![India U-19 crush Sri Lanka by innings and 147 runs - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/28/U-19.jpg.webp?itok=61dHPuGQ)
హంబన్టోటా: శ్రీలంక అండర్–19 జట్టుతో జరిగిన రెండో యూత్ టెస్టులోనూ భారత అండర్–19 జట్టు జయభేరి మోగించింది. శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్లో యువ భారత్... ఇన్నింగ్స్ 147 పరుగుల తేడాతో గెలుపొంది 2–0తో సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. ఓవర్నైట్ స్కోరు 47/3తో నాలుగో రోజు ఆట కొనసాగించిన లంక భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్లో 62.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది.
పెర్నాండో (28) టాప్స్కోరర్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సిద్ధార్థ్ దేశాయ్ (4/40), బదోని (2/17), మంగ్వాని (2/9)లు చెలరేగడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన లంక పరాజయం పాలైంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 613/8 వద్ద డిక్లేర్డ్ చేయగా... శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 316లకే పరిమితమై ఫాలోఆన్ ఆడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment