విజయనగరం ఆస్పత్రిలో దారుణం | Doctors negligence in vizianagaram cotton put in women stomach and forgotten | Sakshi
Sakshi News home page

విజయనగరం ఆస్పత్రిలో దారుణం

Published Sat, Oct 22 2016 3:25 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

Doctors negligence in vizianagaram cotton put in women stomach and forgotten

పార్వతీపురం : విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ కడుపులో డాక్టర్లు కాటన్ పెట్టి కుట్టేశారు. అనంతరం బాధిత మహిళను డిశ్చార్జ్ చేశారు. 
 
గత కొద్ది రోజులుగా ఆమెకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో పార్వతీపురంలోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు స్కానింగ్ చేయడంతో కడుపులో కాటన్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి కాటన్ను తొలగించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకంపై బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement