లాలా అమర్ నాథ్ భార్య మృతి | Wife of legendary cricketer Lala Amarnath passes away | Sakshi
Sakshi News home page

లాలా అమర్ నాథ్ భార్య మృతి

Nov 17 2015 3:17 PM | Updated on Jul 31 2018 5:31 PM

వంగత మాజీ భారత క్రికెటర్ లాలా అమర్ నాథ్ భార్య కైలాష్ కుమారి(92) కన్నుమూశారు.

న్యూఢిల్లీ: దివంగత మాజీ భారత క్రికెటర్ లాలా అమర్ నాథ్ భార్య కైలాష్ కుమారి(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం తుదిశ్వాసం విడిచారు.  కైలాష్ కుమారి మృతి చెందే సమయంలో ఆమె కుమారులు సురీందర్ అమర్ నాథ్, మొహిందర్ అమర్ నాథ్, రాజిందర్ అమర్ నాథ్ లు ఇంటి వద్దే ఉన్నారు.  భారత క్రికెట్ లో ఓ లెజెండ్ క్రికెటర్ గా పేరు గాంచిన లాలా అమర్ నాథ్ పదిహేనేళ్ల కిందట మరణించిన విషయం తెలిసిందే.  ఆయన 2000వ సంవత్సరంలో మృతిచెందారు. అప్పటికి ఆయన వయసు 88 సంవత్సరాలు.

 

భారత టెస్టు క్రికెట్ లో తొలి సెంచరీ నమోదు చేసిన ఘనతను లాలా అమర్ నాథ్ తన పేరిట లిఖించుకున్నారు. అటు తరువాత వీరి కుమారులు సురీందర్ అమర్ నాథ్, మొహిందర్ అమర్ నాథ్ లు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. కాగా, మూడో కుమారుడు రాజిందర్ అమర్ నాథ్ మాత్రం తన క్రికెట్ కెరీర్ ను ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లతో ముగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement