సుశీల్ కుమార్కు ఆశాభంగం | Sushil kumar not part of WFI's Rio camp | Sakshi
Sakshi News home page

సుశీల్ కుమార్కు ఆశాభంగం

Published Sun, May 15 2016 7:12 PM | Last Updated on Mon, Sep 4 2017 12:10 AM

సుశీల్ కుమార్కు ఆశాభంగం

సుశీల్ కుమార్కు ఆశాభంగం

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ బెర్తును ఆశించిన భారత రెజ్లర్ సుశీల్ కుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. అతని స్థానంలో మరో రెజ్లర్ నర్సింగ్ యాదవ్ను ఎంపిక చేస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్యూఎఫ్ఐ) తాజాగా నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి సోన్పేట్లో భారత రెజ్లింగ్ రియో సన్నాహకాల్లో  ఆరంభమవుతున్న నేపథ్యంలో సుశీల్ కుమార్-నర్సింగ్ యాదవ్ల రియో బెర్తుపై నెలకొన్న వివాదానికి డబ్యూఎఫ్ఐ ఎట్టకేలకు తెరదించింది.

వాస్తవానికి  రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో పాల్గొంటామని ఇద్దరు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ పోటీ పడ్డారు. భారత్ తరఫున ఈ కేటగిరిలో సుశీల్ (ఢిల్లీ), నర్సింగ్ (ముంబై) అత్యుత్తమ రెజ్లర్లు కాగా, కేవలం ఒకరికి మాత్రమే ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది.   గతేడాది లాస్‌వేగాస్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ యాదవ్ 74 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గడంతోపాటు టాప్-6లో నిలిచి భారత్ కు ఆ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఆ ఈవెంట్‌కు వెళ్లాల్సిన సుశీల్ గాయం కారణంగా తప్పుకోవడంతో నర్సింగ్ ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. ఒకసారి ఒక దేశానికి బెర్త్ దక్కాక... మరో క్రీడాకారుడు ఒలింపిక్ బెర్త్ కోసం పోటీపడకూడదు. గతంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు పతకాలు తెచ్చానని తనకు ఈసారి మరో అవకావం ఇవ్వాలని సుశీల్ పట్టుబట్టినా.. నిబంధనల ప్రకారం నర్సింగ్ యాదవ్ కు అవకాశం కల్పించారు.


'74 కేజీల విభాగంలో సుశీల్-నర్సింగ్ల మధ్య ట్రయల్స్ నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ అందలేదు. అందుజేత నర్సింగ్ యాదవ్ ను ఈ కేటగిరీ నుంచి రియో సన్నాహకానికి ఎంపిక చేశాం. నిబంధనల మేరకు నర్సింగ్ యాదవ్ ఎంపిక జరిగింది. రాబోవు రోజుల్లో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా?అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ సుశీల్ రియో సన్నాహకాలకు వస్తానంటే కాదనం 'అని డబ్యూఎఫ్ఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement