11 రోజులు సమాధిలో.. | 11 days in the grave | Sakshi

11 రోజులు సమాధిలో..

Oct 23 2016 4:31 AM | Updated on Sep 4 2017 6:00 PM

11 రోజులు సమాధిలో..

11 రోజులు సమాధిలో..

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 11 రోజుల పాటు అన్నపానీయాలు లేకుండా సమాధిలోనే ఉండిపోయారు ఓ స్వామీజీ.....

సాక్షి, బళ్లారి(కర్ణాటక): ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 11 రోజుల పాటు అన్నపానీయాలు లేకుండా సమాధిలోనే ఉండిపోయారు ఓ స్వామీజీ. అనంతరం ధ్యానముద్ర నుంచి మేల్కొని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివచ్చారు. ఈ సంఘటన కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా చింతనపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. స్థానిక సిద్ధలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో ఈ నెల 11న రాచోటేశ్వర అనే స్వామీజీ ధ్యానముద్రలో కూర్చొన్నారు. తర్వాత గ్రామస్తులు, భక్తులు కలిసి స్వామీజీ చుట్టూ రాళ్లతో సమాధి నిర్మించారు. గాలి, వెలుతురు లేకుండా ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం సమాధిని తొలగించారు. ఉజ్జయిని జగద్గురు మరుళు సిద్ధ దేశీ కేంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో యోగముద్రలో ఉన్న రాచోటేశ్వర స్వామీజీని ధ్యాన విముక్తుణ్ని చేయించారు. ధ్యానముద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వామీజీ మాట్లాడుతూ జనం సంతోషంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా వచ్చి పంటలు బాగా పండాలనే 11 రోజులు ధ్యానం చేశానన్నారు. కాగా.. ఈయన గతంలో కూడా 41 రోజులు ధ్యానంలో ఉన్నారని భక్తులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement