సాక్షి, బజరంగ్‌లపై దృష్టి | World Wrestling Championship from today | Sakshi
Sakshi News home page

సాక్షి, బజరంగ్‌లపై దృష్టి

Aug 21 2017 12:55 AM | Updated on Aug 20 2018 8:20 PM

సాక్షి, బజరంగ్‌లపై దృష్టి - Sakshi

సాక్షి, బజరంగ్‌లపై దృష్టి

పతకమే లక్ష్యంగా సోమవారం మొదలయ్యే ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు బరిలోకి దిగనున్నారు.

నేటి నుంచి ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

పారిస్‌: పతకమే లక్ష్యంగా సోమవారం మొదలయ్యే ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు బరిలోకి దిగనున్నారు.పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్‌... మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో కలిపి భారత్‌ తరఫున మొత్తం 24 మంది ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. గత ఏడాది రియో ఒలింపిక్స్‌లో 58 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించిన సాక్షి మలిక్‌ ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గురువారం 60 కేజీల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

సాక్షితోపాటు వినేశ్‌ ఫోగట్‌ (48 కేజీలు)పై భారత బృందం ఆశలు పెట్టుకుంది. పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో సందీప్‌ తోమర్‌ (57 కేజీలు), బజరంగ్‌ పూనియా (65 కేజీలు), సత్యవర్త్‌ కడియన్‌ (97 కేజీలు) పతకాలపై ఆశలు రేకెత్తిస్తున్నారు. ఈ ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన బజరంగ్‌ 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 60 కేజీల విభాగంలో పోటీపడి కాంస్య పతకం సాధించాడు. తొలి రోజు సోమవారం గ్రీకో రోమన్‌ విభాగంలో (71 కేజీలు, 75 కేజీలు, 85 కేజీలు, 98 కేజీలు) పోటీలు జరుగుతాయి.  
రాత్రి గం. 10.30 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌ ఫస్ట్‌ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement