చెన్నై: ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును రెండేళ్ల పాటు సస్పెండ్ చేసిన వ్యవహారంలో బీసీసీఐకి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ నుంచి చెన్నైని తప్పించడాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ఇండియా సిమెంట్స్ పిటిషన్ దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ కిషన్ కౌల్, జస్టిస్ టీఎస్ శివజ్ఞానంలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసులో బిహార్ క్రికెట్ సంఘం ఇంప్లీడ్ అయ్యేందుకు కూడా అనుమతించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. లోధా కమిటీ తీర్పుపై స్టే ఇవ్వాలని ఇండియా సిమెంట్స్ కోరింది.
బీసీసీఐకి మద్రాస్ హైకోర్టు నోటీసులు
Published Fri, Aug 21 2015 11:54 PM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement
Advertisement