
పీవీ సింధు పరాజయం
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో తెలుగు అమ్మాయి పీవీ సింధు పోరాటం ముగిసింది.
జకార్తా: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో తెలుగు అమ్మాయి పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆమె ఓటమి పాలైంది. 8వ సీడ్ కొరియన్ షట్లర్ సుంగ్ చేతిలో 17-21, 21-19, 16-21 తేడాతో ఓడిపోయింది.
తొలి సెట్ కోల్పోయిన సింధు తర్వాత పుంజుకుని రెండో సెట్ గెలిచింది. నిర్ణయాత్మక మూడో సెట్ లో వెనుకబడడంతో సింధు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సివచ్చింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో 21-17, 14-21, 21-17తో ప్రపంచ మూడో ర్యాంకర్ లీ జురుయ్ (చైనా)పై అద్భుత విజయం సాధించింది.