టెస్టు కోసం నిధులు ఇచ్చుకోండి | SC directs BCCI to incur expenses for England series, show accounts to Lodha panel | Sakshi
Sakshi News home page

టెస్టు కోసం నిధులు ఇచ్చుకోండి

Published Wed, Nov 9 2016 1:42 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

SC directs BCCI to incur expenses for England series, show accounts to Lodha panel

బీసీసీఐకి సుప్రీం కోర్టు అనుమతి  
 న్యూఢిల్లీ: ఇంగ్లండ్ జట్టుతో రాజ్‌కోట్‌లో జరగబోయే తొలి టెస్టుకు నిధుల కొరత తీరింది. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం సౌరాష్ట్ర క్రికెట్ సంఘానికి నిధులను విడుదల చేసేందుకు అంగీకరించాలని బీసీసీఐ మంగళవారం సుప్రీం కోర్టును అభ్యర్థించింది. లేకుంటే టెస్టు రద్దయ్యే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రూ.58.66 లక్షల నిధులు విడుదల చేసేందుకు బీసీసీఐకి అనుమతించింది. డిసెంబర్ 3 వరకు జరిగే ఈ సిరీస్‌లో ఇతర మ్యాచ్‌ల కోసం కూడా ఇంతే మొత్తాన్ని ఖర్చు చేసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ అనుమతిచ్చింది. అయితే ఈ నిధులను ఆటగాళ్ల అలవెన్‌‌స, ఇన్సూరెన్‌‌స ఖర్చులకు, మూడో అంపైర్‌కు చెల్లింపు కోసం మాత్రమే ఖర్చు పెట్టాలని, సౌరాష్ట్ర క్రికెట్ సంఘానికి మాత్రం కాదని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement