్లాడినపుడు మాత్రమే ధావన్ పేరు ప్రస్తావనకు వస్తోంది. మరి టీ20 వరల్డ్కప్ విషయంలో అతడి పేరును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు? అనువజ్ఞుడైన ఆటగాడిగా.. మైదానంలో పాదరసంలా కదులుతూ ఆకట్టుకుంటున్న ధావన్ కూడా జట్టులో స్థానం కోసం పోటీపడగలడు కదా! కొన్ని నెలల క్రితం అతడి ఊసే ఎవరూ ఎత్తలేదు. కానీ ఇప్పుడు వన్డే క్రికెట్లో కెప్టెన్గా వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్న తీరు అద్భుతం’’ అని ప్రశంసించాడు. అవసరం లేదు! టీ20 ప్రపంచకప్-2022లో భారత జట్టు ప్రణాళికల్లో ధావన్ కూడా ఉంటే బాగుంటుందని, అతడికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా రితీందర్ సింగ్.. సీసీఐకి సూచించాడు. అయితే, మాజీ సెలక్టర్ సబా కరీం మాత్రం వన్డే ఫార్మాట్లో మాత్రమే ధావన్ అవసరం ఎక్కువగా ఉందని పేర్కొనడం గమనార్హం. కాగా అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆరంభం కానుంది. అదే విధంగా వన్డే వరల్డ్కప్ ఈవెంట్-2023కి భారత్ వేదిక కానున్న విషయం తెలిసిందే. చదవండి: Shubman Gill: అప్పుడేమో ద్విశతకం! 91, 96, 98 నాటౌట్.. పాపం సెంచరీ గండం గట్టెక్కలేడా?! World Cup 2023: అందుకే గబ్బర్ కెప్టెన్ అయ్యాడు! రోహిత్ శర్మ కోరుకుంటున్నది అదే! -
అప్పుడేమో ద్విశతకం! 91, 96, 98 నాటౌట్.. పాపం సెంచరీ గండం గట్టెక్కలేడా?!
India Tour Of West Indies 2022- ODI Series- 3rd ODI: శుబ్మన్ గిల్.. కుడిచేతి వాటం గల ఈ పంజాబ్ యువ బ్యాటర్ వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా వన్డే సిరీస్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. విండీస్ను వారి సొంత గడ్డపై భారత్ క్లీన్స్వీప్ చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ సిరీస్ కెప్టెన్, వెటరన్ ప్లేయర్ శిఖర్ ధావన్తో కలిసి ఓపెనింగ్ చేసేందుకు ఇషాన్ కిషన్ సహా రుతురాజ్ గైక్వాడ్ పేర్లు పరిశీలనలో ఉన్నా.. వారిని కాదని గిల్కు అవకాశం ఇచ్చింది యాజమాన్యం. అందుకు తగ్గట్లుగానే.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు గిల్. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి వన్డేలో 64, రెండో వన్డేలో 43, మూడో వన్డేలో 98 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కొన్నిసార్లు షాట్ల ఎంపిక విషయంలో ఒక్కోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ సమర్పించుకుని విమర్శల పాలైనా.. ఓవరాల్గా ఈ సిరీస్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. బెస్ట్ క్రికెటర్గా... పంజాబ్లోని ఫిరోజ్పూర్లో జన్మించిన 22 ఏళ్ల శుబ్మన్ గిల్కు చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే ఆసక్తి. ఈ విషయం గమనించిన అతడి తండ్రి లఖ్వీందర్ సింగ్ కొడుకుకి మెరుగైన శిక్షణ ఇప్పించడం కోసం మొహాలీకి మకాం మార్చారు. ఈ క్రమంలో 2014 నాటి అండర్ 16 జిల్లా పోటీల్లో భాగంగా గిల్ 351 పరుగులు సాధించాడు. ఇక విజయ్ మర్చంచ్ ట్రోఫీ-2016లో అండర్ 16 స్థాయిలో డబుల్ సెంచరీ చేశాడు. పంజాబ్ తరఫున 2016-17 విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా లిస్ట్ ఏ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ మరుసటి ఏడాది రంజీ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చాడు. బెంగాల్తో అరంగేట్ర మ్యాచ్లోనే ఓపెనర్గా బరిలోకి దిగి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రెండో మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు కూడా! ఇక ఆడిన ప్రతి మ్యాచ్లో తన ప్రతిభను నిరూపించుకున్న శుబ్మన్ గిల్.. బెస్ట్ జూనియర్ క్రికెటర్గా బీసీసీఐ నుంచి వరుసగా రెండు సార్లు అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో అండర్ 19 జట్టులో చోటు దక్కించుకున్న అతడు.. ఐసీసీ అండర్ 19 వరల్డ్కప్ 2018 టోర్నీలో అద్బుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. ఈ మెగా ఈవెంట్లో అతడు 104.50 సగటుతో 418 పరుగులు సాధించాడు. యువ భారత జట్టు నాలుగో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు శుబ్మన్ గిల్. 2018 వేలంలో భాగంగా కోల్కతా నైట్రైడర్స్ అతడిని కోటీ ఎనభై లక్షలకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో 2018లో సన్రైజర్స్తో మ్యాచ్లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్ర మ్యాచ్లో ఏడోస్థానంలో బరిలోకి దిగి 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే, ఆ తర్వాత ఓపెనర్గా మారి తనను తాను నిరూపించుకున్నాడు. పాపం.. సెంచరీ చేజారుతూనే ఉంది! ఈ నేపథ్యంలో 2019లో న్యూజిలాండ్తో వన్డే మ్యాచ్తో గిల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద 2020 నాటి సిరీస్తో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పటి వరకు 11 టెస్టులాడిన గిల్ అత్యధిక స్కోరు 91. ఆరు వన్డే మ్యాచ్లలో అతడు చేసిన అత్యధిక పరుగులు 98(నాటౌట్). 50 up for @ShubmanGill as well! Another promising start, can he rack up a 100 this time? We'll find out soon. Watch all the action from the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/JqWi3n5dip — FanCode (@FanCode) July 27, 2022 ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న గిల్ ఐపీఎల్ అత్యధిక స్కోరు 96 కావడం విశేషం. దీంతో మా గిల్ సెంచరీ గండం గట్టెక్కలేడా అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిల్ సైతం తాజాగా విండీస్తో మూడో మ్యాచ్లో సెంచరీ చేసే అవకాశం చేజారిందని ఫీల్ అయ్యాడు. ప్రశంసల జల్లు! అయితే.. జట్టును గెలిపించినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకుని విండీస్ వన్డే సిరీస్ను ఘనంగా ముగించాడు. దీంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్ ధావన్ సహా వసీం జాఫర్ వంటి మాజీ క్రికెటర్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజా ఇన్నింగ్స్తో సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గావస్కర్ లాంటి టీమిండియా దిగ్గజాల సరసన చోటు గిల్ చోటు సంపాదించాడు. టీమిండియా తరపున వన్డేల్లో 90కి పైగా పరుగులతో అజేయంగా నిలిచిన బ్యాటర్ల జాబితాలో చేరాడు. చదవండి: Martin Guptill: రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. కివీస్ తరపున తొలి ఆటగాడిగా -
Ind Vs WI: గర్వంగా ఉంది! అప్పుడు.. ఇప్పుడూ ధావన్ సూపర్! విదేశీ గడ్డ మీద..
India Tour Of West Indies 2022- ODI Series- 3rd ODI: వెస్టిండీస్తో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసి పరిపూర్ణ విజయం అందుకుంది ధావన్ సేన. ట్రినిడాడ్ వేదికగా బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో 119 పరుగుల తేడాతో గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ను వారి సొంత గడ్డపై వైట్వాష్ చేసిన తొలి భారత జట్టుగా నిలిచింది. కాగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా తదితరులు లేకుండానే యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు విండీస్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విండీస్ గడ్డ మీద ఈ మేరకు అద్వితీయ విజయం అందుకోవడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో విండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించిన టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సంతోషం వ్యక్తం చేశాడు. గర్వంగా ఉంది! మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘మా జట్టులో ఉన్నది యువ ఆటగాళ్లే కావొచ్చు. అయితే, వాళ్లు ఎంతో పరిణతి ప్రదర్శించారు. మైదానంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదు. అద్భుతంగా ఆడి తమను తాము నిరూపించుకున్న తీరు పట్ల నాకు గర్వంగా ఉంది. నిజంగా మాకిది శుభ శకునం’’ అని పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్లో తన ప్రదర్శన గురించి గబ్బర్ మాట్లాడుతూ.. ‘‘నేను ఫామ్లోకి రావడం సంతోషంగా ఉంది. ఈ ఫార్మాట్లో ఆడి చాలా రోజులు అవుతోంది. అయినా మొదటి మ్యాచ్లో నా ఇన్నింగ్స్ నాకు సంతృప్తినిచ్చింది’’ అని పేర్కొన్నాడు. ఇక తనతో పాటు ఓపెనింగ్ చేసిన శుబ్మన్ గిల్ సిరీస్ ఆసాంతం రాణించిన తీరును గబ్బర్ కొనియాడాడు. అదే విధంగా తమ బౌలింగ్ విభాగం సైతం జట్టును గెలిపించేందుకు వందకు వంద శాతం కృషి చేసిందని బౌలర్లను కొనియాడాడు. కాగా గతేడాది శ్రీలంక పర్యటనలో కెప్టెన్గా వ్యవహరించిన తర్వాత శిఖర్ ధావన్కు జట్టులో చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. ధావన్ అప్పుడు.. ఇప్పుడూ.. సూపర్! ఈ క్రమంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్తో అతడు పునరాగమనం చేశాడు. అయితే, ఇంగ్లండ్ గడ్డ మీద పెద్దగా రాణించలేకపోయాడు. మొదటి వన్డేలో 31 పరుగులు చేసిన ధావన్.. రెండు(9), మూడో వన్డే(1)ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. అయినప్పటికీ విండీస్ గడ్డ మీద వన్డే సిరీస్కు సారథిగా ఎంపికయ్యాడు. ద్వితీయ శ్రేణి జట్టు అని భావించినప్పటికీ యువ ఆటగాళ్లతోనే కరేబియన్ గడ్డపై చరిత్ర సృష్టించి ఈ సిరీస్ను మధుర జ్ఞాపకంగా మార్చుకున్నాడు. ఇక విండీస్ పర్యటనలో మూడు మ్యాచ్లలో శిఖర్ ధావన్ చేసిన స్కోర్లు వరుసగా 97, 13, 58. ఇదిలా ఉంటే.. శ్రీలంక పర్యటనలో ధావన్ సారథ్యంలోని యువ జట్టు వన్డే సిరీస్ను 2-1 తేడాతో గెలిచింది. అయితే, టీ20 సిరీస్ను మాత్రం 2-1 తేడాతో చేజార్చుకుంది. ఇక రెండు సందర్బాల్లోనూ విదేశీ గడ్డపై ధావన్ వన్డే సిరీస్ గెలవడం గమనార్హం. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మూడో వన్డే: ►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ ►టాస్: ఇండియా- బ్యాటింగ్ ►మ్యాచ్కు వర్షం ఆటంకి ►ఇండియా స్కోరు: 225-3 (36 ఓవర్లు) ►డక్వర్త్ లూయీస్ పద్ధతి(డీఎల్ఎస్)లో భారత జట్టు నిర్దేశించిన లక్ష్యం 257 పరుగులు ►వెస్టిండీస్ స్కోరు: 137-10 (26 ఓవర్లు) ►విజేత: ఇండియా- డీఎల్ఎస్ పద్ధతిలో 119 పరుగుల తేడాతో గెలుపు ►మూడు మ్యాచ్ల సిరీస్ 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసిన ఇండియా ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్మన్ గిల్(98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 98 పరుగులు- నాటౌట్) ►ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: శుబ్మన్ గిల్(64, 43, 98 పరుగులు) చదవండి: Shubman Gill: మ్యాచ్కు కొన్ని గంటల ముందు తిట్టుకున్నాడు.. కట్చేస్తే Shubman Gill: సెంచరీ మిస్ అయినా దిగ్గజాల సరసన చోటు 50 up for @ShubmanGill as well! Another promising start, can he rack up a 100 this time? We'll find out soon. Watch all the action from the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/JqWi3n5dip — FanCode (@FanCode) July 27, 2022 -
విండీస్పై భారత్ ఘన విజయం సిరీస్ క్లీన్ స్వీప్ (ఫోటోలు)
-
Ind Vs WI 3rd ODI: మా గుండె పగిలింది.. కానీ ఇప్పుడు! తుది జట్లు ఇవే!
India Tour Of West Indies 2022- ODI Series: వెస్టిండీస్ను క్లీన్స్వీప్ చేయడమే లక్ష్యంగా టీమిండియా ఆఖరి వన్డేకు సిద్ధమైంది. ట్రినిడాడ్ వేదికగా బుధవారం (జూలై 27) ఆరంభమైన మ్యాచ్లో టాస్ గెలిచాడు భారత తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆవేశ్ ఖాన్ స్థానంలో ప్రసిద్ కృష్ణ జట్టులోకి వచ్చాడని గబ్బర్ తెలిపాడు. టాస్ ఈ సందర్భంగా ధావన్ మాట్లాడుతూ.. ‘‘మేము ముందు బ్యాటింగ్ చేస్తాం. మంచి స్కోరు నమోదు చేయాలని భావిస్తున్నాం. మాకున్న సానుకూలాంశం ఏమిటంటే.. మా జట్టులోని ప్రతి ఆటగాడు రాణిస్తున్నాడు. ఇందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ద్రవిడ్ సర్ గొప్పగా జట్టును ముందుకు నడిపిస్తున్నారు. ఆటగాళ్లు ఎన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడితే అంతగా రాటుదేలుతారు. ఆయన మా చేత అదే చేయిస్తున్నారు’’ అని పేర్కొన్నాడు. మా గుండె పగిలింది.. ఇప్పుడు ఇక విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్.. ‘‘మొదటి రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో మా గుండె పగిలింది. అయితే, ఈరోజు మేము మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగబోతున్నాం. 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలి. నిలకడ ప్రదర్శించాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు పొందగలం’’ అని చెప్పుకొచ్చాడు. తాము మూడు మార్పులతో మూడో వన్డే ఆడనున్నామన్న పూరన్.. అల్జారీ, రోవ్మన్ పావెల్, రొమారియో షెఫర్డ్ స్థానాల్లో హోల్డర్, కీమో, కార్టీ తుది జట్టులో చోటు దక్కించుకున్నారని తెలిపాడు. కాగా స్వదేశంలో టీమిండియాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా విండీస్ ఇప్పటికే సిరీస్ను 2-0తేడాతో కోల్పోయింది. ఇక నికోలస్ పూరన్ పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఎంపికైన తర్వాత నెదర్లాండ్స్ను క్లీన్స్వీప్ చేసిన వెస్టిండీస్.. పాకిస్తాన్ టూర్లో ఘోర పరాభవం చవిచూసింది. పాక్ చేతిలో వైట్వాష్కు గురైంది. అదే విధంగా స్వదేశంలో ఇటీవల బంగ్లాదేశ్తో ముగిసిన సిరీస్లోనూ ఇదే తరహాలో 3-0తేడాతో క్లీన్స్వీప్ అయింది. మరోవైపు టీమిండియా ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీ20, వన్డే సిరీస్లను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇక వెస్టిండీస్లో ఆఖరి వన్డే గెలిచి ఆతిథ్య జట్టును వైట్వాష్ చేయాలని భావిస్తోంది. మొదటి వన్డేలో 3 పరుగులు, రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా ధావన్ సేన గెలుపొందిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మూడో వన్డే: తుదిజట్లు: ఇండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యజువేంద్ర చహల్, ప్రసిద్ కృష్ణ. వెస్టిండీస్: షాయీ హోప్(వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, కీసీ కార్టీ, బ్రూక్స్, నికోలస్ పూరన్(కెప్టెన్), కైలీ మేయర్స్, జేసన్ హోల్డర్, కీమో పాల్, అకీల్ హొసేన్, హైడెన్ వాల్ష్, జేడెన్ సీల్స్. చదవండి: World Cup 2023: అందుకే గబ్బర్ కెప్టెన్ అయ్యాడు! రోహిత్ శర్మ కోరుకుంటున్నది అదే! T20 WC 2022: అతడి వల్ల టీమిండియాకు ఒరిగేదేమీ లేదు! ఒకవేళ టైటిల్ గెలిస్తే.. The 3rd CG United ODI powered by @goldmedalindia surface for today.👀 #WIvIND pic.twitter.com/uLPs0Ufc17 — Windies Cricket (@windiescricket) July 27, 2022 TOSS🪙: West Indies Captain @nicholas_47 is second best in toss against @BCCI 🇮🇳 captain @SDhawan25. #MenInMaroon will bowl first in final game of the 3-match CG United ODI Series powered by @goldmedalindia at Queens Park Oval 🇹🇹 #WIvIND pic.twitter.com/wXZhKquyCb — Windies Cricket (@windiescricket) July 27, 2022 -
IND VS WI 3rd ODI: 119 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
పోర్ట్ ఆఫ్స్పెయిన్: విండీస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేసింది. డక్వర్త్ లూయీస్ పద్ధతిలో భారత జట్టు నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 137 పరుగులకే విండీస్ జట్టు కుప్పకూలింది. దీంతో టీమిండియా 119 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ లక్ష్యం 35 ఓవర్లలో 257 పరుగులు వర్షం అంతరాయం కారణంగా వెస్టిండీస్- ఇండియా మూడో వన్డేలో 36 ఓవర్లలో 225/3 వికెట్ల వద్ద భారత ఇన్నింగ్స్కు తెరపడింది. డక్వర్త లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257 పరుగులుగా నిర్దేశించారు. టీమిండియా బ్యాట్స్మన్లలో శుభమన్ గిల్ 98 బంతుల్లో 98 పరుగులతో నాటౌట్ నిలిచాడు. వర్షం కారణంగా భారత ఇన్నింగ్స్ను ముగించడంతో గిల్ తృటిలో సెంచరీని కోల్పోయాడు. అనుకున్నదే అయ్యింది.. వర్షం మొదలైంది వాతావరణ శాఖ హెచ్చరికలే నిజమయ్యాయి. వారు చెప్పినట్లుగానే మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు. 24 ఓవర్లు పూర్తయ్యాక వర్షం మొదలుకావడంతో మ్యాచ్ను నిలిపివేశారు. ఈ సమయానికి టీమిండియా స్కోర్ 115/1. క్రీజ్లో గిల్ (51), శ్రేయస్ (2) ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 23వ ఓవర్లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. హేడెన్ వాల్ష్ బౌలింగ్లో పూరన్కు క్యాచ్ ఇచ్చి ధవన్ (74 బంతుల్లో 58; 7 ఫోర్లు) ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 113/1. గిల్కు (51) జతగా శ్రేయస్ క్రీజ్లోకి వచ్చాడు. గిల్ హాఫ్ సెంచరీ మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో గిల్ వన్డేల్లో ఈ ఫీట్ను రెండోసారి చేశాడు. 22 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 112/0. ధవన్ 73 బంతుల్లో 58 పరుగలతో క్రీజ్లో ఉన్నాడు. ధవన్ ఫిఫ్టి.. 100 దాటిన టీమిండియా స్కోర్ ఓపెనర్లు ధవన్ (54), గిల్ (44)లు టీమిండియాకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 20 ఓవర్లలో అజేయమైన 101 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధవన్ వన్డేల్లో 37వ ఫిఫ్టి సాధించాడు. ఈ సిరీస్లో ధవన్కు ఇది రెండో హాఫ్ సెంచరీ. డ్రింక్స్ విరామం సమయానికి టీమిండియా స్కోర్ 87/0 తొలి 10 ఓవర్లు నిదానంగా ఆడిన భారత్.. ఆతర్వాత కాస్త వేగం పెంచింది. ఓపెనర్లు ధవన్ 57 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 48 పరుగులు, గిల్ 46 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 36 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. డ్రింక్స్ విరామం సమయానికి (17 ఓవర్లు) భారత్ వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. గేర్ మార్చని ఓపెనర్లు ఇన్నింగ్స్ ఆరంభం నుంచి నిదానంగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు 11 ఓవర్లు దాటినా గేర్ మార్చడం లేదు. ధవన్ 34 బంతులు ఆడి 23 పరుగులు చేయగా.. గిల్ 32 బంతులను ఎదుర్కొని అన్నే పరుగులు సాధించాడు. 11 ఓవర్లు దాటినా టీమిండియా 50 పరుగుల మార్కును (47/0) చేరుకోలేదు. ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు.. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 17/0 టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ నిదానంగా బ్యాటింగ్ చేస్తుంది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (8), శిఖర్ ధవన్ (9) ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండయా స్కోర్ 17/0. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 3 మ్యాచ్ల ఈ సిరీస్ను టీమిండియా ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఓ మార్పు చేసింది. ఆవేశ్ ఖాన్ స్థానంలో ప్రసిధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు విండీస్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. రోవ్మన్ పావెల్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్ స్థానాల్లో జేసన్ హోల్డర్, కీమో పాల్, కీచీ క్యార్టీ జట్టులో చేరారు. భారత్: శిఖర్ ధవన్(కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్(వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిధ్ కృష్ణ వెస్టిండీస్: షెయ్ హోప్(వికెట్ కీపర్), బ్రాండన్ కింగ్, కీచీ క్యార్టీ, షమ్రా బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్(కెప్టెన్), జేసన్ హోల్డర్, కీమో పాల్, అకేల్ హోసేన్, జేడెన్ సీల్స్, హేడెన్ వాల్ష్ -
నానాటికి దిగజారుతున్న కోహ్లి ర్యాంక్.. ఏడేళ్లలో తొలిసారి ఈ దుస్థితి..!
Virat Kohli: ఐసీసీ తాజాగా (జులై 27) విడుదల చేసిన పురుషుల వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరింత దిగజారాడు. గడిచిన ఏడేళ్లలో ఎన్నడూ లేనంత కింది ర్యాంక్కు రన్మెషీన్ పడిపోయాడు. తాజా ర్యాంకింగ్స్లో 5వ స్థానానికి (744 రేటింగ్ పాయింట్లు) దిగజారిన కోహ్లి.. 2015 అక్టోబర్ తర్వాత టాప్-4 ర్యాంకింగ్స్లో నుంచి బయటికి వచ్చాడు. గత దశాబ్ద కాలం పాటు వన్డేల్లో మకుటం లేని మారాజుగా చలామణి అయిన కోహ్లి.. ఇటీవలి కాలంలో ఈ ఫార్మాట్లో ఎక్కువ మ్యాచ్లు ఆడకుండా ఈ దుస్థితి తెచ్చుకున్నాడు. రెస్ట్ పేరుతో ప్రస్తుతం విండీస్తో జరుగుతున్న వన్డే సిరీస్కు కూడా అతను డుమ్మా కొట్టాడు. కోహ్లి పరిస్థితి ఇలా ఉంటే, తాజా ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఓ స్థానాన్ని కోల్పోయి 6వ ప్లేస్కు పడిపోయాడు. మరోవైపు విండీస్తో వన్డే సిరీస్లో రాణించిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధవన్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్లు తమ ర్యాంక్లను మెరుగుపర్చుకున్నారు. తొలి వన్డేలో 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న ధవన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని 13వ ప్లేస్కు చేరుకోగా.. వరుస హాఫ్సెంచరీలు సాధించిన అయ్యర్ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 54వ స్పాట్కు చేరుకున్నాడు. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, మరో పాక్ ఆటగాడు ఇమామ్ ఉల్ హాక్, సఫారీ ప్లేయర్లు డస్సెన్, డికాక్లు టాప్ 4గా నిలిచారు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అతని కంటే కేవలం ఒక్క పాయింట్ వెనుక ఉండి రెండో స్థానంలో నిలిచాడు. చదవండి: వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ 1.. ఇప్పుడు టెస్టు ఫార్మాట్లో! -
IND VS WI: మూడో వన్డేకు పొంచి ఉన్న వాన గండం..!
విండీస్తో 3 వన్డేల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుని జోరుమీదున్న టీమిండియాకు వరుణుడు అడ్డుకట్ట వేసేలా ఉన్నాడు. ఇవాళ (జులై 27) ట్రినిడాడ్ వేదికగా జరుగబోయే మూడో వన్డేకు వాన గండం పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్నటి నుంచే మ్యాచ్కు వేదిక అయిన పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో ఆకాశం మేఘావృతమైందని, మ్యాచ్ సమయానికి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్లో పేర్కొంది. దీంతో మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఒకవేళ మ్యాచ్ మొదలైనా మధ్యమధ్యలో వరుణ ఆటంకాలు తప్పవని, 50 ఓవర్ల ఆట సాధ్యమయ్యే అవకాశాలు చాలా తక్కువని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్కు వర్షం ముప్పు తప్పి, 50 ఓవర్ల పాటు సజావుగా సాగాలని టీమిండియా కోరుకుంటుంది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి కాన్ఫిడెంట్గా ఉన్న ధవన్ సేన ఈ మ్యాచ్లోనూ గెలిచి విండీస్ను వైట్వాష్ చేయాలని భావిస్తుంది. మరోవైపు గత రెండు మ్యాచ్ల్లో చివరి వరకు పోరాడి ఓడిన విండీస్ సైతం ఈ మ్యాచ్ను ఛాలెంజింగ్గా తీసుకుంటుంది. ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. ఇక జట్ల విషయానికొస్తే.. టీమిండియా ఈ మ్యాచ్లో రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా తుది జట్టులోకి రావచ్చు. మరోవైపు విండీస్ రెండో వన్డేలో కొనసాగించిన జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ తప్పించాల్సి వస్తే గత మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న అకీల్ హొసెన్పై వేటు వేసే ఆస్కారం ఉంది. చదవండి: Ind Vs WI: విండీస్తో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! -
WC 2023: అందుకే కెప్టెన్ అయ్యాడు! కచ్చితంగా ప్రపంచకప్ జట్టులో ఉంటాడు!
ICC ODI World Cup 2023: టీమిండియాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు శిఖర్ ధావన్. ముఖ్యంగా వన్డే ఫార్మాట్లో ఓపెనర్గా జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. రోహిత్ శర్మకు జోడీగా బరిలోకి అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. గత రెండేళ్లలో వన్డేల్లో ధావన్ నమోదు చేసిన అర్ధ శతకాల సంఖ్య తొమ్మిది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఫార్మాట్లో గబ్బర్ నిలకడ ఏమిటో! శ్రీలంక పర్యటన తర్వాత జట్టుకు దూరమైన శిఖర్ ధావన్.. ఇటీవల ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఎంపికైన సంగతి తెలిసిందే. బట్లర్ బృందంతో మొదటి వన్డేలో 31 పరుగులు చేసిన ధావన్.. రెండు(9), మూడో వన్డే(1)ల్లో పూర్తిగా నిరాశపరిచాడు. అయినప్పటికీ వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో వన్డే జట్టుకు సారథిగా గబ్బర్ అవకాశం దక్కించుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్కప్-2023 సన్నాహకాల్లో భాగంగానే ధావన్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని యాజమాన్యం భావిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే అతడు కెప్టెన్ అయ్యాడు! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచకప్ జట్టులో ఉంటే ఉపయుక్తంగా ఉంటుందని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఈ మేరకు ఓజా మాట్లాడుతూ.. ‘‘ఒక సీనియర్ ప్లేయర్ను ఎలా ఉపయోగించుకోవాలో అలాగే ఉపయోగించుకుంటున్నారు. ఇది సరైన విధానమే! ముఖ్యంగా మెగా టోర్నీకి ముందు బెంచ్ను మరింత స్ట్రాంగ్ చేసుకోవడం ముఖ్యం. నిజానికి ధావన్ జట్టులో సీనియర్. వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. అందుకే ద్వితీయ శ్రేణి జట్టుకు అతడు కెప్టెన్గా ఎంపికవుతున్నాడు. రోహిత్ కోరుకుంటున్నది అదే! అతడిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. బ్యాటర్గా కూడా రాణించగల సత్తా ఉంది. ఇంగ్లండ్లో కాస్త నిరాశపరిచినా.. మళ్లీ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. శిఖర్ ధావన్ తనకు జోడీగా ఉండాలని రోహిత్ శర్మ బలంగా కోరుకుంటున్నాడన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి వీరిద్దరి భాగస్వామ్యం జట్టుకు ఎన్నో విజయాలు అందించింది కూడా!’’ అని చెప్పుకొచ్చాడు. శిఖర్ ధావన్ కచ్చితంగా ప్రపంచకప్ జట్టులో ఉంటాడని ప్రజ్ఞాన్ ఓజా విశ్వాసం వ్యక్తం చేశాడు. తన ఆటతో తానేమిటో ఇప్పటికే నిరూపించుకున్నాడని 36 ఏళ్ల గబ్బర్కు మద్దతుగా నిలిచాడు. కాగా ఇటీవల అజయ్ జడేజా మాట్లాడుతూ.. రోహిత్ శర్మ కోరుకున్నట్లుగా ధావన్ దూకుడైన ఆట కనబరచలేడంటూ పెదవి విరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజ్ఞాన్ ఓజా.. గబ్బర్కు అండగా నిలవడం విశేషం. ఇక విండీస్ పర్యటనలో భాగంగా ధావన్ సారథ్యంలోని టీమిండియ ఇప్పటికే సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం(జూలై 27) జరుగనుంది. ఈ సిరీస్లో ధావన్ ఇప్పటి వరకు వరుసగా 97, 13 పరుగులు సాధించాడు. చదవండి: Ajay Jadeja-ODI: మూడు గంటల్లోనే ఫలితం.. ఏడు గంటలు ఎవరు ఆడుతారు? -
Ind Vs WI: టీమిండియా అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన నాలుగో జట్టుగా..
India Vs West Indies 2nd ODI: వెస్టిండీస్తో రెండో వన్డేలో విజయం సాధించిన టీమిండియా సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ట్రినిడాడ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆఖరి పది ఓవర్లలో టీమిండియా 100 పరుగులు సాధించడంతో ఈ గెలుపు సాధ్యమైంది. ఈ క్రమంలో శిఖర్ ధావన్ సేన అరుదైన ఘనత సాధించింది. అదేమిటంటే.. విండీస్తో రెండో వన్డేలో టీమిండియా ఆఖరి పది ఓవర్ల ఆట సాగిందిలా! విజయం సాధించేందుకు భారత్ చివరి 10 ఓవర్లలో సరిగ్గా 100 పరుగులు చేయాల్సిన తరుణం. అయితే, అప్పటికే ఐదు కీలక వికెట్లు కోల్పోవడంతో ఓవర్కు 10 పరుగులతో ఛేదన కష్టంగానే అనిపించింది. అయితే వరుసగా 3 ఓవర్లలో ఒక్కో సిక్సర్ కొట్టిన అక్షర్ పటేల్ ఒక్కసారిగా మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చాడు. ఆపై పరిస్థితి 5 ఓవర్లలో 48 పరుగులకు మారింది. .@akshar2026 takes #TeamIndia home! Finishes it in style. Watch all the action from the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk1l7GU@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/WHjdscpzd9 — FanCode (@FanCode) July 24, 2022 తర్వాతి రెండు ఓవర్లలో భారత్ 16, 13 పరుగుల చొప్పున రాబట్టడంతో సమీకరణం 3 ఓవర్లలో 19 పరుగులకు చేరింది. ఈ క్రమంలో దీపక్ హుడా, శార్దుల్ ఠాకూర్, అవేశ్ ఖాన్ అవుటైనా... ఆల్రౌండర్ అక్షర్ పటేల్ మాత్రం పట్టుదలగా చివరి వరకు నిలబడ్డాడు. ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా, తొలి 3 బంతుల్లో 2 పరుగులే వచ్చాయి. భారత్ అరుదైన ఘనత అయితే మేయర్స్ నాలుగో బంతిని ఫుల్టాస్గా వేయడంతో నేరుగా సిక్స్ కొట్టిన అక్షర్ మ్యాచ్తో పాటు సిరీస్ను భారత్కు అందించిన విషయం తెలిసిందే. కాగా వన్డే మ్యాచ్ చివరి 10 ఓవర్లలో 100కు పైగా పరుగులు సాధించి ఒక జట్టు విజయాన్ని అందుకోవడం 2001 నుంచి ఇది నాలుగోసారి మాత్రమే. బంగ్లాదేశ్పై పాకిస్తాన్ (109 పరుగులు), ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ (102), ఐర్లాండ్పై న్యూజిలాండ్ (101), ఈ మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ (100) సాధించాయి. గతంలో భారత జట్టు అత్యుత్తమంగా 2015 ప్రపంచకప్లో జింబాబ్వేపై 91 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే వెస్టిండీస్- టీమిండియా మధ్య బుధవారం(జూలై 27) మూడో వన్డే జరుగనుంది. India pull off a thriller in the final over to win by 2 wickets. #WIvIND #MenInMaroon pic.twitter.com/0xnSYNMyzC — Windies Cricket (@windiescricket) July 24, 2022 ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టాస్: వెస్టిండీస్- బ్యాటింగ్ వెస్టిండీస్ స్కోరు: 311/6 (50 ఓవర్లు) సెంచరీతో చెలరేగిన షై హోప్(115 పరుగులు) భారత్ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు) విజేత: భారత్.. 2 వికెట్ల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అక్షర్ పటేల్ (35 బంతులు ఎదుర్కొని 64 పరుగులు- నాటౌట్, ఒక వికెట్) అర్ధ సెంచరీలతో రాణించిన శ్రేయస్ అయ్యర్(63), అక్షర్ పటేల్(64), సంజూ శాంసన్(54) చదవండి: Team India Creates World Record: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డేల్లో ప్రపంచ రికార్డు.. -
Ind Vs WI: మీ అత్యుత్తమ స్పిన్నర్ ఎవరో తెలియదా? అతడి విషయంలో ఎందుకిలా?
India Vs West Indies 2nd ODI: వెస్టిండీస్తో రెండో వన్డేలో స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ విషయంలో కెప్టెన్ శిఖర్ ధావన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీమిండియా మాజీ బౌలర్ మురళీ కార్తిక్ విస్మయం వ్యక్తం చేశాడు. మ్యాచ్ 17వ ఓవర్ వరకు అతడి చేతికి బంతిని ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. దీపక్ హుడాతో బౌలింగ్ చేయడంలో తనకేమీ అభ్యంతరం లేదని, అయితే.. చహల్ ఉండగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడే నిమిత్తం టీమిండియా విండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి వన్డే గెలిచిన ధావన్ సేన.. ఆదివారం(జూలై 24) నాటి రెండో మ్యాచ్లోనూ విజయం సాధించింది. సిరీస్ను సొంతం చేసుకుంది. అయితే, ఈ రెండింటిలోనూ చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా టీమిండియా వరుసగా 3 పరుగులు, 2 వికెట్ల తేడాతో గెలుపొందడం గమనార్హం. ఇక రెండో వన్డేలో విండీస్ ఓపెనర్ షాయి హోప్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన విషయం తెలిసిందే. 135 బంతులు ఎదుర్కొన్న అతడు 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేశాడు. ఎట్టకేలకు 49వ ఓవర్ ఐదో బంతికి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో బ్యాటర్, ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ నికోలస్ పూరన్ సైతం 77 బంతుల్లో 74 పరుగులతో రాణించాడు. వీరిద్దరి విజృంభణతో నిర్ణీత 50 ఓవర్లలో ఆతిథ్య వెస్టిండీస్ 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. నాకైతే అర్థం కాలేదు! ఈ నేపథ్యంలో మురళీ కార్తిక్ మాట్లాడుతూ.. సీనియర్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ను రంగంలోకి దింపడానికి టీమిండియా యాజమాన్యం ఎందుకంత ఆలస్యం చేసిందో తనకు అర్థం కాలేదన్నాడు. ఈ మేరకు... ‘‘దీపక్ హుడా బౌలింగ్ చేయడం పట్ల నాకెలాంటి అభ్యంతరం లేదు. అయితే, మీ జట్టులో ఉన్న అత్యుత్తమ స్పిన్నర్ ఎవరో మీకు తెలిసి ఉండాలి కదా? అయినా చహల్ను 17వ ఓవర్ వరకు ఎందుకు తీసుకురాలేదు’’ అని మురళీ కార్తిక్ ప్రశ్నించాడు. వికెట్లు పడగొట్టే సత్తా ఉన్న చహల్ చేతికి త్వరగా బంతిని ఇవ్వకపోవడం సరికాదని ఈ మాజీ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయకపోవడంతో విండీస్ టీ20 మాదిరి చెలరేగిందని, సరైన వ్యూహాలు అమలు చేస్తే తక్కువ స్కోరుకు ఆతిథ్య జట్టును కట్టడి చేసే అవకాశం ఉండేదని ఫ్యాన్ కోడ్తో పేర్కొన్నాడు. కాగా వెస్టిండీస్తో రెండో వన్డేలో బ్యాటింగ్ ఆల్రౌండర్, ఆఫ్ స్పిన్నర్ దీపక్ హుడా.. 9 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 42 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కైలీ మేయర్స్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లెగ్ స్పిన్నర్ చహల్ 9 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మొదటి వన్డేలో అర్ధ శతకంతో మెరిసిన బ్రాండన్ కింగ్ను ఈ మ్యాచ్లో డకౌట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో భారత్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. India pull off a thriller in the final over to win by 2 wickets. #WIvIND #MenInMaroon pic.twitter.com/0xnSYNMyzC — Windies Cricket (@windiescricket) July 24, 2022 ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టాస్: విండీస్- బ్యాటింగ్ వెస్టిండీస్ స్కోరు: 311/6 (50 ఓవర్లు) సెంచరీతో చెలరేగిన షై హోప్(115 పరుగులు) భారత్ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు) విజేత: భారత్.. 2 వికెట్ల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అక్షర్ పటేల్ (64 పరుగులు, ఒక్క వికెట్) అర్ధ సెంచరీలతో రాణించిన శ్రేయస్ అయ్యర్(63), అక్షర్ పటేల్(64), సంజూ శాంసన్(54) చదవండి: IND vs WI: ధోని 17 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన అక్షర్ పటేల్.. తొలి భారత ఆటగాడిగా! Ind Vs WI 1st ODI: 3 పరుగుల తేడాతో విజయం.. ధావన్ సేనకు భారీ షాక్! ఆలస్యంగా వెలుగులోకి.. -
Ind Vs WI: సిక్సర్తో ముగించి.. ఈ మ్యాచ్ ప్రత్యేకం.. దాదాపు ఐదేళ్ల తర్వాత!
India Tour Of West Indies 2022- Axar Patel Comments: ‘‘నిజంగా నాకు ఈ మ్యాచ్ ప్రత్యేకమైనది. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చి జట్టు సిరీస్ గెలవడంలో నా వంతు పాత్ర పోషించాను. ఐపీఎల్లోనూ ఇదే తరహాలో ఆడేవాళ్లం. అవసరమైన సమయంలో రాణించడం ముఖ్యం. దాదాపు ఐదేళ్ల తర్వాత నేను వన్డే మ్యాచ్ ఆడాను. ఇక ముందుకు కూడా ఇదే విధంగా మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపులో భాగం కావడానికి కృషి చేస్తాను’’ అని టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ హర్షం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్తో టీమిండియా మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వన్డే జట్టులో పునరాగమనం చేశాడు బౌలింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్. మొదటి వన్డేలో 21 పరుగులు చేశాడు. అయితే, వికెట్లేమీ తీయలేకపోయాడు. రెండో మ్యాచ్లో ఒక వికెట్ తీయడంతో పాటు 64 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. .@akshar2026 takes #TeamIndia home! Finishes it in style. Watch all the action from the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk1l7GU@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/WHjdscpzd9 — FanCode (@FanCode) July 24, 2022 సిక్సర్ కొట్టి.. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విండీస్ బౌలర్ మేయర్స్ బౌలింగ్లో చివరి ఓవర్ నాలుగో బంతికి సిక్సర్ బాది భారత్ విజయాన్ని ఖరారు చేశాడు. భారీ షాట్తో అజేయంగా ఇన్నింగ్స్ ముగించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ఈ విజయం తనకు చిరస్మరణీయ జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్, వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ సైతం అక్షర్ ఆడిన తీరును కొనియాడారు. అదే విధంగా ఫ్యాన్స్ సైతం అక్షర్ ఇన్నింగ్స్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆదివారం నాటి రెండో మ్యాచ్లో విజయంతో వన్డే సిరీస్ టీమిండియా సొంతమైంది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తేడాతో విండీస్ను ఓడించి ధావన్ సేన ట్రోఫీ గెలిచింది. ఇక బుధవారం(జూలై 27) నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది. ఇదిలా ఉంటే.. కాగా ఐపీఎల్-2022లో అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. 13 ఇన్నింగ్స్ ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు. 10 ఇన్నింగ్స్లో 182 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 42 నాటౌట్. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే ►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్ ►టాస్: వెస్టిండీస్- బ్యాటింగ్ ►వెస్టిండీస్ స్కోరు: 311/6 (50 ఓవర్లు) ►సెంచరీతో చెలరేగిన విండీస్ బ్యాటర్ షాయి హోప్(115 పరుగులు) ►భారత్ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు) ►విజేత: భారత్.. 2 వికెట్ల తేడాతో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అక్షర్ పటేల్ (64 పరుగులు, ఒక్క వికెట్) ►శ్రేయస్ అయ్యర్(63), అక్షర్ పటేల్(64), సంజూ శాంసన్(54) అర్ధ శతకాలు India pull off a thriller in the final over to win by 2 wickets. #WIvIND #MenInMaroon pic.twitter.com/0xnSYNMyzC — Windies Cricket (@windiescricket) July 24, 2022 -
Ind Vs WI 1st ODI: 3 పరుగుల తేడాతో విజయం.. ధావన్ సేనకు భారీ షాక్!
India Tour Of West Indies 2022- 1st ODI: వెస్టిండీస్తో వన్డే సిరీస్ గెలిచి ఫుల్ జోష్లో ఉంది టీమిండియా. కాగా ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేలు ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. మొదటి వన్డేలో 3 పరుగులతో ధావన్ సేన గట్టెక్కగా.. రెండో వన్డేలో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తృటిలో ప్రమాదం నుంచి బయటపడి ఈ విజయాలు నమోదు చేసింది. దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకుంది. Talent wins game but teamwork and intelligence wins championship! 🙌 Kudos to team for the amazing face-off! 😍👏 #IndvsWI pic.twitter.com/jMZOjWiTN6 — Shikhar Dhawan (@SDhawan25) July 25, 2022 తద్వారా పాకిస్తాన్ను వెనక్కినెట్టి.. ఒకే జట్టుపై వరుసగా 12 వన్డే సిరీస్లు గెలిచిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది కూడా! అయితే, అంతా బాగానే ఉన్నా మొదటి వన్డే తర్వాత టీమిండియాకు గట్టి ఎదురెబ్బ తగిలినట్లు సమాచారం. ట్రినిడాడ్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ధావన్ సేన మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఆటగాళ్లకు జరిమానా పడుతుంది. మ్యాచ్ ఫీజులో 20 శాతం మేర కోత విధించడం జరుగుతుంది’’ అని ఐసీసీ పేర్కొంది. ఇక బుధవారం(జూలై 27) ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్- భారత్ మధ్య నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది. ఆ తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా విండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. జూలై 29 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: Shikhar Dhawan: ఆ ముగ్గురు అద్భుతం చేశారు.. అలాంటి పొరపాట్లు సహజం.. ఆవేశ్ సైతం! Ind Vs WI T20I: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్..! A slow over rate in the first ODI against West Indies in Port of Spain has seen India cop a fine. #WIvIND | Details 👇 https://t.co/a3sZLuZJT7 — ICC (@ICC) July 24, 2022 -
Ind Vs WI: ఆ ముగ్గురు అద్భుతం చేశారు.. అలాంటి పొరపాట్లు సహజం.. ఐపీఎల్కు థాంక్స్!
India Tour Of West Indies 2022- 2nd ODI: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా రెండో వన్డేలోనూ శిఖర్ ధావన్ సేన విజయం సాధించింది. ట్రినిడాడ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంపై స్పందించిన కెప్టెన్ శిఖర్ ధావన్.. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్లపై ప్రశంసలు కురిపించాడు. ఈ ముగ్గురు అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని కొనియాడాడు. కాగా ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షాయీ హోప్ సెంచరీ చేసి.. తమ జట్టు భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ పూరన్ సైతం 74 పరుగులతో రాణించడంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ 13 పరుగులకే నిష్క్రమించగా.. గిల్ 43 పరుగులతో రాణించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 63, సంజూ శాంసన్ 54, దీపక్ హుడా 33 పరుగులు చేశారు. ఈ క్రమంలో అక్షర్ పటేల్ 64 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. 2 బంతులు మిగిలుండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో రెండు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. ఈ నేపథ్యంలో ధావన్ మాట్లాడుతూ.. ‘‘నిజంగా ఇది అద్భుత విజయం.. కుర్రాళ్లు ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆఖరి వరకు పోరాడిన తీరు అమోఘం. అయ్యర్, సంజూ, అక్షర్.. అందరూ అత్యద్భుతంగా రాణించారు. అరంగ్రేట మ్యాచ్ అయినప్పటికీ ఆవేశ్ కూడా జట్టుకు అవసరమైన సమయంలో 10 పరుగులు చేసి ఆదుకున్నాడు. నిజానికి ఐపీఎల్కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాంటి మోగా టోర్నీలో ఆడినందు వల్ల భయం, బెరుకు లేకుండా ఇక్కడ కూడా ఆడగలుగుతున్నారు’’ అని పేర్కొన్నాడు. ఇక విండీస్ ఆటగాళ్లలో హోప్, పూరన్ అద్బుతంగా ఆడారన్న ధావన్.. తమ జట్టులో గిల్, అయ్యర్- శాంసన్ మంచి భాగస్వామ్యం నమోదు చేశారని తెలిపాడు. ఇక సంజూ శాంసన్ రనౌట్ గురించి మాట్లాడుతూ.. ఒక్కోసారి ఇలాంటివి జరుగుతాయని, తప్పులు సరిదిద్దుకుంటామని చెప్పుకొచ్చారు. తన లాగే వందో వన్డే మ్యాచ్లో సెంచరీ చేసిన వెస్టిండీస్ బ్యాటర్ హోప్నకు ధావన్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. చదవండి: WI vs IND: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్..! India pull off a thriller in the final over to win by 2 wickets. #WIvIND #MenInMaroon pic.twitter.com/0xnSYNMyzC — Windies Cricket (@windiescricket) July 24, 2022 -
అసలు అతడికి ఇక్కడ ఏం పని? ధావన్పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Ind Vs WI ODI Series- Shikhar Dhawan: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ గురించి భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు వెస్టిండీస్ పర్యటనలో అతడికేం పని అని వ్యాఖ్యానించాడు. ఆరు నెలల క్రితం జట్టు నుంచి తప్పించిన వ్యక్తిని కెప్టెన్గా ఎలా నియమిస్తారని ప్రశ్నించాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మాటలకు.. తాత్కాలిక సారథిగా గబ్బర్ నియామకానికి అసలు పొంతనే కుదరడం లేదని పేర్కొన్నాడు. కాగా గతేడాది శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు ధావన్ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన గబ్బర్.. ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో వెస్టిండీస్తో వన్డే సిరీస్కు రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో మరోసారి కెప్టెన్గా ధావన్కు అవకాశం ఇచ్చింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో అజయ్ జడేజా ఫ్యాన్కోడ్తో మాట్లాడుతూ.. ‘‘శిఖర్ ధావన్ విషయంలో నేను అయోమయానికి గురవుతున్నాను. అసలు అతడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆరు నెలల క్రితం అతడిని జట్టు నుంచి తప్పించారు. ఇప్పుడు కెప్టెనా? నిజానికి కేఎల్ రాహుల్ సహా పలువురు ఇతర యువ ఆటగాళ్లకు ఇలాంటి అవకాశాలు ఇవ్వాలి. కానీ అకస్మాత్తుగా ధావన్ పేరు తెరపైకి వస్తోంది. గతేడాది శ్రీలంక పర్యటనలో కెప్టెన్ను చేశారు. ఆ తర్వాత జట్టులో చోటే లేదు. తర్వాత ఇంగ్లండ్కు తీసుకువెళ్లారు. అసలు టీమిండియా కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ఏమనుకుంటోంది?’’ అని ప్రశ్నించాడు. ఇక ఇంగ్లండ్తో రెండో వన్డేలో పరాజయం తర్వాత తాము దూకుడైన ఆటకు మారుపేరుగా ఉండాలని భావిస్తున్నట్లు రోహిత్ శర్మ చెప్పిన విషయాన్ని అజయ్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. వన్డేలను సైతం టీ20 తరహాలో ఆడతామన్న.. హిట్మ్యాన్ మాటలను బట్టి చూస్తే ధావన్ అసలు జట్టులో ఉండేందుకు అర్హుడు కాదని అజయ్ జడేజా అభిప్రాయపడ్డాడు. కాగా అజయ్ వ్యాఖ్యలపై స్పందించిన గబ్బర్ అభిమానులు ఐపీఎల్-2022లో ధావన్ ప్రదర్శనను ఓసారి గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన ధావన్ 14 ఇన్నింగ్స్లో 460 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 88 నాటౌట్. ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 3 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక కెప్టెన్ శిఖర్ ధావన్ 97 పరుగులతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: Sanju Samson: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే! నువ్వు సూపర్! Well played to @BCCI on competitive 1st ODI.👏🏿 #WIvIND pic.twitter.com/jXj92ekm8b — Windies Cricket (@windiescricket) July 22, 2022 -
Ind Vs WI: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే!
Ind vs WI 1st ODI- Terrific Effort From Sanju Samson: అకీల్ హొసేన్ (32 బంతుల్లో 32 పరుగులు- నాటౌట్).. రొమారియో షెఫర్డ్(25 బంతుల్లో 39 పరుగులు- నాటౌట్).. ఈ వెస్టిండీస్ బౌలర్లు ఇద్దరు.. తమ అద్భుతమైన ఇన్నింగ్స్తో టీమిండియాకు ముచ్చెమటలు పట్టించారు. సునాయాసంగానే గెలుస్తామనుకున్న మ్యాచ్ను ఆఖరి ఓవర్.. ఆఖరి బంతి వరకు తీసుకువచ్చారు. వీరి అద్భుత పోరాటం విండీస్ అభిమానులకు ముచ్చటగొలుపగా.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ చివరి ఓవర్లో రాణించిన విధానం భారత ఫ్యాన్స్ను మురిపించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా- వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం మొదటి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఇందులో టాస్ గెలిచిన విండీస్ ధావన్ సేనను బ్యాటింగ్కు ఆహ్వానించగా.. 309 పరుగుల లక్ష్యాన్ని విధించింది. సంజూ చేసెను అద్భుతం! టార్గెట్ను ఛేదించే క్రమంలో నికోలస్ పూరన్ బృందం శాయశక్తులు ఒడ్డింది. ముఖ్యంగా.. బౌలర్లు అకీల్ హొసేన్, రొమారియో షెఫర్డ్ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడ్డారు. చివరి ఓవర్లో విండీస్ విజయానికి 15 పరుగులు కావాల్సిన సమయంలో మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ఎటాక్ ఆరంభించాడు. మొదటి బంతికి ఒక్క పరుగు కూడా రాలేదు. రెండో బంతికి లెగ్బై రూపంలో ఒక రన్ వచ్చింది. మూడో బాల్ను షెఫర్డ్ బౌండరీకి తరలించాడు. దీంతో విండీస్ శిబిరంలో ఆశలు రేకెత్తాయి. ఇక నాలుగో బంతికి షెఫర్డ్ రెండు పరుగులు రాబట్టాడు. ఐదో బంతి వైడ్గా వెళ్లింది. ఒకవేళ సంజూ అద్భుతంగా డైవ్ చేసి బంతిని ఆపకపోతే బౌండరీని తాకేదే! ఇక తర్వాతి రెండు బంతుల్లో విండీస్కు వరుసగా రెండు, ఒక పరుగు మాత్రమే రావడంతో భారత్ విజయం ఖరారైంది. మూడు పరుగుల తేడాతో ధావన్ సేన గెలుపొందింది. ఈ క్రమంలో కీలక సమయంలో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్న సంజూ శాంసన్పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. Well played to @BCCI on competitive 1st ODI.👏🏿 #WIvIND pic.twitter.com/jXj92ekm8b — Windies Cricket (@windiescricket) July 22, 2022 ‘‘సంజూ గనుక డైవ్ చేసి ఆ బంతిని ఆపకపోయి ఉంటే ఏమయ్యేదో? ఆ బాల్ బౌండరీని తాకితే టీమిండియా కథ అప్పుడే ముగిసేది. ధావన్, గిల్, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్తో పాటు ఆఖరి ఓవర్లో తన ప్రతిభతో ఆకట్టుకున్న సంజూ కూడా ప్రశంసలకు అర్హుడే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Shikhar Dhawan- Nicholas Pooran: సెంచరీ చేజారినందుకు బాధగా ఉంది! అసలైన గెలుపు మాదే! Sanju Samson's keeping was outstanding in this match - In the last over he saved Crucial 4 runs and must credit goes to him and even Mohammad Siraj was appreciated and clapping for his wicketkeeping when he saved. pic.twitter.com/UCLgj2guOR — CricketMAN2 (@ImTanujSingh) July 22, 2022 Love him Or hate him But you cannot Ignore him Sanju Samson saved India from losing the match #WIvIND #IndvsWI #SanjuSamson pic.twitter.com/p0lLcGC3Fq — Roshmi 💗 (@CricCrazyRoshmi) July 22, 2022 We all know Sanju Samson is a great fielder but sometimes we fail to appreciate Sanju Samson the wicketkeeper, have to save today he won us with the gloves #IndvsWI pic.twitter.com/GchlAv4VmT — Anurag (@RightGaps) July 22, 2022 The save from Sanju Samson made a huge impact on the victory of the Indian team, it was a certain 4 extra runs for West Indies & they could have won the game. pic.twitter.com/wxcDLVqY29 — Johns. (@CricCrazyJohns) July 22, 2022 -
Ind Vs WI: సెంచరీ చేజారినందుకు బాధగా ఉంది! అసలైన గెలుపు మాదే!
India Vs West Indies 1st ODI: ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన పోరులో ఎట్టకేలకు టీమిండియా వెస్టిండీస్పై విజయం సాధించింది. ట్రినిడాడ్ వేదికగా శుక్రవారం జరిగిన మొదటి వన్డేలో 3 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో ధావన్ సేన 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. రాణించిన గబ్బర్, గిల్, అయ్యర్ ఇక ఈ మ్యాచ్లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్, ఓపెనర్ శిఖర్ ధావన్ 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ 64 పరుగులతో రాణించగా.. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన శ్రేయస్ అయ్యర్ 54 పరుగులు చేశాడు. టెన్షన్ పెట్టేశారు! ఈ ముగ్గురి విజృంభణతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ సైతం గట్టిపోటీనిచ్చింది. ఓపెనర్ కైలీ మేయర్స్ 75, బ్రూక్స్ 46, బ్రాండన్ కింగ్ 54 పరుగులతో రాణించారు. ఇక ఆఖర్లో అకీల్ హొసేన్ 32, రొమారియో షెపర్డ్ 39 పరుగులతో అజేయంగా నిలిచి చివరి వరకు విజయం కోసం చేసిన పోరాటం వృథాగా పోయింది. మూడు పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. Well played to @BCCI on competitive 1st ODI.👏🏿 #WIvIND pic.twitter.com/jXj92ekm8b — Windies Cricket (@windiescricket) July 22, 2022 బాధగా ఉంది! ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందిస్తూ.. సెంచరీ కొట్టే ఛాన్స్ మిస్ అయినందుకు తీవ్ర నిరాశకు లోనైనట్లు తెలిపాడు. అయితే, ఆఖరి వరకు మ్యాచ్ ఇంత హోరాహోరీగా సాగుతుందని ఊహించలేదన్నాడు. ‘‘శతకం బాదే అవకాశం చేజారినందుకు కాస్త బాధగా ఉంది. అయితే, జట్టుగా మేము సాధించిన విజయం పట్ల సంతోషపడుతున్నా. మేము మంచి స్కోరు నమోదు చేశాము. కానీ.. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ. ఈ స్థాయిలో టెన్షన్ పడాల్సి వస్తుందని ఊహించలేదు. ఏదేమైనా తదుపరి మ్యాచ్లలో మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది’’ అని గబ్బర్ చెప్పుకొచ్చాడు. మేము గెలిచినట్లే: పూరన్ ఆఖరి వరకు అద్భుత పోరాటం చేసి ఓడిపోవడం పట్ల స్పందించిన వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్.. ‘‘మేము గెలిచినట్లే భావిస్తున్నాం. ఈ మ్యాచ్లో తీపి, చేదు జ్ఞాపకాలు.. అయితే, వన్డేల్లో మేము పుంజుకున్న విధానం సంతృప్తినిచ్చింది. మిగిలిన మ్యాచ్లలో సత్తా చాటుతాం. మా బ్యాటర్లు అద్బుతంగా ఆడారు. బౌలర్లు అంతే అద్భుతంగా ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను కట్టడి చేశారు. ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. అయితే, ఓడినా కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. వాటిపై దృష్టి సారిస్తాం’’ అని పేర్కొన్నాడు. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ తొలి వన్డే: ►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ►టాస్: విండీస్- బౌలింగ్ ►భారత్ స్కోరు: 308/7 (50 ఓవర్లు) ►వెస్టిండీస్ స్కోరు: 305/6 (50 ఓవర్లు) ►విజేత: భారత్.. 3 పరుగుల తేడాతో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శిఖర్ ధావన్ (97 పరుగులు) ►అర్ధ శతకాలతో రాణించిన గిల్(64), శ్రేయస్ అయ్యర్(54) Brilliant catch from the Skipper takes our #MaastercardPricelessMoment of the 1st ODI. #WIvIND pic.twitter.com/7WrC0SyMhA — Windies Cricket (@windiescricket) July 22, 2022 చదవండి: IND Vs WI 1st ODI: శుభ్మన్ గిల్ అరుదైన ఫీట్.. సచిన్ రికార్డు బద్దలు..! -
Ind Vs WI: జడేజా గాయంపై అప్డేట్ ఇచ్చిన ధావన్.. ఏమన్నాడంటే!
Shikhar Dhawan Update On Ravindra Jadeja Fitness: వెస్టిండీస్తో వన్డే సిరీస్కు టీమిండియా వైస్ కెప్టెన్గా ఎంపికైన రవీంద్ర జడేజా గాయం గురించి సారథి శిఖర్ ధావన్ అప్డేట్ ఇచ్చాడు. అతడు మొదటి వన్డేకు అందుబాటులో ఉండకపోవచ్చనే సంకేతాలు ఇచ్చాడు. కాగా ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా గాయపడ్డ జడేజా.. ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శుక్రవారం నాటి సిరీస్ ఆరంభ మ్యాచ్కు అతడు దూరమైనట్లు వార్తలు వినిపించాయి. శిఖర్ ధావన్(PC: BCCI) వాళ్లంతా ఉన్నారు కదా! ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన శిఖర్ ధావన్.. ‘‘ప్రస్తుతం తను గాయం కారణంగా కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అయితే, తను మొదటి వన్డే ఆడతాడో లేడో ఇప్పుడే స్పష్టంగా చెప్పలేము. ఒకవేళ తను దూరమైనా స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్ ఉండనే ఉన్నారు. మరోవైపు సిరాజ్, ప్రసిద్ కూడా జట్టుతో ఉన్నారు. మాకు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ విభాగం ఉంది. మా బౌలర్లు తప్పకుండా ప్రభావం చూపుతారు’’ అని పేర్కొన్నాడు. 'West Indies is a great opportunity for the youngsters to get exposure and play, says #TeamIndia ODI Captain @SDhawan25 ahead of #WIvIND series. pic.twitter.com/PBelvII28c — BCCI (@BCCI) July 21, 2022 సంతోషంగా ఉంది! ఇక ఈ సిరీస్కు కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన గబ్బర్..‘‘యువ ఆటగాళ్లతో నా అనుభవాలు పంచుకునే అవకాశం లభించింది. చాలా సంతోషంగా ఉన్నాను. అయితే, వర్షం కారణంగా తగినంత ప్రాక్టీసు చేయలేకపోయాం. ప్రస్తుత జట్టు అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో సమతుల్యంగానే ఉంది. సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ మ్యాచ్లు ఆడకపోయినా.. మంచి పరిణతి కలిగిన ఆటగాడు. శ్రేయస్, శార్దూల్ కూడా చాలా కాలం నుంచి ఆడుతున్న వాళ్లే. ద్రవిడ్ భాయ్తో నా అనుబంధం ఈనాటిది కాదు. 🗣️ 🗣️ "I am very excited to lead the ODI side." @SDhawan25 sums up how he is looking forward to captain #TeamIndia in the #WIvIND ODI series. 👌 👌 pic.twitter.com/MWXzTkLJ13 — BCCI (@BCCI) July 22, 2022 శ్రీలంక పర్యటనలో కూడా మేము కలిసి పనిచేశాం’’ అని చెప్పుకొచ్చాడు. విండీస్ పర్యటనలో గెలుపే క్ష్యంగా ముందకు సాగుతున్నట్లు ధావన్ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవలే ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్న టీమిండియా టీ20, వన్డే సిరీస్లను 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విండీస్ పర్యటనలోనూ ఇదే తరహా ఫలితాలు పునరావృతం చేయాలని భావిస్తోంది. చదవండి: Scott Styris On Shreyas Iyer: టీమిండియా తదుపరి కెప్టెన్ అతడే! ఆ ఒక్క బలహీనత అధిగమిస్తే.. -
Ind Vs WI: రుతురాజ్కు నో ఛాన్స్! ధావన్తో ఓపెనర్గా అతడే!
India tour of West Indies, 2022: టీమిండియా- వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మొదటి మ్యాచ్కు తన జట్టును ఎంచుకున్నాడు. శిఖర్ ధావన్కు జోడీగా ఇషాన్ కిషన్ ఓపెనర్గా బరిలోకి దిగితే బాగుంటుందని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్కు అవకాశం రాకపోవచ్చని, అతడి అరంగేట్రానికి ఇంకా సమయం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇక మూడో స్థానంలో శ్రేయస్ అయ్యర్ సరైనోడన్న ఆకాశ్.. అతడిని విండీస్ బౌలర్లు బౌన్సర్లతో టార్గెట్ చేస్తారని, షాట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో సంజూ శాంసన్, దీపక్ హుడాకు ఆకాశ్ చోప్రా అవకాశం ఇచ్చాడు. కాగా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్కు అందుబాటులో లేని నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఫినిషర్ పాత్ర పోషించాల్సి ఉందని ఆకాశ్ అన్నాడు. కాబట్టి ఆరో స్థానానికి అతడే కరెక్ట్ అని పేర్కొన్నాడు. ఇక తన జట్టులో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లకు చోటిస్తానని ఈ మాజీ బ్యాటర్ పేర్కొన్నాడు. వైస్ కెప్టెన్ జడేజా ఏడో స్థానంలో బ్యాటింగ్కు వస్తే... అతడి తర్వాత శార్దూల్ ఠాకూర్ వస్తే ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్తో మొదటి వన్డేకు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టు: శిఖర్ ధావన్, ఇసాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్. చదవండి: Ind Vs WI ODI Series: వీళ్లతో అంత వీజీ కాదు! ఏమరపాటుగా ఉంటే మూల్యం చెల్లించకతప్పదు! 'West Indies is a great opportunity for the youngsters to get exposure and play, says #TeamIndia ODI Captain @SDhawan25 ahead of #WIvIND series. pic.twitter.com/PBelvII28c — BCCI (@BCCI) July 21, 2022 -
Ind Vs WI 1st ODI: వెస్టిండీస్ చెత్త రికార్డు.. అప్పుడు వైట్వాష్.. మరి ఇప్పుడు!
India tour of West Indies, 2022: వెస్టిండీస్తో వన్డే పోరుకు టీమిండియా సిద్ధమైంది. ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే శుక్రవారం జరుగనుంది. విజయంతో ఈ సిరీస్ను ఆరంభించి విండీస్పై జైత్రయాత్రను కొనసాగించాలని భారత జట్టు భావిస్తుండగా.. సొంతగడ్డపై తమకున్న చెత్త రికార్డును చెరిపేసుకోవాలని పూరన్ బృందం పట్టుదలగా ఉంది. 'West Indies is a great opportunity for the youngsters to get exposure and play, says #TeamIndia ODI Captain @SDhawan25 ahead of #WIvIND series. pic.twitter.com/PBelvII28c — BCCI (@BCCI) July 21, 2022 ఈ నేపథ్యంలో ఇరు జట్ల రికార్డులు, పిచ్, వాతావరణం, తుది జట్ల అంచనా, మ్యాచ్ సమయం, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ అన్న వివరాలు పరిశీలిద్దాం. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా తొలి వన్డే: ►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్, వెస్టిండీస్ ►తేది: జూలై 22, శుక్రవారం ►మ్యాచ్ ఆరంభ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభం ►ప్రసారాలు: వెస్టిండీస్ వర్సెస్ ఇండియా వన్డే, టీ20 సిరీస్కు అఫీషియల్ బ్రాడ్కాస్టర్ ఫ్యాన్ కోడ్. భారత వాసుల కోసం మ్యాచ్లు ఫ్యాన్ కోడ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం. ►అదే విధంగా.. డీడీ స్పోర్ట్స్లోనూ వీక్షించవచ్చు. ►కరేబియన్ల కోసం స్పోర్ట్స్మాక్స్ లైవ్ టెలికాస్ట్ చేయనుంది. పిచ్, వాతావరణం క్వీన్స్ పార్క్ ఓవల్ వన్డేలకు అనువైన వేదిక. బ్యాటింగ్, బౌలింగ్కు సమంగా అనుకూలిస్తుంది. ఇక గురువారం వర్షం కారణంగా ధావన్ సేన ప్రాక్టీస్ ఇండోర్కే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం మాత్రం వర్ష సూచన లేదు. Gearing up for ODI No.1 against the West Indies 💪 Here's @ShubmanGill giving a lowdown on #TeamIndia's 🇮🇳 first net session in Trinidad 🇹🇹#WIvIND pic.twitter.com/oxF0dHJfOI — BCCI (@BCCI) July 21, 2022 తుది జట్ల అంచనా: ఈ మ్యాచ్తో రుతురాజ్ గైక్వాడ్ టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం మెండు. కుడి, ఎడమ చేతివాటం ఓపెనింగ్ జోడీతో ఆడాలని భారత్ భావిస్తే ధావన్తో కలిసి రుతు ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్ ఉంది. ఇక మోకాలి నొప్పి తిరగబెట్టిందన్న వార్తల నేపథ్యంలో జడేజా జట్టుకు దూరమైతే అక్షర్ పటేల్ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది. భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్/ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, సంజూ సామ్సన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా/అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ, యజువేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్. వెస్టిండీస్: నికోలస్ పూరన్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, బ్రూక్స్, మేయర్స్, హోప్, రోవ్మన్ పావెల్, హోల్డర్, అకీల్ హొసీన్ , జోసెఫ్, గుడకేశ్ మోటీ, జేడెన్ సీల్స్. మీకు తెలుసా? ►2017 మార్చి నుంచి వెస్టిండీస్ సొంతగడ్డ మీద 12 ద్వైపాక్షిక సిరీస్లు ఆడింది. ఇందులో కేవలం రెండు మాత్రమే విండీస్ గెలుచుకుంది. ఐర్లాండ్పై 2020లో.. శ్రీలంకపై 2021 మార్చిలో గెలుపు నమోదు చేసింది. ►ఇక వన్డేల విషయానికొస్తే.. 2006 మే తర్వాత వెస్టిండీస్ ఇంతవరకు టీమిండియాతో జరిగిన ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ కూడా గెలవలేదు. 11 సిరీస్లు గెలిచి టీమిండియా వెస్టిండీస్పై ఆధిపత్యం కొనసాగిస్తోంది. ►చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో రోహిత్ సేన చేతిలో భారత్లో జరిగిన సిరీస్లో 3-0 తేడాతో వెస్టిండీస్ వైట్వాష్కు గురైంది. కాగా స్వదేశంలో ఇటీవల బంగ్లాదేశ్తో ముగిసిన వన్డే సిరీస్లనూ ఇదే తరహాలో క్లీన్స్వీప్కు గురైంది. చదవండి: విండీస్తో వన్డే సిరీస్.. టీమిండియాకు బిగ్ షాక్? Ind Vs WI ODI Series: వీళ్లతో అంత వీజీ కాదు! ఏమరపాటుగా ఉంటే మూల్యం చెల్లించకతప్పదు! -
Ind Vs WI: ఆ ముగ్గురు చెలరేగితే ధావన్ సేనకు కష్టాలు తప్పవు!
India tour of West Indies, 2022: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా పలువురు టీమిండియా యువ బ్యాటర్లకు వన్డే జట్టులో చోటు దక్కింది. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతర కీలక బ్యాటర్లు విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా తదితరులకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో.. ఈ సిరీస్ ద్వారా తామేంటో నిరూపించుకునే అవకాశం దొరికింది. ఇక పాకిస్తాన్ పర్యటనలో, స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో చిత్తై డీలా పడిన విండీస్ను.. ఓడించడం శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నా.. టీమిండియా యువ బాట్యర్లకు ఈ ముగ్గురు విండీస్ బౌలర్లను ఎదుర్కోవడం అంత తేలికేమీ కాదు. Gearing up for ODI No.1 against the West Indies 💪 Here's @ShubmanGill giving a lowdown on #TeamIndia's 🇮🇳 first net session in Trinidad 🇹🇹#WIvIND pic.twitter.com/oxF0dHJfOI — BCCI (@BCCI) July 21, 2022 అకీల్ హొసేన్ గతేడాది ఆరంభంలో బంగ్లాదేశ్తో వన్డే సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు లెఫ్టార్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్. ఆరంభంలో కాస్త తడబడ్డా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్తో ముగిసిన సిరీస్లో కేవలం ఒకే ఒక వికెట్ తీసినా.. ప్రస్తుత వన్డే సూపర్ లీగ్ భాగంగా ఆడిన 20 ఇన్నింగ్స్లో ఏకంగా 35 వికెట్లు పడగొట్టాడు. తద్వారా లీగ్లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు 29 ఏళ్ల అకీల్. టీమిండియా బ్యాటర్లకు అకీల్ సవాల్ విసురుతాడనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అకీల్ ఫామ్లోకి వస్తే రైట్ హ్యాండ్ బ్యాటర్లకు అతడితో తలనొప్పి తప్పదు. గుడకేశ్ మోటీ బంగ్లాదేశ్తో స్వదేశంలో ముగిసిన వన్డే సిరీస్తో అరంగేట్రం చేశాడు గుడకేశ్ మోటీ. మూడు మ్యాచ్ల సిరీస్లో అతడు ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తన లెఫ్టార్మ్ స్పిన్తో బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్లో నికోలస్ పూరన్ సారథ్యంలో ఆడిన మోటీకి టీమిండియాతో సిరీస్లో తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు మెండు. అదే జరిగితే 27 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు అంత సులువేమీ కాదు. జేడెన్ సీల్స్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్ ఈ ఏడాది నెదర్లాండ్స్తో సిరీస్తో అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో సిరీస్లో అవకాశం దక్కించుకున్న అతడికి కేవలం ఒకే ఒక మ్యాచ్లో ఆడే ఛాన్స్ దక్కింది. అయితే బంతిని స్వింగ్ చేస్తూ జేడెన్ మంచి ఫలితాలు రాబట్టగలడు. ముఖ్యంగా ఈ 20 ఏళ్ల యువ పేసర్ డెత్ ఓవర్లలో యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బందిపెట్టగలడు. కరేబియన్, లంక ప్రీమియర్ లీగ్లో అతడు రాణించిన విధానమే ఇందుకు నిదర్శనం. ఆండర్సన్ ఫిలిప్తో పాటు రొమారియో షెఫర్డ్ వన్డే సిరీస్కు దూరమైన నేపథ్యంలో జేడెన్కు తుదిజట్టులో అవకాశం రావడం ఖాయంగానే కనిపిస్తోంది.. కాబట్టి అతడి బౌలింగ్లో కాస్త ఆచితూచి ఆడకపోతే టీమిండియా యువ బ్యాటర్లు మూల్యం చెల్లించకతప్పదు. ఇక జూలై 22 నుంచి టీమిండియా- వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్. భారత్తో వన్డేలకు వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటీ, కీమో పాల్, రోవ్మన్ పావెల్, జేడెన్ సీల్స్ చదవండి: Ind Vs WI ODI Series: వన్డేల్లో అరంగేట్రం చేయాలి.. ఓపెనర్గా రావాలి! అతడికి ఆ అర్హత ఉంది! India Vs West Indies 2022: విండీస్తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! -
Ind Vs WI: అతడు వన్డేల్లో అరంగేట్రం చేయాలి.. ధావన్కు జోడీగా ఆడాలి!
India tour of West Indies, 2022: వెస్టిండీస్లో టీమిండియా పర్యటన నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ ఓపెనింగ్ జోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్తో వన్డేల్లో అరంగేట్రం చేయాలని ఆకాంక్షించాడు. శిఖర్ ధావన్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అర్హత రుతుకు ఉందని ఈ మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. కాగా వెస్టిండీస్తో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు విండీస్కు చేరుకుని ప్రాక్టీసు మొదలుపెట్టింది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ గతేడాది ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెస్టిండీస్తో సిరీస్లో భాగంగా వన్డే జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన రుతుకు ఇప్పటికైనా ఛాన్స్ ఇవ్వాలని వసీం జాఫర్ అన్నాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా.. ‘‘వెస్టిండీస్ సిరీస్లో రుతురాజ్కు వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం రావాలి. అతడు శిఖర్తో కలిసి ఓపెనింగ్ చేయాలి. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కుదురుతుంది. విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో రుతు 5 ఇన్నింగ్స్లో 4 సెంచరీలు సాధించాడు. కాబట్టి తుదిజట్టులో చోటు దక్కించుకునే అర్హత అతడికి ఉంది’’ అని వసీం తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా కేఎల్ రాహుల్ గైర్హాజరీ నేపథ్యంలో రుతుకు అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఇషాన్ కిషన్ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక లిస్ట్ ఏ క్రికెట్లో ఈ కుడిచేతి వాటం గల బ్యాటర్ ఓపెనర్గా అద్భుతంగా రాణిస్తున్నాడు. 64 మ్యాచ్లలో వందకు పైగా స్ట్రైక్రేటుతో రుతు 3284 పరుగులు సాధించాడు. చదవండి: Rishabh Pant: పంత్ చూడటానికి బాగుంటాడు.. కాస్త బరువు తగ్గితే! కోట్లలో సంపాదించవచ్చు! India Vs West Indies 2022: విండీస్తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! I think Ruturaj should make his ODI debut and open with Shikhar in the WI series. Ruturaj scored 4 tons in 5 inns in the Vijay Hazare Trophy, deserves a look in. Also left-right combo stays. #WIvIND — Wasim Jaffer (@WasimJaffer14) July 21, 2022 -
Ind Vs WI: వాళ్లంతా లేరు కాబట్టి మా పని ఈజీ.. మేమేంటో చూపిస్తాం!
IND vs WI ODI Series: West Indies captain Nicholas Pooran Comments- కీరన్ పొలార్డ్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఈ ఏడాది మేలో వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్గా నియమితుడయ్యాడు వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా తొలిసారిగా విండీస్ సారథిగా పగ్గాలు చేపట్టాడు. ఇందులో భాగంగా.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఆతిథ్య జట్టును 3-0తో విండీస్ వైట్వాష్ చేసింది. ఆరంభంలో అదుర్స్.. ఆ తర్వాత.. దీంతో విజయంతో కెప్టెన్గా తన ప్రయాణాన్ని ఆరంభించాడు. అయితే, ఆ సంతోషం కొన్నిరోజుల్లోనే ఆవిరైపోయింది.నెదర్లాండ్స్ టూర్ తర్వాత పాకిస్తాన్కు వెళ్లిన నికోలస్ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. వెస్టిండీస్తో వన్డే సిరీస్ను పాకిస్తాన్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇక స్వదేశంలో బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ గెలిచినా.. వన్డే సిరీస్లో మాత్రం ఇదే తరహాలో 3-0తేడాతో పర్యాటక జట్టు చేతిలో వైట్వాష్కు గురైంది. ఈ క్రమంలో టీమిండియాతో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. టీమిండియాతో పోటీకి సన్నద్ధం! ఇప్పటికే ఇంగ్లండ్ టూర్లో టీ20, వన్డే సిరీస్లు గెలిచి జోష్లో ఉన్న పటిష్టమైన భారత జట్టుతో తలపడనుంది. ఇందుకోసం శిఖర్ ధావన్ నేతృత్వంలోని వన్డే జట్టు విండీస్కు చేరుకుంది కూడా! ఈ నేపథ్యంలో నికోలస్ పూరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా సహా కొంత మంది కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్న నేపథ్యంలో వన్డేల్లో తమ పని కాస్త సులువవుతుందని పేర్కొన్నాడు. Trinidad - WE ARE HERE! 👋😃#TeamIndia | #WIvIND pic.twitter.com/f855iUr9Lq — BCCI (@BCCI) July 20, 2022 అయితే, టీమిండియాలో మ్యాచ్ విన్నర్లకు కొదువలేదని, వాళ్లను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపాడు. ఈ మేరకు అతడు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాడు. ‘‘వాళ్లలో(భారత జట్టు) ఎంతో మంది అద్బుత ఆటగాళ్లు ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. బంతితోనూ... బ్యాట్తోనూ రాణించగలరు. మేము చేదు అనుభవాల నుంచి కోలుకుని.. వాళ్లకు సవాలు విసరగలం. ట్రినిడాడ్, ఫ్లోరిడాలో సత్తా చాటుతాం. క్రికెట్ ప్రపంచానికి మేమేంటో చూపిస్తాం. జట్టుగా ఇది మాకొక మంచి అవకాశం. వన్డే క్రికెట్లో లోపాలు సరిదిద్దుకుని.. ముందుకు సాగుతాం. మా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి గట్టి పోటీ ఇచ్చేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అని విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ చెప్పుకొచ్చాడు. కాగా వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. వన్డేలకు శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించనుండగా.. టీ20 సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుతో చేరనున్నాడు. చదవండి: Eng Vs SA 1st ODI Series 2022: అదరగొట్టిన ప్రొటిస్ బౌలర్లు.. ఇంగ్లండ్పై దక్షిణాఫ్రికా ఘన విజయం! ఏకంగా.. India Vs West Indies 2022: విండీస్తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! -
Ind Vs WI: ఫుల్ జోష్లో ధావన్ సేన.. ద్రవిడ్ సర్ మీరు కూడానా! వైరల్
India tour of West Indies, 2022- Rahul Dravid Joins Dhawan gang Hilarious Video: వన్డే సిరీస్ ఆడేందుకై శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్లో అడుగుపెట్టింది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు సన్నద్ధమయ్యే క్రమంలో ట్రినిడాడ్కు చేరుకుంది. ఇక ఈ సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాగా.. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించనున్నాడు. Trinidad - WE ARE HERE! 👋😃#TeamIndia | #WIvIND pic.twitter.com/f855iUr9Lq — BCCI (@BCCI) July 20, 2022 కాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీ20, వన్డే సిరీస్లను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా రెట్టింపు ఉత్సాహంతో విండీస్కు పయనమైంది. ఇక జట్టు వరుస విజయాల నేపథ్యంలో ఆటగాళ్లు సహా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఫుల్జోష్లో ఉన్నాడు. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) ద్రవిడ్ సర్ మీరు కూడానా! విండీస్ చేరుకోగానే ధావన్ షేర్ చేసిన వీడియోలో ద్రవిడ్ భాయ్ను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ధావన్ ముందుండి నడవగా.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, చహల్, జడేజా, సిరాజ్ తమదైన శైలిలో హాయ్ అంటూ ఎంట్రీ ఇచ్చారు. ద్రవిడ్ భాయ్ సైతం వారిని అనుసరిస్తూ చిరునవ్వులు చిందించడం విశేషం. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘ద్రవిడ్ సర్ని ఎప్పుడూ ఇలా చూడలేదు.. మీతో పాటు ఆయనను కూడా మార్చేశారు కదా.. యోయో బాయ్స్’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా వెస్టిండీస్ టూర్లో భాగంగా టీమిండియా మూడు వన్డేలతో పాటు ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. జూలై 22 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఇక టీ20 సిరీస్కు రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నాడు. ప్రస్తుతం అతడు హాలిడే మూడ్లో ఉన్నాడు. భార్య రితికా, కూతురు సమైరాతో సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు. 😍🥰💞 📸:@ritssajdeh | @ImRo45 pic.twitter.com/Z1aLHci6KG — Ritika Sajdeh™ (@ImRitika45) July 19, 2022 వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్. చదవండి: India Vs West Indies 2022: విండీస్తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! -
Ind Vs Wi: విండీస్తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు
India tour of West Indies, 2022: ఇంగ్లండ్ పర్యటన ముగించుకున్న టీమిండియా వెస్టిండీస్ టూర్తో బిజీ కానుంది. విండీస్లో పర్యటనలో భాగంగా మూడు వన్డేలతో పాటు ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇక టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో వన్డే సిరీస్కు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగే టీ20 సిరీస్కు మాత్రం హిట్మ్యాన్ రోహిత్ అందుబాటులోకి రానున్నాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగమైన భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా విండీస్ టూర్కు దూరంగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్- టీమిండియా పూర్తి షెడ్యూల్, మ్యాచ్ సమయం, వేదికలు, జట్ల వివరాలు గమనిద్దాం. ఇక ఇంగ్లండ్తో రీషెడ్యూల్ టెస్టులో ఓటమి పాలైన టీమిండియా.. మూడు మ్యాచ్ల టీ20, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లను 2-1 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. విండీస్ పర్యటనలోనూ ఇదే తరహాలో విజయం సాధించాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్. వెస్టిండీస్తో టీ20 సిరీస్కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్*, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్*, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్. కాగా ఇటీవలే గాయం నుంచి కోలుకున్న టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. భారత్తో వన్డేలకు వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటీ, కీమో పాల్, రోవ్మన్ పావెల్, జేడెన్ సీల్స్ వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా! మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ►జూలై 22- మొదటి వన్డే- క్వీన్స్ పార్క్ ఓవల్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- ట్రినిడాడ్ ►జూలై 24- రెండో వన్డే- క్వీన్స్ పార్క్ ఓవల్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- ట్రినిడాడ్ ►జూలై 27- మూడో వన్డే-క్వీన్స్ పార్క్ ఓవల్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- ట్రినిడాడ్ ►మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఆరంభం ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ►మొదటి టీ20- జూలై 29- బ్రియన్ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్ ►రెండో టీ20- ఆగష్టు 1- వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ ►మూడో టీ20- ఆగష్టు 2-వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ ►నాలుగో టీ20- ఆగష్టు 6- సెంట్రల్ బ్రొవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, ఫ్లోరిడా ►ఐదో టీ20- ఆగష్టు 7- సెంట్రల్ బ్రొవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, ఫ్లోరిడా ►మ్యాచ్ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం చదవండి: Denesh Ramdin: టీమిండియాతో సిరీస్.. క్రికెట్కు గుడ్బై చెప్పిన విండీస్ వికెట్ కీపర్..! KL Rahul-Jhulan Goswami: గోస్వామి బౌలింగ్.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్.. వీడియో వైరల్! -
విండీస్ దిగ్గజాల రికార్డుకు ఎసరు పెట్టిన రోహిత్-ధవన్ జోడీ
Rohit-Dhawan: టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధవన్లు మరో అరుదైన రికార్డుపై కన్నేశారు. ఇంగ్లండ్తో రెండో వన్డేలో ఈ ద్వయం మరో 43 పరుగులు జోడిస్తే.. విండీస్ దిగ్గజ ఓపెనర్ల రికార్డును అధిగమిస్తారు. వన్డేల్లో విండీస్ లెజెండరీ ఓపెనింగ్ పెయిర్ గార్డన్ గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ జోడీ తొలి వికెట్కు 102 ఇన్నింగ్స్ల్లో 5150 పరుగులు జోడించగా.. రోహిత్-ధవన్ జోడీ 112 ఇన్నింగ్స్ల్లో 5108 పరుగులు చేసింది. ఇంగ్లండ్తో నేటి (జులై 14) మ్యాచ్లో భారత ఓపెనింగ్ ద్వయం మరో 43 పరుగులు సాధించగలిగితే.. వన్డేల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకుతుంది. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ జోడీ (136 ఇన్నింగ్స్ల్లో 6609 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ ఆల్టైమ్ గ్రేట్ ఓపెనింగ్ జోడీ మాథ్యూ హేడెన్-ఆడమ్ గిల్క్రిస్ట్ (114 ఇన్నింగ్స్ల్లో 5472) రెండో ప్లేస్లో నిలిచింది. తొలి వన్డేలో హిట్మ్యాన్- ధవన్ పెయిర్ తొలి వికెట్కు అజేయమైన 114 పరుగులు సాధించడం ద్వారా ఫిఫ్టి ఓవర్స్ ఫార్మాట్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకుంది. ఇదిలా ఉంటే, తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు బుమ్రా (6/19), మహ్మద్ షమీ (3/31) నిప్పులు చెరగడంతో 110 పరుగులకే చాపచుట్టేసింది. ఛేదనలో రోహిత్ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్లు) శిఖర్ ధవన్ (54 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు)లు చెలరేగడంతో ఇంగ్లండ్ నిర్ధేశించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. ఫలితంగా టీమిండియా 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసి 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు టీ20 సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో చేజిక్కించుకుంది. చదవండి: విండీస్తో టి20 సిరీస్.. కోహ్లి, బుమ్రా ఔట్ -
Ind Vs Eng: మాది సరైన నిర్ణయం.. ముందే తెలుసు.. అందుకే ఇలా!
India tour of England, 2022 - Ind Vs Eng 1st ODI: ఇంగ్లండ్తో మొదటి వన్డేలో అదరగొట్టిన బౌలర్లను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసించాడు. ఓవల్ పిచ్పై తమ బౌలర్లు అత్యుత్తమంగా రాణించగలరని తెలుసునని, అందుకు అనుగుణంగానే అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నారని కొనియాడాడు. ఇక అనువజ్ఞుడైన శిఖర్ ధావన్ పరిస్థితులకు తగ్గట్లుగా రాణించాడని పేర్కొన్నాడు. మొదటి బంతి మినహా తాము ఎలాంటి తప్పులు చేయలేదని రోహిత్ చెప్పుకొచ్చాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇక మహ్మద్ షమీ 7 ఓవర్ల బౌలింగ్ చేసి 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ప్రసిద్ కృష్ణకు ఒక వికెట్ దక్కింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో భాగంగా ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ వరుసగా 76, 31 పరుగులు చేసి భారత్ను గెలిపించారు. దీంతో భారీ విజయంతో సిరీస్లో 1-0 తేడాతో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. సరైన నిర్ణయం.. మాకు ముందే తెలుసు! ఈ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ.. ‘‘ పిచ్ కండిషన్ను బట్టి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని సరైన నిర్ణయం తీసుకున్నాము. అయినా, పిచ్ స్వభావం కారణంగా మేమెప్పుడూ ఆందోళన చెందలేదు. ఎందుకంటే మా బౌలర్లు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా రాణించగలరో మాకు తెలుసు. స్వింగ్, సీమ్కు అనుకూలంగా ఉన్న పిచ్ను మేము సమర్థవంతంగా ఉపయోగించుకున్నాము. మా బౌలర్లు అత్యుత్తంగా రాణించారు. ఇక శిఖర్ , నేను చాలా ఏళ్లుగా కలిసి బ్యాటింగ్ చేస్తున్నాము. ఒకరినొకరం పరస్పరం అర్థం చేసుకోగలము. అయితే, మొదటి బంతి విషయంలో మా జడ్జిమెంట్ తప్పింది. అంతేతప్ప వన్డే ఫార్మాట్లో ఉన్న తనకు ఉన్న సుదీర్ఘ అనుభవం అక్కరకు వచ్చింది. గతంలో ఎన్నో మ్యాచ్లు గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఈ విజయం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది’’ అని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్ ఆరంభించిన విల్లే బౌలింగ్లో రోహిత్ ఒక పరుగు తీశాడు. అయితే, డైరెక్ట్ హిట్ నేపథ్యంలో ధావన్ డైమండ్ డక్గా వెనుదిరగాల్సి వచ్చేది. కాస్తలో రనౌట్ ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 2022 వన్డే సిరీస్- మొదటి మ్యాచ్: ►టాస్: ఇండియా- బౌలింగ్ ►ఇంగ్లండ్ స్కోరు: 110 (25.2) ►ఇండియా స్కోరు: 114/0 (18.4) ►విజేత: ఇండియా- 10 వికెట్ల తేడాతో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్ప్రీత్ బుమ్రా(7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు) చదవండి: Ind Vs Eng 1st ODI: టీమిండియా ఆరేళ్ల తర్వాత.. పాపం ఇంగ్లండ్ సొంతగడ్డపై చెత్త రికార్డు! Mohammed Shami: షమీ సంచలనం.. టీమిండియా తరపున తొలి బౌలర్గా IND VS ENG 1st ODI: రోహిత్ శర్మ భారీ సిక్సర్.. బంతి తగిలి చిన్నారికి గాయం -
Ind Vs Eng: దేశవాళీ వన్డే, టీ20 క్రికెట్ ఆడతా.. నా టార్గెట్ వరల్డ్కప్!
ODI World Cup 2023- Shikhar Dhawan: టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ చాలా రోజుల తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతేడాది జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించిన గబ్బర్.. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. తాజాగా టీమిండియా ఇంగ్లండ్ టూర్ నేపథ్యంలో వన్డే సిరీస్తో పునరాగమనం చేయనున్నాడు. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో రోహిత్ శర్మతో కలిసి ధావన్ ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖాయమైంది. ఓవల్ వేదికగా మంగళవారం(జూలై 12) జరిగే మొదటి వన్డేతో గబ్బర్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక వెస్టిండీస్తో వన్డే సిరీస్కు రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో శిఖర్ ధావన్ సారథిగా పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ది టెలిగ్రాఫ్నకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చిన గబ్బర్.. తన భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పుకొచ్చాడు. నా టార్గెట్ అదే! వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్ జరుగనున్న తరుణంలో.. ‘‘ప్రస్తుతం నా దృష్టి మొత్తం వన్డే ప్రపంచకప్ టోర్నీ మీదే ఉంది. ఈ గ్యాప్లో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలని అనుకుంటున్నాను. అప్పుడే ప్రపంచకప్ జట్టులో చోటు.. నన్ను నేను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. ఇక అంతకంటే ముందు ఐపీఎల్లో మరింత గొప్పగా రాణించాలని భావిస్తున్నాను. అంతేకాకుండా దేశవాళీ వన్డే క్రికెట్, టీ20 మ్యాచ్లలో ఆడాలని భావిస్తున్నా. ఇంగ్లండ్ పర్యటనకు ముందు నేను పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాను. నెట్స్లో ప్రాక్టీసు చేశాను. ఈ సిరీస్తో పూర్తి స్థాయిలో ఫామ్లోకి వస్తాననుకుంటున్నాను. ఓపెనర్గా నాకు చాలా అనుభవం ఉంది. నా టెక్నిక్ను మరింతగా మెరుగుపరచుకుంటున్నాను. ఏదేమైనా.. సంయమనంతో పరిస్థితులకు తగ్గట్లుగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ.. చిన్న చిన్న స్కోర్లను సైతం భారీ స్కోర్లుగా మలచడంపై దృష్టి సారించాలి. అప్పుడే అనుకున్న ఫలితాలను పొందగలం’’ అని 36 ఏళ్ల శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన గబ్బర్.. 14 ఇన్నింగ్స్లో కలిపి 460 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ఎంపిక కాలేదు. కానీ వన్డే ఫార్మాట్లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు. చదవండి: Surya Kumar Yadav: ప్రస్తుతం అతడిని ఎదుర్కోగల బౌలర్ ప్రపంచంలోనే ఎవరూ లేరు! Ind Vs Eng 1st ODI: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్ను కాదని అర్ష్దీప్ సింగ్కు ఛాన్స్! ఇంకా.. -
అరుదైన రికార్డుపై కన్నేసిన హిట్మ్యాన్-గబ్బర్ జోడీ
Rohit-Dhawan: పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీల్లో ఒకటిగా పరిగణించబడే రోహిత్ శర్మ-శిఖర్ ధవన్లు వన్డేల్లో ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు. ఈ ద్వయం ఇవాళ (జులై 12) ఇంగ్లండ్తో జరుగబోయే తొలి వన్డేలో మరో ఆరు పరుగులు జోడిస్తే ఫిఫ్టి ఓవర్స్ ఫార్మాట్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న నాలుగో జోడీగా రికార్డుల్లోకెక్కనుంది. హిట్మ్యాన్-గబ్బర్ జోడీ ఇప్పటివరకు 111 వన్డే ఇన్నింగ్స్ల్లో 4994 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసింది. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ జోడీ అగ్రస్థానంలో ఉంది. సచిన్-గంగూలీ ద్వయం 136 ఇన్నింగ్స్ల్లో 6609 పరుగులు జోడించింది. వీరి తర్వాత స్థానాల్లో ఆసీస్ ఆల్టైమ్ గ్రేట్ ఓపెనింగ్ జోడీ మాథ్యూ హేడెన్-ఆడమ్ గిల్క్రిస్ట్ (114 ఇన్నింగ్స్ల్లో 5472), విండీస్ లెజెండరీ ఓపెనింగ్ పెయిర్ గార్డన్ గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ (102 ఇన్నింగ్స్ల్లో 5150) ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 తేడాతో చేజిక్కించుకున్న భారత్.. ఇవాళ కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా తొలి వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, శిఖర్ ధవన్లు టీమిండియా తరఫున ఓపెనింగ్ చేయనున్నారు. ఇటీవలి కాలంలో ధవన్కు సరైన అవకాశాలు లేకపోవడంతో చాలాకాలం తర్వాత ఈ జోడీ కలిసి బరిలోకి దిగనుంది. చదవండి: Ind Vs Eng: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్ను కాదని అర్ష్దీప్ సింగ్కు ఛాన్స్! -
విండీస్తో వన్డే సిరీస్ కెప్టెన్గా ధావన్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
Team India Captains In 2022 So Far: సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు విరాట్ కోహ్లి... వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్... స్వదేశంలో శ్రీలంక, వెస్టిండీస్లతో పరిమిత ఓవర్ల సిరీస్కు రోహిత్ శర్మ.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు రిషభ్ పంత్... ఐర్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్కు హార్దిక్ పాండ్యా.. ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా... ఇంగ్లండ్తో టీ20 సిరీస్ నేపథ్యంలో వార్మప్ మ్యాచ్లకు దినేశ్ కార్తిక్.. వెస్టిండీస్తో వన్డేలకు శిఖర్ ధావన్..! ఏంటీ ఈ జాబితా అనుకుంటున్నారా?! 2022 తొలి అర్ధభాగంలో టీమిండియా కెప్టెన్ల పేర్లు! వార్మప్ మ్యాచ్లను మినహాయిస్తే.. ఈ ఏడాదిలోనే భారత జట్టుకు ఏడుగురు సారథులుగా ఎంపికయ్యారు. విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న తర్వాత పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. రోహిత్ ఒక్కసారి కూడా! కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ ఇంత వరకు విదేశాల్లో ఇంత వరకు ఒక్క సిరీస్ కూడా ఆడలేదు. ఇంగ్లండ్తో షెడ్యూల్ టెస్టు సమయంలో కోవిడ్ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక జూలై 7 నుంచి టీ20 సిరీస్తో అందుబాటులోకి రానున్నాడు. .@ImRo45 - out and about in the nets! 👏 👏 Gearing up for some white-ball cricket. 👌 👌#TeamIndia | #ENGvIND pic.twitter.com/nogTRPhr9a — BCCI (@BCCI) July 4, 2022 ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. సుమారు ఆర్నెళ్ల కాలంలోనే ఏడుగురు కెప్టెన్లు కావడం.. కోహ్లి, రోహిత్, బుమ్రా తదితరులకు తరచుగా విశ్రాంతినివ్వడం పట్ల టీమిండియా ఫ్యాన్స్ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు! ఎంత మంది కెప్టెన్లను మారుస్తారురా బాబూ అంటూ ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని ట్రోల్ చేస్తున్నారు. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు ధావన్ను కెప్టెన్గా, జడేజాను వైస్ కెప్టెన్గా తాజాగా ఎంపిక చేసిన నేపథ్యంలో ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. రండి బాబూ రండి.. టీమిండియా కెప్టెన్సీ తీసుకోండి.. అంటూ పండ్లు అమ్ముతున్నట్లుగా అమ్ముతున్నారు.. ఇదిగో టీమిండియా కెప్టెన్ విషయంలో ఇలాంటి దుస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అంటూ మీమ్స్తో రెచ్చిపోతున్నారు నెటిజన్లు! BCCI giving captaincy to the players nowadays pic.twitter.com/hB4usx0AOE — D Jay (@djaywalebabu) July 6, 2022 మరోవైపు.. అసలు భారత క్రికెట్ జట్టులో ఏం జరుగుతోంది? హెడ్కోచ్ ద్రవిడ్ సర్ ఏం చేస్తున్నారు? కీలక ఆటగాళ్లకు తరచుగా విశ్రాంతి ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఐపీఎల్కు మాత్రం అందరూ అందుబాటులో ఉంటారా? అసలు టీమిండియాకు కెప్టెన్లు ఎందరో చెప్పండి? మీరేం చేస్తున్నారో అర్థమవుతోందా? సింపుల్.. భారత క్రికెట్ను భ్రష్టు పట్టిస్తున్నారు! అంతే కదా! అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Rishabh Pant: పంత్ను ఆ స్థానంలో బ్యాటింగ్కు పంపండి.. అప్పుడే: టీమిండియా మాజీ ఓపెనర్ Indian Cricket Team Captaincy Nowadays 🤣🤣#CricketTwitter pic.twitter.com/uhA8O6hjK1 — Dheeraj Singh (@Dheerajsingh_) July 6, 2022 The Selectors didn’t want To split Captaincy In white-ball cricket, says Sourav Ganguly - December 2021 8th Captain for India in 2022 😳😳 Hope for upcoming series they will make Md.Siraj as Captain @BCCI #IndvsWI #ViratKohli#RohitSharma#BCCI pic.twitter.com/HUERa96REn — 𝙶𝙹 🇮🇳 ☮️ #𝙿𝚎𝚊𝚌𝚎 (@IAM000710) July 6, 2022 This is Indian cricket, After Virat Kohli left from the captaincy.! pic.twitter.com/sYjhg8hf1Q — Rabin Chetry (@ViratRabin) July 6, 2022 -
Ind Vs WI: ధావన్కు బంపరాఫర్.. వన్డే జట్టు కెప్టెన్గా ఎంపిక.. బీసీసీఐ ప్రకటన
India Tour of West Indies, 2022: వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. ఈ మేరకు విండీస్తో మూడు మ్యాచ్ల సిరీస్లో తలపడబోయే జట్టు వివరాలు వెల్లడించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. ఇక వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ను సెలక్టర్లు ఈ సిరీస్కు కెప్టెన్గా ఎంపిక చేశారు. రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్గా అవకాశం దక్కింది. అదే విధంగా ఐర్లాండ్తో టీ20 సిరీస్లో అదరగొట్టిన దీపక్ హుడా విండీస్తో వన్డేలకు ఎంపికయ్యాడు. సంజూ శాంసన్ సైతం మరోసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్కు కూడా అవకాశం దక్కింది. ఇక జూలై 22న మొదటి వన్డేతో టీమిండియా- వెస్టిండీస్ మధ్య సిరీస్ ఆరంభం కానుంది. కాగా గతంలో శ్రీలంకతో సిరీస్ నేపథ్యంలో శిఖర్ ధావన్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా వెస్టిండీస్తో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటర్లు విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, పేసర్ జస్ప్రీత్ బుమ్రా తదితరులకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా! వన్డే సిరీస్ ►జూలై 22- మొదటి వన్డే ►జూలై 24- రెండో వన్డే ►జూలై 27- మూడో వన్డే టీ20 సిరీస్ ►మొదటి టీ20- జూలై 29 ►రెండో టీ20- ఆగష్టు 1 ►మూడో టీ20- ఆగష్టు 2 ►నాలుగో టీ20- ఆగష్టు 6 ►ఐదో టీ20- ఆగష్టు 7 చదవండి: Jasprit Bumrah: అందుకే ఓడిపోయాం.. అయితే, కెప్టెన్సీ చేయడం నచ్చింది! భవిష్యత్తులో.. ICC Mens Test Rankings: దుమ్ములేపిన పంత్.. ఏకంగా! దిగజారిన కోహ్లి ర్యాంకు.. ఇక బెయిర్స్టో.. 🚨 NEWS 🚨: The All-India Senior Selection Committee has picked the squad for the three-match ODI series against the West Indies to be played at the Queen's Park Oval, Port of Spain, Trinidad.#TeamIndia | #WIvIND — BCCI (@BCCI) July 6, 2022 -
Shikhar Dhawan: నెట్స్లో ప్రాక్టీసు చేస్తున్న గబ్బర్.. వీడియో వైరల్!
Shikhar Dhawan shares video: ‘‘నా పెదాల మీద చిరునవ్వు తీసుకువచ్చే సన్నివేశం చూడాలంటే స్వైప్ చేయండి’’ అంటూ టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. నెట్స్లో ప్రాక్టీసు చేస్తున్న దృశ్యాలను పంచుకుంటూ తన ఆనందం ఆటతోనే ముడిపడి ఉందని పేర్కొన్నాడు. కాగా గతేడాది శ్రీలంక టూర్ తర్వాత ధావన్కు మళ్లీ భారత జట్టులో చోటు దక్కలేదు. ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన 36 ఏళ్ల గబ్బర్.. 14 మ్యాచ్లలో కలిపి 38.33 సగటుతో 460 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేటు 122.67. అయినప్పటికీ దక్షిణాఫ్రికాతో ఇటీవల స్వదేశంలో ముగిసిన టీ20 సిరీస్కు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ను పక్కనపెట్టేశారు సెలక్టర్లు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ మేరకు ధావన్ ఎంపిక విషయంలో సెలక్టర్లకు సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి. టీ20 ప్రపంచకప్-2022 సమీపిస్తున్న నేపథ్యంలోనే ఇలా చేసినట్లు వాదనలు వినిపించాయి. అయితే, అదే సమయంలో గబ్బర్ను కాదన్నారు సరే.. దినేశ్ కార్తిక్కు మాత్రం ఎలా ఎంపిక చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం ఐర్లాండ్తో సిరీస్కు కూడా అతడిని ఎంపిక చేయకపోవడంపై ధావన్ అభిమానులు గుస్సా అయ్యారు. ఇదిలా ఉంటే.. గబ్బర్ మాత్రం నిరాశ చెందక తన పని తాను చేసుకుకోతున్నాడు. నెట్స్లో చెమటోడుస్తూ ప్రాక్టీసు చేస్తున్నాడు. చదవండి: Rashid Latif: 'ఐపీఎల్ అంటేనే బిజినెస్'.. విషం చిమ్మిన పాక్ మాజీ క్రికెటర్ Jos Buttler Six Viral Video: దయ, జాలి లేకుండా..'అందుకే అనేది బట్లర్ మామూలోడూ కాదని' View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లు.. టీమిండియాకు ఏమైంది..?
గతేడాది కాలంగా టీమిండియా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 11 నెలల కాలంలో ఏకంగా ఏడుగురు కెప్టెన్లు మారడంతో ఏ సిరీస్కు ఎవరు కెప్టెన్గా ఉంటారో అర్ధం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. 2021 జూన్లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరగా, అదే సమయంలో శిఖర్ ధవన్ సారధ్యంలో టీమిండియా శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడింది. అనంతరం అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్కు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల చేత న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టు నుంచి విరాట్ కోహ్లి తప్పుకోగా ఆ మ్యాచ్కు రహానే కెప్టెన్గా వ్యవహరించారు. తదనంతరం కెప్టెన్సీ విషయంలో చెలరేగిన వివాదాల నేపథ్యంలో విరాట్ కోహ్లి టీమిండియా సారధ్య బాధ్యతల నుంచి మొత్తంగా తప్పుకోగా.. సౌతాఫ్రికా టూర్లో రెండో టెస్టుకు ఆతర్వాత జరిగిన వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించాడు. ఆ తర్వాత టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక జట్లతో వన్డే, టీ20 సిరీస్లకు కెప్టెన్గా ఉన్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు రోహిత్కు విశ్రాంతినివ్వడంతో కేఎల్ రాహుల్ను తాత్కాలిక కెప్టెన్గా ఎంపిక చేయగా, సిరీస్ ప్రారంభానికి ముందే అతను గాయం కారణంగా వైదొలిగాడు. దీంతో బీసీసీఐ రిషబ్ పంత్ను కెప్టెన్గా నియమించింది. సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్లో పర్యటించే భారత జట్టులో పంత్కు చోటు దక్కడంతో ఐర్లాండ్లో పర్యటించే మరో జట్టుకు హార్ధిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేసింది బీసీసీఐ. ఇలా వివిధ కారణాల చేత 11 నెలల కాలంలో టీమిండియాకు ఏడుగురు కెప్టెన్లు మారారు. చదవండి: టీమిండియా ఇంగ్లండ్కు.. కేఎల్ రాహుల్ జర్మనీకి..! -
IPL 2022: పాపం ధావన్... తన తప్పు లేకున్నా తన్నులు తిన్నాడు!
IPL 2022: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్స్టాగ్రామ్లో 11 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న గబ్బర్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్లు తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాదు ఫన్నీ వీడియోలతోనూ ఆకట్టుకుంటాడు. ఈ క్రమంలో గురువారం శిఖర్ షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఐపీఎల్-2022లో శిఖర్ ధావన్ పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. తాజా ఎడిషన్లో 14 ఇన్నింగ్స్ ఆడిన గబ్బర్ 460 పరుగులు(అత్యధిక స్కోరు 88- నాటౌట్) సాధించాడు. అయితే, బ్యాటర్గా ధావన్ సఫలీకృతుడైనప్పటికీ.. అతడి జట్టుకు మాత్రం మరోసారి పరాభవం తప్పలేదు. పద్నాలుగు మ్యాచ్లలో కేవలం ఏడు గెలిచి 14 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఈసారి కూడా కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు ఇళ్లకు చేరుకున్నారు. ఈ క్రమంలో గబ్బర్ ఓ ఫన్నీ వీడియో పంచుకున్నాడు. ఇందులో ధావన్ తండ్రి అతడిని సరదాగా తన్నుతూ.. కొడుతున్నట్లుగా కనిపించారు. పక్కనున్న వాళ్లు ఆపుతున్నా ఆవేశంగా ముందుకు వస్తూ ధావన్ను ఆయన చితక్కొట్టినట్లు నటించారు. ఈ వీడియోకు.. ‘‘నాకౌట్కు అర్హత సాధించనందుకు మా నాన్న చేతిలో ఇలా నాకౌట్’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇది నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇక సినిమాలపై మక్కువ ఉన్న ధావన్ త్వరలోనే బాలీవుడ్ తెరపై దర్శనమివ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ధావన్ను దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపిక చేయని నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. చదవండి 👇 IPL 2022: చాన్స్ ఇస్తే... చెలరేగిపోయారు... ఈ నలుగురు వారికి వారే సాటి! అద్భుతంగా.. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });