Shikhar Dhawan
-
చాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్గా శిఖర్ ధావన్
దుబాయ్: భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan)... చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) అంబాసిడర్గా (Ambassador) నియమితుడయ్యాడు. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నలుగురు అంబాసిడర్లను ఎంపిక చేసింది. ఇందులో ధావన్తో పాటు పాకిస్తాన్ జట్టుకు చాంపియన్స్ ట్రోఫీ అందించిన కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్, న్యూజిలాండ్ దిగ్గజ పేసర్ టిమ్ సౌతీ చోటు దక్కించుకున్నారు.2013లో భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన శిఖర్... ఈ టోర్నీ చరిత్రలో వరుసగా రెండుసార్లు ‘గోల్డెన్ బ్యాట్’ అవార్డు గెలుచుకున్న ఏకైక ప్లేయర్గా నిలిచాడు. ‘చాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్గా ఎంపికవడం గౌరవంగా భావిస్తున్నా. ఏదో తెలియని కొత్త అనుభూతి కలుగుతోంది. ప్రపంచంలోని 8 అత్యుత్తమ జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని ధావన్ పేర్కొన్నాడు.చాంపియన్స్ ట్రోఫీలో 701 పరుగులు చేసిన శిఖర్... భారత్ తరఫున ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీలో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన ధావన్... ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గానూ కొనసాగుతున్నాడు. -
కోచ్లకు ‘టీ’ అందించేవాడిని.. ఇంకా: శిఖర్ ధావన్
క్రికెటర్ కావాలనే కలను నెరవేర్చుకునే క్రమంలో తాను చేసిన పనుల గురించి శిఖర్ ధావన్(Shikhar Dhawan) తాజాగా వెల్లడించాడు. పిచ్ను రోల్ చేయడం సహా కోచ్లకు ‘టీ’లు అందించడం వరకు అన్నీ తానే చేసేవాడినని తెలిపాడు. పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేసేందుకు రోజంతా ఎండలో నిలబడేవాడినని గుర్తు చేసుకున్నాడు.కాగా ఢిల్లీకి చెందిన శిఖర్ ధావన్ ఎడమచేతి వాటం బ్యాటర్. అండర్-19 వరల్డ్కప్-2004లో సత్తా చాటడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. నాటి టోర్నీలో మూడు శతకాల సాయంతో 505 పరుగులు చేసి సత్తా చాటాడు. అయినప్పటికీ టీమిండియాలోకి రావడానికి ధావన్ చాలా రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.ఢిల్లీ తరఫున ఓపెనర్గావీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్లతో కలిసి ఢిల్లీ తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన ధావన్.. ఎట్టకేలకు 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా తరఫున మొత్తంగా 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేసిన గబ్బర్.. 68 టీ20లలో 1759 పరుగులు సాధించాడు. ఇక టెస్టు ఫార్మాట్లో 34 మ్యాచ్లు ఆడి 2315 రన్స్ చేశాడు. 2022లో చివరగా భారత్కు ప్రాతినిథ్యం వహించిన శిఖర్ ధావన్కు.. ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి.టీమిండియాలో చోటు కరువుశుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ తదితర యువ బ్యాటర్లు ఓపెనర్లుగా టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకోవడంతో ధావన్కు మొండిచెయ్యి ఎదురైంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగష్టులో అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు కూడా గుడ్బై చెప్పాడు.ఇక ప్రస్తుతం లెజెండ్స్ లీగ్, నేపాల్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీలలో పాల్గొంటున్న శిఖర్ ధావన్ తాజాగా చిన్నారులతో ముచ్చటించాడు. శిఖర్ ధావన్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ పిల్లాడు.. ‘‘మీ క్రికెట్ ప్రయాణం ఎలా మొదలైంది’’ అని అడిగాడు.కోచ్లకు ‘టీ’ అందించేవాడినిఇందుకు బదులిస్తూ.. ‘‘చిన్నతనంలో క్లబ్ క్రికెట్ ఆడేవాడిని. అక్కడ దాదాపు ఏడాది పాటు సాధన చేశాను. ఆ మరుసటి ఏడాది నాకు టోర్నమెంట్లో ఆడే అవకాశం వచ్చింది. అయితే, ఖాళీగా ఉన్న ఆ ఏడాదిలో నేను ఎన్నెన్నో చిత్రమైన పనులు చేశాను.పిచ్ను రోల్ చేయడం, కోచ్ల కోసం టీ తీసుకురావడం.. పది నిమిషాల పాటు బ్యాటింగ్ చేసేందుకు గంటల పాటు ఎండలో నిల్చోవడం.. ఇలాంటివి చాలానే చేశాను’’ అని శిఖర్ ధావన్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.కుమారుడికి దూరంగా.. కాగా శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయేషా ముఖర్జీ అనే ఆస్ట్రేలియా మహిళను అతడు 2012లో పెళ్లాడాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ధావన్తో కలిసి జోరావర్కు జన్మనిచ్చింది. అయితే, ఎంతో అన్యోన్యంగా ఉండే ఆయేషా- శిఖర్ ధావన్ రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఇక కుమారుడు జొరావర్ను ఆయేషా తనతో పాటు ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లగా.. ధావన్ తన గారాలపట్టిని మిస్సవుతున్నట్లు చాలాసార్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలిపాడు. ధావన్ తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నట్లు సమాచారం.చదవండి: ఇలాంటి కెప్టెన్ను ఎప్పుడూ చూడలేదు: రోహిత్ శర్మపై టీమిండియా స్టార్ కామెంట్స్ -
శిఖర్ ధవన్ సుడిగాలి శతకం
బిగ్ క్రికెట్ లీగ్లో టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ చెలరేగి ఆడుతున్నాడు. ఈ లీగ్లో నార్తర్న్ ఛార్జర్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ధవన్.. యూపీ బ్రిడ్జ్ స్టార్స్తో జరిగిన మ్యాచ్లో సుడిగాలి శతకంతో మెరిశాడు. ఈ మ్యాచ్లో 49 బంతుల్లోనే శతక్కొట్టిన ధవన్.. ఓవరాల్గా 63 బంతులు ఎదుర్కొని 14 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేశాడు. SHIKHAR DHAWAN CENTURY. 🙇♂️🔥pic.twitter.com/CntrgLAf4L— Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2024ధవన్కు జతగా మరో ఎండ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ సమీవుల్లా షెన్వారీ కూడా విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. షెన్వారీ 46 బంతుల్లో 11 సిక్స్లు, 7 ఫోర్ల సాయంతో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ధవన్-షెన్వారీ జోడీ తొలి వికెట్కు 207 పరుగులు జోడించింది. ధనవ్, షెన్వారీ సుడిగాలి శతకాలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తర్న్ ఛార్జర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు చేసింది.పరుగుల వరద పారిస్తున్న ధవన్బిగ్ క్రికెట్ లీగ్లో శిఖర్ ధవన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ లీగ్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన ధవన్ 170కి పైగా స్ట్రయిక్రేట్తో 301 పరుగులు చేశాడు. ఈ లీగ్లో ధవన్ లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా కూడా ధవన్లో జోరు ఏమాత్రం తగ్గలేదు. రిటైర్మెంట్ అనంతరం ధవన్ ప్రతి చోటా లీగ్లు ఆడుతున్నాడు. ఇటీవలే అతను నేపాల్ క్రికెట్ లీగ్లోనూ పాల్గొన్నాడు. ధవన్ అక్కడ కూడా మెరుపు ఇన్నింగ్స్లు ఆడి అభిమానులను అలరించాడు. -
శిఖర్ ధావన్ ఫిట్నెస్ సీక్రెట్ తెలిస్తే కంగుతినాల్సిందే..!
భారత మాజీ క్రికెటర్, ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ మైదానంలో అడుపెడితో ధనాధన్ సిక్సర్ల వర్షం కురవాల్సిందే. ధావన్ పరుగుల విధ్వంసానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అంతలా తన ఆటతో కట్టిపడేసే ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్తో పాటు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం నేపాల్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఇంతలా శక్తిమంతంగా ఆడలాంటే అంతే స్థాయిలో బాడీని, ఆరోగ్యాన్ని ఫిట్గా ఉంచుకోవాలి. అందుకోసం ధావన్ ఎలాంటి వర్కౌట్లు, డైట్ తీసుకుంటారో తెలుసా..!.శిఖర్ ధావన్ వారంలో రెండు నుంచి మూడు కఠినమైన జిమ్ సెషన్లు తప్పనిసరిగా చేస్తాడు. వాటిలో కార్డియో వర్కౌట్లు కూడా ఉంటాయట. అంతేగాదు ఓ ఇంటర్వ్యూలో ప్రాథమిక వ్యాయామానికి ముందు బాడీ చురుకుగా ఉండేలో గ్లూట్ వ్యాయమాలు, మొబిలిటీ ట్రైనింగ్, స్ట్రెచింగ్ వంటివి చేస్తానని చెప్పుకొచ్చాడు. ధావన్ యోగా ప్రేమికుడు కూడా. యోగాసనాలు రోజువారీ దినచర్యలో కచ్చితంగా ఉంటాయి. అయితే ధావన్ ఎక్కువగా రన్నింగ్ ఎక్సర్సైజుని ఎంజాయ్ చేస్తానని చెబుతున్నారు. ఇది శరీరం అంతటా రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా చేస్తుందట. ఏదైన వర్కౌట్లు చేయడానికి ముందు కనీసం 30 నిమిషాలు శరీరం వేడెక్కేలా రన్నింగ్ లేదా జాగింగ్ చేయాలని సూచిస్తున్నాడు ధావన్. చివరిగా మానసిక ఆరోగ్యం కోసం శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, సూర్యనమస్కారాలు కూడా చేస్తానని అంటున్నారు ధావన్. డైట్..గబ్బర్గా పిలిచే ధావన్ ఎక్కువగా కాల్చిన చికెన్, బంగాళదుంపలు, సాల్మన్, బ్రోకలీ తదితర కూరగాయాలను ఇష్టంగా తింటారు. వీటితోపాటు ఆలూ పరాటాలు, దోసెలు, చికెన్ కర్రీ వంటివి కూడా తింటానని చెబుతున్నారు. ఈ ఫుడ్ తనకు కఠినమైన వ్యాయామాల సమయంలో హెల్ప్ అవుతుందని చెబుతున్నాడుప్రోటీన్ రిచ్ డైట్కి ప్రాధాన్యత ఇవ్వనని చెబుతున్నారు. శక్తి కోసం పిండి పదార్థాలు తప్పనసరి అని వాదించారు కూడా. తాను ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లు కలిగిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటానని చెప్పారు.అథ్లెట్లకు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం అవసరమనే అపోహ ప్రజల్లో ఉంది. కానీ "శక్తిని పెంచడానికి కార్బోహైడ్రేట్లే ప్రధానమని నమ్ముతా అని చెప్పారు ధావన్.(చదవండి: స్నానం చేయడం పాత ట్రెండ్! ఇలా మూడ్ని బట్టి..) -
శిఖర్ ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్.. సిక్సర్ల వర్షం.. 51 బంతుల్లోనే..
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం నేపాల్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఎన్పీఎల్ ఆరంభ ఎడిషన్లో కర్నాలీ యాక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న గబ్బర్.. బుధవారం నాటి మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు.ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్ కీర్తిపూర్ వేదికగా ఖాట్మండూ గుర్ఖాస్తో జరిగిన మ్యాచ్లో శిఖర్ ధావన్.. 51 బంతుల్లోనే 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. గబ్బర్ ఇన్నింగ్స్లో ఐదు సిక్సర్లు, నాలుగు బౌండరీలు ఉండటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నాలీ యాక్స్.. ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.గబ్బర్ మెరుపుల వీడియో వైరల్అయితే, ఖాట్మండూ గుర్ఖాస్ బ్యాటర్ల విజృంభణ కారణంగా.. కర్నాలీ యాక్స్కు మూడు వికెట్ల తేడాతో ఓటమి తప్పలేదు. ఏదేమైనా ఈ మ్యాచ్లో శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచింది. గబ్బర్ పరుగుల విధ్వంసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అభిమానులను ఆకర్షిస్తోంది.ఎనిమిది జట్లుకాగా ఈ ఏడాది మొదలైన నేపాల్ ప్రీమియర్ లీగ్లో చిట్వాన్ రైనోస్, జనక్పూర్ బోల్ట్స్, సుదుర్పశ్చిమ్ రాయల్స్, ఖాట్మండూ గుర్ఖాస్, లుంబిని లయన్స్, కర్నాలీ యాక్స్, బీరట్నగర్ కింగ్స్, పొఖరా అవెంజర్స్ జట్లు పాల్గొంటున్నాయి. కర్నాలీ యాక్స్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో రెండూ ఓడిపోయింది.ఇదిలా ఉంటే.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్తో పాటు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు శిఖర్ ధావన్. అనంతరం లెజెండ్స్ లీగ్లో భాగమైన గబ్బర్.. నేపాల్ లీగ్ క్రికెట్లోనూ ఆడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్లలో కలిపి పదివేలకు పైగా పరుగులు చేసిన 38 ఏళ్ల ధావన్.. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాలో సభ్యుడు.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి DHA-ONE HAS ARRIVED! 🌪️Shikhar Dhawan scored an unbeaten 72, including 5 huge sixes, powering Karnali Yaks to a competitive total 🤩#NPLonFanCode pic.twitter.com/lPVx9uUYPz— FanCode (@FanCode) December 4, 2024 -
భార్యతో విడాకులు.. ‘మిస్టరీ గర్ల్’తో శిఖర్ ధావన్! వీడియో వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ వార్తల్లోకి వచ్చాడు. ముంబై విమానాశ్రయంలో ‘మిస్టరీ గర్ల్’తో కలిసి అతడు కెమెరాలకు చిక్కడమే ఇందుకు కారణం. కాగా భారత క్రికెట్ జట్టు ఓపెనర్గా అద్భుత రికార్డు కలిగి ఉన్న శిఖర్ ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.శుబ్మన్ గిల్ రాకతోఐసీసీ టోర్నీల్లో నిలకడగా రాణించి అభిమానులను అలరించిన ధావన్.. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో కలిసి 269 మ్యాచ్లు ఆడి 10867 పరుగులు చేశాడు. ఇందులో 24 శతకాలు.. 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, శుబ్మన్ గిల్ రాకతో గబ్బర్ కెరీర్ నెమ్మదించింది. ఒకవైపు తన ఫామ్లేమి.. మరోవైపు గిల్ అద్భుత ఆట తీరు కనబరచడంతో సెలక్టర్లు ధావన్ను పక్కనపెట్టారు.ఈ క్రమంలో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా గిల్ పాతుకుపోవడమే కాదు.. ఏకంగా టీమిండియా భవిష్య కెప్టెన్ అనేంతగా దూసుకుపోయాడు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా అవకాశాలు కరువైన శిఖర్ ధావన్ ఆగష్టులో రిటైర్మెంట్ ప్రకటించాడు.ఆయేషా ముఖర్జీతో వివాహంఇక ధావన్ వ్యక్తిగత విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని పెళ్లాడాడు. అప్పటికే ఆమెకు మొదటి భర్తతో ఇద్దరు ఆడపిల్లలు జన్మించగా.. వారిని కూడా తన కూతుళ్లుగానే ధావన్ స్వీకరించాడు. ఇక ఆయేషాతో ధావన్కు ఒక కుమారుడు కలిగాడు. అతడికి జొరావర్గా నామకరణం చేశారు.భార్యతో విడాకులు.. కుమారుడు దూరంధావన్- ఆయేషా ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు. అయితే, అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరడంతో 2023లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో జొరావర్ను తీసుకుని ఆయేషా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. అంతేకాదు.. తన కుమారుడితో మాట్లాడేందుకు కూడా ఆమె ఒప్పుకోవడం లేదని.. కొడుకును తనకు పూర్తిగా దూరం చేస్తోందని ధావన్ సోషల్ మీడియా పోస్టుల్లో పరోక్షంగా వెల్లడించాడు.ఆ అమ్మాయి ఎవరు?ఈ క్రమంలో ధావన్ తాజాగా ముంబై ఎయిర్పోర్టులో ఓ అమ్మాయితో కలిసి కనిపించడం హాట్టాపిక్గా మారింది. ఇద్దరూ కలిసి ఒకే కారులో రాగా.. ఆ అమ్మాయి మాత్రం ధావన్తో కలిసి ఒకే ఫ్రేములో కెమెరా కళ్లకు చిక్కకుండా పక్కకు వెళ్లిపోయింది. అయితే, కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసి విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో గబ్బర్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరి జంట ముచ్చటగా ఉందని.. ఆ అమ్మాయి ఎవరోగానీ ధావన్ జీవితంలోకి వస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. కాగా ధావన్ బాలీవుడ్లోనూ తన అదృష్టం పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె మోడల్ లేదంటే నటి అయి ఉంటుందని.. ఇద్దరూ కలిసి షూటింగ్కు వెళ్తున్నారేమోనంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. గబ్బర్ నోరు విప్పితే కానీ.. అసలు విషయం బయటకు రాదు మరి!చదవండి: IPL 2025: మెగా వేలం ముహూర్తం ఖరారు! ఇప్పటికి రూ. రూ. 550.5 కోట్లు.. ఇక View this post on Instagram A post shared by HT City (@htcity) -
‘రోహిత్ గొప్ప నాయకుడు.. ఆసీస్తో తొలి మ్యాచ్ ఆడకపోయినా..’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గొప్ప నాయకుడని మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రశంసలు కురిపించాడు. ఆటలో గెలుపోటములు సహజమని.. సహచర ఆటగాళ్ల పట్ల సారథి వ్యవహరించే తీరే అన్నికంటే ముఖ్యమైనదని పేర్కొన్నాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది.ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా.. కివీస్కు 0-2తో సిరీస్ సమర్పించుకుంది. దీంతో స్వదేశంలో టీమిండియా టెస్టు సిరీస్ల విజయాల(18) పరంపరకు బ్రేక్ పడింది. పన్నెండేళ్ల తర్వాత సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్ ఓడిన భారత జట్టుగా రోహిత్ సేన నిలిచింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ స్పందించాడు. ‘‘క్రికెటర్లుగా మేము కేవలం ఆడటంపైనే దృష్టి పెడతాం. గెలుపే మా లక్ష్యం. ఇక రోహిత్ గురించి చెప్పాలంటే.. అతడొక గొప్ప నాయకుడు. మ్యాచ్లు గెలిచామా? ఓడిపోయామా? అన్న ఫలితంతో సంబంధం లేకుండా.. ఒక జట్టును తీర్చిదిద్దడంలో కెప్టెన్గా తన వంతు పాత్ర చక్కగా పోషిస్తాడు.సహచర ఆటగాళ్లతో అతడి బంధం ఎలా ఉందనేదే ముఖ్యం. అవసరమైన వేళ వాళ్లకు అండగా ఉన్నాడా? లేడా అన్నది కూడా ప్రధానం’’ అని శిఖర్ ధావన్ రోహిత్ శర్మను కొనియాడాడు. ఇక కివీస్తో సిరీస్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రోహిత్ ఆసీస్తో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయం గురించి మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో టీమిండియా గొప్పగా రాణిస్తుంది. రోహిత్ తొలి మ్యాచ్ ఆడతాడా? లేదా అన్న అంశంపై స్పష్టత లేదు. ఒకవేళ అతడు జట్టుతో లేనట్లయితే కచ్చితంగా ఆటగాళ్లు అతడి కెప్టెన్సీని మిస్సవుతారు.అయితే, రోహిత్ లేకపోయినా జట్టులోని ప్రతి ఆటగాడు తమ బాధ్యతను నెరవేరుస్తూ ముందుకు సాగుతారు. ప్రస్తుత టీమ్ ఆసీస్లోనూ బాగా ఆడుతుందనే నమ్మకం ఉంది’’ అని ధీమా వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య నామమాత్రపు మూడో టెస్టు ముంబై వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు నవంబరులో ఆస్ట్రేలియా వెళ్తుంది. -
రాణించిన గబ్బర్.. అయినా డీకే జట్టు చేతిలో ఓటమి
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా సథరన్ సూపర్ స్టార్స్తో నిన్న (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్లో శిఖర్ ధవన్ సారథ్యం వహిస్తున్న గుజరాత్ గ్రేట్స్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ధవన్ హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ.. దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని సథరన్ సూపర్ స్టార్స్పై పైచేయి సాధించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. చతురంగ డిసిల్వ మెరుపు అర్ద సెంచరీతో (28 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మార్టిన్ గప్తిల్ 22, హమిల్టన్ మసకద్జ 20, దినేశ్ కార్తీక్ 18 పరుగులు చేశారు. కేదార్ జాదవ్ (1), పార్థివ్ పటేల్ (4),పవన్ నేగి (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. గుజరాత్ గ్రేట్స్ బౌలర్లలో మనన్ శర్మ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. ప్లంకెట్, ప్రసన్న తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ గ్రేట్స్.. శిఖర్ ధవన్ మినహా ఎవరూ రాణించకపోవడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధవన్ 48 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. గత మ్యాచ్లో సెంచరీ చేసిన మోర్నీ వాన్ విక్ ఈ మ్యాచ్లో 15 పరుగులకే ఔటయ్యాడు. లెండిల్ సిమన్స్ 7, మొహమ్మద్ కైఫ్ 5, అస్గర్ అఫ్ఘాన్ 3, మనన్ శర్మ 10 పరుగులు చేశారు. సథరన్ సూపర్ స్టార్స్ బౌలర్లలో పవన్ నేగి 3, అబ్దుర్ రజాక్ 2, చతురంగ డిసిల్వ, కేదార్ జాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. చదవండి: ఆస్ట్రేలియాను మట్టికరిపించిన టీమిండియా -
వాన్ విక్ మెరుపు సెంచరీ.. రైనా టీమ్పై ధవన్ జట్టు ఘన విజయం
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్లో తొలి సెంచరీ నమోదైంది. తొయమ్ హైదరాబాద్తో ఇవాళ (సెప్టెంబర్ 23) జరిగిన మ్యాచ్లో గుజరాత్ గ్రేట్స్ ఓపెనర్ మోర్నీ వాన్ విక్ మెరుపు శతకం సాధించాడు. వాన్ విక్ 69 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా సురేశ్ రైనా సారథ్యం వహిస్తున్న తొయమ్ హైదరాబాద్పై శిఖర్ ధవన్ జట్టు గుజరాత్ గ్రేట్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 27 బంతుల్లో 44 పరుగులు చేసిన సురేశ్ రైనా టాప్ స్కోరర్గా నిలిచాడు. పీటర్ ట్రెగో 36 (నాటౌట్), గుర్కీరత్ సింగ్ 26, వాల్టన్ 17, క్లార్క్ 15, వర్కర్ 13 పరుగులు చేశారు. షాన్ మార్ష్ (1), స్టువర్ట్ బిన్ని (7) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్లంకెట్, మనన్ శర్మ, ప్రసన్న తలో రెండు వికెట్లు తీయగా.. గాబ్రియెల్ ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. వాన్ విక్ మెరుపు సెంచరీతో చెలరేగడంతో 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వాన్ విక్ ఒంటిరి పోరాటం చేయగా.. శిఖర్ ధవన్ (21), లెండిల్ సిమన్స్ (20), యశ్పాల్ శర్మ (13 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఇసురు ఉడాన, గుర్కీరత్ మాన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: రసవత్తరంగా సాగుతున్న న్యూజిలాండ్, శ్రీలంక టెస్ట్ మ్యాచ్ -
టీమిండియా స్టార్ రీ ఎంట్రీ.. ఆ జట్టులో చేరిక
టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కీలక ప్రకటన చేశాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్లో తాను భాగం కానున్నట్లు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన తర్వాత కూడా ఆటగాడిగా కొనసాగే అవకాశం టీ20 లీగ్ల ద్వారా దక్కిందని.. మరోసారి మైదానంలో దిగి అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీకే వెల్లడించాడు.ఇటీవలే రిటైర్మెంట్కాగా ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన ఈ చెన్నై క్రికెటర్.. సీజన్ ముగిసిన తర్వాత క్యాష్ రిచ్ లీగ్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు డీకే ఈ ఏడాది జూన్ 1న ప్రకటన విడుదల చేశాడు. అనంతరం సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్తో జట్టు కట్టిన దినేశ్ కార్తిక్.. ఈ లీగ్లో ఆడనున్న భారత తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.ఆ జట్టులో చేరిన డీకేఇక తాజాగా లెజెండ్స్ లీగ్లోనూ పాల్గొనన్నుట్లు తెలిపాడు. ఈ టీ20 లీగ్లో సదరన్ సూపర్స్టార్స్కు ప్రాతినిథ్యం వహించనున్నట్లు మంగళవారం వెల్లడించాడు. అభిమానుల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నానని.. తనలో ఆడగల సత్తా ఉన్నంత కాలం క్రికెటర్గా కొనసాగుతానని డీకే పేర్కొన్నాడు. మైదానంలో దిగేందుకు శారీరకంగా, మానసికంగా సన్నద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు.కాగా 2004 నుంచి 2022 వరకు టీమిండియాకు ఆడిన దినేశ్ కార్తిక్.. 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లలో భాగమయ్యాడు. టెస్టుల్లో 1025, వన్డేల్లో 1752, టీ20లలో 686 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో 257 మ్యాచ్లు ఆడి 4842 రన్స్ స్కోరు చేశాడు.ఇక శనివారం రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం తాను లెజెండ్స్ లీగ్లో పాల్గొననున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గబ్బర్ సోమవారం ప్రకటించాడు.తాజాగా డీకే సైతం ఇదే బాటలో నడవడం విశేషం. ఈ లీగ్లో ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, క్రిస్ గేల్,ఆరోన్ ఫించ్ తదితర మాజీ క్రికెటర్లు ఇప్పటికే భాగమయ్యారు. కాగా సెప్టెంబరు 29న లెజెండ్స్ లీగ్ వేలం జరుగనుంది. ఇందులో 200కు పైగా ఆటగాళ్లు పాల్గొననున్నారు. చదవండి: టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టు ప్రకటన -
’మిగతా సెలక్టర్లు అతడిని వద్దన్నారు... అయినా నేను వినలేదు’
ఫామ్లో ఉన్న యువ క్రికెటర్లకు అవకాశం ఇస్తేనే వారి సత్తా బయటపడుతుందని టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ అన్నాడు. ప్రతిభను గుర్తించడం ఎంత ముఖ్యమో.. సరైన సమయంలో జట్టుకు ఎంపిక చేయడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నాడు. అప్పుడే సెలక్టర్లు తమ పాత్రకు న్యాయం చేసిన వాళ్లవుతారని అభిప్రాయపడ్డాడు.సెహ్వాగ్ను కాదని ధావన్ను ఆడించాశిఖర్ ధావన్ అరంగేట్రం విషయంలో తన అంచనా తప్పలేదని.. తన నిర్ణయం సరైందేనని గబ్బర్ నిరూపించాడని సందీప్ పాటిల్ ఈ సందర్భంగా వెల్లడించాడు. సహచర నలుగురు సెలక్టర్లు వ్యతిరేకించినా.. నాడు వీరేంద్ర సెహ్వాగ్ను కాదని ధావన్ను తుదిజట్టుకు ఎంపిక చేసిన విషయాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు. కాగా 2013లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ సందర్భంగా డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ వరుసగా తొలి రెండు మ్యాచ్లలో విఫలమయ్యాడు.అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డుఈ క్రమంలో మూడో టెస్టులో వీరూ భాయ్పై వేటు వేసిన సెలక్టర్లు ధావన్కు టెస్టు అరంగేట్రం అవకాశం కల్పించారు. అయితే, వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కేవలం 85 బంతుల్లోనే శతకం బాదాడు. తద్వారా టెస్టు అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆసీస్తో మూడో టెస్టులో మొత్తంగా 174 బంతులు ఎదుర్కొన్న గబ్బర్.. 187 పరుగులతో అదరగొట్టాడు. ఆ తర్వాత టీమిండియాలో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు ఈ మొహాలీ హ్యారికేన్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘యువ క్రికెటర్లు ఫామ్లో ఉన్నపుడే వారికి అవకాశాలు ఇవ్వాలి.నన్ను కాపాడాడుసరైన సమయంలో పిలుపునిస్తేనే వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆ సమయంలో శిఖర్ సౌతాఫ్రికా టూర్లో ఇండియా-ఏ తరఫున డబుల్ సెంచరీ, సెంచరీ బాదాడు. అప్పుడు అతడిని జాతీయ జట్టుకు ఆడించాలని నేను భావించాను. సెహ్వాగ్ను కాదని.. ధావన్ను ఆడించాలనే నా నిర్ణయాన్ని నా సహచర సెలక్టర్లు వ్యతిరేకించారు.అయితే, ఆ తర్వాత వారిని ఒప్పించగలిగాను. అలా శిఖర్ జట్టులోకి వచ్చి తొలి టెస్టులోనే రికార్డు సెంచరీ బాదాడు. నా నిర్ణయం సరైందని నిరూపించాడు. అయినా.. నేనేమీ క్రెడిట్ తీసుకోవాలనుకోలేదు. నిజానికి శిఖర్ శతకం చేసి ఒకరకంగా నన్ను రక్షించాడనుకోండి(నవ్వుతూ)’’ అంటూ గత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాడు. కాగా సందీప్ పాటిల్ టీమిండియా తరఫున 29 టెస్టులు, 45 వన్డేలు ఆడాడు. 2012- 2016 మధ్య బీసీసీఐ చీఫ్ సెలక్టర్గా పనిచేశాడు. చదవండి: Duleep Trophy: కళ్లన్నీ ఈ ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లపైనే! -
అభిమానులకు శుభవార్త!.. శిఖర్ ధావన్ రీఎంట్రీ
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన క్రికెటింగ్ కెరీర్లో నూతన అధ్యాయాన్ని మొదలుపెట్టనున్నట్లు తెలిపాడు. తాను ఇంకా ఫిట్గానే ఉన్నానని.. ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ)లో భాగం కానున్నట్లు ధావన్ వెల్లడించాడు.వినోదం పంచేందుకు సిద్ధంరిటైర్మెంట్ తర్వాత కూడా తాను ఆటగాడిగా ముందుకు సాగేందుకు దొరికిన గొప్ప అవకాశం ఇది అని పేర్కొన్నాడు. క్రికెట్ తన జీవితంలో భాగమని.. త్వరలోనే తన స్నేహితులతో కలిసి మళ్లీ బ్యాట్ పట్టి మైదానంలో దిగనున్నట్లు తెలిపాడు. తన అభిమానులకు వినోదం పంచేందుకు సిద్ధంగా ఉన్నానని.. వారితో కలిసి కొత్త జ్ఞాపకాలు పోగు చేసుకునేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు గబ్బర్ తెలిపాడు.రిటైర్మెంట్ అనంతరంఇందుకు సంబంధించి శిఖర్ ధావన్ పేరిట ఎల్ఎల్సీ సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా తాను అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ధావన్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. పద్నాలుగేళ్లకు పైగా టీమిండియా క్రికెటర్గా కొనసాగిన ఈ మాజీ ఓపెనర్కు గత రెండేళ్లుగా అవకాశాలు కరువయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ జోడీగా శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ జట్టులో పాతుకుపోగా.. గబ్బర్కు నిరాశే ఎదురైంది.ఈ నేపథ్యంలో 38 ఏళ్ల ధావన్ అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, క్రికెటర్గా మాత్రం తాను కొనసాగుతానని.. అందుకు లెజెండ్స్ లీగ్ రూపంలో కొత్త అవకాశం వచ్చిందని తాజాగా వెల్లడించాడు. కాగా 2010లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 2022లో తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. మొత్తంగా టీమిండియా తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 2315, 6793, 1759 పరుగులు సాధించాడు ధావన్.లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆరు జట్లుటీ20 ఫార్మాట్లో నిర్వహిస్తోన్న లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భిల్వారా కింగ్స్, గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, సదరన్ సూపర్స్టార్స్, అర్బనైజర్స్ హైదరాబాద్ పేరిట ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత మాజీ స్టార్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, మహ్మద్ కైఫ్, పార్థివ్ పటేల్, శ్రీశాంత్ సహా విదేశీ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, ఉపుల్ తరంగ, డ్వేన్ స్మిత్, మార్టిన్ గప్టిల్ తదితరులు భాగమవుతున్నారు. తాజాగా శిఖర్ ధావన్ కూడా ఈ జాబితాలో చేరాడు. అయితే, అతడు ఏ జట్టుకు ఆడనున్నది తెలియాల్సి ఉంది. సెప్టెంబరులో ఈ లీగ్ ఆరంభం కానుంది. -
థాంక్యూ శిఖర్.. లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించావు: కోహ్లి
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇంటర్ననేషనల్ క్రికెట్తో పాటు దేశీవాళీ క్రికెట్ నుంచి ధావన్ తప్పుకున్నాడు. ఈ క్రమంలో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, గౌతం గంభీర్ వంటి దిగ్గజ క్రికెటర్లు విషెస్ తెలపగా.. తాజాగా ఈ జాబితాలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి చేరాడు. ధావన్ను ఉద్దేశించి కోహ్లి ఓ భావోద్వేగ పోస్టును షేర్ చేశాడు. గబ్బర్తో ఉన్న అనుబంధాన్ని అభిమానులతో కింగ్ కోహ్లి పంచుకున్నాడు. "శిఖర్.. నీ ఘనమైన అరంగేట్రం నుంచి టీమిండియా అద్భుతమైన ఓపెనర్లలో ఒకడిగా మారేవరకు మాకు ఎన్నో లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించావు. ఆట పట్ల మీ అభిరుచి, క్రీడాస్ఫూర్తి, నీ చిరునవ్వును మేము కచ్చితంగా మిస్ అవుతాము. కానీ మీ లెగసీ మాత్రం కొనసాగుతుంది. ఎన్నో జ్ఞాపకాలు, మరపురాని ప్రదర్శనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆఫ్ది ఫీల్డ్ మొదలు పెట్టబోయే నీ రెండో ఇన్నింగ్స్కు ఆల్ దిబెస్ట్ అని" ఎక్స్లో కోహ్లి రాసుకొచ్చాడు. కాగా కోహ్లి, ధావన్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ఢిల్లీ తరపున జూనియర్ క్రికెట్ కూడా ఆడారు. కాగా టీమిండియాకు 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20ల్లో ధావన్ ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో 6,793, టెస్టుల్లో 2,315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1,759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు శిఖర్ ధావన్ ఖాతాలో ఉన్నాయి. Shikhar @SDhawan25 from your fearless debut to becoming one of India's most dependable openers, you've given us countless memories to cherish. Your passion for the game, your sportsmanship and your trademark smile will be missed, but your legacy lives on. Thank you for the…— Virat Kohli (@imVkohli) August 25, 2024 -
తొడగొట్టి చెబుతున్నా...
ఓపెనర్గా శిఖర్ ధావన్ భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు అతని ఖాతాలో చేరాయి. ధావన్ కెరీర్లో కొన్ని ఆసక్తికర గణాంకాలను చూస్తే...‘నా క్రికెట్ ప్రయాణాన్ని ముగిస్తున్నాను. లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలు, అభిమానం మూటగట్టుకున్నాను. జీవితంలో ముందుకు వెళ్లాలంటే పేజీలకు తిప్పక తప్పదు. అందుకే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ నుంచి నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఎన్నో ఏళ్లు భారత్ తరఫున ఆడగలిగినందుకు నా హృదయంలో ప్రశాంతత ఉంది. వెనక్కి తిరిగి చూస్తే అన్నీ గుర్తుంచుకునే క్షణాలే. ఆటను దాటి బయటకు చూస్తే అంతా కొత్త ప్రపంచమే. నా జీవితంలో భారత్కు ఆడాలనే ఒకే ఒక లక్ష్యం ఉండేది. అది సాధించగలిగాను. భారత్కు ఇకపై ఆడబోవడం లేదని బాధపడవద్దు. ఇన్నేళ్లు ఆడగలిగానని సంతోంచు అనేది నా మాట. దాని పట్ల గర్వంగా ఉన్నా. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. జై హింద్’ –శిఖర్ ధావన్ 187 తన తొలి టెస్టులో ధావన్ చేసిన పరుగులు. అరంగేట్ర టెస్టులో భారత్ తరఫున ఇదే అత్యధిక స్కోరు కాగా...85 బంతుల్లో సాధించిన శతకం భారత ఆటగాళ్లందరిలో వేగవంతమైంది. 65.15 ఐసీసీ టోరీ్నల్లో (వన్డే వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ కలిపి) ధావన్ సగటు అందరికంటే అత్యధికం. 20 ఇన్నింగ్స్లలో అతను 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలతో 1238 పరుగులు చేశాడు.18 రోహిత్తో కలిసి నెలకొల్పిన సెంచరీ భాగస్వామ్యాల సంఖ్య. సచిన్–గంగూలీ (21) తర్వాత ఇది రెండో స్థానం.109 తన 100వ వన్డేలో సెంచరీ సాధించిన ధావన్, ఈ ఫీట్ నమోదు చేసిన పది మంది ఆటగాళ్ళలో ఒకడు.12 విదేశాల్లో ధావన్ సెంచరీల సంఖ్య. భారత్లో 5 శతకాలు మాత్రమే అతను సాధించాడు. 6769 ఐపీఎల్లో ధావన్ పరుగులు. ఓవరాల్గా కోహ్లి (8004) తర్వాత రెండో స్థానం. 5 ఐపీఎల్లో ఐదు సీజన్లలో ధావన్ 500కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. వన్డేల్లో కనీసం 40కు పైగా సగటు, 90కి పైగా స్ట్రయిక్ రేట్తో 5 వేలకు పైగా పరుగులను సాధించిన ఎనిమిది మంది బ్యాటర్లలో ధావన్ ఒకడు -
ఓవైపు గాయం.. అయినా 'గబ్బర్' వీరోచిత సెంచరీ(వీడియో)
టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశీవాళీ క్రికెట్కు కూడా గబ్బర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010లో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ధావన్.. చివరగా డిసెంబర్ 2022లో భారత జెర్సీలో కన్పించాడు. యువ క్రికెటర్ల రాకతో పాటు ఫామ్ లేమి కారణంగా గబ్బర్ భారత జట్టులో చోటు కోల్పోయాడు. అయితే గత రెండేళ్లగా టీమిండియాలో ధావన్ ఆడకపోయినప్పటకి.. ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. భారత జట్టుకు ఎన్నో చారిత్రత్మక విజయాలను సైతం శిఖర్ అందించాడు.వన్డే ప్రపంచకప్-2019లో ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్ ధావన్ కెరీర్లో చిరస్మరణీయంగా మిగిలిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓ వైపు గాయంతో బాధపడుతూనే ధావన్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. అది కూడా తన పుట్టిన రోజున కావడం విశేషం.పోరాట యోదుడు..2019 వన్డే ప్రపంచకప్లో భాగంగా లీగ్ మ్యాచ్లో డిసెంబర్ 5న ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. అయితే ఈ మ్యాచ్ ఆరంభంలోనే ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ వేసిన ఓ బంతి శిఖర్ ధావన్ బొటన వేలికి బలంగా తాకింది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు.ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటకి నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో అతడి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరుగుతాడని అంతా భావించారు. కానీ ధావన్ మాత్రం తన ఆటను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. ఓ వైపు గాయంతో బాధపడుతూనే ఆసీస్ బౌలర్లపై గబ్బర్ ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో నొప్పిని భరిస్తూనే అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యంత వేగంగా సెంచరీ సాధించిన తొలి ఆసియా ప్లేయర్గా చరిత్రకెక్కాడు. ఓవరాల్గా ఆ మ్యాచ్లో 109 బంతులు ఎదుర్కొన్న ధావన్.. 16 పరుగులతో 117 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం ధావన్ను స్కానింగ్కు తరలించగా.. బొటన వేలు విరిగినట్లు తేలింది. దీంతో టోర్నీ మధ్యలోనే గబ్బర్ వైదొలగాడు. అతడి స్ధానాన్ని రిషబ్ పంత్తో బీసీసీఐ భర్తీ చేసింది. అయితే 2019 వరల్డ్కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. కాగా ధావన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ అతడి ఐకానిక్ ఇన్నింగ్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 🔸 117 runs from 109 balls🔸 16 foursCelebrating @SDhawan25 on his birthday 🎉Relive his match-winning 💯 against Australia from the 2019 ICC Men's Cricket World Cup 📽️ pic.twitter.com/bJ8phF2RpJ— ICC Cricket World Cup (@cricketworldcup) December 5, 2020 -
అంతర్జాతీయ క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై
-
అంతర్జాతీయ క్రికెట్కు 'గబ్బర్' గుడ్ బై (ఫోటోలు)
-
అరంగేట్రంతోనే వరల్డ్ రికార్డు!
భారత క్రికెట్లో మరో శకం ముగిసింది. టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికాడు. అదే విధంగా దేశవాళీ క్రికెట్ నుంచి కూడా ధావన్ తప్పుకున్నాడు. అతడి నిర్ణయం క్రికెట్ అభిమానులకు షాక్కు గురిచేసింది. 14 ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ధావన్.. ఎన్నో అద్భుత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్లో ఎన్నో ఘనతలను కూడా అందుకున్నాడు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్గా భారత్కు ఎన్నో అద్భుత ఆరంభాలను ఇచ్చిన ధావన్ క్రికెట్ జర్నీపై ఓ లుక్కేద్దాం.తొలి మ్యాచ్లోనే డకౌట్.. అయినా2010లో వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో ధావన్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే తన తొలి మ్యాచ్లో సిల్వర్ డకౌటై అందరని నిరాశపరిచాడు. కానీ ఆ తర్వాత తన నిలకడ ప్రదర్శనతో ధావన్ జట్టులో తన స్ధానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే వన్డేల్లో తొలి సెంచరీ మార్క్ను అందుకోవడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాపై తన మొదటి వన్డే సెంచరీ మార్క్ను ధావన్ అందుకున్నాడు. ఆ తర్వాత ధావన్ వరుసగా శతకాలు మ్రోత మోగించాడు.టెస్టు అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు..అప్పటికే వన్డేల్లో తన మార్క్ను చూపించిన ధావన్.. మార్చి 14, 2013న మొహాలీలో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు. అయితే తన అరంగేట్రంలోనే గబ్బర్ సత్తాచాటాడు. ఆసీస్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 85 బంతుల్లోనే తన తొలి సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా టెస్టుల్లో తొలి మ్యాచ్లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.ఇక ఈ మ్యాచ్లో ఓవరాల్గా 33 ఫోర్లు, 2 సిక్స్లతో 187 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తన డెబ్యూలో భీబత్సం సృష్టించిన ధావన్ 'మొహాలీ హరికేన్గా పేరు గాంచాడు. ధావన్ డెబ్యూ ఇన్నింగ్స్ను అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుపులు..2013లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడడంలో ధావన్ది కీలక పాత్ర. ఆ టోర్నీ అసాంతం గబ్బర్ మెరుపులు మెరిపించాడు. 5 మ్యాచుల్లోనే గబ్బర్ ఏకంగా 90.75 సగటుతో 363 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు. ఈ టోర్నీలో వరుసగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్పై సెంచరీలతో చెలరేగాడు.చివరి మ్యాచ్ అదే.. భారత స్టార్ ఓపెనర్గా ఒక వెలుగు వెలిగిన ధావన్ నెమ్మదిగా తన ఫామ్ను కోల్పోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. అంతేకాకుండా యువ క్రికెటర్ల రాకతో ధావన్ను సెలక్టర్లు పూర్తిగా పక్కన పెట్టేశారు. ధావన్ చివరగా భారత్ తరుపన 2022లో బంగ్లాదేశ్పై వన్డేల్లో ఆడాడు.ఓవరాల్గా టీమిండియాకు 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20ల్లో గబ్బర్ ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో 6,793, టెస్టుల్లో 2,315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1,759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు శిఖర్ ధావన్ ఖాతాలో ఉన్నాయి.మిస్యూ గబ్బర్..ఇక ధావన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. మిస్యూ గబ్బర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ధావన్ ఇకపై కేవలం ఐపీఎల్లో మాత్రం ఆ -
IPL 2025: ఈ ముగ్గురు కెప్టెన్లను రిలీజ్ చేయనున్న ఫ్రాంఛైజీలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం-2025 నేపథ్యంలో ఆటగాళ్ల రిటెన్షన్ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. పది జట్ల ఫ్రాంఛైజీలు- భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారుల మధ్య జూలై 31 నాటి సమావేశంలో ఈ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఫ్రాంఛైజీ యజమానుల్లో అధికులు ఆరుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరగా.. బీసీసీఐ ఇందుకు సానుకూలంగా స్పందించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు ఫ్రాంఛైజీలు మాత్రం తమ కెప్టెన్లను విడిచిపెట్టి.. వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోవాలనే యోచనలో ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది.ఆర్సీబీఐపీఎల్-2025 నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తమ సారథిని మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. వేలానికి ముందు ఫాఫ్ డుప్లెసిస్ను విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 36 ఏళ్ల డుప్లెసిస్ ఐపీఎల్-2024లో 438 పరుగులు చేయడంతో పాటు.. జట్టును ప్లే ఆఫ్స్ వరకు చేర్చగలిగాడు.అయితే, డుప్లెసిస్ వయసు రీత్యా కెప్టెన్గా అతడిని కొనసాగించేందుకు విముఖంగా ఉన్నట్లు సమాచారం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని.. యువ టీమిండియా ఆటగాడిని సారథిగా నియమించుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.పంజాబ్ కింగ్స్ఐపీఎల్ టాప్ రన్ స్కోర్లలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఒకడు. అయితే, పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉన్న అతడు గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2024లో ఆరంభ మ్యాచ్ల తర్వాత గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు.ధావన్ స్థానంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ పంజాబ్ కింగ్స్ను ముందుకు నడిపించాడు. అయితే, ప్లే ఆఫ్స్మాత్రం చేర్చలేకపోయాడు. ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కూడా ఉందన్న విషయం తెలిసిందే.ఇందుకు ప్రధాన కారణం సరైన నాయకుడు లేకపోవడమే. ఇక ధావన్ ఇప్పటికే జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అంతేకాదు దేశవాళీ క్రికెట్లోనూ ఆడటం లేదు. అలాంటి ఆటగాడిని సారథిగా కొనసాగించడంలో అర్థం లేదని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 38 ఏళ్ల ధావన్ను కెప్టెన్గా తప్పించి.. అతడి స్థానంలో యువ నాయకుడిని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.లక్నో సూపర్ జెయింట్స్ఐపీఎల్లో 2022లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్కు మూడేళ్లుగా టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. 2022, 2023 సీజన్లలో లక్నోను టాప్-4లో నిలబెట్టిన రాహుల్.. 2024లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆటగాడినూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. పద్నాలుగు మ్యాచ్లలో కలిపి 520 పరుగులు చేసినప్పటికీ.. స్ట్రైక్రేటు(136.12) పరంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ సందర్భంగా ఓనర్ సంజీవ్ గోయెంకా రాహుల్పై బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అంతా బాగానే ఉందని సంజీవ్ గోయెంకా సంకేతాలు ఇచ్చినా.. రాహుల్ మాత్రం బాగా హర్టయినట్లు సమాచారం. జట్టును వీడాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఫ్రాంఛైజీ సైతం రాహుల్ను రిలీజ్ చేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: IPL 2025: గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం.. ఆశిష్ నెహ్రాపై వేటు! -
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఐపీఎల్-2024లోనూ పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది పంజాబ్ కింగ్స్. ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఈ జట్టు.. ఈసారి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచింది.కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం బారిన పడటం.. కొన్ని మ్యాచ్లలో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడం ప్రభావం చూపింది. ధావన్ స్థానంలో తాత్కాలికంగా కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన సామ్ కరన్ ఫర్వాలేదనిపించినా.. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్లలో పంజాబ్ కేవలం నాలుగే గెలిచింది.ఇంకో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో గెలిస్తే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ కోచ్ టామ్ మూడీ విమర్శనాస్త్రాలు సంధించాడు.‘‘మైదానం లోపలా.. వెలుపలా నాయకత్వ మార్పులే వాళ్ల పేలవ ప్రదర్శనకు కారణం. అదే నిలకడలేమి కూడా ఓ కారణం. మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే మైదానంలోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయి’’ అని టామ్ మూడీ పంజాబ్ కింగ్స్ను విమర్శించాడు.కాగా 58 ఏళ్ల టామ్ మూడీ 2008లో పంజాబ్ కోచ్గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో ఆ ఏడాది జట్టు సెమీస్ వరకు చేరింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన కనబరచడంలో విఫలమవుతోంది. ఇక పంజాబ్ను వీడిన తర్వాత 2013- 2019 వరకు సన్రైజర్స్ హైదరాబాద్కు కోచ్గా ఉన్నాడు. 2016లో జట్టుకు టైటిల్ అందించాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరింది. చదవండి: IPL: ధోనికి ఇదే చివరి సీజన్?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా -
కొడుకు దూరం.. టీమిండియాలో చోటు కరువు.. ఐపీఎల్లోనూ అలా!
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. భార్య ఆయేషా ముఖర్జీ నుంచి విడాకులు తీసుకున్న ధావన్ కొడుకు జొరావర్కు కూడా దూరమయ్యాడు.జొరావర్ ప్రస్తుతం తన తల్లి దగ్గరే ఆస్ట్రేలియాలో ఉంటున్న కారణంగా ధావన్ కనీసం అతడిని నేరుగా కలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కుమారుడిని తలచుకుంటూ ధావన్ భావోద్వేగ పోస్టులు పెడుతూ ఉన్నాడు. మరోవైపు.. టీమిండియాలోనూ ధావన్కు చోటు కరువైంది.యువ ఓపెనర్లు శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్లతో పోటీలో వెనుకబడ్డ ధావన్.. 2022లో ఆఖరిసారిగా బంగ్లాదేశ్తో సిరీస్ సందర్భంగా టీమిండియా తరఫున వన్డే ఆడాడు.ఆ తర్వాత మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు శిఖర్ ధావన్. ఆ తర్వాత ఆసియా క్రీడలు- 2023 జట్టులో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు ధావన్ సారథ్యం వహిస్తాడని విశ్లేషకులు భావించగా.. బీసీసీఐ మాత్రం మరోసారి ఈ ఢిల్లీ బ్యాటర్కు మొండిచేయి చూపింది.ఈ మెగా టోర్నీలో తొలిసారి పాల్గొనే టీమిండియాకు రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. అతడి నేతృత్వంలో భారత్ స్వర్ణం సాధించింది. ఇదిలా ఉంటే.. అసలే కొడుకుకు దూరమై.. టీమిండియాలో చోటు కరువైన శిఖర్ ధావన్కు ఐపీఎల్-2024లోనూ కష్టాలే ఎదురయ్యాయి.పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా బరిలోకి దిగిన శిఖర్ ధావన్ తొలి ఐదు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండగలిగాడు. భుజం నొప్పి కారణంగా మిగతా మ్యాచ్లకు గబ్బర్ దూరమయ్యాడు. అతడి స్థానంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ పంజాబ్ను ముందుకు నడిపించాడు.అయితే, ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్లో 60 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో శిఖర్ ధావన్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.ఇదిలా ఉంటే.. గబ్బర్ శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. తన పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘జీవితంలోని చిన్న సంతోషాలు ఇలా వీటితో కలిసి ఆస్వాదిస్తున్నాను’’ అంటూ ధావన్ క్యాప్షన్ ఇచ్చాడు.ఇది చూసిన గబ్బర్ అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘పైకి నవ్వుతున్నా.. నీ మనసు లోతుల్లో ఎంత బాధ ఉందో అర్థం చేసుకోగలం’’ అంటూ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్లో ధావన్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల గురించి కామెంట్లు చేస్తున్నారు. -
IPL 2024: కేకేఆర్ను ఢీకొట్టనున్న పంజాబ్.. స్టార్క్ ఔట్, ధవన్ ఇన్..?
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 26) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్.. టేబుల్ సెకెండ్ టాపర్ అయిన కేకేఆర్ను వారి సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్లో ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ పంజాబ్కు చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్ లెక్కల్లో ఉంటుంది.లేకపోతే మరో సీజన్లో టైటిల్ లేకుండా రిక్త హస్తాలతో వైదొలగాల్సి ఉంటుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు కేకేఆర్ ఏడింట ఐదు మ్యాచ్లు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో కేకేఆర్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ మూడో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది.హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. పంజాబ్పై కేకేఆర్ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి.బలాబలాల విషయానికొస్తే.. పంజాబ్తో పోలిస్తే కేకేఆర్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పెట్టి సొంతం చేసుకున్న మిచెల్ స్టార్క్ మినహా కేకేఆర్కు పెద్ద సమస్యలేమీ లేవు. స్టార్క్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లో తేలిపోయాడు. వికెట్లు తీయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. నరైన్, రసెల్తో పాటు కుర్ర బౌలర్లు రాణిస్తుండటంతో స్టార్క్ వైఫల్యాలు హైలైట్ కావడం లేదు.పంజాబ్తో నేటి మ్యాచ్లో స్టార్క్ పక్కకు కూర్చోవాల్సి రావచ్చు. అతను ఆర్సీబీ గత మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు (వేలికి). స్టార్క్ గత రెండు రోజులుగా ప్రాక్టీస్ సెషన్స్లోనూ కనబడలేదు. దీన్ని బట్టి చూస్తే.. పంజాబ్తో మ్యాచ్లో అతను ఆడకపోవచ్చని తెలుస్తుంది.పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు మిడిలార్డర్ బ్యాటర్లు శశాంక్ సింగ్, అశుతోష్ శర్మపై అందరి చూపు ఉంది. ఈ సీజన్లో ఈ ఇద్దరు అద్భుతమైన పోరాటాలతో పంజాబ్ ఆడిన ప్రతి మ్యాచ్ను రక్తి కట్టించారు. వీరిద్దరి నుంచి అభిమానులు మరోసారి సంచలన ఇన్నింగ్స్లు ఆశిస్తున్నారు. వీరిద్దరు మినహా ఈ సీజన్లో పంజాబ్కు చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. ఈ మ్యాచ్లో పంజాబ్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధవన్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరంగా శిఖర్ తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్స్లో యాక్టివ్గా కనిపించాడు. దీన్ని బట్టి అతని రీఎంట్రీ ఖాయమని తేలిపోయింది. నేటి మ్యాచ్లో స్టార్క్ ఆడకపోతే అతడి స్థానంలో దుష్మంత చమీర ఆడే అవకాశం ఉంది. తుది జట్లు (అంచనా)..కేకేఆర్: ఫిల్ సాల్ట్ (వికెట్కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్/దుష్మంత చమీర, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ. [ఇంపాక్ట్ ప్లేయర్: వెంకటేష్ అయ్యర్]పంజాబ్: శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, ప్రభ్సిమ్రన్ సింగ్, సామ్ కర్రన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), లియామ్ లివింగ్స్టోన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, హర్షల్ పటేల్. [ఇంపాక్ట్ ప్లేయర్: అర్ష్దీప్ సింగ్] -
IPL 2024: పంజాబ్ కింగ్స్కు భారీ ఎదురుదెబ్బ
వరుసగా రెండు మ్యాచ్ల్లో చివరి ఓవర్లో ఓటములు ఎదుర్కొన్న పంజాబ్ కింగ్స్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్కు దూరం కానున్నాడు. ధవన్ పంజాబ్ తదుపరి ఆడబోయే ఒకట్రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండడని ఆ జట్టు క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ సంజయ్ బాంగర్ తెలిపాడు. రాజస్తాన్ రాయల్స్తో నిన్నటి (ఏప్రిల్ 13) మ్యాచ్కు ముందు చివరి నిమిషంలో ధవన్ డ్రాప్ అయ్యాడు. ధవన్ ఏప్రిల్ 26న కేకేఆర్తో మ్యాచ్ సమయానికి అందుబాటులోకి వస్తాడని తెలుస్తుంది. ఈ మధ్యలో పంజాబ్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీలతో కీలక మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్లకు ధవన్ దూరం కావడం పంజాబ్కు భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ధవన్ గైర్హాజరీలో పంజాబ్ను సామ్ కర్రన్ ముందుండి నడిపించనున్నాడు. రాయల్స్తో మ్యాచ్, గత ఐపీఎల్ సీజన్లోనూ కర్రన్ పంజాబ్ కెప్టెన్గా వ్యవహరించాడు. కాగా, రాయల్స్తో నిన్నటి మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో చివరి ఓవర్ ఐదో బంతికి సిక్సర్ కొట్టి హెట్మైర్ (10 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) రాయల్స్ను గెలిపించాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో హెట్మైర్ మరో సిక్సర్ కూడా బాదాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఆఖర్లో అశుతోష్ శర్మ (16 బంతుల్లో 31; ఫోర్, 3 సిక్సర్లు) బ్యాట్ను ఝులిపించడంతో పంజాబ్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. రాయల్స్ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో రాయల్స్ కూడా తడబడింది. అయితే హెట్మైర్ మెరుపులు మెరిపించి రాయల్స్ను గెలిపించాడు. రాయల్స్ ఇన్నింగ్స్లో కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు లేవు. 39 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ (4-0-18-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. -
ఆ ఇద్దరితో రూమ్ అస్సలు షేర్ చేసుకోను: రోహిత్ శర్మ
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కపిల్.. హిట్మ్యాన్, శ్రేయస్లను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. వీటికి రోహిత్, శ్రేయస్ తమదైన శైలిలో బదులిచ్చారు. ఈ సందర్భంగా రోహిత్, శ్రేయస్ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఆ ఇద్దరు పరమ గలీజ్గాళ్లు.. షో సందర్భంగా కపిల్ హిట్మ్యాన్తో సంభాషిస్తూ ఓ ఆసక్తికర ప్రశ్నను అడిగాడు. రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఎవరితో కలసి షేర్ చేసుకుంటారని రోహిత్ను అడిగాడు. ఇందుకు రోహిత్ బదులిస్తూ.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గది కేటాయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తే శిఖర్ ధవన్, రిషబ్ పంత్లతో మాత్రం అస్సలు ఉండనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఆ ఇద్దరు గదిని చాలా మురికిగా ఉంచుతారు. ప్రాక్టీస్ నుంచి వచ్చాక బట్టలను మంచంపైనే పడేస్తారు. వారి గది తలపుపై ఎప్పుడూ డు నాట్ డిస్టర్బ్ (DOD) అనే బోర్డు దర్శనమిస్తుంది. ఈ ఇద్దరు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పడుకుంటారు. ఉదయమే రూమ్ క్లీనింగ్కు వచ్చే వాళ్లు DOD బోర్డును చూసి వెనక్కు వెళ్లిపోతారు. మూడు నాలుగు రోజుల వరకు వాళ్ల రూమ్ చండాలంగా ఉంటుంది. ఈ కారణంగా వీళ్లతో రూమ్ షేర్ చేసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. నేను కూడా వారితో ఉండాలని అస్సలు అనుకోనంటూ హిట్మ్యాన్ బదులిచ్చాడు. ఇదే సందర్భంగా రోహిత్ మరిన్ని విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. వన్డే వరల్డ్కప్ ఫైనల్లో ఓటమి అనంతరం అభిమానుల కోపానికి గురవుతానని భయపడ్డానని తెలిపాడు. కానీ ప్రజలు తమను బాగా ఆడామని ప్రశంసించడంతో ఊపిరి పీల్చుకున్నామని అన్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ (మధ్యాహ్నం 3:30).. లక్నో-గుజరాత్ (రాత్రి 7:30) తలపడుతున్నాయి. -
IPL 2024 GT vs PBKS : గుజరాత్పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం..
IPL 2024 GT vs PBKS Live Updates: గుజరాత్పై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం.. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. పంజాబ్ విజయంలో శశాంక్ సింగ్(61) కీలక పాత్ర పోషించాడు. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 73 పరుగులకే 4 వికెట్లు పంజాబ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటి అతడు మాత్రం తన హిట్టింగ్ను కొనసాగించి పంజాబ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కేవలం 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శశాంక్ 6 ఫోర్లు, 4 సిక్స్లతో 61 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ఆశుతోష్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్తో 31 పరుగులు చేసి పంజాబ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఫలితంగా 200 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి పంజాబ్ ఛేదించింది. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, ఒమర్జాయ్, మొహిత్ శర్మ, నల్కండే తలా వికెట్ సాధించారు. 19 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 193/6 19 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 193/6. క్రీజులో శశాంక్ సింగ్(57), అశుతోష్ శర్మ(31) పరుగులతో ఉన్నారు. పంజాబ్ విజయానికి ఆఖరి ఓవర్లో 7 పరుగులు కావాలి. ఆరో వికెట్ డౌన్.. జితేష్ శర్మ ఔట్ 150 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన జితేష్ శర్మ.. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 15. 3 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 150/6. క్రీజులో శశాంక్ సింగ్(33) పరుగులతో ఉన్నారు. ఐదో వికెట్ డౌన్.. 111 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన సికిందర్ రజా.. మొహిత్ శర్మ బౌలింగ్లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు పంజాబ్ స్కోర్ : 119/5. క్రీజులో శశాంక్ సింగ్(33), జితేష్ శర్మ(1) ఉన్నారు. నాలుగో వికెట్ డౌన్.. సామ్ కుర్రాన్ ఔట్ 71 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. ఒమర్జాయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. మూడో వికెట్ డౌన్.. ప్రభు సిమ్రాన్ ఔట్ ప్రభు సిమ్రాన్ సింగ్ రూపంలో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 35 పరులు చేసిన ప్రభు సిమ్రాన్.. నూర్ ఆహ్మద్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 7.2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 65/3. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్.. బెయిర్ స్టో ఔట్ పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. నూర ఆహ్మద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. సామ్ కుర్రాన్ క్రీజులోకి వచ్చాడు. 6 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 54/2. క్రీజులో ప్రభ్ సిమ్రాన్ సింగ్(29), సామ్ కుర్రాన్(1) పరుగులతో ఉన్నారు. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ 200 పరుగులు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 89 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు రాహుల్ తెవాటియా ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. కేవలం 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 23 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు పడగొట్టగా.. హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. నాలుగో వికెట్ డౌన్.. 164 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన విజయ్ శంకర్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్: 166/4 శుబ్మన్ గిల్ ఫిప్టీ.. శుబ్మన్ గిల్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 31 బంతుల్లో గిల్ 5 ఫోర్లు, 2 సిక్స్లతో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 15 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 134/3 మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్.. సాయి సుదర్శన్ ఔట్ 123 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 33 పరుగులు చేసిన సాయి సుదర్శన్.. హర్షల్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో శుబ్మన్ గిల్(46) ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. కేన్ మామ ఔట్ 69 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్.. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్ల్లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ స్కోర్ : 52/1 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్(16), శుబ్మన్ గిల్(19) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన వృద్దిమాన్ సాహా.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఓవర్లకు గుజరాత్ స్కోర్: 29/0 2 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 18/0 టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ రెండు ఓవర్లు ముగిసే వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(8), వృద్దిమాన్ సాహా(6) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. గుజరాత్ జట్టులోకి కేన్ విలియమ్సన్ రాగా.. పంజాబ్ జట్టులోకి సికిందర్ రజా వచ్చాడు. తుది జట్లు పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్) జానీ బెయిర్స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ప్రభ్సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, అర్ష్దీప్ సింగ్ గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే -
IPL RCB Vs PBKS Highlights Photos: పంజాబ్ కింగ్స్పై బెంగళూరు విజయం (ఫొటోలు)
-
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. ఇందులోనైనా ఆర్సీబీ గెలుస్తుందా..?
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 25) పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఆర్సీబీ భావిస్తుండగా.. పంజాబ్ సీజన్లో వరుసగా రెండో విజయంపై కన్నేసింది. ఆర్సీబీ సీజన్ తొలి మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓటమిపాలు కాగా.. పంజాబ్ తమ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ఆయా జట్ల ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం.. ఆర్సీబీ కంటే పంజాబ్ అన్ని విభాగాల్లో మెరుగ్గా కనిపించింది. ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పేపర్పై బలంగా కనిపించినప్పటికీ తొలి మ్యాచ్లో స్టార్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. 8 ఫోర్లు బాది డుప్లెసిస్ (35) ప్రమాదకరంగా కనిపించినప్పటికీ.. ఆ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ముస్తాఫిజుర్ అతన్ని పెవిలియన్కు పంపాడు. విరాట్ విషయానికొస్తే.. ఆ మ్యాచ్లో అతని బ్యాటింగ్ నత్త నడకను తలపించింది. అతను 20 బంతులను ఎదుర్కొని కేవలం 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రజత్ పాటిదార్, మ్యాక్స్వెల్ డకౌటై దారుణంగా నిరాశపర్చగా.. కోట్లు పెట్టి అరువు తెచ్చుకున్న కెమారూన్ గ్రీన్ తుస్సుమనిపించాడు. వికెట్కీపర్లు అనూజ్ రావత్ (48), దినేశ్ కార్తీక్ (38 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడకపోయుంటే ఆర్సీబీ 100 పరుగులు చేయడం కూడా కష్టంగా ఉండేది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు కూడా తేలిపోయారు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. అల్జరీ జోసఫ్, కర్ణ్ శర్మ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మయాంక్ డాగర్ కాస్త పర్వాలేదనిపించగా.. గ్రీన్ 2 వికెట్లు తీసి నాట్ బ్యాడ్ అనిపించాడు. పంజాబ్తో ఇవాల్టి మ్యాచ్లో ఆర్సీబీ అదనపు పేసర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. కర్ణ శర్మ స్థానంలో ఆకాశదీప్ తుది జట్టులోకి రావచ్చు. పంజాబ్ విషయానికొస్తే.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చి విజయం సొంతం చేసుకుంది. అర్ష్దీప్ సింగ్, రబాడ, రాహుల్ చాహర్ తమ కోటా ఓవర్లు పూర్తి చేసి పర్వాలేదనిపించగా.. హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. హర్ప్రీత్ బ్రార్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్లో సత్తా చాటిన సామ్ కర్రన్ ఒకే ఓవర్ బౌల్ చేశాడు. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు పర్వాలేదనిపించారు. కర్రన్ (63) అర్దసెంచరీతో రాణించగా.. లివింగ్స్టోన్ (38 నాటౌట్), శిఖర్ ధవన్ (22), ప్రభ్సిమ్రన్ సింగ్ నాట్ బ్యాడ్ అనిపించారు. ఆర్సీబీతో ఇవాల్టి మ్యాచ్ పంజాబ్ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఢిల్లీతో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. ఆర్సీబీ తుది జట్టు (అంచనా): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్కీపర్), అల్జరీ జోసెఫ్, ఆకాశ్దీప్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్ పంజాబ్ తుది జట్టు (అంచనా): శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్కీపర్), శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ -
PBKS Vs DC Photos: ఢిల్లీపై పంజాబ్ ఘన విజయం (ఫొటోలు)
-
PBKS vs DC: బోణీ కొట్టిన పంజాబ్.. ఢిల్లీపై ఘన విజయం
IPL 2024 PBKS vs DC- Updates: బోణీ కొట్టిన పంజాబ్.. ఢిల్లీపై ఘన విజయం ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. చంఢీఘర్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. కేవలం 6 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో సామ్ కుర్రాన్(63) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. లివింగ్ స్టోన్(38) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఖాలీల్ అహ్మద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. షాయీ హోప్ 33 పరుగులతో ఢిల్లీ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ►100 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జితేష్ శర్మ.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. మూడో వికెట్ డౌన్.. 84 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన ప్రభు సిమ్రాన్ సింగ్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి జితేష్ శర్మ వచ్చాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఒకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్లో శిఖర్ ధావన్(22) బౌల్డ్ కాగా.. బెయిర్ స్టో(9) రనౌటయ్యాడు. 5 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 53/2. క్రీజులో ప్రభ్ సిమ్రాన్ సింగ్(16), సామ్ కుర్రాన్(3) పరుగులతో ఉన్నారు. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఆహ్వానం మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. షాయీ హోప్ 33 పరుగులతో ఢిల్లీ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలవగా.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అభిషేక్ పోరెల్ మెరుపులు మెరిపించాడు. కేవలం 10 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో 32 పరుగులతో 21 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ కారణంగా ఢిల్లీ ఈ మేరకు స్కోరు చేయగలిగింది. తొమ్మిదో వికెట్ డౌన్ 19.6: హర్షల్ పటేల్ బౌలింగ్లో అభిషేక్తో సమన్వయలోపంతో కుల్దీప్ యాదవ్(1) రనౌట్ 18.3: ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ అర్ష్దీప్ బౌలింగ్లో సుమిత్ కుమార్(2) వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఫలితంగా ఢిల్లీ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 149-8(19) 17.1: ఏడో వికెట్ డౌన్ అక్షర్ పటేల్(21) రనౌట్ కావడంతో ఢిల్లీ ఏడో వికెట్ కోల్పోయింది. అభిషేక్ పోరెల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 138/7 (17.1) 15.4: ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ రాహుల్ చహర్ బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్(5) శశాంక్ సింగ్కు క్యాచ్ ఇచ్చాడు. సుమిత్ కుమార్క్రీజులోకి వచ్చాడు. అక్షర్ 12 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 128-6(16) 13.2: ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో రికీ భుయ్(3) ఐదో వికెట్గా వెనుదిరిగాడు. స్కోరు: 117-5(14). అక్షర్ ఐదు, స్టబ్స్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. 12.4: నాలుగో వికెట్ డౌన్ దాదాపు ఏడాదిన్నర తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పంత్ హర్షల్ పటేల్ బౌలింగ్లో బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 13 బంతుల్లో 18 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఫలితంగా ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోగా ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 111-4 (13) మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ షాయీ హోప్(33) మూడో వికెట్గా పెవిలియన్ చేరాడు. కగిసో రబడ బౌలింగ్లో హర్ప్రీత్ బ్రార్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అతడి స్థానంలో రికీ భుయ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 95-3(11). పంత్ నాలుగు పరుగులతో క్రీజులో ఉన్నాడు. పది ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు: 86-2 షాయీ హోప్ 26, పంత్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. క్రీజులోకి పంత్ 7.6: హర్షల్ పటేల్ బౌలింగ్లో వార్నర్(29) అవుట్. పంత్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 74-2(8) పవర్ ప్లేలో స్కోరు? ఓపెనర్ వార్నర్ దంచి కొడుతున్నాడు. పవర్ ప్లే ముగిసే సరికి అతడు 14 బంతుల్లో 22 రన్స్, హోప్ 10 బంతుల్లో 4 పరుగులు చేశాడు. స్కోరు: 54-1(6 ఓవర్లలో). 3.2: తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ అర్ష్దీప్ బౌలింగ్లో మిచెల్ మార్ష్ తొలి వికెట్(20(12)గా వెనుదిరిగాడు. షాయీ హోప్ క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్లుగా వార్నర్, మార్ష్ ఢిల్లీ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి ఓవర్ ముగిసే సరికి స్కోరు: 10-0 రిషభ్ పంత్ రీఎంట్రీ ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో రెండో మ్యాచ్కు రంగం సిద్ధమైంది. చండీగఢ్లో కొత్తగా నిర్మించిన ముల్లన్పూర్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. టాస్ గెలిచిన ఆతిథ్య పంజాబ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. డిసెంబరు 2022లో ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్రగాయాలపాలైన రిషబ్ పంత్ ఈ మ్యాచ్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఢిల్లీ కెప్టెన్గా, వికెట్ కీపర్గా తన బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మరోవైపు.. పంజాబ్ శిఖర్ ధావన్ నేతృత్వంలో బరిలోకి దిగనుంది. ఇక ఇరుజట్లు గత సీజన్లో దారుణంగా విఫలమయ్యాయి. పంజాబ్ కింగ్స్ పద్నాలుగింట కేవలం ఆరు గెలిచి ఎనిమిదో స్థానంలో.. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో నిలిచాయి. తాజా ఎడిషన్ను గెలుపుతో ఆరంభించాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షాయ్ హోప్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/ కెప్టెన్), రికీ భుయ్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ. పంజాబ్ కింగ్స్ శిఖర్ ధావన్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో, సామ్ కరన్, లియామ్ లివింగ్స్టోన్, జితేశ్ శర్మ( వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్. చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీకిది తగునా కోహ్లి? -
విధ్వంసం సృష్టించిన శిఖర్ ధవన్.. ఐపీఎల్కు ముందు ప్రత్యర్దులు హడల్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఫామ్లోకి వచ్చాడు. డీవై పాటిల్ టీ20 టోర్నీలో డీవై పాటిల్ బ్లూ జట్టుకు ఆడుతున్న గబ్బర్.. సీఏజీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన శిఖర్ కేవలం 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా డీవై పాటిల్ బ్లూ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గబ్బర్ తాజా ప్రదర్శనతో ఐపీఎల్ జట్లు హడలిపోతున్నాయి. ధవన్ ఇదే భీకర్ ఫామ్ను కొనసాగిస్తే తిప్పలు తప్పవని మదనపడుతున్నాయి. బ్లూ జట్టులో గబ్బర్ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. ఓపెనర్ అభిజిత్ తోమర్ (20 బంతుల్లో 31 పరుగులు), అయాజ్ ఖాన్ (9 బంతుల్లో 16), పరిక్షిత్ (6 బంతుల్లో 11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సీఏజీ బౌలర్లలో సన్వీర్ సింగ్, రిత్విక్ చటర్జీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రధాన్, అంకిత్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన సీఏజీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వరుణ్ లవండే (70) అర్దసెంచరీతో రాణించగా.. సన్వీర్ సింగ్ (48 నాటౌట్), ఆబిద్ ముస్తాక్ (17 నాటౌట్) సీఏజీని విజయతీరాలకు చేర్చారు. సీఏజీలో సంజయ్ 11, సేనాపతి 4, సచిన్ బేబీ 20 పరుగులు చేశారు. బ్లూ బౌలర్లలో విపుల్ కృష్ణన్ 2, కర్ష్ కొఠారి ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో సీఏజీ సెమీఫైనల్కు చేరుకుంది. ఇవాళే జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో ఇండియన్ అయిల్ జట్టు టాటా స్పోర్ట్స్ క్లబ్పై గెలుపొంది సెమీస్కు చేరింది. ఈ టోర్నీలో మరో రెండు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఇవాళే జరుగనున్నాయి. -
శిఖర్ ధావన్ విధ్వంసం.. చెలరేగిన దినేష్ కార్తీక్
డివై పాటిల్ టీ20 కప్-2024లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి చెలరేగాడు. ఈ టోర్నీలో డివై పాటిల్ బ్లూ జట్టుకు ధావన్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్బీఐతో జరిగిన మ్యాచ్లో ధావన్ సత్తాచాటాడు. డివై పాటిల్ బ్లూ జట్టు విజయంలో గబ్బర్ కీలక పాత్ర పోషించాడు. 9 వికెట్ల తేడాతో ఆర్సీఐని బ్లూ జట్టు చిత్తు చేసింది. 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన డివై పాటిల్ బ్లూ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్గా బరిలోకి దిగిన ధావన్ కేవలం 29 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 45 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్బీఐ జట్టు కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ఆర్బీఐ బ్యాటర్లలో ప్రణయ్ శర్మ(33) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. పాటిల్ బ్లూ జట్టులో పరీక్షిత్ వల్సంకర్ 4 వికెట్లతో సత్తాచాటగా.. కొథారీ 3 వికెట్లు పడగొట్టాడు. -
రీ ఎంట్రీలో చెలరేగిన శిఖర్ ధావన్.. అయినా పాపం! ఒకే ఒక్క పరుగు
టీమిండియా వెటరన్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖన్ ధావన్ ఏడాది తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. డివై పాటిల్ టీ20 కప్లో డివై పాటిల్ బ్లూ జట్టుకు ధావన్ ప్రాతినిథ్యం వహించాడు. ఈ టోర్నీలో భాగంగా బుధవారం పూణే వేదికగా టాటా స్పోర్ట్స్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో ధావన్ సత్తాచాటాడు. ఈ మ్యాచ్లో ధావన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 28 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లుతో 39 పరుగులు చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ ధావన్ ఇన్నింగ్స్ వృథాగా మిగిలిపోయింది. ఈ మ్యాచ్లో డివై పాటిల్ బ్లూ జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టాటా స్పోర్ట్స్ క్లబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. టాటా బ్యాటర్లలో అపూర్వ వాంఖడే(83) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. డివై పాటిల్ బ్లూ బౌలర్లలో కెప్టెన్ విపుల్ కృష్ణణ్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డివై పాటిల్ బ్లూ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. దీంతో తమ విజయానికి కేవలం ఒక్కపరుగు దూరంలో డివై పాటిల్ బ్లూ జట్టు నిలిచిపోయింది. చదవండి: Babar Azam AFG Captain Photo Viral: అఫ్గానిస్తాన్ కెప్టెన్గా బాబర్ ఆజం..!? -
BCCI Central Contracts: ఆ నలుగురి ఖేల్ ఖతమైనట్లేనా..?
2023-24 సంవత్సరానికి గాను బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్ చతేశ్వర్ పుజారా, శిఖర్ ధవన్, ఉమేశ్ యాదవ్ చోటు కోల్పోయారు. వీరిలో పుజారా ఒక్కడు దేశవాలీ, ఇతరత్రా టోర్నీల్లో యాక్టివ్గా ఉంటూ మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉమేశ్ దేశవాలీ క్రికెట్లో అడపాదడపా దర్శనమిస్తున్నాడు. శిఖర్ అయితే మొత్తానికే క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. కేవలం ఐపీఎల్ కోసమే అతను గేమ్లో కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు మరో వెటరన్ అజింక్య రహానేను కూడా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో పరిగణలోకి తీసుకోలేదు. రహానే రంజీల్లో పూర్తి స్థాయిలో ఆడుతున్నప్పటికీ.. అతని నుంచి చొప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా లేదు. దీంతో చేసేదేమీ లేక బీసీసీఐ అతన్ని పక్కకు పెట్టి ఉంటుంది. ఈ నలుగురిలో ఒక్క పుజారా మినహా మిగతా ముగ్గురి విషయంలో బీసీసీఐ కరెక్ట్గానే వ్యవహరించిందనుకోవచ్చు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోతే వీరి కెరీర్లు ఖతమైనట్లేనా..? ఈ నలుగురు తిరిగి పుంజుకుని టీమిండియాలో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉందా..? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు నో అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే టీమిండియాలో ఈ నలుగురి పాత్రలకు న్యాయం చేస్తున్న వారి సంఖ్య చాంతాండంత ఉంది. వీరి భవితవ్యం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. పై పేర్కొన్న నలుగురితో పాటు సరైన అవకాశాలు రాని చహల్, దీపక్ హుడాలపై కూడా బీసీసీఐ వేటు వేసింది తాజాగా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, సిరాజ్లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్ లభించగా.. అక్షర్ పటేల్, రిషబ్ పంత్లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్ వచ్చింది. ఇటీవలికాలంలో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, ప్రసిద్ద్ కృష్ణ , అవేశ్ ఖాన్ , రజత్ పాటిదార్ , జితేశ్ శర్మ , ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్లకు కొత్తగా కాంట్రాక్ట్ లభించింది. -
అత్యంత అరుదైన ఘనత సాధించిన టీమిండియా బ్యాటర్
అండర్-19 వరల్డ్కప్లో సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తూ, పరుగుల వరద పారిస్తున్న యంగ్ ఇండియా బ్యాటర్ ముషీర్ ఖాన్.. న్యూజిలాండ్తో నిన్న జరిగిన మ్యాచ్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్కప్లో ఇప్పటికే ఓ సెంచరీతో (ఐర్లాండ్పై 106 బంతుల్లో 118 పరుగులు) చెలరేగిన ముషీర్.. తాజాగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మరో సెంచరీతో (126 బంతుల్లో 131 పరుగులు) విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో ముషీర్ సింగిల్ వరల్డ్కప్ ఎడిషన్లో ఒకటికంటే ఎక్కువ సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ముషీర్కు ముందు టీమిండియా తరఫున సీనియర్ ఆటగాడు శిఖర్ ధవన్ మాత్రమే సింగిల్ వరల్డ్కప్ ఎడిషన్లో రెండు సెంచరీలు చేశాడు. తాజా ప్రదర్శనతో ముషీర్.. శిఖర్ సరసన నిలిచాడు. న్యూజిలాండ్పై సెంచరీతో ముషీర్ మరో ఘనతను కూడా సాధించాడు. ముషీర్.. ప్రస్తుత వరల్డ్కప్లో లీడింగ్ రన్ స్కోరర్గా అవతరించాడు. ముషీర్ ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 81.25 సగటున 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ (యూఎస్ఏపై 76 బంతుల్లో 73 పరుగులు) సాయంతో 325 పరుగులు చేశాడు. అన్న అడుగుజాడల్లో.. ఇటీవలే టీమిండియాకు ఎంపికైన ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్కు సొంత తమ్ముడైన ముషీర్ అన్న అడుగుజాడల్లో నడుస్తున్నాడు. 2016 అండర్-19 వరల్డ్కప్లో సర్ఫరాజ్ కూడా లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. వరుస సెంచరీలతో పరుగుల వరద పారిస్తున్న ముషీర్.. తర్వలో టీమిండియా తలుపులు కూడా తట్టే అవకాశం ఉంది. తాజా ప్రదర్శనలతో ముషీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని సైతం ఆకర్శించాడు. 2024 సీజన్ వేలంలో అన్ సోల్డ్గా మిగిలిపోయిన ముషీర్ను అవకాశం ఉంటే పంచన చేర్చుకోవాలని అన్ని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన 18 ఏళ్ల ముషీర్.. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. 2022-23 రంజీ సీజన్లో ముంబై తరఫున ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేసిన ముషీర్.. ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడి కేవలం 96 పరుగలు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో నిన్న జరిగిన గ్రూప్-1 సూపర్ సిక్స్ మ్యాచ్లో యువ భారత్ 214 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఫిబ్రవరి 2న ఆడనుంది. ఆ మ్యాచ్లో భారత్.. నేపాల్తో తలపడుతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్న భారత్.. సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. -
ఆ జట్టులోనూ నా పేరు లేదు.. షాకయ్యాను! అందుకే: ధావన్
"ఆ జట్టులో నా పేరు లేకపోవడంతో షాక్కు గురయ్యాను. కానీ అంతలోనే మనసుకు సర్దిచెప్పుకొన్నాను. వాళ్ల ఆలోచనా విధానం మరోలా ఉందేమో అని నన్ను నేను తమాయించుకున్నాను. ఏదేమైనా సెలక్టర్ల నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప నేనేమీ చేయలేను కదా! నిజానికి నా భవితవ్యం గురించి సెలక్టర్లతో నేను ఇంత వరకు మాట్లాడింది లేదు. ఇప్పటికీ జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి వెళ్తూ ఉంటాను. అక్కడ క్వాలిటీ టైమ్ ఎంజాయ్ చేస్తాను. అక్కడ అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. నా కెరీర్ రూపకల్పనలో ఎన్సీఏది కీలక పాత్ర. నిజానికి అక్కడి నుంచే నా కెరీర్ మొదలైంది. అందుకే నేనెల్లప్పుడూ ఎన్సీఏ పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటాను" అని టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఆసియా క్రీడలు-2023 జట్టులో తనకు చోటు లభిస్తుందని ఆశించానని.. కానీ అలా జరుగలేదంటూ గబ్బర్ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా టీమిండియా తరఫున పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ బ్యాటర్ శిఖర్ ధావన్కు ఏడాదికి పైగా జట్టులో చోటు కరువైంది. యువ ఓపెనర్లకు పెద్దపీట బంగ్లాదేశ్తో 2022, డిసెంబరు వన్డేలో ఆఖరిసారిగా అతడు టీమిండియాకు ఆడాడు. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఓపెనర్లకు పెద్దపీట వేస్తున్న సెలక్టర్లు ధావన్ను పక్కనపెట్టేశారు. ఈ నేపథ్యంలో.. వన్డే ప్రపంచకప్-2023కి ముందు జరిగిన ఆసియా క్రీడలతో అతడు రీఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరిగింది. చోటు ఆశించి భంగపడ్డా మెగా టోర్నీ నేపథ్యంలో చైనాకు వెళ్లే భారత ద్వితీయ శ్రేణి క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ధావన్ ఉంటాడనే వార్తలు వినిపించాయి. కానీ.. అనూహ్యంగా రుతురాజ్కు పగ్గాలు అప్పగించిన మేనేజ్మెంట్ ధావన్కు మొండిచేయి చూపింది. ఇక ఆ తర్వాత మళ్లీ అతడికి టీమిండియాలో చోటు దక్కనేలేదు. ఈ నేపథ్యంలో.. 38 ఏళ్ల ధావన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ఆసియా క్రీడల జట్టులో చోటు దక్కుతుందని ఆశించి భంగపడ్డానని తెలిపాడు. అయితే, తాను సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానన్నాడు. అందుకే ఇలా ఇక వన్డేలు, టీ20లు ఆడేందుకే టెస్టు క్రికెట్కు పూర్తిగా దూరమయ్యానని ధావన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా 2013లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో ధావన్ది కీలక పాత్ర. నాటి ఐసీసీ టోర్నీలో 363 పరుగులతో ఈ లెఫ్టాండర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. -
జొరావర్..నిన్ను చూసి ఏడాదవుతోంది : శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్
టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన కెరీర్తో పాటు.. తన వ్యక్తిగత జీవితంలోనూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే భారత జట్టులో చోటు కోల్పోయిన ధావన్.. తన భార్య అయేషా ముఖర్జీ నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. ఇటీవలే ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు శిఖర్ దావన్, ఆయేషా ముఖర్జీకి విడాకులు మంజారు చేసింది. అప్పటి నుంచి తన కుమారుడు జొరావర్ను శిఖర్ కలుసుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా తన కుమారుడి పుట్టిన సందర్భంగా ధావన్ ఎమోషనల్ అయ్యాడు. జొరావర్కు బర్త్డే విషెస్ చెప్తూ ఇన్స్టాగ్రామ్లో ధావన్ భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం జొరావర్ ఆస్ట్రేలియాలో అయేషాతో కలిసి ఉన్నాడు. 'నిన్ను నేరుగా చూసి ఏడాదవుతోంది. దాదాపు మూడు నెలలుగా అన్ని చోట్లా (సోషల్ మీడియాలో) నన్ను బ్లాక్ చేశారు. నీ నుంచి నన్ను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నీతో వీడియో కాల్లో కూడా మాట్లాడి చాలా రోజులైంది. అందుకే నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి పాత ఫోటోనే పోస్ట్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే మై డియర్ బాయ్. నేను నీతో నేరుగా మాట్లాడలేకపోయినా.. ఎల్లప్పుడూ టెలీపతి(కమ్యూనికేషన్) ద్వారా నేను నిన్ను కనెక్ట్ అవుతాను. నిన్ను చూసి గర్విస్తున్నా.. నువ్వు బాగున్నావని నాకు తెలుసు. ఈ నాన్న నిన్నెప్పుడూ మిస్సవుతాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ దేవుని దయతో మనం మళ్లీ కలుసుకునే సమయం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటాను. లవ్ యూ జొరా అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చాడు. కాగా ఈ ఏడాది ఆక్టోబర్లో ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు ధావన్- అయేషా విడాకులు మంజూరు చేసింది. జనవరిలో ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసిస్తోందని ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో ధావన్ విడాకుల పిటిషన్ ధాఖలు చేశాడు. అనంతరం తన భార్యపై ధావన్ చేసిన ఆరోపణలు అన్నీ వాస్తవమైనవని విశ్వసించిన న్యాయస్దానం విడాకులు మంజూరు చేసింది. ధావన్, ఆయేషా దంపతుల కుమారుడి శాశ్వత కస్టడీపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. కానీ ధావన్కు భారత్ లేదా ఆస్ట్రేలియాలో తన కుమారుడిని కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా వీడియో కాల్ ద్వారా కూడా ధావన్ తన కుమారుడితో మాట్లాడవచచ్చని పేర్కొంది. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
IPL 2024: సామ్ కర్రన్ కొనసాగింపు.. భారీ హిట్టర్కు షాకిచ్చిన పంజాబ్
ఐపీఎల్ 2024 సీజన్కు సంబంధించి కొనసాగించే ఆటగాళ్ల జాబితాను (Retention), రిలీజ్ (Release) చేసే ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు ఇవాళ (నవంబర్ 26) ప్రకటించాయి. పంజాబ్ కింగ్స్ మొత్తంగా 5 మంది ఆటగాళ్లను విడుదల చేసి, 19 మందిని కొనసాగించింది. పంజాబ్ కెప్టెన్గా శిఖర్ ధవన్ను కొనసాగించింది. పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లలో హార్డ్ హిట్టర్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. షారుఖ్ ఖాన్ భానుక రాజపక్స మోహిత్ రతీ బల్తేజ్ ధందా రాజ్ అంగద్ బవా పంజాబ్ కింగ్స్ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే.. శిఖర్ ధవన్ (కెప్టెన్) జానీ బెయిర్స్టో జితేశ్ శర్మ ప్రభ్సిమ్రన్ సింగ్ మాథ్యూ షార్ట్ హర్ప్రీత్ బ్రార్ అథర్వ తైడే రిషి ధవన్ సామ్ కర్రన్ సికంబర్ రజా లియామ్ లివింగ్స్టోన్ గుర్నూర్ సింగ్ బ్రార్ శివమ్ సింగ్ రాహుల్ చాహర్ అర్షదీప్ సింగ్ హర్ప్రీత్ బ్రార్ విధ్వత్ కావేరప్ప కగిసో రబాడ నాథన్ ఇల్లిస్ -
జద్రాన్ సూపర్ ఇన్నింగ్స్.. అఫ్గన్ రికార్డు స్కోరు..
ICC WC 2023- Ibrahim Zadran: వన్డే వరల్డ్కప్-2023లో అఫ్గనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ ఆస్ట్రేలియాతో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పటిష్ట పేస్ దళం ఉన్న కంగారూ జట్టు బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొని అజేయ శతకంతో మెరిశాడు. మొత్తంగా 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 129 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో అఫ్గన్ తరఫున ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసి తొలి బ్యాటర్గా నిలిచిన 21 ఏళ్ల ఇబ్రహీం.. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. వరల్డ్కప్ టోర్నీలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్ల జాబితాలో ధావన్ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచాడు. ఈ లిస్టులో జింబాబ్వే ఆటగాడు నీల్ జాన్సన్ 132* పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ హ్యారిస్ 130 పరుగులతో రెండో స్థానం ఆక్రమించాడు. కష్టాల్లో ఆసీస్ కాగా అఫ్గనిస్తాన్ విధించిన 292 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడుతోంది. 25 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు నష్టపోయి 126 పరుగులు మాత్రమే చేసింది. అయితే, ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అద్భుత ఆట తీరుతో అర్ధ శతకం పూర్తి చేసుకుని ఆసీస్ శిబిరంలో ఆశలు రేకెత్తిస్తున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేసిన టాప్-5 క్రికెటర్లు 1. నీల్ జాన్సన్(జింబాబ్వే)- 132* పరుగులు- 1999లో లార్డ్స్ మైదానంలో 2. క్రిస్ హ్యారిస్(న్యూజిలాండ్)- 130 పరుగులు- 1996లో చెన్నైలో 3. ఇబ్రహీం జద్రాన్(అఫ్గనిస్తాన్)- 129* పరుగులు- 2003 ముంబైలో 4. శిఖర్ ధావన్(ఇండియా)- 117 పరుగులు- 2019లో ది ఓవల్లో 5. రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్)- 116 పరుగులు- 2023లో ధర్మశాలలో. అఫ్గనిస్తాన్కు ఇదే భారీ స్కోరు: ముంబైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా.. అఫ్గనిస్తాన్ వరల్డ్కప్ టోర్నీలో తమ అత్యధిక స్కోరు నమోదు చేసింది. జద్రాన్ అజేయ శతకం కారణంగా 291 పరుగులు సాధించి ఈ మేరకు తమ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. వరల్డ్కప్ టోర్నీలో ఇప్పటి వరకు అఫ్గనిస్తాన్ సాధించిన టాప్-5 స్కోర్లు ఇవే ►ఆస్ట్రేలియా మీద- 2023లో ముంబైలో- 291/5. ►వెస్టిండీస్ మీద- 2019లో లీడ్స్లో- 288. ►పాకిస్తాన్ మీద- 2023లో చెన్నైలో- 286/2. ►ఇంగ్లండ్ మీద- 2023లో ఢిల్లీలో- 284. ►టీమిండియా మీద- 2023లో ఢిల్లీలో- 272/8. చదవండి: వరల్డ్కప్లో అఫ్గన్ తరఫున ఒకే ఒక్క సెంచరీ.. సచిన్, కోహ్లికి కూడా సాధ్యం కాని రికార్డు View this post on Instagram A post shared by ICC (@icc) -
Pak Vs Aus: మాకిది అలవాటే! పాక్పై ధావన్ సెటైర్లు.. వీడియో వైరల్
ICC Cricket World Cup Warm-up Matches 2023- Pakistan vs Australia: పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పాకిస్తాన్- ఫీల్డింగ్.. ఈ జంట ప్రేమకథ ఎప్పటికీ ముగిసిపోదంటూ సెటైర్లు వేశాడు. వన్డే వరల్డ్కప్-2023 నేపథ్యంలో బాబర్ ఆజం బృందం ఇప్పటికే భారత్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్లో సన్నాహక మ్యాచ్లు ఆడుతోంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్తో తొలి వార్మప్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఓడిన పాక్.. మంగళవారం(అక్టోబరు 3) ఆస్ట్రేలియాతో తలపడుతోంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (77), కామెరాన్ గ్రీన్(50- నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడం సహా మిగతా బ్యాటర్లలో అలెక్స్ క్యారీ మినహా మిగతా వాళ్లంతా రాణించారు. మిస్ఫీల్డింగ్.. వీడియో వైరల్ ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది కంగారూ జట్టు. పాక్ బౌలర్ల, ఫీల్డర్ల తప్పిదాలను క్యాష్ చేసుకుని పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో ఆసీస్తో మ్యాచ్లో పాక్ ఫీల్డర్లు మహ్మద్ వాసిం జూనియర్, మహ్మద్ నవాజ్ సమన్వయలోపంతో ఎక్స్ట్రా పరుగులు ఇవ్వడం ఆ జట్టు అభిమానులకు చిరాకు తెప్పించింది. పాకిస్తాన్- ఫీల్డింగ్.. నెవర్ ఎండింగ్ లవ్స్టోరీ ఇందుకు సంబంధించిన వీడియోను హైలైట్ చేస్తూ.. ‘‘పాకిస్తాన్- ఫీల్డింగ్.. నెవర్ ఎండింగ్ లవ్స్టోరీ’’ అంటూ ధావన్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. గబ్బర్ కామెంట్ నెట్టింట వైరల్గా మారింది. లైకులు, షేర్లతో దూసుకుపోతోంది. కాగా పాక్ టీమ్కు ఇలాంటివి కొత్తేం కాదు. మిస్ఫీల్డింగ్ కారణంగా ఆ జట్టు భారీ మూల్యం చెల్లించిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2023 భారత జట్టులో శిఖర్ ధావన్కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యువకులతో పోటీలో ఈ వెటరన్ ఓపెనర్ వెనుబడిపోయాడు. ఇక అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. టీమిండియా అక్టోబరు 8న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో చెన్నైలో పోటీ పడనుంది. ఇక అక్టోబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొట్టనుంది. చదవండి: 1987లో జన్మించిన కెప్టెన్దే ఈసారి వరల్డ్కప్ ట్రోఫీ! లిస్టులో ఎవరంటే! Pakistan & fielding never ending love story 🥰😄😄 #PakistanFielding #PakCricket pic.twitter.com/AJzT90hgNM — Shikhar Dhawan (@SDhawan25) October 3, 2023 -
Asia Cup 2023: ఆశావహులతో భారత జట్టు.. కెప్టెన్గా ధవన్..!
ఆసియా కప్-2023 కోసం సెలెక్టర్లు నిన్న (ఆగస్ట్ 21) 17 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో చోటు కోసం ధవన్, చహల్, శాంసన్, యశస్వి లాంటి ఆశావహులు ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికీ.. వీరికి నిరాశే మిగిలింది. గాయాల నుంచి కోలుకున్న సీనియర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లతో పాటు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్లకు సెలెక్టర్లు పెద్దపీట వేశారు. ట్రావెలింగ్ రిజర్వ్గా సంజూ శాంసన్ను ఎంపిక చేసినప్పటికీ.. ఈ ఎంపిక నామమాత్రమే. ఇదిలా ఉంటే, ఆసియా కప్ ఆశావహులతో రూపొందించబడిన ఓ నమూనా భారత జట్టు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ జట్టు ఆసియా కప్ను ఎంపిక చేసిన 17 మంది సభ్యుల భారత జట్టుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఈ జట్టుకు శిఖర్ ధవన్ కెప్టెన్గా ఉంటే.. చహల్, శాంసన్ లాంటి ఆసియా కప్ ఆశావహులు మిగతా సభ్యులుగా ఉన్నారు. ఈ జట్టుకు ఓపెనర్లుగా ధవన్, రుతురాజ్ ఉండగా.. వన్డౌన్లో యశస్వి జైస్వాల్, నాలుగో స్థానంలో సంజూ శాంసన్, ఆతర్వాత రింకూ సింగ్, శివమ్ దూబే, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, పేసర్ల కోటాలో దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. ఆసియా కప్ ఆశావహులతో రూపొందించబడిన ఈ జట్టును చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ధవన్ నేతృత్వంలోని ఈ జట్టు బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్లను సునాయాసంగా ఓడిస్తుందని, ఈ జట్టు టీమిండియాకు ఏమాత్రం తీసిపోదని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే, ఆసియా కప్కు ఎంపిక చేసిన భారత జట్టుతో పోలిస్తే ఈ జట్టు చాలా సమతూకంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఐసీసీ సభ్య దేశాలైన చాలా జట్లకంటే ఈ జట్టు మెరుగ్గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ జట్టు సోషల్మీడియాలో నెటిజన్లకు మాంచి టాపిక్గా మారింది. ఆసియాకప్ భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ ట్రావెలింగ్ రిజర్వ్: సంజూ శాంసన్ ఆసియా కప్ ఆశావహుల భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (వికెట్కీపర్), రింకూ సింగ్, శివమ్ దూబే, దీపక్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్ -
WC 2023: ధావన్ కెరీర్కు ఎండ్కార్డ్? అంతేనన్న అగార్కర్! వీడియో వైరల్
End of road for Shikhar Dhawan! Ajit Agarkar confirms: వన్డేల్లో అద్భుత రికార్డులు.. ద్వితీయ శ్రేణి జట్టు కెప్టెన్గా టీమిండియాను ముందుకు నడిపించి చరిత్ర సృష్టించిన సందర్భాలు.. మేటి ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపు.. కానీ.. ఇవేమీ వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ పొడిగించుకునేందుకు దోహదం చేయలేదు.. కొత్త నీరు వచ్చె.. పాత నీరు పోయె! కొత్త నీరు రాగానే.. పాత నీరు పోవాలన్న చందంగా.. శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యువ బ్యాటర్ల నుంచి ఎదురైన పోటీ ముందు 37 ఏళ్ల గబ్బర్ నిలవలేకపోయాడు. మెరుగైన ప్రదర్శనలతో వీరిద్దరు ఓపెనర్లుగా స్థానం సుస్థిరం చేసుకుంటున్న క్రమంలో ధావన్కు అవకాశాలు కరువయ్యాయి. వాళ్లు ముగ్గురే మా ప్రాధాన్యం అయితే.. ఇటీవల వీరిద్దరు విఫలమవుతున్న తరుణంలో ఆసియా కప్-2023 రూపంలో గబ్బర్కు మరో ఛాన్స్ దక్కుతుందని అతడి అభిమానులు ఆశపడ్డారు. కానీ.. బీసీసీఐ సెలక్టర్లు వాళ్ల ఆశలపై నీళ్లు చల్లారు. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మకు జోడీగా శుబ్మన్ గిల్ను ఎంపిక చేశారు. ఇషాన్ కిషన్కు కూడా జట్టులో చోటిచ్చారు. ఈ క్రమంలో గబ్బర్కు నిరాశే మిగిలింది. జట్టు ప్రకటన సమయంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ‘‘శిఖర్ ధావన్ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఎన్నో ఆడాడు. కానీ ప్రస్తుతం.. రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్లకు మాత్రమే ఓపెనర్లుగా మా ప్రాధాన్యం ఉంటుంది’’ అని కుండబద్దలు కొట్టాడు. ధావన్ కెరీర్కు ఎండ్కార్డ్? ఇక ఆసియా కప్ జట్టే వన్డే వరల్డ్కప్ ప్రొవిజినల్ టీమ్ అన్న అంచనాల నడుమ ధావన్ కెరీర్ ముగిసినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో.. ‘‘అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడు. ఎప్పుడూ ఎవరినీ నిందించలేదు. సెలక్టర్ల విషయంలో ఏనాడూ తప్పుగా మాట్లాడలేదు. జట్టుకు అవసరమైన సమయంలో 100 శాతం కష్టపడ్డాడు. గబ్బర్ను తలచుకుంటే బాధేస్తోంది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా టీమిండియా తరఫున శిఖర్ ధావన్.. 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేశాడు. ఇందులో17 సెంచరీలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 143. చదవండి: అందుకే చహల్పై వేటు.. ఇకపై: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు Asia Cup: వరల్డ్కప్లో వాళ్లకు చోటు! ఆ ముగ్గురికి రోహిత్ శర్మ గుడ్న్యూస్.. Asia Cup: అయ్యర్, రాహుల్ వచ్చేశారు.. తిలక్ వర్మ ఇన్.. పాపం సంజూ! #WATCH | At the moment, Rohit Sharma, Shubman Gill and Ishan Kishan are our preferred openers...Shikhar Dhawan has been a terrific player for India, says BCCI chief selector Ajit Agarkar. pic.twitter.com/TqF6gV4869 — ANI (@ANI) August 21, 2023 -
ఆసియా కప్, వరల్డ్కప్లలో రోహిత్కు జత ఎవరు..? కొత్తగా రేసులోకి మరో ఆటగాడు
టీమిండియాను ఓపెనర్ల సమస్య చాలా కాలంగా వేధిస్తూనే ఉంది. సచిన్-గంగూలీ, సచిన్-సెహ్వాగ్, గంభీర్-సెహ్వాగ్ల శకం ముగిసాక కొంతకాలం పాటు రోహిత్ శర్మ-శిఖర్ ధవన్ల జోడీ విజయవంతంగా సాగింది. అయితే కాలక్రమంలో ధవన్ ఫామ్ కోల్పోవడం, కేఎల్ రాహుల్ లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ధవన్ క్రమేనా కనుమరుగైపోయాడు. రాహుల్ అన్ని ఫార్మాట్లలో రాణించడంతో ధవన్ స్థానాన్ని ఆక్రమించాడు. అయితే ఇటీవలి కాలంలో బీసీసీఐ ఫార్మాట్కు ఓ జట్టును ప్రకటిస్తుండటం.. సిరీస్, సిరీస్కు కీలక ఆటగాళ్లను రెస్ట్ పేరుతో పక్కకు పెడుతుండటం.. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తరుచూ గాయాల బారిన పడుతుండటంతో ఓపెనర్ల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఈ క్రమంలో రాహుల్కు ప్రత్యామ్నాయంగా ఐపీఎల్ హీరో శుభ్మన్ గిల్ తెరపైకి వచ్చాడు. రోహిత్కు జతగా గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడి రాహుల్ను మరిపించాడు. అయితే గిల్ ఫామ్ కూడా ఇటీవలికాలంలో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య పునరావృతం అయ్యింది. త్వరలో ఆసియా కప్, వన్డే వరల్డ్కప్ లాంటి మెగా ఈవెంట్లు ఉండటంతో బీసీసీఐకి ఓపెనర్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం, ఐపీఎల్-2023కి ముందు ఆతర్వాత జరిగిన సిరీస్ల్లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లాంటి యువ ఓపెనర్లు సత్తా చాటడంతో సమస్య మరింత తీవ్రతరమైంది. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్లో మరో యంగ్ ఓపెనర్ పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటం (డబుల్ సెంచరీ, సెంచరీ) బీసీసీఐని మరింత ఇరకాటంలో పడేసింది. మరోవైపు వెటరన్ శిఖర్ ధవన్కు ఆఖరి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు కూడా తీవ్రతరమవుతుండటంతో బీసీసీఐకి ఏం చేయాలో పాలుపోక స్తబ్ధతలో ఉండిపోయింది. ప్రస్తుతం లైమ్లైట్లో ఉన్న అందరు ఓపెనర్లను పరిగణలోకి తీసుకుంటే 90 శాతం అర్హులే ఉండటంతో సెలక్టర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఓపెనింగ్ స్థానాల కోసం రోహిత్తో పాటు మొత్తం 8 మంది (పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, శిఖర్ ధవన్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్) లైన్లో ఉన్నారు. వీరితోనే సతమతమవుతుంటే యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్లు మేము సైతం అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో భారత సెలెక్టర్లు ఆసియా కప్, వన్డే వరల్డ్కప్లకు రోహిత్కు జతగా ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. -
'నా పేరు లేకపోవడం చూసి షాక్ అయ్యా.. కానీ ఆ విషయంలో మాత్రం హ్యాపీ'
టీమిండియా వెటరన్ వికెట్ ఓపెనర్ శిఖర్ ధావన్ గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే చైనా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్కు వెళ్లే భారత జట్టుకు ధావన్ సారధ్యం వహిస్తాడని అంతా భావించారు. కానీ గబ్బర్ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఆసియా క్రీడల్లో పాల్గోనే భారత జట్టుకు యువ ఓపెనర్ రుత్రాజ్ గైక్వాడ్ను సారధిగా ఎంపిక చేశారు. కాగా గతంలో చాలా సిరీస్ల్లో భారత ద్వితీయ శ్రేణి జట్టుకు ధావనే నాయకత్వం వహించాడు. ఇక ఆసియాగేమ్స్కు చోటు దక్కకపోవడంపై ధావన్ తాజాగా స్పందించాడు. ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో నా పేరు లేకపోవడం చూసి నేను షాక్ అయ్యాను. అయితే సెలక్టర్లు వేరే ఆలోచనతో జట్టును ఎంపిక చేశారని నేను భావించాను. దాన్ని మనం అంగీకరించక తప్పదు. రుత్రాజ్ గైక్వాడ్ నాయకత్వం వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. జట్టు మొత్తం యువకులతో కూడి ఉంది. వారు బాగా రాణిస్తారని ఆశిస్తున్నాను.. జట్టుకు అవసరమైతే ఇప్పుడైనా రీఎంట్రీ ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. నేను ఎప్పటికప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తూనే ఉంటాను. అక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి. నేను ఇప్పటికీ ఫిట్నెస్గా ఉన్నాను. అయితే నా ఫ్యూచర్ కోసం ఏ సెలక్టరు కూడా ఇప్పటివరకు నాతో ఏమి మాట్లాడలేదు. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్కు టైటిల్ను అందించడమే నా లక్ష్యమని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధావన్ పేర్కొన్నాడు. చదవండి: 'అతడొక అద్భుతం.. కచ్చితంగా కోహ్లి అంతటివాడవుతాడు' -
తిలక్ వద్దు!? వరల్డ్కప్ టోర్నీలో నంబర్ 4లో సూర్య సరైనోడు! అతడిని ఆడిస్తే..
World Cup 2023: మిడిలార్డర్లో కీలక స్థానమైన నాలుగో నంబర్పై టీమిండియాలో నెలకొన్న అనిశ్చితి గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బ్యాటింగ్ ఆర్డర్ నం.4లో సమస్య ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ రిటైర్ అయిన తర్వాత అక్కడ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారని పేర్కొన్నాడు. అయ్యర్ గాయాల బారిన పడటం వల్ల ఇక శ్రేయస్ అయ్యర్ ఆ లోటును భర్తీ చేయగల సత్తా ఉన్నవాడే అయినా.. గాయాల బెడద వల్ల అతడు అందుబాటులో లేకపోవడం అనిశ్చితికి కారణమైందని పేర్కొన్నాడు. అయ్యర్ జట్టుకు దూరమైన తరుణంలో వేర్వేరు ఆటగాళ్లతో ప్రయోగాలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆసియా వన్డే కప్-2023, వన్డే వరల్డ్కప్-2023 వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో టీమిండియాను వేధిస్తున్న ఈ ప్రధాన సమస్య గురించి వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ టోర్నీలో నాలుగో స్థానంలో టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ను ఆడించాలని సూచించాడు. నా ఛాయిస్ సూర్యనే.. ఎందుకంటే ‘‘నేనైతే నం.4లో సూర్యనే ఎంచుకుంటాను. గత కొంతకాలంగా అతడు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. అనుభవజ్ఞుడు. కాబట్టి నా ఛాయిస్ సూర్యనే’’ అని వ్యాఖ్యానించాడు. కాగా టీ20లలో సుదీర్ఘకాలంగా ప్రపంచ నంబర్ 1 బ్యాటర్గా కొనసాగుతున్న ముంబై బ్యాటర్ సూర్యకుమార్ వన్డేల్లో మాత్రం రాణించలేకపోతున్న విషయం తెలిసిందే. వన్డేల్లో సో సోగా.. వెస్టిండీస్తో సిరీస్లోనూ వచ్చిన అవకావాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మూడు వన్డేల్లో వరుసగా 19, 24, 35 పరుగులు చేయగలిగాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు మొత్తంగా 26 వన్డే మ్యాచ్లు ఆడిన సూర్య 511 పరుగులు మాత్రమే చేశాడు. తిలక్ గురించి మాట్లాడుతుంటే! ఈ నేపథ్యంలో 50 ఓవర్ ఫార్మాట్లో తన గణాంకాలు చెప్పుకోదగినవిగా లేవని, ఈ విషయం చెప్పేందుకు సిగ్గుపడనని సూర్య వాస్తవాన్ని అంగీకరించాడు కూడా! ఇదిలా ఉంటే.. విండీస్తో టీ20 సిరీస్తో ఎంట్రీ ఇచ్చిన యువ సంచలనం తిలక్ వర్మ నాలుగో స్థానంలో మెరుగ్గా ఆడుతున్న వేళ అతడిని వన్డేల్లోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, ధావన్ మాత్రం అనుభవం పేరిట సూర్య పేరును ఎంచుకోవడం విశేషం. ఇక భారత్ వేదికగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు వన్డే వరల్డ్కప్ టోర్నీ జరుగనుంది. అంతకంటే ముందు టీమిండియా.. ఆగష్టు 30న ఆరంభం కానున్న ఆసియా వన్డే కప్-2023లో పోటీపడనుంది. చదవండి: దూకుడు నేర్పిన దాదా.. భారత క్రికెట్కు స్వర్ణయుగం.. అగ్రశ్రేణి జట్లకు వణుకు -
ఐసీసీ టోర్నీల్లో ఘనమైన రికార్డు.. అతనికి వరల్డ్కప్ ఆడే ఛాన్స్ ఇవ్వండి..!
భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఆస్ట్రేలియా అయితే ఏకంగా తమ కోర్ టీమ్ను కూడా ప్రకటించేసింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సైతం టీమిండియాను ఎంపిక చేసేందుకు భారీ కసరత్తు చేస్తుంది. వరల్డ్కప్కు ఎంపిక చేసే భారత జట్టులో ఎవరెవరు ఉండాలన్న అంశంపై అభిమానులు సోషల్మీడియా వేదికగా ఇప్పటికే విస్తృత స్థాయి చర్చలు మొదలుపెట్టారు. పలానా ఆటగాడు ఉండాలని కొందరు, పలానా ఆటగాడు ఉండకూడదని మరికొందరు తమతమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. మరోవైపు గాయాల బారిన పడి గతకొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆటగాళ్లపై (కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్) కూడా చర్చ నడుస్తుంది. ఒకవేళ వారు జట్టులోకి తిరిగి వస్తే ప్రస్తుతమున్న యువ ఆటగాళ్ల పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. రోహిత్కు జతగా మరో ఓపెనర్ ఎవరు.. కోహ్లితో పాటు మిడిలార్డర్లో ఎవరెవరు ఉంటారు.. ఒకవేళ కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని వరల్డ్కప్కు అందుబాటులోకి వస్తే అతను వికెట్కీపింగ్ కూడా చేస్తాడా, లేదా.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఎవరుంటారు.. ఆల్రౌండర్ల కోటాలో జడేజాతో పాటు ఎవరెవరు జట్టులో ఉంటారు.. పేస్ విభాగం ఎలా ఉండబోతుంది..? ఇలా సవాలక్ష ప్రశ్నలు అభిమానుల మెదళ్లను తొలిచి వేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా రోహిత్ శర్మ పార్ట్నర్ ఎవరనే డిస్కషన్ తారా స్థాయిలో జరుగుతుంది. ఇటీవల యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ తరుచూ విఫలమవుతుండటంతో ఈ చర్చ పతాక స్థాయికి చేరింది. ఈ క్రమంలో గిల్ ప్రత్యామ్నాయంగా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ పేరు వినిపిస్తుంది. ఐసీసీ టోర్నీల్లో ధవన్కు ఘనతమైన రికార్డు ఉండటం అతనికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ధవన్ ఐసీసీ టోర్నీల్లో 27 ఇన్నింగ్స్ల్లో 50.4 సగటున 97.25 స్ట్రయిక్ రేట్తో 6 సెంచరీలు, 4 అర్ధసెంచరీల సాయంతో 1312 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూపించి ధవన్ అభిమానులు అతన్ని వరల్డ్కప్కు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వయసు పైబడిన రిత్యా ధవన్కు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ అవుతుందని, అందుకైనా అతనికి చివరి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ధవన్కు పోటీగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ యశస్వి వన్డే అరంగేట్రం చేసి రాణిస్తే, ధవన్కు మొండిచెయ్యి ఎదురుకావచ్చు. మరి ఇన్ని సమీకరణల నేపథ్యంలో వరల్డ్కప్లో రోహిత్కు జోడీగా ఎవరిని బరిలోకి దిగుతారో వేచి చూడాలి. -
కోహ్లి, రోహిత్లకు సాధ్యం కాలేదు.. తొలి భారత బ్యాటర్గా సూర్య ఆల్టైం రికార్డు
West Indies vs India, 3rd T20I: వెస్టిండీస్తో తొలి టీ20లో 21 పరుగులు.. రెండో టీ20లో ఒకే ఒక్క పరుగు చేసి రనౌట్.. టీమిండియా స్టార్ సర్యకుమార్ యాదవ్ తొలి రెండు టీ20 మ్యాచ్లలో విఫలం కావడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. టీ20 నంబర్ 1 బ్యాటర్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించలేదంటూ అభిమానులే పెదవి విరిచారు. ఈ రెండు మ్యాచ్లలోనూ టీమిండియా ఓటమి చెందడం విమర్శల పదునును మరింత పెంచింది. అయితే, తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సూర్య విజృంభించాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి తన విలువేంటో చాటుకున్నాడు. స్కై వీరవిహారం విండీస్తో మంగళవారం నాటి మూడో టీ20లో స్కై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుబ్మన్ గిల్ విఫలమైన వేళ తిలక్ వర్మతో కలిసి జట్టును ఆదుకున్నాడు. 44 బంతుల్లోనే 83 పరుగులతో సత్తా చాటాడు. 10 ఫోర్లు, 4 సిక్స్లు బాది వింటేజ్ సూర్యను గుర్తు చేశాడు. సిక్స్ల సెంచరీ జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడమే గాకుండా.. టీ20లలో మరో అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా ‘సిక్స్ల సెంచరీ’ కొట్టిన తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. కోహ్లిని అధిగమించాడు. అంతేకాదు.. భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ను వెనక్కి నెట్టి అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానం ఆక్రమించాడు. కాగా శిఖర్ ధావన్ 68 టీ20 మ్యాచ్లలో 126కు పైగా స్ట్రైక్రేటుతో 1759 పరుగులు సాధించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఇప్పటి వరకు 49 ఇన్నింగ్స్ ఆడి.. 174కు పైగా స్ట్రైక్రేటుతో 1780 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 14 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సూర్య అత్యధిక స్కోరు 117. అంతర్జాతీయ టీ20లలో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న భారత బ్యాటర్లు ►సూర్యకుమార్ యాదవ్- 49 ఇన్నింగ్స్లో 101 సిక్సర్లు ►విరాట్ కోహ్లి- 107 ఇన్నింగ్స్లో 117 సిక్సర్లు ►రోహిత్ శర్మ- 140 ఇన్నింగ్స్లో 182 సిక్సర్లు వీళ్లు కూడా.. ఇక ఇతర బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 68 ఇన్నింగ్స్లో 99, యువరాజ్ సింగ్ 51 ఇన్నింగ్స్లో 74, హార్దిక్పాండ్యా 70 ఇన్నింగ్స్లో 68, సురేశ్ రైనా 66 ఇన్నింగ్స్లో 58, మహేంద్ర సింగ్ ధోని 85 ఇన్నింగ్స్లో 52, శిఖర్ ధావన్ 66 ఇన్నింగ్స్లో 50 సిక్స్లు బాదారు. ఇదిలా ఉంటే.. విండీస్తో మూడో టీ20 సందర్భంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన సూర్య.. ఈ అవార్డు అందుకోవడం ఇది పన్నెండోసారి. ఈ జాబితాలో కోహ్లి 15 అవార్డులతో అగ్రస్థానంలో ఉండగా.. సూర్య.. రోహిత్తో కలిసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: రన్రేట్ అవసరం లేదు.. హార్దిక్ చేసింది ముమ్మాటికీ తప్పే! Form is temporary. Surya is permanent! .#INDvsWI #INDvWIAdFreeonFanCode pic.twitter.com/QRdE8Eg8BQ — FanCode (@FanCode) August 8, 2023 -
వెటరన్ జోడీ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్- గిల్! దాదా- వీరూల తర్వాత..
West Indies vs India, 3rd ODI: వెస్టిండీస్పై తొలి రెండు వన్డేల్లో ప్రదర్శన భారత జట్టు ఆటతీరుపై సందేహాలు రేకెత్తించినా... తమ స్థాయి ఏమిటో చివరి పోరులో టీమిండియా చూపించింది. ఇద్దరు స్టార్ బ్యాటర్లు ఆడకపోయినా, ప్రత్యర్థిని చిత్తు చేయగల సత్తా తమకుందని నిరూపించింది. ఆఖరి వన్డేలో భారీ విజయంతో సిరీస్ను సొంతం చేసుకున్న జట్టు ఇప్పుడు టి20 పోరుకు సిద్ధమైంది. హాఫ్ సెంచరీలతో మెరిసి ఇక్కడా సీనియర్లు లేకపోవడంతో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు యువ ఆటగాళ్లకు ఇది సరైన అవకాశం. ఇదిలా ఉంటే.. మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్ అర్ధ శతకాలతో మెరిసిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ 64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు రాబట్టగా.. గిల్ 92 బంతుల్లో 11 బౌండరీలు బాది మొత్తంగా 85 రన్స్ చేశాడు. వెటరన్ జోడీ రికార్డు బద్దలు మొదటి వికెట్కు 19.4 ఓవర్లలో వీరిద్దరు కలిసి 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ క్రికెటర్లు శిఖర్ ధావన్- అజింక్య రహానే పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. కాగా 2017లో ఈ జోడీ వెస్టిండీస్తో వన్డే మ్యాచ్లో మొదటి వికెట్కు 132 పరుగులు జతచేశారు. ఈ క్రమంలో ఆరేళ్ల తర్వాత వీరి రికార్డును లెఫ్ట్- రైట్ కాంబినేషన్ ఓపెనింగ్ పెయిర్ బ్రేక్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది. దాదా- వీరూల తర్వాత అదే విధంగా.. కరేబియన్ దీవిలో పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యధిక భాగస్వామ్యం(ఏ వికెట్పై అయినా) నమోదు చేసిన రెండో భారత జోడీగా నిలిచింది. 2007 వరల్డ్కప్ మ్యాచ్ సందర్భంగా బెర్ముడాపై సౌరవ్ గంగూలీ- వీరేంద్ర సెహ్వాగ్ రెండో వికెట్కు 202 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో వీరి తర్వాతి స్థానాన్ని ఇషాన్- గిల్ ఆక్రమించారు. బ్యాటింగ్ ఆర్డర్ కకావికలం కాగా వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను 2–1 తేడాతో భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మూడో వన్డేలో భారత్ 200 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. 352 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా గుడకేశ్ మోటీ (34 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా, అలిక్ అతనజ్ (50 బంతుల్లో 32; 3 ఫోర్లు), అల్జారి జోసెఫ్ (39 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్లు) కొద్దిగా పోరాడగలిగారు. శార్దుల్ ఠాకూర్ వన్డేల్లో తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (4/37) నమోదు చేయగా, ముకేశ్ 3, కుల్దీప్ 2 వికెట్లు తీశారు. శుబ్మన్ గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా, ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచారు. శార్దూల్ చెలరేగాడు 2007 నుంచి ఇప్పటి వరకు వెస్టిండీస్పై భారత్కు ఇది వరుసగా 13వ వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. పదునైన బౌలింగ్తో చెలరేగిన పేసర్ ముకేశ్ కుమార్ తొలి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని ధాటికి కింగ్ (0), మేయర్స్ (4), హోప్ (5) అవుట్ కావడంతో స్కోరు 17/3 వద్ద నిలిచింది. పదేళ్ల తర్వాత ఉనాద్కట్ ఆ తర్వాత విండీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. పదేళ్ల తర్వాత తొలి వన్డే ఆడిన ఉనాద్కట్... కార్టీ (6)ని అవుట్ చేయగా... తన వరుస ఓవర్లలో శార్దుల్ రెండు వికెట్లు తీయడంతో స్కోరు 50/6కు చేరింది. అనంతరం తన వరుస ఓవర్లలో కుల్దీప్ తర్వాతి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ దశలో మోతీ, జోసెఫ్ కొద్ది సేపు పట్టుదల కనబర్చి తొమ్మిదో వికెట్కు 60 బంతుల్లో 55 పరుగులు జోడించారు. అయితే ఈ జోడీని విడదీసిన శార్దుల్ తన తర్వాతి ఓవర్లో ఆఖరి వికెట్ కూడా తీసి విండీస్ ఆట ముగించాడు. చదవండి: క్రికెట్కు గుడ్బై చెప్పిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ అరుదైన రికార్డుకు చేరువలో శాంసన్.. కోహ్లి, రోహిత్ సరసన చేరేందుకు! కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచి.. ఇన్కమ్టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా! -
వరల్డ్కప్ జట్టులో అతడు తప్పకుండా ఉంటాడు! అక్కడే దిక్కులేదంటే..
Wasim Jaffer picks his Indian squad for World Cup 2023: వన్డే వరల్డ్కప్-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుష్కరకాలం తర్వాత భారత గడ్డపై ఈ మెగా ఈవెంట్ జరుగుతున్న తరుణంలో అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా తన జట్టును ఎంపిక చేసుకున్నాడు. తన టీమ్లో 15 మందికి చోటిచ్చిన ఈ మాజీ బ్యాటర్.. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్కు తగిన ప్రాధాన్యం ఉండాలని నొక్కి వక్కాణించాడు. ‘‘రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, శిఖర్ ధావన్.. ఈ ముగ్గురే నా ఓపెనర్లు. తుది జట్టులో ధావన్కు చోటు దక్కనప్పటికీ బ్యాకప్ ఓపెనర్గా అతడు ఎంతో కీలకం. మిడిలార్డర్లో.. మూడో స్థానంలో విరాట్ కోహ్లి.. ఆ తర్వాతి స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఉండాలి. సంజూ కూడా.. ఇక బౌలర్ల విభాగంలో ముగ్గురు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ నా ప్లేయింగ్ 11లో ఉంటారు.పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఉంటారు. అయితే, వీరితో పాటు హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేయడం ముఖ్యం. ఇక బ్యాకప్ ప్లేయర్లుగా శార్దూల్ ఠాకూర్(పేసర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్)కు చోటిస్తాను’’ అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. యువకులు పాతుకుపోతున్నారు కాగా శిఖర్ ధావన్ గతేడాది డిసెంబరులో ఆఖరిసారిగా టీమిండియాకు ఆడాడు. అప్పటి నుంచి జాతీయ జట్టులో అతడికి చోటే కరువైంది. కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా యువ ఆటగాళ్లు శుబ్మన్ గిల్(రెగ్యులర్), ఇషాన్ కిషన్ పాతుకుపోతున్నారు. టెస్టుల్లో ఘనమైన ఎంట్రీ ఇచ్చిన యశస్వి జైశ్వాల్ కూడా పోటీకి వస్తున్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ సైతం రేసులో ఉండనే ఉన్నాడు. ద్వితీయ శ్రేణి జట్టులోనూ దక్కని చోటు ఈ నేపథ్యంలో ధావన్ మళ్లీ టీమిండియాలో పునరాగమనం చేయడం దాదాపు అసాధ్యం. అంతేకాదు ఇటీవల ఆసియా క్రీడలు-2023కి ఎంపిక చేసిన ద్వితీయ శ్రేణి జట్టుకు ధావన్ సారథ్యం వహించనున్నాడనే వార్తలు వట్టి పుకార్లేనని సెలక్షన్ కమిటీ నిర్ణయంతో తేలిపోయింది. ఏకంగా వరల్డ్కప్లో? రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో యువ జట్టును చైనాకు పంపనున్నారు. అలాంటిది వసీం జాఫర్ మాత్రం సీనియారిటీకి పెద్దపీట వేస్తూ ధావన్ను ఏకంగా వరల్డ్కప్-2023లో ఆడించాలనే సూచన చేయడం విశేషం. ఈ నేపథ్యంలో.. ‘‘పాపం ధావన్.. ద్వితీయ శ్రేణి టీమ్లోనే దిక్కులేదు.. మరి వరల్డ్కప్లో ఆడిస్తారా’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: తేలిపోయిన వెంకటేశ్ అయ్యర్.. రెచ్చిపోయిన రింకూ సింగ్ -
ఈసారి యశస్వి మిస్సయ్యాడు! అయితేనేం అరుదైన రికార్డుతో..
West Indies vs India, 2nd Test- Yashasvi Jaiswal Record: టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ జోరు మీదున్నాడు. వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ముంబై బ్యాటర్.. 171 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా ఈ 21 ఏళ్ల లెఫ్టాండర్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో పిన్న వయసులోనే మొదటి టెస్టులోనే 150 పరుగుల మార్కు అందుకున్న తొలి భారత బ్యాటర్గా రికార్డులకెక్కాడు. శిఖర్ ధావన్ రికార్డు బద్దలు దీనితో పాటు మరెన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇక రెండో టెస్టులోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 74 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 57 పరుగులు సాధించాడు. తన కెరీర్లో మొదటి రెండు మ్యాచ్లలో రాణించిన యశస్వి జైశ్వాల్.. రెండో టెస్టు సందర్భంగా టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ను అధిగమించాడు. రోహిత్, గంగూలీ తర్వాత భారత్ తరఫున తొలి రెండు టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. శిఖర్ ధావన్ను వెనక్కినెట్టి రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ తర్వాతి స్థానం ఆక్రమించాడు. ఈసారి సెంచరీ మిస్ అయినా ఇదిలా ఉంటే వెస్టిండీస్తో తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ట్రినిడాడ్ వేదికగా గురువారం ఆరంభమైన రెండో టెస్టులోనూ పట్టు బిగించింది. తొలిరోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో యశస్వి జేసన్ హోల్డర్ బౌలింగ్లో అవుటయ్యాడు. అయితే, ఈసారి సెంచరీ మిస్ అయినా అర్ధ శతకంతో మెరిసి మరో అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కెరీర్లో మొదటి రెండు టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 బ్యాటర్లు వీరే! 1.రోహిత్ శర్మ- 288 పరుగులు 2.సౌరవ్ గంగూలీ- 267 పరుగులు 3.యశస్వి జైశ్వాల్- 228 పరుగులు 4.శిఖర్ ధావన్- 210 పరుగులు 5.పృథ్వీ షా- 204 పరుగులు. చదవండి: Ind vs WI: ధోని భయ్యా లేడు కదా.. ఇలాగే ఉంటది! ఇప్పటికైనా వాళ్లను పిలిస్తే.. -
ధావన్ పేరును కనుమరుగు చేసే పనిలో యశస్వి! ఏకైక బ్యాటర్గా గబ్బర్.. కానీ
Yashasvi Jaiswal: అరంగేట్ర మ్యాచ్లోనే అద్భుత శతకం సాధించి అనేకానేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్. వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ 21 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్.. 387 బంతులు ఎదుర్కొని 171 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ(103)కు జోడీగా ఓపెనర్గా బరిలోకి దిగిన యశస్వి.. డబుల్ సెంచరీకి దూరమైనా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తన మొదటి మ్యాచ్లోనే అవార్డు అందుకున్నాడు. మరి విండీస్తో రెండో టెస్టులోనూ అతడు ఓపెనింగ్ చేయడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రినిడాడ్ వేదికగా జూలై 20న ఆరంభం కానున్న ఈ మ్యాచ్ నుంచి యశస్వి జైశ్వాల్ ఇదే దూకుడు కొనసాగిస్తే టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉన్న మూడు రికార్డులు బద్దలవడం ఖాయం. అవేంటంటే.. తొలి 10 టెస్టు ఇన్నింగ్స్లో.. టీమిండియా తరఫున మొదటి 10 టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ధావన్ (532 రన్స్) ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నాడు. వినోద్ కాంబ్లీ(880), సునిల్ గావస్కర్(831), మయాంక్ అగర్వాల్(605) ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. యశస్వి అరంగేట్ర మ్యాచ్లో మాదిరి చెలరేగితే ధావన్ను అధిగమించడం కష్టమేమీ కాదు. టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక స్ట్రైక్రేటు(మినిమం 100 బాల్స్) టీమిండియా తరఫున తన తొలి మ్యాచ్లో యశస్వి 44.19 స్ట్రైక్రేటుతో 171 పరుగులు సాధించాడు. మొదటి మ్యాచ్ కాబట్టి ఆచితూచి ఆడుతూనే సెంచరీ మార్కు అందుకున్న అతడు ఇకపై దూకుడు పెంచాల్సి ఉంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో మాదిరి తన అగ్రెసివ్ బ్యాటింగ్ చూపిస్తే ధావన్ రికార్డును బద్దలు కొట్టవచ్చు. టీమిండియా క్రికెటర్లలో రిషభ్ పంత్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు. 2022లో ఇంగ్లండ్తో టెస్టులో తొలి 100 బంతుల్లో 131.53 స్ట్రైక్రేటు నమోదు చేయగా.. 2009లో శ్రీలంక మీద సెహ్వాగ్ 115.35 స్ట్రైక్రేటుతో పరుగులు సాధించాడు. ఇక ధావన్ 2017లో శ్రీలంక మీద 113.09తో వీరితో పాటు ఈ జాబితాలో చేరాడు. మొదటి సెషన్లో మోస్ట్ రన్స్ టీమిండియా బ్యాటర్లెవరికీ సాధ్యం కాని రీతిలో శిఖర్ ధావన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు మ్యాచ్లో తొలి సెషన్లో అత్యధిక పరుగులు(104- నాటౌట్) సాధించిన తొలి భారత క్రికెటర్గా చరిత్రకెక్కాడు. 2018లో అఫ్గనిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా.. మొదటి సెషన్లోనే 104 పరుగులు రాబట్టాడు. అంతకు ముందు వీరేంద్ర సెహ్వాగ్ వెస్టిండీస్ మీద 2006లో 99 పరుగులు సాధించాడు. ఇక యశస్వి ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ధావన్ను వెనక్కి నెట్టడం అసాధ్యమేమీ అనిపించడం లేదు. మీరేమంటారు?! చదవండి: పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 18 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై ఇదేమి ఔట్రా అయ్యా.. పాకిస్తాన్ ఆటగాళ్లు అంతే! వీడియో వైరల్ -
Asian Games: శిఖర్ ధావన్ కాదా!? టీమిండియా కెప్టెన్గా అతడు..!
Asian Games 2023: చైనాలో ఈ ఏడాది జరుగనున్న ఆసియా క్రీడలకు భారత క్రికెట్ జట్లను పంపేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్-2023 మొదలుకానున్న నేపథ్యంలో మెన్స్ క్రికెట్కు సంబంధించి ద్వితీయ శ్రేణి జట్టును పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ జట్టుకు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా.. దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ను హెడ్కోచ్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అత్యుత్తమ క్రికెటర్ పీటీఐతో మాట్లాడిన సందర్భంగా... టీమిండియా- బీ జట్టుకు రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ అయితే బాగుంటుందని డీకే వ్యాఖ్యానించాడు. ఆసియా క్రీడల్లో భారత జట్టుకు సారథ్యం వహించే అర్హత అశూకు ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘అత్యుత్తమ, గొప్ప క్రికెటర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్కు కచ్చితంగా స్థానం ఉంటుంది. అశ్విన్- దినేశ్ కార్తిక్ ఆ హక్కు తనకు ఉంది.. అర్హుడు కూడా కనీసం ఒక్కసారైనా టీమిండియా కెప్టెన్గా వ్యవహరించే అవకాశం అతడికి రావాలి. అందుకు అతడు వందకు వందశాతం అర్హుడే. ఆ హక్కు తనకి ఉంది’’అని డీకే పేర్కొన్నాడు. ఇక ఆసియా కప్-2023లో టీమిండియా వికెట్ కీపర్ రేసులో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని 36 ఏళ్ల దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు. ఇక.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం టీమిండియా వెస్టిండీస్ పర్యటనతో బిజీకానుంది. జూలై 12 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు భారత ఆటగాళ్లు కరేబియన్ గడ్డపై అడుగుపెట్టారు. కాగా విండీస్తో టెస్టు జట్టులో వెటరన్ స్పిన్ ఆల్రౌండర్ అశ్విన్కు స్థానం దక్కిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 23- అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. వెస్టిండీస్తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: WC 2023: గొప్ప బ్యాటర్వే! కానీ నీకసలు బుర్ర లేదు.. WC 2023: వెస్టిండీస్కు ఊహించని షాకిచ్చిన స్కాట్లాండ్! మరీ ఘోరంగా.. -
ఆర్నెళ్లుగా జట్టుకు దూరం.. ఏకంగా టీమిండియా కెప్టెన్గా రీఎంట్రీ!
గతేడాది డిసెంబరులో ఆఖరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో భాగంగా ఛట్టోగ్రామ్ వేదికగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడాడు. ఆ తర్వాత గబ్బర్కు జట్టులో చోటు కరువైంది. మెరుగైన ప్రదర్శన ఈ నేపథ్యంలో ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ సారథిగా అవతారమెత్తిన శిఖర్ ధావన్.. బ్యాటర్గా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఆడిన 11 మ్యాచ్లలో కలిపి మొత్తంగా 373 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో అతడి అత్యధిక స్కోరు 99 నాటౌట్. అయితే, బ్యాటర్గా సఫలమైనప్పటికీ కెప్టెన్గా గబ్బర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అడపా దడపా టీమిండియా సారథిగా వ్యవహరించిన అతడు.. ఐపీఎల్లో పంజాబ్ను కనీసం టాప్-5లో కూడా నిలపలేకపోయాడు. ఐపీఎల్ పదహారో ఎడిషన్లో ఆడిన 14 మ్యాచ్లలో పంజాబ్ కేవలం ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆర్నెళ్లుగా జట్టుకు దూరం ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా జాతీయ జట్టుకు దూరమైన శిఖర్ ధావన్ ఈసారి ఏకంగా కెప్టెన్గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో జరుగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు అతడు సారథిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ధావన్ నేతృత్వంలో ద్వితీయశ్రేణి జట్టు హాంగ్జూకు వెళ్లనున్నట్లు సమాచారం. అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్ ఆరంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్గా రీఎంట్రీ! ప్రధాన జట్టు ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉండనున్న తరుణంలో.. సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు నిర్వహించనున్న ఆసియా క్రీడలకు బీ-టీమ్ను పంపే యోచనలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ జట్టుకు కెప్టెన్ ధావన్, హెడ్కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. టీమిండియా జూలై 12 - ఆగష్టు 13 వరకు వెస్టిండీస్ పర్యటనలో గడుపనుంది. చదవండి: WC 2023: వెస్టిండీస్ కొంపముంచిన జింబాబ్వే! ఇక ఆశలు వదులుకోవాల్సిందే! టీమిండియాతో టెస్టులకు సై.. కెప్టెన్గా బ్రాత్వైట్.. వాళ్లంతా జట్టుకు దూరం -
బీసీసీఐ కీలక నిర్ణయం! వాళ్లకు ఊరటనిచ్చేలా.. ఇక ధావన్ కెప్టెన్గా..
ప్రపంచ దేశాల్లోని ఎంతో మంది క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పాల్గొని పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు సంపాదించుకుంటున్నారు. ప్రధాన జట్లతో పాటు అసోసియేట్ దేశాల ఆటగాళ్లు కూడా ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకునేందుకు క్యాష్ రిచ్ లీగ్ దోహదం చేస్తోంది. అయితే, మన క్రికెటర్లకు మాత్రం విదేశీ టీ20 లీగ్లలో ఆడే అవకాశం లేదు. బంధం తెంచుకుంటేనే ఒకవేళ ఎవరైనా అలా చేయాలనుకుంటే భారత క్రికెట్ నియంత్రణ మండలితో బంధాలన్నీ తెంచుకోవాల్సిందే. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్కు కూడా వీడ్కోలు పలికిన తర్వాతే విదేశీ టీ20 లీగ్లలో ఆడాల్సి ఉంటుంది. ఈ మేరకు బీసీసీఐ కట్టుదిట్టమైన నిబంధనలు విధించింది. సమీక్ష నిర్వహించడం ద్వారా అయితే, తాజాగా ఈ పాలసీపై సమీక్ష నిర్వహించేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. జూలై 7 నాటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఈ అంశంపై రివ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా అమెరికా జూలై నుంచి మేజర్ లీగ్ క్రికెట్(MLC) పేరిట టీ20 టోర్నీ నిర్వహించనుంది. మార్పులు చేసేందుకు సిద్ధం ఇటీవల ఐపీఎల్కు గుడ్బై చెప్పిన ఆటగాళ్లు కొందరు ఈ లీగ్లో భాగమయ్యేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ తమ పాత విధానంలో మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్ ప్రమాణాలు పెంచడం సహా విదేశీ టీ20 లీగ్లలో ఆడేందుకు యువ ఆటగాళ్లు బోర్డుతో బంధం తెంచుకునే పరిస్థితులను చక్కదిద్దే దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆ జట్టుకు కెప్టెన్గా ధావన్! ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన సీనియర్ ఆటగాళ్లకు దోహదం చేసేలా బోర్డు నిర్ణయం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశంతో పాటు ఏసియన్ గేమ్స్కు భారత పురుష, మహిళా జట్లను పంపే విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీనియర్ పురుషుల జట్టుకు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాన ఆటగాళ్లు వరల్డ్కప్-2023 సన్నాహకాలతో బిజీగా ఉండనున్న తరుణంలో గబ్బర్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టును చైనాకు పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు ఏసియన్ గేమ్స్ నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. చదవండి: మా వల్లే కిర్స్టన్కు పేరు.. ఆ తర్వాత అతడు సాధించింది సున్నా! మరి ద్రవిడ్.. 18 నెలలు జట్టుకు దూరం.. వచ్చి ఒక్క మ్యాచ్ ఆడగానే! జడ్డూ..: గంగూలీ -
స్టార్ క్రికెటర్ కొత్త సూపర్ లగ్జరీ కారు, ధరెంతో తెలిస్తే షాకవుతారు!
స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్కు లగ్జరీ కార్లపైమోజును మరోసారి చాటుకున్నాడు. తాజాగా అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారును కొనుగోలు చేశాడు.దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో ధావన్ ఒక వీడియను షేర్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ 4 లక్షల,11 వేలకు పైగా లైక్స్తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ మోడళ్ల ధర రూ. 3.5 కోట్ల నుండి అత్యంత ఖరీదైన వేరియంట్ రూ. 4 కోట్ల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ధావన్ కొనుగోలు చేసిన లేటెస్ట్ వెర్షన్ విలువ 4 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా ఎప్పటిలాగానే తనదైన స్టయిల్లో పంజాబీ పాటతో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. సెలబ్రిటీలు మనసుపడుతున్న కార్లలో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కూడా ఒకటి. ఫీచర్లు పరివీలిస్తే ఫ్లోటింగ్-స్టైల్, పూర్తిగా డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మెరిడియన్ 35-స్పీకర్ ఆడియో సిస్టమ్, డైనమిక్ నోయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. ఇది వీల్ వైబ్రేషన్లు, ఇంజిన్ నానోయిస్, టైర్ నోయిస్, రోడ్ నోయిస్ ఇతర బ్యాక్గ్రౌండ్ నోయిస్ కంట్రోల్ చేస్తుంది. భారీ 13.1అంగుళాల స్క్రీన్, హెడ్-అప్ డిస్ప్లే, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ , బ్యాక్ సీట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. ఇంకా హెడ్ల్యాంప్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ లైట్లు , ఇంటిగ్రేటెడ్ LED DRL ఉంటాయి. ప్రీమియం లుక్తో రీడిజైన్ చేయబడిన బంపర్తోపాటు అప్గ్రేడెడ్ డోర్ హ్యాండిల్స్ ఫ్లష్ ఫిట్టింగ్ను కలిగి ఉందీ కారు. కాగా ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్ శిఖర్ ధావన్కు లగ్జరీ కార్లంటే మక్కువ ఎక్కువ. ఇప్పటికే అతని గ్యారేజ్లోమెర్సిడెస్-బెంజ్ GL-క్లాస్ BMW M8ని కొనుగోలు చేశాడు. ఈ లిస్ట్లో తాజాగా ల్యాండ్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ చేరడం విశేషం. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
అదే మా కొంపముంచింది.. చాలా విషయాలు నేర్చుకున్నాం! అందుకే అలా చేశా: ధావన్
ఐపీఎల్-2023ను పంజాబ్ కింగ్స్ ఓటమితో ముగించింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం ధర్మశాల వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ నిష్క్రమించింది. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కాపాడుకోలేకపోయింది. ఇక తమ చివరి మ్యాచ్లో ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందించాడు. ఫీల్డింగ్ తప్పిదాల వల్లే తాము ఓడిపోయామని ధావన్ తెలిపాడు. "పవర్ప్లేలో మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం. అది మమ్మల్ని వెనుక్కి నెట్టింది. అయితే కుర్రాన్, జితేష్, షారుఖ్ తమ అద్భుత ఇన్నింగ్స్లతో మంచి స్కోర్ను అందించారు. దీంతో మళ్లీ మేము మ్యాచ్లో కమ్బ్యాక్ ఇచ్చాం. మా బాయ్స్ బౌలింగ్లో కూడా పర్వాలేదనపించారు. కానీ ఫీల్డింగ్లో మాత్రం నిరాశపరిచారు. ఈజీ క్యాచ్లను జారవిడవడం మా కొంపముంచింది. ఈ పిచ్పై కనీసం 200 పరుగులు చేస్తే మంచి స్కోర్ అవుతుంది. కొన్నిసార్లు బ్యాటింగ్ క్లిక్ అయితే బౌలింగ్లో విఫలమయ్యాం. మరికొన్ని సార్లు బౌలింగ్లో రాణిస్తే బ్యాటింగ్లో విఫలమయ్యాం. ఈ మ్యాచ్లోనూ ఈ రెండు విభాగాల్లో ఒక యూనిట్గా రాణించలేకపోయాం. మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. మేము ఈ సీజన్లో చాలా విషయాలు నేర్చుకున్నాము. మేము కొన్ని విభాగాల్లో అద్భుంగా రాణించాం. ఇక ఈ మ్యాచ్ను ఆఖరి వరకు తీసుకువెళ్లాలని ఉద్దేశ్యంతో మా ప్రధాన బౌలర్లను ముందే ఉపయోగించాను. కాబట్టి రాహుల్ చాహర్ చివరి ఓవర్ని వేయాల్సి వచ్చింది" అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో ధావన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఢిల్లీతో సీఎస్కే కీలక పోరు.. గెలిస్తే ప్లే ఆప్స్కు! లక్నో కూడా -
చాలా బాధగా ఉంది.. అదే మా ఓటమికి కారణం! ప్రతీ సారి ఇంతే: ధావన్
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ కథ దాదాపు ముగిసినట్లే. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైన పంజాబ్.. ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. తప్పనిసారిగా గెలవాల్సిన మ్యాచ్లో 15 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమి చవిచూసింది. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు మాత్రమే చేయగల్గింది. లివింగ్స్టోన్(94) అద్బుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ తన జట్టును గెలిపించుకోలేపోయాడు. ఇక కీలక మ్యాచ్లో ఓటమిపై మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్సీ శిఖర్ ధావన్ స్పందించాడు. ఓటమికి కారణం తమ చెత్త బౌలింగే అని గబ్బర్ తెలిపాడు. "కీలక మ్యాచ్లో ఓటమి పాలవ్వడం చాలా బాధగా ఉంది. మొదటి ఆరు ఓవర్ల(పవర్ప్లే)లో మేం బాగా బౌలింగ్ చేయలేదు. తొలుత పిచ్పై బంతి అద్బుతంగా స్వింగ్ అయింది. అటువంటి సమయంలో మా పేసర్లు వికెట్లు సాధించడంలో విఫలమయ్యారు. వికెట్ల విషయం పక్కన పెడితే కనీసం పరుగులనైనా కట్టడి చేసి ఉంటే బాగుండేది. ఈ మ్యాచ్లోనే కాకుండా ప్రతీ మ్యాచ్లోనే మేం ఇంతే. పవర్ప్లేలో కనీసం 50-60 మధ్య పరుగులు సమర్పించుకుంటున్నాం. అయితే ఈ మ్యాచ్లో మేము చాలా క్లోజ్గా వెళ్లి ఓడిపోయాం. ఆఖరి ఓవర్లో నోబాల్ తర్వాత మళ్లీ మా ఆశలు చిగురించాయి. కానీ దురదృష్టవశాత్తూ అది జరగలేదు. లివింగ్ స్టోన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్లో కూడా మాకు మంచి ఆరంభం లభించలేదు. తొలి ఓవర్ మెయిడిన్, రెండో ఓవర్లో నేను ఔటయ్యాను. దాదాపు పవర్ప్లే మేమ 12 బంతులు వరకు వృథా చేశాము. ఇక ఆఖరి ఓవర్లో స్పిన్నర్తో బౌలింగ్ చేయంచాలన్న నా నిర్ణయం విఫలమైంది. అంతకు ముందు ఫాస్ట్బౌలర్లకు ఒకే ఓవర్లో 18-20 పరుగులు రాబట్టారు. కాబట్టి నేను స్పిన్నర్తో ముందుకు వెళ్లాను అని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో ధావన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: పంజాబ్ కొంపముంచిన ధావన్ చెత్త కెప్టెన్సీ.. అలా చేసి ఉంటే? -
క్రెడిట్ వారికే.. ప్రభ్సిమ్రన్ అత్యద్భుతం: పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్
ఐపీఎల్-2023లో నిన్న (మే 13) మరో లో స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకోగా.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ప్రభ్సిమ్రన్ (65 బంతుల్లో 103; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. డీసీ ఇన్నింగ్స్లో వార్నర్ (54) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ ధవన్ మాట్లాడుతూ.. తమ బౌలర్లపై, ముఖ్యంగా స్పిన్నర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. బౌలర్లే తమను తిరిగి ఆటలోకి తీసుకొచ్చారని కొనియాడాడు. క్రెడిట్ అంతా వారికే దక్కుతుందని అన్నాడు. తాము బ్యాటింగ్ చేసే సమయంలో సైతం పిచ్ స్పిన్నర్లకు సహకరించిందని, అలాంటి పిచ్పై ఓ పక్క వికెట్లు పడుతున్నా ప్రభ్సిమ్రన్ అత్యద్భుతమైన నాక్ ఆడాడని ఆకాశానికెత్తాడు. మ్యాచ్ను పంజాబ్వైపు టర్న్ చేసిన స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ (4/30)పై కూడా ధవన్ ప్రశంసల వర్షం కురిపించాడు. వికెట్లే లక్ష్యంగా నెమ్మదిగా బౌలింగ్ చేయమని బ్రార్కి చెప్పానని.. అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను ఔట్ చేసిన తీరు అమోఘమని కొనియాడాడు. డీసీపై గెలుపు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని, ప్రశాంతంగా ఉండటం తమకు బాగా సహాయపడిందని, తదుపరి రెండు మ్యాచ్ల్లో ఇలాగే ఉండేందుకు ప్రయత్నిస్తామని ధవన్ చెప్పుకొచ్చాడు. చదవండి: అదే మా కొంపముంచింది.. బౌలర్లు ఒత్తిడికి లోనయ్యారు! చెత్త కెప్టెన్సీ వల్లే ఇదంతా -
ఐపీఎల్లో ధావన్ అరుదైన రికార్డు.. కోహ్లి, వార్నర్ సరసన
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 50 హాఫ్ సెంచరీలు కొట్టిన మూడవ బ్యాటర్గా ధావన్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2023లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన ధావన్ ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్లో 47 బంతులు ఎదుర్కొన్న ధావన్ 9 ఫోర్లు, ఓ సిక్సర్తో 57 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ధావన్ ఇప్పటివరకు 50 హాఫ్ సెంచరీలతో పాటు రెండు సెంచరీలు కూడా నమోదు చేశాడు.ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ధావన్ కంటే ముందు డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లి ఉన్నారు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో వార్నర్ ఇప్పటివరకు 59 హాఫ్ సెంచరీలు సాధించగా..విరాట్ కోహ్లి 50 ఆర్థశతకాలు సాధించాడు. చదవండి: #Glenn Phillips: ఫిలిప్స్ విధ్వంసకర ఇన్నింగ్స్.. అరుదైన రికార్డు! అయితే 416.66 స్ట్రైక్రేటుతో.. -
LSG VS PBKS: ఆ నిర్ణయమే పంజాబ్ కొంపముంచిందట..!
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో నిన్న (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 56 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ మీడియాతో మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను విశ్లేషించాడు. తాను తీసుకున్న ఓ నిర్ణయం మిస్ ఫైర్ అయ్యి, అదే తమ కొంపముంచిందని అభిప్రాయపడ్డాడు. ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్తో బరిలోకి దిగడమే తాము చేసిన అతిపెద్ద తప్పిదమని, అదనపు స్పిన్నర్తో బరిలోకి దిగిన లక్నోకు అదే కలిసొచ్చిందని తెలిపాడు. రాహుల్ చాహర్ (4-0-29-0) మినహా తమ బౌలర్లంతా ధారళంగా పరుగులు సమర్పించుకున్నారని, అందుకు తగిన మూల్యం జట్టు మొత్తం చెల్లించుకుందని అన్నాడు. ఇది తమకో గుణపాఠమని చెప్పిన ధవన్.. భారీ లక్ష్య ఛేదనలో తాను త్వరగా ఔట్ కావడంపై కూడా స్పందించాడు. బంతి తాను ఊహించినంత క్విక్గా లేదని, అందుకే తానాడిన షాట్ నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లిందని తెలిపాడు. ఛేదనలో ఓ దశలో (అథర్వ ధాటిగా ఆడుతున్నప్పుడు) గెలుపుపై ఆశలు చిగురించాయని, అయితే లక్నో బౌలర్లు అద్భుతంగా చేసి తమను కట్టడి చేశారని పేర్కొన్నాడు. షారుక్ ఖాన్ను ఆఖర్లో ఆడించడంపై స్పందిస్తూ.. లివింగ్స్టోన్, సామ్ కర్రన్ లాంటి భారీ హిట్టర్లు ఉండగా, షారుక్ను ముందు పంపే సాహసం చేయలేదని చెప్పుకొచ్చాడు. కాగా, పంజాబ్తో జరిగిన మ్యాచ్లో లక్నో 56 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తడబడిన పంజాబ్, తమ శక్తి మేరకు ప్రయత్నించి 201 పరుగులకు (19.5) ఆలౌటైంది. లక్నో ఇన్నింగ్స్లో కైల్ మేయర్స్ (54), ఆయూష్ బదోని (43), స్టోయినిస్ (72), పూరన్ (45) సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడగా.. పంజాబ్ తరఫున అథర్వ టైడే (66), సికందర్ రజా (36), లివింగ్స్టోన్ (23), కర్రన్ (21), జితేశ్ శర్మ (24) ఓ మోస్తరుగా రాణించారు. లక్నో బౌలర్లు యశ్ ఠాకూర్ 4, నవీన్ ఉల్ హాక్ 3, బిష్ణోయ్ 2, స్టోయినిస్ ఓ వికెట్ సాధించారు. -
పంజాబ్ కింగ్స్కు గుడ్ న్యూస్.. విధ్వంసకర ఆటగాడు వచ్చేస్తున్నాడు..!
ఐపీఎల్-2023లో భాగంగా మొహాలీ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 20) మధ్యాహ్నం 3:30 గంటలకు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ముఖ్యంగా వరుస పరాజయాల బాట పట్టిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ గెలుపు బూస్టప్ ఇస్తుంది. ఈ జట్టు ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు పంజాబ్ పరిస్థితి సైతం ఏమంత ఆశాజనకంగా లేదు. ఆ జట్టు గత మ్యాచ్లో గెలిచిందనే కాని, ఓవరాల్గా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో తుది జట్లలో ఎవరెవరు ఉండే అవకాశముందో అన్న విషయాన్ని ఓసారి పరిశీలిస్తే.. భుజం గాయం కారణంగా లక్నోతో జరిగిన గత మ్యాచ్కు దూరంగా ఉన్న పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే లేట్గా జట్టుతో చేరి, అనంతరం నెట్స్లో గాయపడిన ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్.. ఆర్సీబీతో మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. లివింగ్ స్టోన్ తుది జట్టులోకి వస్తే గత మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సికందర్ రజా, ఆసీస్ ఆల్రౌండర్ మాథ్యూ షార్ట్లలో ఎవరో ఒకరు బెంచ్కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఆర్సీబీ స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ విషయానికొస్తే.. గాయం కారణంగా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఈ ఆసీస్ పేసర్ ఇంకా కోలుకునే దశలోనే ఉన్నట్లు సమాచారం. ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. గత మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓడిన జట్టునే యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. పంజాబ్ జట్టులో మాత్రం రెండు మార్పులకు ఆస్కారం ఉంది. గత మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన అథర్వ స్థానంలో ధవన్.. షార్ట్, సికిందర్ రజాలలో ఎవరో ఒకరి స్థానంలో లివింగ్స్టోన్ తుది జట్టులోకి రావచ్చు. తుది జట్లు (అంచనా).. పంజాబ్ కింగ్స్: శిఖర్ ధవన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రన్, మాథ్యూ షార్ట్/లివింగ్స్టోన్, హర్ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రన్, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, రబాడ, అర్షదీప్ సింగ్ ఆర్సీబీ: డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, మహిపాల్ లోమ్రార్, మ్యాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, హసరంగ, పార్నెల్, విజయ్కుమార్ వైశాఖ్, సిరాజ్ -
ధావన్ ఖలీఫా లాంటివాడు.. ఈసారి పంజాబ్ కచ్చితంగా: టీమిండియా మాజీ బ్యాటర్
IPL 2023- Shikhar Dhawan: ‘‘పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విభాగం బాగుంది. ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల బౌలర్లు జట్టులో ఉన్నారు. ఈసారి ఐపీఎల్లో పంజాబ్ టాప్-4లో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి’’ అని టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ గురించి మాట్లాడుతూ.. ‘‘శిఖర్ ధావన్ ఐపీఎల్కు ఖలీఫా లాంటివాడు. నాయకుడు అంటే ఎలా ఉండాలో ఉదాహరణగా నిలుస్తున్నాడు’’ అని కొనియాడాడు. ఓవైపు బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండటం.. మరోవైపు సమర్థవంతమైన కెప్టెన్ ఉన్న కారణంగా పంజాబ్ కింగ్స్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరడం ఖాయమని కైఫ్ అంచనా వేశాడు. కాగా ఐపీఎల్-2023 వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్ను విడిచిపెట్టిన విషయం తెలిసిందే. బ్యాటర్గా, కెప్టెన్గా గబ్బర్ హిట్! ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది యాజమాన్యం. ఈ క్రమంలో ఐపీఎల్-2023లో తొలి రెండు మ్యాచ్లలో ధావన్ సేన జయకేతనం ఎగురవేసింది. తమ ఆరంభ మ్యాచ్లో సొంతమైదానం మొహాలీలో కోల్కతా నైట్ రైడర్స్తో పోటీపడ్డ పంజాబ్.. డీఎల్ఎస్ పద్ధతిలో 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ధావన్ 40 పరుగులు సాధించాడు. జట్టు 191 పరుగులు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కోల్కతా బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలమైన అర్ష్దీప్ సింగ్(3 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మిగతావాళ్లలో రాహుల్ చహర్, హర్ప్రీత్బ్రార్, సికందర్ రజా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఒకడే ఒక్కడు మొనగాడు ఇక రెండో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్తో తలపడిన పంజాబ్ విజయంలో ధావన్ (86 పరుగులు నాటౌట్) , పేసర్ నాథన్ ఎల్లిస్ (4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 4 వికెట్లు) కీలక పాత్ర పోషించారు. అయితే, సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మాత్రం పంజాబ్కు ఓటమి తప్పలేదు. కెప్టెన్ శిఖర్ ధావన్ (66 బంతుల్లో 99 పరుగులు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో రెండు విజయాలతో పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పంజాబ్ గురువారం గుజరాత్ టైటాన్స్తో పోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన మహ్మద్ కైఫ్.. ధావన్ బ్యాటింగ్ మెరుపులు, నాయకత్వ ప్రతిభను ప్రశంసించాడు. ఈసారి పంజాబ్ కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుతుందని జోస్యం చెప్పాడు. కాగా గాయం నుంచి కోలుకున్న పవర్ హిట్టర్ లియామ్ లివింగ్స్టోన్ జట్టుతో చేరడంతో పంజాబ్కు బలం పెరిగినట్లయింది. చదవండి: ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్.. తొలుత ఎవరూ కొనలేదు, ఇప్పుడు తెలిసొచ్చింది..! IPL 2023: మొన్న నోర్జే, నిన్న సందీప్ శర్మ..! -
PBKS Vs GT: పవర్ హిట్టర్ వచ్చేశాడు! అందరి కళ్లు అతడిపైనే!
IPL 2023- Punjab Kings vs Gujarat Titans: ఐపీఎల్-2023లో భాగంగా డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్తో పోరుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. సొంత మైదానంలో టైటాన్స్తో ఢొకొట్టేందుకు ధావన్ సేన పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. పవర్ హిట్టర్, ఇంగ్లంగ్ స్టార్ లియామ్ లివింగ్స్టోన్ రాకతో పంజాబ్లో జోష్ వచ్చింది. తమ స్టార్ ప్లేయర్ వచ్చేశాడని.. అందరి కళ్లు అతడిపైనే ఉన్నాయంటూ కింగ్స్ జట్టు లివింగ్స్టోన్ ఫొటోలు షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకుంది. కాగా గాయం కారణంగా సుదీర్ఘ కాలం పాటు ఆటకు దూరమైన లివింగ్స్టోన్ ఈ మ్యాచ్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు.. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ బెంచ్కే పరిమితమైన సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ కూడా గుజరాత్తో మ్యాచ్లో ఆడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్ తుది జట్టు ఎలా ఉండబోతుందన్న అంశాన్ని పరిశీలిద్దాం. గుజరాత్తో పంజాబ్ ఢీ ఓపెనర్లుగా ప్రబ్సిమ్రన్ సింగ్, కెప్టెన్ శిఖర్ ధావన్ జోడీ కొనసాగనుండగా.. లివింగ్స్టోన్ను వన్డౌన్లో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఇక భనుక రాజపక్స స్థానంలో గత మ్యాచ్లో వన్డౌన్లో వచ్చిన మాథ్యూ షార్ట్ బెంచ్కే పరిమితం కానున్నాడు. అదే విధంగా ఆశించిన మేర రాణించలేకపోతున్న సికందర్ రజాకు ఇదే ఆఖరి ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది. మిడిలార్డర్లో షారుక్ ఖాన్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, హర్ప్రీత్ బ్రార్ ఆడనున్నారు. వీరితో పాటు సామ్ కర్రన్ ఉండనే ఉంటాడు. గతంలో చెరోసారి ఇక.. బౌలింగ్ విభాగంలో పేసర్లు కగిసో రబడ, నాథన్ ఎల్లిస్లలో ఒకరు.. అర్ష్దీప్ సింగ్తో పాటు స్పిన్నర్ రాహుల్ చహర్ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. కాగా గత మ్యాచ్లో శిఖర్ ధావన్ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం కావడంతో సన్రైజర్స్ చేతిలో పంజాబ్కు ఓటమి తప్పలేదు. మరోవైపు.. గుజరాత్కు సైతం గత మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ రూపంలో ఈ సీజన్లో తొలి ఓటమి ఎదురైంది. దీంతో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. కాగా గురువారం మ్యాచ్ జరుగనున్న మొహాలీ స్టేడియంలో గతంలో ఇరు జట్లు తలపడిన రెండు సందర్భాల్లో చెరో విజయం నమోదు చేశాయి. గుజరాత్తో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ తుది జట్ల(అంచనా): పంజాబ్ కింగ్స్ ప్రబ్సిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్స్టోన్, సికిందర్ రజా, జతేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, సామ్ కర్రన్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, నాథన్ ఎల్లిస్/కగిసో రబడ, అర్ష్దీప్ సింగ్. గుజరాత్ టైటాన్స్ వృద్ధిమాన్ సాహా, శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్. చదవండి: IPL 2023: నీ తప్పిదం వల్ల భారీ మూల్యం! అమ్మో ఈ ‘మహానుభావుడు’ ఉంటేనా.. సచిన్ నన్ను బ్యాట్తో కొట్టాడు.. పిచ్చివాడిని చేస్తావా అంటూ ఫైర్ అయ్యాడు: సెహ్వాగ్ All the focus is on 𝐨𝐧𝐞 𝐦𝐚𝐧! 📸@liaml4893 is ready to Roar 🦁#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/wo7boR6Qvk — Punjab Kings (@PunjabKingsIPL) April 12, 2023 -
మళ్లీ ప్రేమలో పడ్డ శిఖర్ ధవన్..? వైరల్ వీడియో
ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 9) సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో అజేయమైన 99 పరుగులు చేసి, తన జట్టు ఓడినా కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్, ఇవాళ ఓ క్రికెటేతర విషయం ద్వారా వార్తల్లోకెక్కాడు. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో ధవన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత కీలక విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకుంటూ కనిపించాడు. Love is in the air for Shikhar Dhawan! He has moved on and found someone in a Delhi Party. #ShikharDhawanLeakedVideo pic.twitter.com/TZhLUyiHBp — Salman (Mohd Ali Shaikh) (@salman3126) April 10, 2023 ఈ వీడియోలో ధవన్ మాట్లాడుతూ.. ఇటీవలే ఢిల్లీలోని ఓ ఫామ్హౌస్ పార్టీలో ఓ వ్యక్తిని కలిశానని.. ఆమెను తొలి చూపులోనే ప్రేమించానని, ఆమెను చూడగానే తన జీవితంలో ఎన్నడూ లేని క్లారిటీ వచ్చిందని, ఆమెను చూస్తూ అలాగే ఉండిపోయానని.. ఆమె మాట్లాడుతుంటే వింటూ ఉండిపోయానని అన్నాడు. ఆతర్వాత రెండు రోజుల్లో తామిద్దరంలో కలిసి ఇంట్లో ఉన్నామని తెలిపాడు. ఓ వ్యక్తితో సెట్ అవుతుందని అనిపిస్తే వెయిట్ చేయడమెందుకు.. పాత విషయాలను మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించడమేనని చెప్పాడు. ఈ వీడియోలో ధవన్ ప్రస్తావించిన వ్యక్తి ఎవరన్న విషయం స్పష్టంగా తెలియనప్పటికీ, అతని మాటల ఆధారంగా తన కొత్త జీవితంలోకి వచ్చిన మరో మహిళ అన్న విషయం క్లియర్గా తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో, ధవన్ కొత్త ఇన్నింగ్స్ (పెళ్లి విషయంలో) ప్రారంభించాడని జనాలు అనుకుంటున్నారు. అయితే, ఇది లీక్డ్ వీడియోనా లేక ఏదైనా అడ్వర్టైజ్మెంట్లో భాగమా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, 8 ఏళ్ల వివాహ బంధం తర్వాత ధవన్ 2021లో భార్య అయేషా ముఖర్జీతో విడిపోయి, అప్పటినుంచి ఒంటిగా ఉంటున్న విషయం తెలిసిందే. -
IPL 2023: ఇంజక్షన్లు తీసుకున్నా.. అద్భుత ప్రభావం.. త్వరలోనే కలుస్తా
IPL 2023- PBKS- Liam Livingstone: పంజాబ్ కింగ్స్కు శుభవార్త. పవర్ హిట్టర్, ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్స్టోన్ త్వరలోనే జట్టుతో చేరనున్నాడు. ఈ విషయాన్ని లివింగ్స్టోన్ స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘ గత రెండు నెలలుగా కఠిన పరిస్థితులు.. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతా.. త్వరలోనే మీతో చేరతా పంజాబ్ కింగ్స్’’ అని సోమవారం ట్వీట్ చేశాడు. కాగా 11.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పంజాబ్ కింగ్స్ లివింగ్స్టోన్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే గాయం కారణంగా గతేడాది డిసెంబరు నుంచి ఆటకు దూరమైన అతడు ఇన్నాళ్లు చికిత్స తీసుకున్నాడు. లియామ్ లివింగ్స్టోన్ (PC: IPL) ఇంజక్షన్లు తీసుకున్నా ఈ క్రమంలో కోలుకున్న లివింగ్స్టోన్ లంకాషైర్ క్రికెట్ టీవీ ఇంటర్వ్యూలో ఆదివారం మాట్లాడుతూ.. ‘‘గత వారం ఇంజక్షన్లు తీసుకున్నా. అవి అద్భుతమైన ప్రభావం చూపాయి. రానున్న 48 గంటల్లో ఇండియాకు పయనమవుతా’’ అని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా మరోసారి అప్డేట్ ఇచ్చాడు. దీంతో పంజాబ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పవర్ హిట్టర్ వస్తే తమ బ్యాటింగ్ ఆర్డర్ బలం పెరుగుతుందని పేర్కొంటున్నారు. కాగా ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా లివింగ్స్టోన్ సొంతమని ఇప్పటికే పలుమార్లు రుజువైన విషయం తెలిసిందే. పవర్ హిట్టర్ వచ్చేస్తున్నాడు.. ఇక 29 ఏళ్ల లివింగ్స్టోన్ 2017లో సౌతాఫ్రికాతో టీ20మ్యాచ్తో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2021లో వన్డే, 2022లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు మొత్తంగా ఒక టెస్టులో 16 పరుగులు, 12 వన్డేల్లో 250 పరుగులు, 20 టీ20లలో 423 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. తొలి రెండు మ్యాచ్లలో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్.. సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం నాటి మ్యాచ్లో పరాజయం పాలైంది. ప్రస్తుతం ధావన్ సేన పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. పంజాబ్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 13న గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. అన్నీ కుదిరితే ఈ మ్యాచ్లో లివింగ్స్టోన్ ఆడే అవకాశం ఉంది. చదవండి: 4 ఓవర్లలో 69 పరుగులు; తలెత్తుకో చాంపియన్.. కేకేఆర్ ట్వీట్ వైరల్! ఎవరీ యశ్ దయాల్? IPL 2023: హర్షా బోగ్లేకు ధావన్ అదిరిపోయే కౌంటర్! నవ్వుతూనే చురకలు! It’s been a long couple months but it’s time to get back to work… see you soon @PunjabKingsIPL 🙏❤️ — Liam Livingstone (@liaml4893) April 9, 2023 -
IPL 2023: హర్షా బోగ్లేకు ధావన్ అదిరిపోయే కౌంటర్! నవ్వుతూనే చురకలు!
ఐపీఎల్-2023లో భాగంగా ఎస్ఆర్హెచ్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ దావన్ మాత్రం అందరి మనసులను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్లో ధావన్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభం నుంచి చివరి వరకు క్రీజులో నిలిచి 66 బంతుల్లో అజేయంగా 99 పరుగులు చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న ధావన్ మాత్రం తన పట్టుదలను కోల్పోలేదు. ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టుకు 143 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ను అందించాడు. ఇక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన గబ్బర్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ అవార్డు అందుకునే సమయంలో ప్రముఖ మ్యాచ్ ప్రెజెంటర్, వాఖ్యత హర్షా భోగ్లే, ధావన్ మధ్య ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? ఏప్రిల్ 5న గౌహతి వేదికగా రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో 5 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ధావన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో గబ్బర్ 86 పరుగులు చేశాడు. అయితే పంజాబ్ ఇన్నింగ్స్ అనంతరం హర్షా భోగ్లే ధావన్ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో "శిఖర్ ధావన్ను తన స్ట్రైక్ రేట్ను మరింత పెంచుకోవాలి. అతడి ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగింది. ముఖ్యంగా గహహుతి వంటి వికెట్పై మరింత దూకుడుగా ఆడాలి. ఆఖరిలో అతడు తన స్ట్రైక్ రేట్ను పెంచాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ఆరంభంలో సింగిల్స్ మాత్రమే తీశాడు. అతడి ఇన్నింగ్స్ చూస్తే..జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడా లేదా అన్న సందేహం కలుగుతుందని" భోగ్లే పేర్కొన్నాడు. ఇక తాజాగా ఎస్ఆర్హెచ్తో పోస్ట్ మ్యాచ్ ప్రేజేటేషన్ సందర్భంగా బోగ్లే వ్యాఖ్యలకు గబ్బర్ కౌంటర్ ఇచ్చాడు. "ఇప్పుడు నా స్ట్రైక్ రేట్తో మీరు సంతోషంగా ఉన్నారా" అని ధావన్ నవ్వుతూ బోగ్లేను ప్రశ్నించాడు. అందుకు బదులుగా "ఈ మ్యాచ్లో మీ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో మీరు ఆడిన ఇన్నింగ్స్ వర్ణాతీతం. నిజంగా మీ స్ట్రైక్ రేట్ పట్ల సంతోషంగా ఉన్నాను" అంటూ బోగ్లే సమాధానం ఇచ్చాడు. చదవండి: IPL 2023 GT vs KKR: నరాలు తెగ ఉత్కంఠ.. సంచలన విజయం! కన్నీళ్లు పెట్టుకున్న జుహీ చావ్లా -
పంజాబ్కు గుడ్న్యూస్.. అతడు వచ్చేశాడు! హైదరాబాద్కు చేరుకున్నధావన్ సేన
IPL 2023- Punjab Kings- Liam Livingstone- Kagiso Rabada: వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్కు శుభవార్త. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ భారత్కు వచ్చేశాడు. జట్టుతో కలిసి హైదరాబాద్కు చేరుకున్నాడు. అదే విధంగా ధావన్ సేనకు సంబంధించిన మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. భారీ మొత్తం వెచ్చించి కింగ్స్ కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ రాకకోసం మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా కోలుకోలేదు మోకాలి గాయం కారణంగా రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న లివింగ్స్టోన్ ఇంకా పూర్తి కోలుకోలేదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఓల్డ్ ట్రఫోర్డ్లో చికిత్స పొందుతున్న లివింగ్స్టోన్ ఏప్రిల్ 15 తర్వాతే భారత్కు వెళ్లే అవకాశం ఉందని క్రిక్బజ్తో పేర్కొన్నారు. కాగా గాయం కారణంగా గతేడాది డిసెంబరు నుంచి లియామ్ లివింగ్స్టోన్ ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న అతడు.. ఏప్రిల్ మొదటి వారంలోనే పంజాబ్ కింగ్స్తో చేరతాడనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం అతడి రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబడ మాత్రం తదుపరి మ్యాచ్లో అందుబాటులోకి రానున్నాడు. కాగా ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్ హైదరాబాద్ వేదికగా.. సన్రైజర్స్తో మ్యాచ్లో తలపడనుంది. హైదరాబాద్కు చేరుకున్న ధావన్ సేన ఈ నేపథ్యంలో ధావన్ సేన.. హైదరాబాద్కు చేరుకుంది. సంప్రదాయ పద్ధతిలో గబ్బర్ బృందానికి స్వాగతం లభించింది. కాగా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2023 సీజన్ను ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై 7 పరుగుల తేడాతో గెలుపొందిన పంజాబ్.. రెండో మ్యాచ్లో రాజస్తాన్పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వల్ప తేడాలతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కాగా 11.50 కోట్ల రూపాయల భారీ మొత్తం చెల్లించి పంజాబ్ లివింగ్స్టోన్ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక రబడ కోసం 9.25 కోట్లు ఖర్చు చేసింది. చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే కోహ్లి వచ్చాడు.. కోపంగా బ్యాట్ విసిరేశాడు.. పక్కనే కూర్చున్న నాతో.. Sadda Captain has spoken. 🫡 📍Hello, Hyderabad. 👋🏻#JazbaHaiPunjabi #SaddaPunjab #TATAIPL | @SDhawan25 pic.twitter.com/4GpSvq1Q9J — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 All eyes on KG! 👀#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL I @KagisoRabada25 pic.twitter.com/wwhpjjLRTv — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 Sadde 🦁s enjoyed a warm Hyderabadi welcome! 😊 🙏#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL pic.twitter.com/wuvpq4Fyb7 — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2023 -
అన్నా.. ప్రతిసారీ గిట్లనే అయితాంది.. ఎందుకంటావ్?! సంజూ ట్వీట్ వైరల్
IPL 2023- RR Vs PBKS: పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. సంజూతో పాటు శిఖర్ ధావన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఐపీఎల్-2023లో భాగంగా రాజస్తాన్- పంజాబ్ అసోంలోని గువాహటి వేదికగా బుధవారం తలపడ్డాయి. పంజాబ్ ఓపెనర్లు సూపర్ హిట్ రాయల్స్కు హోం గ్రౌండ్ అయిన బర్సపరా స్టేడియంలో టాస్ గెలిచిన సంజూ.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు ఓపెనర్లు ప్రబ్సిమ్రన్ సింగ్(60), కెప్టెన్ శిఖర్ ధావన్ (86 నాటౌట్) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. మిగిలిన వాళ్లలో జితేశ్ శర్మ(27) ఒక్కడు 20 పరుగుల మార్కు దాటాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పంజాబ్ 197 పరుగులు చేసింది. ఇక ఫీల్డింగ్ సమయంలో రాజస్తాన్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ వేలికి గాయం కావడంతో.. యశస్వి జైశ్వాల్(11)కు జతగా ఓపెనింగ్కు దిగిన అశ్విన్ డకౌట్ అయ్యాడు. ఇక వన్డౌన్లో వచ్చిన బట్లర్ సైతం తక్కువ స్కోరుకే పరిమితం కాగా కెప్టెన్ సంజూ 25 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు. ఆశలు పెంచిన హెట్మెయిర్, ధ్రువ్.. కానీ పడిక్కల్ 21 , రియాన్ పరాగ్ 20 పరుగులు చేయగా.. ఆఖర్లో షిమ్రన్ హెట్మెయిర్(18 బంతుల్లో 36 పరుగులు), ధ్రువ్ జురెల్ (15 బంతుల్లో 32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి పోరాటంతో గెలుపు అంచుల వరకు వచ్చిన రాజస్తాన్ ఆఖరికి ఐదు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గెలిచే మ్యాచ్లో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో సంజూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. పంజాబ్ కెప్టెన్, టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్తో ఉన్న ఫొటోను పంచుకున్న ఈ కేరళ బ్యాటర్.. ‘‘పాజీ(అన్నా).. మన మధ్య ప్రతిసారీ ఇలాంటి ఉత్కంఠ రేపే మ్యాచ్లే ఎందుకు జరుగుతాయంటావు?’’ అని చమత్కరించాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘ఆటలో గెలుపోటములు సహజం.. కానీ ఆటగాళ్ల ప్రేమాభిమానాలు, క్రీడాస్ఫూర్తి ఇలా శాశ్వతం’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు రాజస్తాన్- పంజాబ్ ఐపీఎల్లో 25 మ్యాచ్లలో తలపడగా.. రాయల్స్ 14, కింగ్స్ 11 మ్యాచ్లలో గెలిచాయి. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్కు శ్రేయస్ అయ్యర్ దూరం.. టీమిండియాలోకి ఆంధ్ర ఆటగాడు తొలి మ్యాచ్లోనే చుక్కలు చూపించాడు.. ఎవరీ ధ్రువ్ జురెల్? వీడియో వైరల్ “Paaji, har baar itne tight matches kyun?” 🫢 pic.twitter.com/Fn6zrc9La9 — Sanju Samson (@IamSanjuSamson) April 6, 2023 That's that from Match 8. @PunjabKingsIPL win their second game on the trot as they beat #RR by 5 runs. Scorecard - https://t.co/Cmk3rElYKu #TATAIPL #RRvPBKS #IPL2023 pic.twitter.com/R9j1jFpt5C — IndianPremierLeague (@IPL) April 5, 2023 -
Sam Curran: పర్లేదు.. పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తున్నాడు..!
ఐపీఎల్-2023లో అత్యధిక ధర పలికిన పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ (18.5 కోట్లు).. తనపై పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తున్నాడు. ఇప్పటివరకు అతను ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపిస్తున్నాడు. ఐపీఎల్-2023లో ఇతర ఖరీదైన ఆటగాళ్లలా కాకుండా అంచనాలను తగ్గట్టుగా రాణిస్తూ నాట్ బ్యాడ్ అనిపిస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కర్రన్ తర్వాత అత్యంత ఖరీదైన ఆటగాళ్లు కెమారూన్ గ్రీన్ (ఎంఐ, 17.5 కోట్లు), కేఎల్ రాహుల్ (లక్నో, 17 కోట్లు), బెన్ స్టోక్స్ (16.25 కోట్లు) అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతుంటే.. కర్రన్ ఓకే అనిపిస్తున్నాడు. కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో బ్యాట్తో (17 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్సర్లు), బంతితో (1/38) ఓ మోస్తరుగా రాణించిన అతను.. నిన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఉత్కంఠ సమరంలో ఆఖరి ఓవర్లో 16 పరుగులకు డిఫెండ్ చేసి (10 పరుగులు మాత్రమే ఇచ్చాడు) తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించి, రన్నింగ్ ఎడిషన్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో కర్రన్ ఆఖరి ఓవర్లో 16 పరుగులు డిఫెండ్ చేసిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఆఖరి ఓవర్ అద్భుతమైన మెచ్యూరిటీతో బౌల్ చేశాడని కితాబునిస్తున్నారు. కర్రన్ ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తే ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ టైటిల్ కల సాకారమవుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే, పంజాబ్-రాజస్థాన్ జట్ల మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగిన టఫ్ ఫైట్లో పంజాబ్ విజయం సాధించింది. 198 పరుగుల లక్ష్యఛేదనలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదులుకున్న రాజస్థాన్ను హెట్మైర్ (18 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు), ఇంపాక్ట్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ (15 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ ఆటతో గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. కర్రన్ తెలివైన బౌలింగ్తో రాజస్థాన్ గెలుపును అడ్డుకున్నాడు. -
పంజాబ్ కింగ్స్లో కీలక మార్పు.. గాయపడ్డ ఆల్రౌండర్ రీప్లేస్మెంట్ ఎవరంటే..?
పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. భుజం గాయంతో బాధపడుతూ సీజన్ మొత్తానికే దూరమైన యువ ఆల్రౌండర్ రాజ్ అంగద్ బవా స్థానంలో పంజాబ్కు చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ గుర్నూర్ సింగ్ బ్రార్ను ఎంపిక చేసుకుంది పీబీఎస్కే యాజమాన్యం. బ్రార్ను బేస్ ధర 20 లక్షలకు సొంతం చేసుకున్నట్లు పంజాబ్ యాజమాన్యం వెల్లడించింది. గత ఐపీఎల్ సీజన్ (2022) రెండు మ్యాచ్లు ఆడిన బవా.. ప్రస్తుత ఎడిషన్ ప్రారంభానికి ముందే గాయపడిన విషయం తెలిసిందే. (రాజ్ అంగద్ బవా) గుర్నూర్ సింగ్ బ్రార్ విషయానికొస్తే.. ఈ పంజాబ్ ఆల్రౌండర్ 2022 డిసెంబర్లో పంజాబ్ తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పంజాబ్ తరఫున ఇప్పటివరకు 5 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన బ్రార్ 120.22 స్ట్రయిక్రేట్తో 107 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్లో 3.80 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. (గుర్నూర్ సింగ్ బ్రార్) ఇదిలా ఉంటే, రన్నింగ్ ఎడిషన్లో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్లో కేకేఆర్పై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భానుక రాజపక్ష (50), కెప్టెన్ శిఖర్ ధవన్ (40) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన కేకేఆర్ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్థతిలో పంజాబ్ను విజేతగా ప్రకటించారు. 3 వికెట్లు పడగొట్టిన కేకేఆర్ పతనానికి బీజం వేసిన అర్షదీప్ సింగ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
RR Vs PBKS: చహల్ ఉండగా భయమేల! కానీ అసోంలో మాత్రం..
Rajasthan Royals vs Punjab Kings Predicted Playing XI: ఐపీఎల్-2023 సీజన్ను భారీ విజయంతో ఆరంభించిన రాజస్తాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్తో పోటీకి సిద్ధమైంది. గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరుగనుంది. ఇక తమ తొలి మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్పై స్వల్ప తేడాతో గెలుపొందిన పంజాబ్ సైతం రాజస్తాన్తో ఢీ అంటే ఢీ అంటోంది. కాగా తమకు హోం గ్రౌండ్గా ఉన్న ఈ స్టేడియంలో రాజస్తాన్ రెండు మ్యాచ్లు ఆడిన తర్వాత సొంతమైదానం జైపూర్లో మిగిలిన మ్యాచ్లు ఆడనుంది. ఇదిలా ఉంటే.. మరి అసోంలో వాతావరణం, బర్సపరా స్టేడియంలో పిచ్ పరిస్థితి, తుది జట్లు ఎలా ఉండబోతున్నాయన్న వివరాలు గమనిద్దాం. పిచ్ పరిస్థితి? గతంలో పలు అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన అసోం స్టేడియంలో వికెట్ కాస్త బౌన్సీగా ఉంటుంది. పేసర్లకు అనుకూలం. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు సహకరిస్తుంది. గతేడాది అక్టోబరులో ఇక్కడ టీమిండియా- సౌతాఫ్రికా మధ్య జరిగిన టీ20 మ్యాచ్లో ఒక్కో జట్టు 200 పరుగుల కంటే ఎక్కువ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 16 పరుగుల తేడాతో గెలిచింది. కాబట్టి ఈసారి కూడా హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం లేకపోలేదు. వాతావరణం అసోంలో వర్ష సూచన లేదు. కాబట్టి రాజస్తాన్- పంజాబ్ మ్యాచ్కు వరుణుడి ఆటంకం ఉండకపోవచ్చు. యుజీ ఉండగా భయమేల? వాళ్ల తర్వాత చహల్ మాత్రమే పంజాబ్ కింగ్స్పై రాజస్తాన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్కు అద్భుతమైన రికార్డు ఉంది. పంజాబ్తో మ్యాచ్లో యుజీ ఇప్పటి వరకు 28 వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్(34), సునిల్ నరైన్ (33) తర్వాత పంజాబ్పై ఈ ఘనత సాధించిన మూడో బౌలర్ చహల్. ఇక సన్రైజర్స్తో మ్యాచ్లో 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చి విశ్వరూపం చూపించిన చహల్.. పంజాబ్పై కూడా చెలరేగితే రాజస్తాన్కు తిరుగు ఉండదు. ఇక పేస్ విభాగంలో బౌల్ట్, హోల్డర్, ఆసిఫ్, సైనీ(తొలి మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్) ఉండనే ఉన్నారు. ఇక రాజస్తాన్ టాపార్డర్లో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్.. వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ఫామ్లో ఉండటం సానుకూలాంశం. వెరసి ‘హోం గ్రౌండ్’లో రాజస్తాన్దే పైచేయి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, టాపార్డర్ను దెబ్బకొట్టడం సహా ఫినిషర్ హెట్మెయిర్ను కట్టడి చేస్తే పంజాబ్ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి. ఇక మ్యాచ్ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్లు ఎలాంటి పాత్ర పోషించనున్నారో వేచిచూడాలి. తుది జట్ల అంచనా: రాజస్తాన్ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎమ్ ఆసిఫ్, యజ్వేంద్ర చాహల్. పంజాబ్ శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్సే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సికందర్ రజా, షారుక్ ఖాన్, సామ్ కరన్, నాథన్ ఎల్లిస్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, అర్ష్దీప్ సింగ్. చదవండి: అందుకే అక్షర్తో బౌలింగ్ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్ లాగేసుకున్నాడు! -
సూపర్ క్రేజ్.. సంపాదన కోట్లలో.. ఐపీఎల్ కెప్టెన్ల ‘బలగం’.. బలం! పాపం అతడొక్కడే!
IPL 2023 10 Teams Captains- Families: వేసవిలో వినోదం పంచేందుకు ఐపీఎల్ పండుగ వచ్చేసింది. పది జట్ల మధ్య పోటాపోటీ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత మజాను అందించనుంది. పొట్టి ఫార్మాట్ మెగా సమరానికి శుక్రవారం(మార్చి 31) తెరలేవనుంది. గతేడాది చాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభ మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. మరి ఐపీఎల్-2023లో ఆయా జట్లకు సారథ్యం వహించనున్న కెప్టెన్లు, వారి జీతం, నికర సంపాదన.. తదితర వివరాలు.. అదే విధంగా ఫ్రాంఛైజీల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా.. వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ.. నిరాశకు లోనైన వేళ అండగా నిలిచే ‘బలగం’.. అదేనండీ వారి కుటుంబాలు, వ్యక్తిగత వివరాల గురించి తెలుసుకుందాం! గుజరాత్ టైటాన్స్ కెప్టెన్: హార్దిక్ పాండ్యా ►టీమిండియా స్టార్ ఆల్రౌండర్ ►గత సీజన్లో క్యాష్ రిచ్లో తొలిసారి అడుగుపెట్టిన గుజరాత్కు టైటిల్ అందించిన సారథి. ►గుజరాత్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ అందుకుంటున్న మొత్తం: 15 కోట్లు ►2015లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన హార్దిక్ సుదీర్ఘకాలం పాటు ముంబై ఇండియన్స్కు ఆడాడు. ముంబై జట్టులో కీలస సభ్యుడిగా ఎదిగిన పాండ్యా నికర సంపాదన సుమారు 67 కోట్లు! ముచ్చటైన కుటుంబం గుజరాత్కు చెందిన హార్దిక్ పాండ్యా మధ్యతరగతి కుటుంబం నుంచి ఈ స్థాయికి చేరుకున్నాడు. పాండ్యా సక్సెస్ జర్నీలో అతడి తల్లిదండ్రులు, సోదరుడు, టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్యతో పాటు భార్య నటాషా స్టాంకోవిక్ పాత్ర కూడా ఉంది. విరామం దొరికితే చాలు తన సమయం మొత్తాన్ని కుటుంబానికే కేటాయిస్తాడు హార్దిక్. భార్య నటాషా, కొడుకు అగస్త్యతో గడుపుతాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్: మహేంద్ర సింగ్ ధోని ►టీమిండియా మాజీ సారథి, భారత్కు మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన ఏకైక కెప్టెన్గా మిస్టర్ కూల్ ఘనత. ►చెన్నై జట్టును నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు ధోని ఐపీఎల్ సాలరీ: 12 కోట్ల రూపాయలు. ►క్రికెటర్గా, వ్యాపారవేత్తగా, ఎండార్స్మెంట్ల రూపంలోనూ చేతినిండా సంపాదించే ధోని నెట్వర్త్ 2022 నాటికి: దాదాపు 1030 కోట్లు అందమైన ఫ్యామిలీ రాంచిలోని సగటు మధ్య తరగతి కుటుంబానికి చెందిన ధోని.. అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. భార్య సాక్షి, కుమార్తె జీవాతో ఎక్కువ సమయం గడుపుతాడు ధోని. సాక్షితో పాటు జీవా కూడా తన తండ్రిని చీర్ చేస్తూ ఐపీఎల్లో సందడి చేస్తూ ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్: కేఎల్ రాహుల్ ►టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ►గతంలో పంజాబ్ కింగ్స్ సారథిగా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ప్రస్తుతం 17 కోట్ల జీతం అందుకుంటున్నాడు. ఆర్సీబీతో 2014లో ఐపీఎల్ ప్రయాణం మొదలుపెట్టిన రాహుల్ నికర సంపాదన సుమారుగా 75 కోట్లు అని అంచనా. ►కర్ణాటక బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ ఏడాది ఆరంభంలో పెళ్లి చేసుకున్నాడు. బాలీవుడ్ నటి అతియా శెట్టితో కలిసి ఏడడుగులు వేశాడు. రాహుల్ తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు. ముంబై ఇండియన్స్ కెప్టెన్: రోహిత్ శర్మ ►టీమిండియా ప్రస్తుత కెప్టెన్ ►ముంబై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించిన సారథి ►ఐపీఎల్లో అత్యధికసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్గా రోహిత్ శర్మ ఘనత ►15 సీజన్లపాటు ఐపీఎల్ ఆడిన హిట్మ్యాన్ ప్రస్తుత సాలరీ 16 కోట్లు. ►టీమిండియా సారథి అయిన రోహిత్ నికర సంపాదన దాదాపుగా 214 కోట్ల రూపాయలు. ►రోహిత్ శర్మకు భార్య రితికా సజ్దే, కుమార్తె సమైరా శర్మ అంటే ప్రాణం. ఈ మహారాష్ట్ర బ్యాటర్ను చీర్ చేస్తూ వీళ్లిద్దరు ఐపీఎల్లో చేసే సందడి అంతా ఇంతాకాదు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్: శిఖర్ ధావన్ తొలిసారి పంజాబ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన టీమిండియా వెటరన్ ఓపెనర్ ధావన్. 2008లో ఢిల్లీ డేర్డెవిల్స్తో క్యాష్ రిచ్లీగ్లో అడుగుపెట్టిన గబ్బర్.. ప్రస్తుత ఐపీఎల్ సాలరీ 8.25 కోట్లు. నెట్వర్త్ సుమారు 105 కోట్లు అని అంచనా. విఫలమైన బంధం శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాకు చెందిన అయేషాను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తర్వాత ధావన్తో ఆమెకు కలిగిన సంతానం జొరావర్. చాలా అన్యోన్యంగా మెలిగే ధావన్- అయేషా మనస్పర్థల కారణంగా గతేడాది విడిపోయారు. భార్యకు దూరమై ఒంటరిగా మిగిలిపోయిన గబ్బర్కు ఫ్యామిలీ మద్దతులగా నిలబడింది. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్: శ్రేయస్ అయ్యర్ అయ్యర్ గాయం కారణంగా దూరం కావడంతో నితీశ్ రాణాకు కేకేఆర్ పగ్గాలు. ఐపీఎల్-2023లో కోల్కతాను ముందుండి నడిపించనున్న నితీశ్(సాలరీ 3.4 కోట్ల రూపాయలు). శ్రేయస్ అయ్యర్ 2015లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అతడి ప్రస్తుత సాలరీ. 12.5 కోట్లు. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ అయిన అయ్యర్ నెట్వర్త్ దాదాపు 53 కోట్లు. అయ్యర్ ఎదుగుదలలో అతడి తల్లిదండ్రులు, సోదరి పాత్ర కూడా ఉందని పలు సందర్భాల్లో చెప్పాడు. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్: సంజూ శాంసన్ ►టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర సంజూ శాంసన్ ►కేరళకు చెందిన సంజూ రాజస్తాన్ రాయల్స్ సారథిగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. గతేడాది రాయల్స్ను ఫైనల్కు చేర్చి సత్తా చాటాడు. ►సంజూ తన స్నేహితురాలు చారులతను ప్రేమించి పెళ్లాడాడు. సంజూ ఐపీఎల్ సాలరీ 14 కోట్లు కాగా.. నికర సంపాదన దాదాపుగా 72 కోట్లు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్: ఫాఫ్ డుప్లెసిస్ సౌతాఫ్రికా బ్యాటర్ డుప్లెసిస్ ఆర్సీబీని గతేడాది ప్లే ఆఫ్స్నకు చేర్చాడు. 2011లో చెన్నై తరఫున ఐపీఎల్లో అరంగ్రేటం చేసిన ఫాఫ్.. ప్రస్తుత ఐపీఎల్ సాలరీ 7 కోట్లు. ఈ ప్రొటిస్ బ్యాటర్ నెట్వర్త్ సుమారు 130 కోట్ల రూపాయలు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్: రిషభ్ పంత్ గైర్హాజరీలో డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ వార్నర్ గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ సారథిగా ఉన్న వార్నర్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అందుకుంటున్న జీతం.. 6.25 కోట్లు. ముగ్గురు కుమార్తెలు డేవిడ్ వార్నర్ పక్కా ఫ్యామిలీమ్యాన్. అతడి భార్య పేరు కాండిస్. ఈ జంటకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో వెకేషన్కు చెక్కేస్తాడు వార్నర్. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్: ఎయిడెన్ మార్కరమ్ ►సౌతాఫ్రికా టీ20 లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ను విజేతగా నిలిపిన మార్కరమ్. ►ఐపీఎల్-2023లో హైదరాబాద్ సారథిగా ఎంపికైన మార్కరమ్. ►అతడి ఐపీఎల్ సాలరీ 2.6 కోట్లు కాగా.. ఈ ప్రొటిస్ బ్యాటర్ నికర ఆస్తి 30 కోట్లు. ►మార్కరమ్ గర్ల్ఫ్రెండ్ నికోలీ డానియెల్ ఒ కనార్. చదవండి: IPL 2023: ఈసారి టైటిల్ గెలిచే అవకాశాలు వాళ్లకే: ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ IPL 2023: తెర వెనుక నాయకులను చూసేద్దామా.. -
అలా అయితే, తప్పక రాజకీయాల్లోకి వస్తా.. శిఖర్ ధవన్ సంచలన స్టేట్మెంట్
గత కొద్ది రోజులుగా ఏదో విషయంతో వార్తల్లో నిలుస్తున్న టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్.. తాజాగా మరో ఆసక్తికర స్టేట్మెంట్ ద్వారా క్రికెట్తో పాటు పొలిటికల్ సర్కిల్స్లోనూ హీట్ పుట్టించాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన గబ్బర్.. భగవంతుడి చిత్తమై, తన విధిలో రాసిపెట్టివుంటే, తప్పక రాజకీయాల్లోకి వస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీలో పుట్టిపెరిగిన 37 ఏళ్ల ధవన్ రాజకీయాలపై తన మనసులో మాట బయటపెట్టడంతో పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ధవన్ ఏ పార్టీలో చేరాడు, ఏ పార్టీతో టచ్లో ఉన్నాడు, ఏ పార్టీలో చేరకపోతే ఎవరు అతనికి గాలం వేస్తున్నారు..? ఇలా రకరకాల డిస్కషన్లతో గబ్బర్ అభిమానులు నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నారు. అయితే గబ్బర్ తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన వెంటనే మరో విషయం కూడా స్పష్టం చేశాడు. ఇప్పటికైతే రాజకీయాలపై తనకు ఎలాంటి ప్లాన్లు లేవని, తాను ఏ రాజకీయ పార్టీని సంప్రదించలేదని, ఒకవేళ నేను రాజకీయాల్లోకి రావడం దేవుడి చిత్తమైతే అందులోనూ వంద శాతం ఎఫర్ట్ పెట్టి సక్సెస్ సాధిస్తానని పేర్కొన్నాడు. ఐపీఎల్-2023 ప్రారంభానికి ముందు ఇలాంటి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన గబ్బర్.. మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న 16వ ఎడిషన్లో పంజాబ్ కింగ్స్కు సారధ్యం వహించనున్నాడు. కాగా, గత కొద్ది రోజులుగా ఏదో ఓ ఆసక్తికర స్టేట్మెంట్తో వార్తల్లో నిలుస్తున్న ధవన్.. తొలుత చెడిన తన ఫ్యామిలీ లైఫ్పై స్పందించాడు. ఆతర్వాత తానే సెలెక్టర్నైతే, ఓపెనర్గా తన కంటే శుభ్మన్ గిల్ బెటర్ అని వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే, టాటూ వేయించుకున్నందుకు హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్నానని చెప్పాడు. తాజాగా రాజకీయాలపై తన మనసులో మాటను బయటపెట్టి వార్తల్లో హెడ్లైన్గా మారాడు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 1న కేకేఆర్తో జరిగే మ్యాచ్తో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్-2023 జర్నీ ప్రారంభిస్తుంది. -
బంపర్ ఆఫర్ కొట్టిన సంజూ శాంసన్
టీమిండియాలో సమీకరణలు, ఇతరత్రా కారణాల చేత సరైన అవకాశాలు రాక నిరాశలో కూరుకుపోయిన టాలెంటెడ్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్కు బీసీసీఐ ఎట్టకేలకు ఓ విషయంలో న్యాయం చేసింది. జట్టుకు ఎంపికైనా రకరకాల కారణాల చేత తుది జట్టులో అడే అవకాశాలను కోల్పోతున్న సంజూకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చి తగిన గుర్తింపునిచ్చింది. సంజూకు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ.. గ్రేడ్ సి కేటగిరీ ఆటగాళ్ల జాబితాలో చోటు కల్పించింది. ఈ ఒప్పందం మేరకు సంజూకు రూ. కోటి వార్షిక వేతనం లభించనుంది. సంజూతో పాటు దీపక్ హుడా, కేఎస్ భరత్, అర్షదీప్ సింగ్లకు బీసీసీఐ తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చింది. వీరిని కూడా బీసీసీఐ గ్రేడ్ సి కేటగిరిలో చేర్చింది. వీరికి కూడా ఏటా కోటి రూపాయల వేతనం లభించనుంది. తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ల జాబితాలో చాలా మార్పులు చేసిన బీసీసీఐ.. ఏ గ్రేడ్లో ఉన్న రవీంద్ర జడేజాను ఏ ప్లస్ (7 కోట్లు) గ్రేడ్కు ప్రమోట్ చేయగా.. వరుస వైఫల్యాల బాట పట్టిన కేఎల్ రాహుల్ను ఏ గ్రేడ్ నుంచి బీ గ్రేడ్కు డిమోట్ చేసింది. ఇటీవల ఆసీస్తో జరిగిన సిరీస్లో విశేషంగా రాణించిన అక్షర్ పటేల్ను బీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్కు ప్రమోట్ చేసిన బీసీసీఐ.. వెటరన్ ఆటగాళ్లు ఆజింక్య రహానే, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్లను పూర్తిగా కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించింది. ఆశ్చర్యకరంగా ఏ ఫార్మాట్లో కూడా అవకాశాలు దక్కని మరో వెటరన్ ప్లేయర్ శిఖర్ ధవన్ బీసీసీఐతో సి గ్రేడ్ కాంట్రక్ట్ను నిలబెట్టుకున్నాడు. కాంట్రాక్ట్ జాబితా (మొత్తం 26 మంది) ►‘ఎ ప్లస్’ గ్రేడ్ (రూ. 7 కోట్లు): రోహిత్, కోహ్లి, బుమ్రా, జడేజా. ►‘ఎ’ గ్రేడ్ (రూ. 5 కోట్లు): హార్దిక్ పాండ్యా, అశ్విన్, షమీ, రిషభ్ పంత్, అక్షర్ పటేల్. ►‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు): పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుబ్మన్ గిల్. ►‘సి’ గ్రేడ్ (రూ. 1 కోటి): ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, కోన శ్రీకర్ భరత్. -
'మా నాన్న కొట్టాడు.. నేను హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను'
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఐపీఎల్-2023 సీజన్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో పంజాబ్ కింగ్స్కు ధావన్ నాయకత్వం వహించనున్నాడు. మయాంక్ అగర్వాల్ స్థానంలో ధావన్ను పంజాబ్ తమ కెప్టెన్గా నియమించింది. ఇప్పటికే పంజాబ్ జట్టుతో కలిసిన గబ్బర్.. తమ హోం గ్రౌండ్ మొహాలీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. పంజాబ్ తమ తొలి మ్యాచ్లో ఏప్రిల్1న కేకేఆర్తో తలపడనుంది. ఇక ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధావన్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తన 15 ఏళ్ల వయస్సులో టాటూ కారణంగా హెచ్ఐవి పరీక్ష చేయించుకున్నట్లు గబ్బర్ తెలిపాడు. "నేను 15 ఏళ్ల వయస్సులో నా ఫ్యామిలీతో కలిసి మనాలి టూర్కు వెళ్లాను. అయితే నా కుటుంబ సభ్యులకు తెలియకుండా నేను నా భుజంపై టాటూ వేయించుకున్నాను. నేను అది కనిపించకుండా దాదాపు 3 నుంచి 4 నెలలవరకు దాచి ఉంచాను. ఒక రోజు మా నాన్నకు నా పచ్చబొట్టు విషయం తెలిసిపోయింది. ఆయన నన్ను తీవ్రంగా కొట్టాడు. టాటూ వేయించుకున్న తర్వాత నేను కూడా కొంచెం భయపడ్డాను. ఎందుకంటే టాటూ వేసే వ్యక్తి ఎటువంటి సూదితో శాడో నాకు తెలియదు. కాబట్టి మా నాన్నతో కలిసి వెళ్లి హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. అది నెగెటివ్గా తేలింది" అని ఆజ్ తక్ షో 'సీధీ బాత్’లో ధావన్ పేర్కొన్నాడు. చదవండి: PAK vs AFG: టీ20ల్లో పాక్ బ్యాటర్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా -
టీమిండియాలో నో ఛాన్స్.. హిందీ సీరియల్లో నటిస్తున్న శిఖర్ ధావన్!
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ దావన్ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న ధావన్ను భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో పలు సిరీస్లో కెప్టెన్గా వ్యవహరించిన ధావన్.. ఇప్పుడు పూర్తిగా జట్టులోనే చోటు కోల్పోయాడు. దావన్ చివరగా గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా తరపున ఆడాడు. అనంతరం అతడు స్థానాన్ని యువ ఓపెనర్ శుబ్మన్ గిల్తో సెలక్టర్లు భర్తీ చేశారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా దావన్ వ్యవహరించబోతున్నాడు. గత సీజన్లో తమ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ స్ధానంలో గబ్బర్ను పంజాబ్ నియమించింది. ఈ ఏడాది సీజన్కు ముందు మయాంక్ అగర్వాల్ను పంజాబ్ విడిచిపెట్టింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ మార్చి31 నుంచి ప్రారంభం కానుంది. సీరియల్లో నటిస్తున్న ధావన్... కాగా ఐపీఎల్ ఆరంభానికి ముందు ధావన్ ఓ హిందీ ఓ హిందీ సీరియల్లో నటిస్తూ బిజీబీజీగా ఉన్నాడు. జీ ఛానెల్లో ప్రసారమయ్యే హిందీ సీరియల్ ‘కుండలి భాగ్య’లో ఓ పోలీస్ అధికారి పాత్రలో గబ్బర్ కనిపించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ధావన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ధావన్ పోలీస్ లూక్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇ ధావన్ క్రికెట్కు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా ఎక్టివ్గా ఉంటాడు. ఎప్పటికప్పుడు డ్యాన్స్, ఇన్స్టా రీల్స్తో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఇప్పడు మరో కొత్త రోల్లో అభిమానలను గబ్బర్ అలరించబోతున్నాడు. చదవండి: Virender Sehwag: కుంబ్లేతో గొడవలు.. హెడ్కోచ్గా నన్ను రమ్మని కోహ్లి కోరాడు View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) -
చేయాల్సిందంతా చేశాను.. నాకంటే బెటర్ ఆప్షన్ దొరికినప్పుడు.. శిఖర్ ధవన్ వైరాగ్యం
Shikar Dhawan: టీమిండియాలో చోటు దక్కకపోవడంపై వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ తొలిసారి స్పందించాడు. వన్డే జట్టులో స్థానం కోల్పోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధవన్ మాట్లాడుతూ.. టీమిండియా తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు చేయాల్సిందంతా చేశాను.. నా అత్యుత్తమ ప్రదర్శన కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చిన వారికి టీమిండియాలో చోటు దొరికితే నాకెలాంటి ఇబ్బంది లేదు.. కెరీర్లో ఎత్తుపల్లాలు సహజం.. టీమిండియా చోటు దక్కనందుకు నాకెంత మాత్రం బాధ లేదు, యువ క్రికెటర్లు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడుతున్నారని అన్నాడు. గబ్బర్ చేసిన ఈ వ్యాఖ్యల్లో వైరాగ్యం స్పష్టమవుతున్నప్పటికీ.. భవిష్యత్తులో టీమిండియాలో చోటుపై అతను ధీమా వ్యక్తం చేయడం కొసమెరుపు. టీమిండియాలో చోటుపై ధవన్ నిజాయితీగా చేసిన ఈ వ్యాఖ్యల పట్ల క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జట్టులో స్థానంపై ఇంత నిజాయితీగా మాట్లాడే క్రికెటర్ను చూడలేమని సోషల్మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. కాగా, ఫామ్ లేమి, వయసు మీద పడటం, పూర్ స్ట్రయిక్ రేట్ వంటి ప్రధాన అంశాల కారణంగా ధవన్ గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. మధ్యమధ్యలో భారత-బి జట్టుకు సారధ్యం వహించిన గబ్బర్.. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. 2018 నుంచి టెస్ట్లకు, 2021 నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న గబ్బర్.. గతేడాది స్వదేశంలో వెస్టిండీస్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో జరిగిన వన్డే సిరీస్ల్లో టీమిండియాకు సారధ్యం వహించాడు. ఆ మూడు సిరీస్ల్లో గబ్బర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మధ్యలో ఇషాన్ కిషన్ (బంగ్లాదేశ్), శుభ్మన్ గిల్ (న్యూజిలాండ్)లు వన్డేల్లో డబుల్ సెంచరీలతో విరుచుకుపడటంతో ధవన్కు దారులు మూసుకుపోయాయి. ఏదో అడపాదడపా ప్రదర్శనలతో కనీసం వన్డే జట్టులోనైనా కొనసాగుదామనుకున్న ధవన్ ఆశలపై యువ క్రికెటర్లు నీళ్లుచల్లారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సమీప భవిష్యత్తులో ధవన్కు టీమిండియా నుంచి పిలుపు వచ్చే ఛాయలు కనబడటం లేదు. టీమిండియా ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ స్థానం పక్కా కాగా.. గిల్ ఫార్మాట్లకతీతంగా అత్యుత్తమ ప్రద్శనలతో సత్తా చాటుతూ జట్టులో పాతుకుపోయాడు. దీంతో ధవన్ కెరీర్కు ఎండ్ కార్డ్ పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ధవన్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉన్నాడు. -
గిల్, ఇషాన్లు ఇద్దరు స్టార్ క్రికెటర్లను తొక్కేశారు.. చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు
జీ న్యూస్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ సంచలన విషయాలను బహిర్గతం చేశాడు. టీమిండియా, బీసీసీఐల్లో జరిగిన, జరుగుతున్న ఎన్నో విషయాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత క్రికెట్, బీసీసీఐల్లోని పెద్ద తలకాయలకు సంబంధించిన విషయాల్లో బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను వెల్లడించాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, టీమిండియా ప్రస్తుత, మాజీ సారధులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు సంబంధించిన ఆసక్తికర అంశాలను వివరించాడు. కెప్టెన్సీ విషయంలో నాటి బీసీసీఐ బాస్ గంగూలీ.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మధ్య వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అగ్గి రాజేశాడు. కోహ్లి టీ20 కెప్టెన్సీ వదిలేస్తానన్నప్పుడు బీసీసీఐ అతన్ని పునరాలోచించుకోవాలని కోరిందని, అలాగే వన్డే సారధ్య బాధ్యతల నుంచి తప్పించేముందు బోర్డు కోహ్లితో మాట్లాడిందని నాడు కోహ్లి ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి-రోహిత్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వారిలో ఇగో ఉందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాస్తవానికి గంగూలీకి రోహిత్ శర్మపై ఎలాంటి ప్రత్యేక ఇంట్రెస్ట్ లేనప్పటికీ.. కోహ్లిపై మాత్రం వ్యతిరేకత ఉండిందంటూ బాంబు పేల్చాడు. టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేసి కోహ్లి బీసీసీఐపై పైచేయి సాధించాలని భావించాడని, అది నచ్చక పోవడం వల్లనే గంగూలీ-కోహ్లిల మధ్య గ్యాప్ పెరిగిందని అన్నాడు. అలాగే టీమిండియా ఆటగాళ్లు ఫిట్నెస్ ప్రూవ్ చేసుకునేందుకు ఇంజక్షన్లు వాడతారని, అవి డోపింగ్ టెస్ట్కు సైతం చిక్కని అధునాతన ఔషదాలంటూ భారత క్రికెట్లో ప్రకంపనలకు ఆధ్యం పోశాడు. కొందరు ఆటగాళ్లు పూర్తి ఫిట్గా లేకపోయినా తమను ఆడించాలని బతిమాలతారంటూ సరికొత్త దుమారానికి తెరలేపాడు. ఇదే సందర్భంగా శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, శిఖర్ ధవన్ల పేర్లను ప్రస్తావిస్తూ సంచలన కామెంట్స్ చేశాడు. గిల్, ఇషాన్ కిషన్ల వల్ల కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, శిఖర్ ధవన్ల కెరీర్లు ప్రమాదంలో పడ్డాయని.. గిల్, ఇషాన్ల హవాలో రాహుల్, సంజూలకు అవకాశాలు క్రమంగా కనుమరుగవుతాయని అన్నాడు. శిఖర్ ధవన్ ట్రిపుల్ సెంచరీలు చేసినా బీసీసీఐ పట్టించునే పరిస్థితుల్లో లేదని, అతనో ఔట్డేటెడ్ ప్లేయర్ అని కామెంట్ చేశాడు. భారత క్రికెట్ గురించి.. బీసీసీఐ, టీమిండియాలో పెద్ద తలకాయల గురించి చేతన్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ సర్కిల్స్లో పెను దుమారం రేపుతున్నాయి. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన చేతన్ శర్మపై బీసీసీఐ ఏ చర్యలకు ఉపక్రమిస్తుందో వేచి చూడాలి. -
మాజీ భార్య పరువు తీస్తుంది.. టీమిండియా స్టార్ క్రికెటర్ ఆవేదన, కోర్టు అక్షింతలు
టీమిండియా స్టార్ క్రికెటర్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ కోర్టు మెట్లెక్కాడు. అతని మాజీ భార్య అయేషా ముఖర్జీ తన పరువుకు భంగం కలిగించేలా విష ప్రచారం చేస్తుందని న్యూఢిల్లీలోని పటియాలా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన స్నేహితులు, క్రికెట్కు సంబంధించిన వ్యక్తులు అలాగే ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహించే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి అయేషా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేస్తుందని ఆధారాలతో సహా కోర్టులో సమర్పించాడు. తన పరువుకు భంగం కలిగించే సమాచారాన్ని సోషల్మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తుందని వాపోయాడు. ధవన్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు అయేషాను మందలించింది. ధవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అలాగే అతని పరువుకు భంగం కలిగేలా ఎలాంటి సమాచారాన్ని మీడియాతో కానీ అతని స్నేహితులు, బంధువులతో కానీ మరే ఇతర సోషల్మీడియా ప్లాట్ఫాంలపై కానీ షేర్ చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ధవన్ సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నత వ్యక్తి అని, అంతేకాక అతను భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యుడని, అతని రెప్యుటేషన్ దెబ్బతినే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. Delhi court restrains estranged wife of Shikhar Dhawan from making defamatory allegations against the cricketer report by @NarsiBenwal #ShikharDhawan @SDhawan25 https://t.co/5MWVV4gEUe — Bar & Bench (@barandbench) February 4, 2023 భారత్, ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన అయేషా తన వాదనలను వినిపించేందుకు ఇది సరైన మార్గం కాదని, ఒకవేళ అలాంటివేవైనా ఉంటే రెండు దేశాల్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. కాగా, ధవన్ 2012లో అస్ట్రేలియాకు చెందిన అయేషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ కుమారుడు (జోరావర్) జన్మించాడు. అయేషాకు ధవన్తో పెళ్లికి ముందే వివాహం జరిగింది. వారికి రియా, ఆలియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మనస్పర్ధల కారణంగా ధవన్-అయేషా 2021లో విడిపోయారు. కోర్టు వీరికి విడాకులు కూడా మంజూరు చేసింది. కోర్టు తీర్పు మేరకు ధవన్ మెయింటెనెన్స్ సరిగ్గా చల్లించట్లేదని అయేషా ప్రస్తుతం ఆరోపిస్తుంది. కాగా, టీమిండియాలో కీలక సభ్యుడైన శిఖర్ ధవన్ ఇప్పటివరకు 34 టెస్ట్లు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. ఇందులో 2315 టెస్ట్ పరుగులు (7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు), 6793 వన్డే పరుగులు (17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు), 1759 టీ20 పరుగులు (11 హాఫ్ సెంచరీలు) ఉన్నాయి. ధవన్ పలు మ్యాచ్ల్లో టీమిండియాకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. -
న్యూజిలాండ్తో తొలి వన్డే.. సెంచరీతో రికార్డుల్లోకెక్కిన శుభ్మన్ గిల్
టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ వరుస శతకాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల (జనవరి 15) శ్రీలంకపై మూడో వన్డేలో (97 బంతుల్లో 116; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించిన గిల్.. ఇవాళ (జనవరి 18) న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలోనూ శతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్లో 87 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన గిల్.. వరుస ఇన్నింగ్స్ల్లో సెంచరీలు సాధించడంతో పాటు అతి తక్కువ వన్డేల్లో 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్ ధవన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ధవన్.. 17 వన్డేల్లో 3 సెంచరీలు పూర్తి చేయగా.. గిల్.. 19 వన్డేల్లో ఈ మార్కును చేరుకున్నాడు. ఈ రికార్డుతో పాటు గిల్ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అతి వేగంగా (19 మ్యాచ్ల్లో) 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో పాక్ ఆటగాడు ఫకర్ జమాన్ (18 వన్డేలు) అగ్రస్థానంలో ఉండగా.. గిల్, మరో పాక్ ఆటగాడు ఇమామ్ ఉల్ హాక్తో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున అతి వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో గిల్ అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్ (24 మ్యాచ్లు) సంయుక్తంగా రెండో ప్లేస్లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో 34 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 210/4గా ఉంది. గిల్ (94 బంతుల్లో 111; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (22 బంతుల్లో 11; ఫోర్) క్రీజ్లో ఉన్నారు. రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31) ఓ మోస్తరుగా రాణించగా.. విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5) నిరుత్సాహపరిచారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్, టిక్నర్, సాంట్నర్, డారిల్ మిచెల్ తలో వికెట్ పడగొట్టారు. -
లంకతో సిరీస్కు దూరమవడంపై స్పందించిన సంజూ.. ఏమన్నాడంటే..?
Sanju Samson: గాయం కారణంగా శ్రీలంక సిరీస్ (టీ20) నుంచి మిడిల్ డ్రాప్ అయిన సంజూ శాంసన్ తొలిసారి స్పందించాడు. ఆల్ ఈజ్ వెల్.. సీ యూ సూన్ అంటూ ఇన్స్టా వేదికగా తన సందేశాన్ని పంపాడు. సంజూ తన పోస్ట్లో తొలి టీ20 సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఫోటో షేర్ చేశాడు. సంజూ చేసిన ఈ పోస్ట్కు టీమిండియా ప్రస్తుత కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, వన్డే తాత్కాలిక సారధి శిఖర్ ధవన్ స్పందించారు. View this post on Instagram A post shared by Sanju V Samson (@imsanjusamson) హార్ధిక్.. హార్ట్ ఏమోజీతో రిప్లై ఇవ్వగా, ధవన్.. గెట్ వెల్ సూన్ బ్రో అంటూ బదులిచ్చాడు. సంజూ గాయం నుంచి త్వరగా కోలుకుని తిరిగి బరిలోకి దిగాలని అతని అభిమానులు సోషల్మీడియాలో పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్నారు. కాగా, లంకతో తొలి టీ20 సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ సంజూ శాంసన్ గాయపడిన విషయం తెలిసిందే. సంజూ గాయం తీవ్రమైంది కానప్పటికీ.. మున్ముందు జట్టు అవసరాల దృష్ట్యా బీసీసీఐ అతన్ని ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచి విశ్రాంతినిచ్చింది. బీసీసీఐ వైద్యులు తెలిపిన వివరాల మేరకు.. సంజూ ఎడమ కాలి మోకాలి భాగంలో స్వల్ప గాయమైందని, కదలికలో సమస్య ఉన్నట్లు స్కాన్ రిపోర్ట్లో గుర్తించినందున కొద్దిరోజుల పాటు విశ్రాంతినివ్వాలని వారు బోర్డుకు సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన బోర్డు తదనుగుణంగానే సంజూకు పాక్షికంగా విశ్రాంతి కల్పిస్తూ.. లంకతో మిగతా టీ20లకు అన్క్యాప్డ్ ప్లేయర్ జితేశ్ శర్మను ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే, తొలి టీ20లో సంజూ బ్యాట్తో పాటు ఫీల్డింగ్లోనూ దారుణంగా నిరాశపర్చాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని ఈ కేరళ బ్యాటర్.. ఫీల్డింగ్లోనూ క్యాచ్ను జారవిడిచి విమర్శలెదుర్కొన్నాడు. భారత దిగ్గజ ఆటగాడు, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్.. శాంసన్ చెత్త షాట్ సెలెక్షన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. అమవాస్యకో పున్నానికో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే ఎలా అంటూ ఘాటు స్వరంతో వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చిన సంజూ.. కేవలం ఆరు బంతులు మాత్రమే ఆడి (5 పరుగులు) దారుణంగా నిరాశపరిచాడు. ధనంజయ డిసిల్వ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయిన సంజూ.. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక అదే ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో తేలిపోయిన సంజూ.. ఫీల్డింగ్ చేస్తూ కీలక క్యాచ్ జారవిడిచాడు. లంక ఇన్నింగ్స్లో హార్ధిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లో నిస్సంక ఇచ్చిన క్యాచ్ను వదిలిపెట్టి కెప్టెన్ ఆగ్రహానికి గురయ్యాడు.