doctors negligence
-
ప్రాణం పోయమంటే... పేగులు తోడేశారు
అనంతపురం మెడికల్: జీవి పుట్టుకకు దేవుడు కారణమైతే... ఆ జీవి ఆయురారోగ్యాలతో పరిపూర్ణ జీవితం గడిపేందుకు వైద్యులు కారణమై దేవుడితో సమానంగా ఖ్యాతి దక్కించుకున్నారు. అయితే కొందరు వైద్యుల కారణంగా ఈ ఖ్యాతి కాస్త అపఖ్యాతిగా మారుతోంది. ఇందుకు ప్రభుత్వ సర్వజనాస్పత్రి (జీజీహెచ్)లో సర్జరీ విభాగం సేవలే నిదర్శనం. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి చేరుకున్న ఓ వృద్ధుడికి శస్త్రచికిత్స చేసి వార్డుకు తరలిస్తే పేగులు బయటపడ్డాయి. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా...కణేకల్లు మండలం బెన్నికల్కు చెందిన వృద్ధుడు హనుమప్ప కడుపునొప్పితో బాధపడుతుంటే కుటుంబసభ్యులు ఆ చుట్టుపక్కల ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. నయం కాకపోవడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు గత నెల సర్వజనాస్పత్రికి పిలుచుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు గత నెల 25న యూనిట్ 2 కింద అడ్మిట్ చేసుకుని వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇంటర్ స్టైనల్ ఇన్ఫెక్షన్ కారణంగా కడుపు నొప్పి వస్తోందని గుర్తించి లాపరోటమీ సర్జరీ (పొత్తికడుపు ఓపెన్ సర్జరీ) చేసి ఎస్ఐసీయూకు తరలించారు. ఐసీయూకు తరలించిన అదే రోజు హనుమప్పకు సర్జరీ వైద్యులు వేసిన కుట్లు తెరుచుకుని కడుపులో నుంచి పేగులు బయటపడ్డాయి. దీంతో కుటుంబీకులు, పక్కనే ఉన్న రోగులు, వారి సహాయకులు భయభ్రాంతులకు గురయ్యారు.వార్డులోని సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడి విషయాన్ని వెంటనే వైద్యులు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే అనస్తీసియా నుంచి బయటపడిన హనుమప్ప నొప్పి భరించలేక కేకలు వేస్తుండడంతో ఎస్ఐసీయూలో భయానక వాతావరణం నెలకొంది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న వైద్యులు వెంటనే తమ తప్పును సరిదిద్దుకునే చర్యలు చేపట్టారు. ఇదేమిటని బాధిత కుటుంబసభ్యులు వైద్యులను ఆరా తీస్తే హనుమప్పకదలడం, ఆయాసం అధికంగా కావడంతో పేగులు బయట పడ్డాయని నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంతేకాక ఈ అంశం వెలుగు చూడకుండా తొక్కిపెట్టారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో హనుమప్ప కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. కాగా, యూనిట్ 2 వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శస్త్రచికిత్స విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. సర్జరీ విభాగంలో సరైన ప్రమాణాలను వైద్యులు పాటించడం లేదని ఆస్పత్రి వర్గాలే బాహటంగా చెబుతున్నాయి. సీనియర్లు చేయాల్సిన సర్జరీని పీజీ వైద్య విద్యార్థులతో చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. సర్వజనాస్పత్రిలో సర్జరీ విభాగం వైఫల్యాలపై ఆస్పత్రి పాలక వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో దారుణం
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో దారుణం జరిగింది. డెలివరీ సమయంలో ఆపరేషన్ చేసి.. కడుపులో కాటన్ పాడ్ వదిలేశారు వైద్యులు. దీంతో ఆ బాలింత ప్రాణాల మీదకు వచ్చింది. ఐదురోజుల కిందట.. వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తి లయకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో కాన్పు కోసం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఆ సమయంలో ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆపరేషన్ సక్సెస్ అయ్యి.. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాటన్ ప్యాడ్ను వైద్యులు ఆమె కడుపులో వదిలేశారు. ఈ క్రమంలో ఆ బాలింత తీవ్ర అస్వస్థతకు గురవుతూ వచ్చింది. సోమవారం రాత్రి ఆమె పరిస్థితి మరింత దిగజారండంతో.. చెన్నూర్ అసుపత్రికి తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్లు కీర్తి లయను పరిశీలించి.. ఆపై ఆపరేషన్ చేసి కాటన్ పాడ్ను బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆపరేషన్ చేసి కడుపులో బ్యాండేజ్ వదిలేసిన వైద్యులు.. మహిళ మృతి
లక్నో: వైద్యుల నిర్లక్ష్యానికి ఓ మహిళ బలైంది. ఆపరేషన్ చేసి బ్యాండేజ్ను కడుపులోనే వదిలివేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ ప్రాణాలు కోల్పోయిందని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఉత్తర్ప్రదేశ్ అమ్రోహ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అమ్రోహ జిల్లాలో ఇటివలే ఇలాంటి ఘటన జరిగింది. మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో టవల్ను వదిలేశారు. ఆమెకు తీవ్రమైన నొప్పి రావడంతో పరీక్షలు చేయగా ఈ విషయం వెలుగుచూసింది. ఈ ఆపరేషన్ చేసిన వైద్యుడు అనుమతి లేకుండా ఆస్పత్రి నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. Amroha, UP | Locals protest after a woman died allegedly due to bandage left inside her stomach during operation On basis of a man's complaint alleging that his wife died after treatment at a hospital due to negligence of a doctor, case registered.Probe on:VK Rana, CO City(21.1) pic.twitter.com/BjKhG8zxyf — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 22, 2023 చదవండి: షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం -
మలక్పేట ఏరియా ఆసుపత్రిలో విషాదం.. ఇద్దరు బాలింతలు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు బాలింతలు మృతి చెందడం కలకలం రేపుతోంది. బాధిత బంధువుల ఆందోళనతో అస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లా చెదురుపల్లి గ్రామానికి చెందిన సిరివెన్నెల రెండో కాన్పు కోసం మలక్పేట ఏరియా ఆసుపత్రిలో చేరారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించకుండానే ఆపరేషన్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె డెంగ్యూ జ్వరం ఉన్నది గుర్తించకుండా డెలీవరీ చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని తెలిపారు. వెంటనే బాలింతను గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్లేట్లేట్స్ తగ్గిపోవడంతో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ముందస్తు వైద్య పరీక్షలు చేయకుండా ఆమె మరణించినట్లు గాంధీ వైద్యులు తెలిపారు. ఇదే క్రమంలో మరో బాలింత శివాని సైతం డెలివరీ అనంతరం అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యానికి ఇద్దరు బాలింతలు బలయ్యారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మలక్పేట ఆసుపత్రి ఎదుట, చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మృతికి కారణమైన డాక్టర్లను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకుకదిలే ప్రస్తకే లేదని వెల్లడించారు. వైద్యాధికారులు ఏమన్నారంటే.. మలక్పేట ఆసుపత్రిలో బాలింతల మృతిపై వైద్యుల నిర్లక్ష్యం లేదని వైద్యాధికారి సునీత వెల్లడించారు. సిరివెన్నెలకు డెంగ్యూ ఫీవర్ లేదని తెలిపారు. డెంగ్యూ ఉంటే తాము డెలివరీ చేయమని పేర్కొన్నారు. అన్ని పరీక్షలు చేశాకే డెలివరీ చేశమన్నారు. డెలివరీ తర్వాత సిరివెన్నెలకు హార్ట్రేట్ పెరిగిందని, హార్ట్ ప్రాబ్లమ్ రావడంతో గాంధీకి తరలించామన్నారు. శివానికి హైపోథైరాయిడ్ సమస్య ఉందన్నారు. చదవండి: పండుగ ప్రయాణం.. నరకయాతన -
Hyderabad: వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి!
సాక్షి, హైదరాబాద్(కీసర): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణీ మృతి చెందిందని ఆరోపిస్తూ ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బొమ్మలరామారం మండలం తూంకుంటకు చెందిన రాధిక అలియాస్ లావణ్య(22)కు పదినెలల క్రితం కీసరకు చెందిన పూండ్రు శేఖర్తో వివాహం జరిగింది. ఆమె 5 నెలల గర్భిణీ కాగా.. ఆమెకు కడుపు నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఈనెల 16న కీసరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యురాలు చికిత్స చేసి ఇంటికి పంపించారు. నొప్పి తగ్గకపోవడంతో అదే రోజు భువనగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వెంటనే నగరంలోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు. గాంధీలో పరీక్షించిన వైద్యులు కడుపులో బిడ్డ పరిస్థితి బాగాలేదని తొలగించారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందింది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి నుంచి సదరు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబీకులు ఆసుపత్రి అద్దాలు, ఫర్నీచర్ను సైతం ధ్వసం చేశారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడారు. గర్భిణీ అయిన తన భార్యను వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చినప్పుడు పచ్చ కామెర్లు వచ్చాయని చెప్పలేదని ముందే చెబితే జాగ్రత్త పడేవారమని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. చదవండి: (హైదరాబాద్లో కోటి విలువ చేసే వజ్రాభరణాలు చోరీ.. దొంగలను పట్టించిన భూతద్దం) -
వైద్యుల నిర్లక్ష్యానికి యువ క్రీడాకారిణి బలి
చెన్నై: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ యువ క్రీడాకారిణి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పెరియార్ నగర్ గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్లో చోటుచేసుకుంది. వ్యాసర్పాడికి చెందిన ఆర్.ప్రియ(17) బీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫస్టియర్ చదువుతోంది. ఫుట్బాల్ క్రీడాకారిణి అయిన ప్రియ కుడి మోకాలి లిగమెంట్ దెబ్బతింది. దీంతో ఆమె పెరియార్ నగర్ గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్కు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఈ నెల 7న మోకాలికి ఆపరేషన్ చేసి, కంప్రెషన్ బ్యాండేజీ వేశారు. బ్యాండేజీ గట్టిగా వేయడంతో లోపల రక్త స్రావం అయి గడ్డకట్టి, మిగతా కాలికి సరిగ్గా రక్త ప్రసరణ జరలేదు. వైద్యులు గమనించకపోవడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను రాజీవ్గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (ఆర్జీజీజీహెచ్) రెఫర్ చేశారు. వైద్యులు ఈనెల 8న ఆమె కుడి కాలిని తొలగించారు. ఇంటెన్సివ్ కేర్లో చికిత్స కొనసాగుతుండగానే కిడ్నీలు, లివర్, గుండె విఫలమై మంగళవారం ప్రియ తుదిశ్వాస విడిచిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ చెప్పారు. నిర్లక్ష్యం వహించిన గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్కు చెందిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశామన్నారు. ప్రియ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారంతోపాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ చదవండి: నా కూతుర్నే పార్టీ మారమన్నారు: సీఎం కేసీఆర్ -
నల్గొండలో దారుణం.. కన్నీళ్లు తెప్పించే ఘటన..
నల్లగొండ టౌన్: సాధారణ ప్రసవం పేరిట వైద్యులు చేసిన కాలయాపనకు ఓ నిండు ప్రాణం బలైంది. తీవ్ర రక్త స్రావంతో బాలింత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు శనివారం ఆస్పత్రి ఎదుట ఆందో ళనకు దిగారు. కట్టంగూరు మండలం చెర్వు అన్నారం గ్రామానికి చెందిన శిరసు అఖిల మొదటి కాన్పు నిమిత్తం ఈ నెల 9న నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. చదవండి: పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన హిజ్రాలు.. ఎందుకంటే? మూడు రోజులుగా ఆమె నొప్పులతో ఇబ్బందిపడుతున్నా సాధారణ ప్రసవం పేరిట వైద్యులు కాలయాపన చేశారు. ఆపరేషన్ చేయకుండా ఈ నెల 11న నార్మల్ డెలివరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో అఖిల కడుపును వైద్యులు బలంగా ఒత్తడంతో మగశిశువును ప్రసవించింది. అదే సమయంలో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో కుటుంబసభ్యులు బాధితు రాలిని ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని వేడుకున్నా వైద్యులు అంగీకరించకుండా మూడు రోజులపాటు ఆమెకు రక్తం ఎక్కిస్తూ గడిపారు. అనంతరం పరిస్థితి విషమించి అఖిల కోమాలోకి వెళ్లడంతో వైద్యులు ఈ నెల 14న సికింద్రాబాద్లోని గాంధీ ఆస్ప త్రికి తరలించారు. అక్కడ అఖిల పరిస్థితి మరింత విషమించి శుక్రవారం రాత్రి మృతి చెందింది. మృతదేహంతో ఆందోళన: అఖిల మృతికి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఎదుట మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువు లు శనివారం ఆందోళనకు దిగారు. ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా నార్మల్ డెలివరీ చేయడంతో గర్భసంచి పగిలిపోయి రక్తస్రావమైందని ఆరోపించారు. అఖిల మృతికి కారణమైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి, శిశువు సంరక్షణకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, టూటౌన్ పోలీసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ వచ్చి కుటుంబసభ్యులతో మాట్లాడారు. డాక్టర్లపై ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
డాక్టర్ల నిర్లక్ష్యం.. తల్లిని కోల్పోయిన పిల్లలు
తిరువొత్తియూరు: సేలం జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. దీంతో బంధువులు ఆందోళన చేపట్టారు. అధికారులు స్పందించి ప్రైవేట్ ఆస్పత్రికి సీలు వేశారు. వివరాల ప్రకారం.. జలగంఠాపురం సౌరియూర్ ప్రాంతానికి చెందిన భూపతి భార్య సంగీత (28). ఈ దంపతులకు 11 ఏళ్ల కుమార్తె, ఏడేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో సంగీత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడానికి 20 రోజులకు ముందు ఎడప్పాడిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చా రు. అక్కడ ఆమెకు ఆపరేషన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన సంగీతకు 2 వారాల తర్వాత తరచూ కడుపునొప్పి రావడంతో తిరిగి అదే ఆసుపత్రికి తీసుకెళ్లా రు. డాక్టర్లు ఆమె కడుపులో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించి ఆమెకు రెండవ సా రి ఆపరేషన్ చేశారు. తర్వా త ఇంటికి వెళ్లి మాత్రలు వేసుకున్న సంగీత ఆదివారం అస్వస్థతకు గురైంది. మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లాగా అక్కడ మూడోసారి ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉద యం సంగీత ఆమె మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సంగీత చనిపోయిందని ఆరోపిస్తూ.. బంధువులు రాత్రి ధర్నాకు దిగారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో సిబ్బంది లెనిన్ సంగీత మృతదేహాన్ని సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రైవేట్ ఆస్పత్రిని సీజ్ చేశారు. ఇది కూడా చదవండి: ఎంత పనిచేశావ్ నాన్నా! పుట్టింటికి నవ వధువు.. ప్రాణాలు తీసిన కన్నతండ్రి -
సుల్తాన్బజార్: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
సాక్షి, సుల్తాన్బజార్: వైద్యుల నిర్లక్ష్యంవల్లే తమ కూతురు మృతి చెందిందని బాలింత కుటుంబ సభ్యులు చేపట్టిన ఆందోళన సుల్తాన్బజార్ ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఐదు గంటల పాటు ఆస్పత్రిలో గందరగోళ పరిస్థితి నెలకుంది. పోలీసులు విచ్చ వైద్యులపై కేసు నమోదు చేయడంతో బాధితులు శాంతించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సైదాబాద్ లక్ష్మీనగర్కు చెందిన బాలకృష్ణ భార్య పూజ(25)కు నెలలు నిండడంతో మొదటి కాన్పు కోసం ఈ నెల 25వ తేదీ ఆదివారం 3 గంటల ప్రాంతంలో సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరి్పంచారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు వైద్యులు ఆపరేషన్ చేయడంతో పూజ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే వైద్యులు ఉదయం 11 గంటల ప్రాంతంలో బాలింతరాలు పూజ చనిపోయిందని చెప్పడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎలా చనిపోతుందంటూ కుటుంబ సభ్యులు వైద్యులను ప్రశి్నంచారు. పూజకు డ్యూటీ వైద్యులు సరిగా కుట్లు వేయకపోవడంతోనే రక్తస్రావం ఎక్కువై మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా రెండో సారి వైద్యలు కుట్లు వేయడంతోనే పూజ మరణించిందని ఆందోళనకు దిగారు. తమ బిడ్డ వైద్యల నిర్లక్ష్యం వల్లే మృతిచెందిందని ఆస్పత్రి ఎదుట ఐదు గంటల పాటు ఆందోళన చేపట్టారు. అప్పుడే పుట్టిన చిన్నారని అనాథగా మారిందని కుటుంబ సభ్యులు విలపించిన తీరు అక్కడ ఉన్నవారిని కలచి వేసింది. సమాచారం తెలుసుకున్న సుల్తాన్బజార్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, ఏసీపీ దేవేందర్ బంధువులకు నచ్చజెప్పారు. ఎట్టకేలకు వైద్యులపై పోలీçసు కేసు నమోదు చేస్తామని బంధువులకు సర్దిజెప్పి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్చేసిన డ్యుటీ డాక్టర్పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి హామీ ఇచ్చారు. -
గర్భిణి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
సాక్షి, నర్సంపేట (వరంగల్): వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఏడు నెలల గర్భిణి లావణ్య(24) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. దీంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు. దుగ్గొండి మండలం మదిర గ్రామానికి చెందిన పెరుమాండ్ల మల్లారెడ్డి– నీలమ్మ దంపతుల కుమార్తె లావణ్యను నెక్కొండ మండలానికి చెందిన అనుముల నర్సింహారెడ్డి– రేణుక దంపతుల కుమారుడు రాకేష్రెడ్డికి ఇచ్చి సంవత్సరం క్రితం వివాహం జరిపించారు. కొద్ది రోజుల తర్వాత భార్యాభర్తలు హైదరాబాద్కు వెళ్లారు. ఈ క్రమంలో లావణ్య గర్భం దాల్చడంతో పుట్టింటికి వచ్చి ఉంటుంది. శనివారం సాయంత్రం ఆమెకు నొప్పులు రాగా, నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాత్రి నొప్పులు ఎక్కువ కావడంతో ఆస్పత్రి సిబ్బంది ఇంజక్షన్ వేయడంతో తగ్గాయి. తిరిగి ఆదివారం ఉదయం నొప్పులు ఎక్కువ కావడంతో మళ్లీ ఇంజక్షన్ వేయగా, కొద్ది సేపటికే లావణ్య మృతి చెందినట్లు ఆమె అత్త రేణుక తెలిపారు. దీంతో ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చదవండి: పెట్రోల్ బంకులో పనిచేసే యువతి.. మైనర్ బాలుడిని ట్రాప్ చేసి.. -
ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం: డాక్టర్ల నిర్లక్ష్యంతోనే..
సాక్షి, మంచిర్యాల: డాక్టర్ నిర్లక్ష్యంతో వృద్ధురాలు మృతిచెందిన సంఘటన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ కుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గోదావరిఖనికి చెందిన కడారి అయిలమ్మ(65)ను అనారోగ్యం కారణంగా కుటుంబ సభ్యులు ఈనెల27న చేర్పించారు. నాలుగు రోజులుగా కొంత అనారోగ్యంతో బాధపడుతుండగా చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రాణాపాయం లేదని కొంత చికిత్స అవసరమని అడ్మిట్ చేసుకున్నారు. బుధవారం ఉదయం, సాయంత్రం వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన ఆసుపత్రి వైద్యుడు రాత్రి మాత్రం ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని పేర్కొన్నాడు. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో అయిలమ్మ కుటుంబ సభ్యులు వేరే చోట నుంచి సిలిండర్ తీసుకొచ్చారు. అయితే ఆక్సీమీటర్తో పాటు సిలిండర్ బిగించడానికి స్పానర్ కూడా ఆసుపత్రిలో లేవు. పరిస్థితి విషమించిన అయిలమ్మకు చికిత్స చేసేందుకు డాక్టర్ రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అయిలమ్మ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వైద్యుల నిర్లక్ష్యం; 3 రోజుల పసికందు మృతి..
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం 3 రోజుల పసికందు మృతిచెందింది. ఆ వివరాలు.. పెద్ద కొడప్గల్ మండలం తక్కపల్లికి చెందిన ఓ మహిళ డెలివరీ కోసం మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలో అరుణ్, జయశ్రీ దంపతులకు ఆడపిల్ల జన్మించింది. అయితే పాప పుట్టిన తర్వాత జాండీస్ రావడంతో వెంటిలేటర్ అవసరమైంది. అప్పటికే కుటుంబ సభ్యులు ఓ నెగిటివ్ బ్లడ్ రెండు బాటిళ్లు తీసుకొచ్చారు. ఈలోపే పాప కన్నుమూసింది. దీంతో వెంటిలేటర్ అందుబాటులో లేకపోవడంతో శిశువు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పాప మరణించిందని బంధులవులు ఆందోళన చేపట్టారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రావద్దని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: బీభత్సం.. అర్ధరాత్రి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు! -
‘డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి ఎమ్మెల్యే ఫిర్యాదు’
సాక్షి, అనంతపురం: వైద్యుల నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. కరోనా బాధితుల పట్ల వైద్యుల చిన్నచూపు తగదని సూచించారు. వైద్యుల్లో మానవతా దృక్పథం లోపించిందని, నాసిరకమైన భోజనం అందిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరికాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (‘ఆ రాష్ట్రాలతో అతి కొద్ది సమయంలోనే పోటీ పడవచ్చు’) కాగా ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని వైద్యం చేసేందుకు నిరాకరించే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నాన్ కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. (వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అనంత ఫైర్..) -
కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం
సాక్షి, కరీంనగర్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు బెడ్పై నుంచి కిందపడి మృతిచెందాడు. బెడ్పై నుంచే కిందపడటంతో ఆక్సిజన్ అందక ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి కిందపడి ఆక్సిజన్ అందక గిలగిలా కొట్టుకున్న సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని అదే వార్డులోని మరో పెషేంట్ ఫోన్ కాల్ ద్వారా బయటకు సమాచారం అందించాడు. అలాగే అందుకు సంబంధించిన ఫొటోలను కూడా పంపాడు. బాధితుడు బెడ్పై నుంచి కిందపడిన విషయాన్ని వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదని, అటువైపు కన్నెత్తి కూడా చూడ లేదని తెలిపాడు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. బాధితుడు కిందపడి మృతిచెందిన తర్వాత.. మృతదేహాన్ని మంచంపైకి చేర్చి ఆక్సిజన్ పెట్టారని చెప్పారు. ఆస్పత్రిలో పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. -
కరోనా బూచి చూపి ఇతర రోగులపై నిర్లక్ష్యం
అమీర్పేట: కరోనా బూచి చూపి ఇతర రోగుల పట్ల ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వవ్యవహరిస్తున్నారని, అత్యవసరంగా చేయాల్సిన ఆపరేషన్లను సైతం వాయిదా వేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. సనత్నగర్ ఈఎస్ఐసీ మెడికల్ కళాశాల బోధనా ఆసుపత్రిలో ప్రత్యేకంగా కోవిడ్–19 వార్డులు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని కూడా కేటాయించి సేవలందిస్తున్నారు. మిగతా విభాగాల ద్వారా ఈఎస్ఐ కార్డు లబ్ధిదారులకు చికిత్సలు అందించాల్సి ఉండగా.. వైద్యులు, అధికారులు ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసరంగా ఆసుపత్రికి వస్తున్న రోగులకు నామమాత్రంగా సేవలందిస్తూ చేతులు దులుపుకుంటున్నారని రోగులు వాపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు, దీర్ఘకాలిక రోగాలతో వచ్చే వారికి మందులతో సరిపెడుతూ కావాల్సిన వైద్య పరికరాలను సమకూర్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన ఆనంద్కిషోర్ అనే వ్యక్తి రెండు నెలల క్రితం ఆసుపత్రిలో చేరాడు. కాలుకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని, కరోనా వైరస్ ఉధృతి కారణంగా ఇప్పట్లో శస్త్ర చికిత్స చేయలేమని, కొంత కాలం పాటు వాకర్ సాయంతో నడవాలని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే వాకర్ కోసం ఆసుపత్రి చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని కిషోర్ వాపోయాడు. దీంతో బెడ్డుకే పరిమితమయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. పడుకుంటే ఆయాసం వస్తోందని, ఇటీవల ఆసుపత్రి వెళ్లగా బెల్టు పెట్టుకోవాలని సూచించారన్నారు. వాకర్ ఇవ్వాలని కోరితే సరైన సమాధానం ఇవ్వడంలేదని, ఇక బెల్టు కోసం ఎవరిని అడగాలో అర్థం కావడం లేదన్నాడు. 15 ఏళ్లుగా ఈఎస్ఐకి డబ్బులు కడుతున్నామని, ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరిన తమకు సకాంలో వైద్యం ఇవ్వకుంటే కార్డు ఉండి లాభం ఏమిటని కిషోర్ వాపోయాడు. ఆసుపత్రికి వచ్చే అనేక మంది రోగులు ఇదే విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ బూచిని చూపి అత్యవసరంగా చేయాల్సిన ఆపరేషన్లను వేయిదా వేయడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సకాలంలో వైద్యం అందకపోవడంతో ఒక రోగి ఊపిరాడక మృతిచెందిన ఘటన అనంతపురం జీజీహెచ్లో జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైంది. ధర్మవరానికి చెందిన రాజు అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రికి రాగా, వైద్యులు పట్టించుకోలేదు. శుక్రవారం తెల్లవారుజామున మూడుగంటలకు ఆసుపత్రికి వచ్చిన రాజుకు వైద్య చికిత్స సకాలంలో అందించకపోవడంతో ఊపిరాడక మరణించినట్లు తెలిసింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు,బంధువులు ఆందోళనకు దిగారు. -
చనిపోయారని చెప్పి చేతికిచ్చారు..
చింతూరు: పురిటి నొప్పులు ఆగకుండానే ఆ గర్భిణికి గుండె ఆగే మాట చెప్పారు.. పుట్టబోయే ఇద్దరు శిశువుల్లో ఒకరు చనిపోయారని అనడంతో ఆమె దుఃఖానికి అవధులు లేవు.. చివరికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఇద్దరూ చనిపోయారంటూ కవర్లో ఆ శిశువులను పెట్టి ఇవ్వడం మరింత కలచివేసింది.. కొన్ని గంటల తర్వాత ఆ కవర్లో ఓ శిశువు కదుతుందని బంధువులు చెప్పడంతో బతికి ఉన్నట్లు నిర్ధారించుకుని వైద్యానికి ఏర్పాట్లు చేశారు.. ఈ ఘటన తెలంగాణలోని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆ గర్భిణి బంధువులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. చింతూరు మండలం నరిసింహాపురం గ్రామానికి చెందిన ముచ్చిక సునీత, రవీందర్ దంపతులు. సునీత ఆరు నెలల గర్భిణి. శుక్రవారం ఆమెకు నొప్పులు రావడంతో చింతూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేయడంతో శుక్రవారం రాత్రి అక్కడికి తరలించారు. ఆ ఆసుపత్రిలో ఆమెను పరీక్షించిన సిబ్బంది స్కానింగ్ తీయించాలని చెప్పడంతో స్కానింగ్ చేయించి వైద్యుడికి చూపించారు. దానిని పరిశీలించిన ఆయన కవల పిల్లల్లో ఓ బిడ్డ చనిపోయిందని శస్త్రచికిత్స చేసి చనిపోయిన బిడ్డను తీయకపోతే ఇన్ఫెక్షన్ సోకుతుందని చెప్పడంతో గర్భిణి బంధువులు ఒప్పుకున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు వైద్యుడు శస్త్రచికిత్స చేసిన చనిపోయిన ఆడబిడ్డతో పాటు, మరో మగబిడ్డను కూడా బయటకు తీసి ఇరువురు చనిపోయారంటూ కవర్లో పెట్టి ఇచ్చారని సునీత మామయ్య సింగయ్య తెలిపారు. సునీతకు డెలివరీ అనంతరం బాలింతలను ఉంచే వార్డులో ఉంచడంతో పాటు చనిపోయినట్లు చెప్పిన బిడ్డలను కూడా అక్కడే కవర్లో ఉంచారు. మధ్యాహ్నం 12 గంటలకు సునీత బాబాయ్ సీతారామయ్య భోజనం తీసుకొచ్చి ఏం జరిగిందని అడగడంతో ఇద్దరు శిశువులు చనిపోయారని వైద్యులు చెప్పి కవరులో పెట్టి ఇచ్చారని చూపించింది. దీంతో ఆయన దగ్గరికి వెళ్లి కవర్లను చూడగా అందులో ఒక బిడ్డ కదలడంతో వెంటనే వైద్యులకు విషయం తెలిపారు. స్పందించిన వారు వెంటనే ఆ బిడ్డను హుటాహుటిన ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చావా యుగంధర్ వివరణ ఇస్తూ శుక్రవారం రాత్రి వారు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వచ్చారని, స్కానింగ్లో చనిపోయిన బిడ్డ ఉందని గుర్తించామన్నారు. బయట కూడా స్కానింగ్ చేయించాలని చెప్పామన్నారు. ఆ స్కానింగ్లో కూడా అలాగే ఉందని, దానివల్ల తల్లికి, మరో బిడ్డకు ఇన్ఫెక్షన్ సోకుతుందని చెప్పి శనివారం ఉదయం డెలివరీ చేసి బయటకు తీశామన్నారు. మరో బిడ్డ పరిస్థితి కూడా బాగోక పోవడంతో ఆ బిడ్డను కూడా తీసి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. పుట్టినప్పుడు రెండో బిడ్డకు శ్వాస లేదని, అంతేకాక శిశువు బరువు 500 గ్రాములు ఉండటంతో కష్టమని చెప్పి తమ సిబ్బంది వారికి సూచించారన్నారు. రెండో బిడ్డను వారు బయటకు తీసుకెళ్లారని, తిరిగి తీసుకొచ్చి ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయమనడంతో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇద్దరూ చనిపోయారని అన్నారు ఉదయం 8 గంటలకు కాన్పు చేసి కవలలను తీశారు. ఇరువురూ చనిపోయారని చెప్పి కవర్లో పెట్టి ఆసుపత్రి సిబ్బంది అప్పగించారు. 12 గంటల సమయంలో నేను సునీతకు భోజనం తీసుకొని వచ్చి ఏం జరిగిందని ప్రశ్నించడంతో కవర్లో ఉన్న శిశులను చూపించింది. దగ్గరకు వెళ్లి చూడగా అందులో మగ శిశువు కదులుతుండటం గమనించి సిబ్బందికి తెలపడంతో వారు ఇంక్యూబేటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇది ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమే. –కాకా సీతారామయ్య, సునీత బాబాయ్ -
వైద్యుల నిర్లక్ష్యం.. ఇద్దరు మహిళల మృతి
సాక్షి, సిరిసిల్ల : వైద్యుల నిర్లక్ష్యంతో జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆపరేషన్ సమయంలో వైద్యం వికటించి మృతి చెందారు. ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్ చేయడంతోనే ఈ అనర్థం జరిగిందని తెలుస్తుంది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఆసుపత్రి యాజమాన్యం జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇద్దరు మహిళలు మృతి చెందారని బంధువుల ఆరోపించడంతో జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన డీఎంహెచ్వో ఆసుపత్రిని సీజ్ చేసినట్లు తెలిపారు. -
అధిక రక్తస్రావంతో బాలింత మృతి
వనస్థలిపురం: వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ బాబుకు జన్మనిచ్చిన తర్వాత అధిక రక్తస్రావంతో మృతి చెందింది. సరైన చికిత్స అందక వేరే ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ప్రసవ సమయంలో వైద్యుల నిర్లక్ష్య, రక్తం ఎక్కించే సదుపాయాలు లేకపోవడంతో బాలింత మృతి చెందిందని ఆమె భర్త సతీష్ ఆరోపిస్తున్నారు. వివరాలలోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ములుగుకు చెందిన లెక్చరర్ సముద్రాల సతీష్ భార్య విజయ (29) రెండో కాన్పు నిమిత్తం హైదరాబాద్కు వచ్చి హయత్నగర్లో తన సోదరి వద్ద ఉంటోంది. ఆదివారం రాత్రి 1.30 గంటలకు నొప్పులు రావడంతో ప్రైవేటు ఆసుపత్రులు నడవక పోవడంతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. సోమవారం ఉదయం 4గంటల సమయంలో విజయ బాబుకు జన్మనిచ్చింది. కాగా విజయకు అధిక రక్తస్రావం అవుతుండడంతో 5గంటల సమయంలో ఆసుపత్రికి చెందిన అంబులెన్సులో నగరంలోని జడ్జీఖానా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ విజయ చికిత్స పొందుతు మృతిచెందింది. విజయ మృతితో రెండేళ్ల మొదటి కుమారుడు, అప్పుడే పుట్టిన బాబు తల్లి లేని పిల్లలు అయ్యారని బంధువులు వాపోతున్నారు. జాండీస్, బ్లీడింగ్తోనే మృతి... విజయకు నార్మల్ డెలివరీ అయ్యింది. కాగా ఆమె జ్వరం, జాండీస్తో బాధ పడుతోంది. డెలివరీ అనంతరం అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం జడ్జిఖానా ఆసుపత్రికి పంపించాం. అక్కడ చికిత్స పొందుతు విజయ మృతి చెందింది. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఏమి లేదు. – సూపరిండెండెంట్ హరిప్రియ, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి రక్తం ఎక్కించే సదుపాయం లేకపోవడం శోచనీయం... ఏరియా ఆసుపత్రిలో రక్తం ఎక్కించే సదుపాయం లేకపోవడం శోచనీయం. ప్రసవం సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే విజయ చనిపోయింది. ఆమె ఇద్దరు పిల్లలు తల్లిని కోల్పోయారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. – అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం -
వైద్యం వికటించి చిన్నారి మృతి
సాక్షి, ఖమ్మం: వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన సంఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... నగరంలో రమణగుట్ట ప్రాంతానికి చెందిన దారా అఖిల గత నెల 18న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రెండో కాన్పులో పాపకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్యం సరిగా లేకపోవటంతో 19న ఎన్నెస్టీ రోడ్లోని జనని పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పాపకు వైద్య సేవలు అందించారు. 18 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేయటంతో ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం రెండు రోజుల కే శిశువుకు జ్వరం రావటంతో మంగళవారం మళ్లీ అదే ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు మందులు రాసిచ్చి పంపారు. బుధవారం శిశువు ఆరోగ్యం మరింత దిగజారటంతో మళ్లీ శిశువును జనని ఆస్పత్రికి తీసుకొచ్చారు. శిశువును పరీక్షించిన వైద్యులు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించటంతో.. నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వరంగల్కు తీసుకెళ్లి చూపించారు. వైద్య సేవలు పొందుతూ అక్కడే శిశువు మృతి చెందింది. శిశువు మృతికి జనని ఆస్పత్రి వైద్యులే కారణమని ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. పాప పరిస్థితి గురించి రోజూ వైద్యుడిని వివరాలు అడుగుతున్నప్పటికీ ఏమీ చెప్పకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయిస్తామని అడిగినా వినకుండా ఇక్కడే ఉంచి ప్రాణాన్ని బలిగొన్నారని కన్నీరుమున్నీరై విలపించారు. తమకు న్యాయం చేసేవరకు ఇక్కడి నుంచి కదలబోమని భీష్మించారు. టూటౌన్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యజమాన్యం, శిశువు బంధువులతో చర్చలు జరిపింది. -
వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడి మృతి!
సాక్షి, కర్నూలు: ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీలో వైద్యుల నిర్లక్ష్యానికి మరో యువకుడు మృతి చెందాడు. వారం రోజుల క్రితం సరైన వ్యాధి నిర్ధారణ జరగక, సకాలంలో వైద్యం అందక ఒకరు మృతి చెందిన విషయం విదితమే. తాజాగా మరో యువకుడు సరైన చికిత్స అందక తనువు చాలించాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన కేశాలు, రూతమ్మలకు ఇద్దరు కుమారులు. వీరిది వ్యవసాయ కుటుంబం. పెద్ద కుమారుడైన చక్రవర్తి(20) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ వ్యవసాయం చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం వ్యక్తిగత కారణాలతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే అతన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అనంతరం పరిస్థితి విషమిస్తుండటంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు రెఫర్ చేశారు. గురువారం ఉదయం 6 గంటలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చిన అతనికి వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మేల్ మెడికల్(ఎంఎం)–7 వార్డులో అడ్మిట్ చేశారు. వాస్తవంగా ఇలా క్రిమిసంహారక మందు తాగిన వారిని వార్డులో గాకుండా ముందుగా ఏఎంసీ విభాగానికి తరలిస్తారు. కానీ వైద్యులు వార్డుకు తరలించడంతో అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించింది. వెంటనే క్యాజువాలిటీకి తీసుకురాగా అప్పటికే అతను మృతి చెందాడు. దీంతో క్యాజువాలిటీలో కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. వార్డుకు గాకుండా ఏఎంసీ విభాగానికి తీసుకెళ్లి అత్యవసర వైద్యం అందించి ఉంటే తమ కుమారుడు బతికేవాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే తన కుమారుని మృతికి కారణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. -
హిజ్రాకు చికిత్స చేసేందుకు డాక్టర్ల నిరాకరణ
చెన్నై,తిరుత్తణి: అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన హిజ్రాకు చికిత్స చేసేందుకు ప్రభుత్వ వైద్యులు నిరాకరించిన ఘటన తిరుత్తణి ప్ర భుత్వాస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. తిరుత్తణి పెరియార్నగర్కు చెందిన కావ్య(40) అనే హిజ్రాకు జ్వరంతో పాటు వాంతులు, విరేచనాలు రావడంతో చికిత్స కోసం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. అయితే హిజ్రాకు చికిత్స చేసేందుకు వైద్యులు నిరాకరించారు. సుమారు 2 గంటల పాటు అనా రోగ్యంతో బాధపడుతున్నా కనీసం వైద్యులు పలకరించేందుకు సైతం ముందుకు రాకపోవడంతో తోటి హిజ్రాలు ఎందుకు వైద్యం చేయరని ఆస్పత్రి చీఫ్ డాక్టర్ రాధికను ప్రశ్నిం చారు. వారి ప్రశ్నలను డాక్టర్ పట్టించుకోకపోవడంతో హిజ్రాలు ఆస్పత్రి ప్రాంగణం వద్ద బైఠాయించారు. అక్కడికి వచ్చిన తిరువళ్లూరు జిల్లా ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర దయాళన్కు సమస్యను వివరించారు. చివరకు జాయింట్ డైరెక్టర్ ఆదేశాలతో వైద్యులు హిజ్రాకు చికిత్స చేశారు. -
ప్రాణం ఖరీదు రూ.2లక్షలు..?
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు ప్రాణాలకు ఖరీదు కడుతున్నాయి. ఇటీవల కాలంలో వైద్యుల నిర్లక్ష్యంతో పలువురు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలు చోటుచేసుకోవడం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వేలాది రూపాయలను ఫీజుల రూపంలో తీసుకుంటూనే, ప్రాణాలకు గ్యారంటీని ఇవ్వలేని దుర్భర పరిస్థితుల్లో జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల తీరు జిల్లా ప్రజల్లో కలవరం నెలకొంది. జిల్లా కేంద్రంలో ఇటీవల పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం అంటు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడం... వీరికి మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తూ బాధితుల పక్షన నిలబడి ఆందోళనలు చేయడం... కుటుంబానికి న్యాయం చేయాలని లక్షల్లో డిమాండ్ చేయడం, చివరికి బాధితులకు ఎంతో కొంత ఇప్పించడం వైద్యులు సైతం ఈ గొడువలెందుకులే అని లక్షల్లో ముట్టజెప్పడం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రాణాలకు ఖరీదు కట్టడం పరిపాటిగా మారింది. ఇటీవల జిల్లా కేంద్రంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.... ఈ నెల 17 మంచిర్యాల మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రిలో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టౌన్ మండలం డోర్పెల్లి గ్రామానికి చెందిన డోంగ్రీ సాయినాథ్ – తిరుమల కూతురు సంకీర్తణ (8) జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం డెంగీ జ్వరం అని, ప్లేట్లేట్స్ 43వేలే ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో చికిత్స పొదుతూ ఈ నెల 18న సాయంత్రం మృతి చెండడంతో వైద్యుల నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రూ. 2లక్షలకు ఒప్పందం... విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు చేరుకొని వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి చెందినట్లు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు. జోక్యం చేసుకుని ఇరువార్గాలతో మాట్లాడి ఆందోళన జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఘటన స్థలంలో బాలిక తల్లిదండ్రులు ఇద్దరే ఉండడంతో మృత దేహాన్ని తీసుకెళ్లడానికి విముకత చూపించారు. తమ గ్రామం నుంచి తమకు చెందిన బంధువులు వచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లమని రోదిస్తూ ఉండిపోయారు. గురువారం సాయినాథ్ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని మరోసారి ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక నేతలు కుటుంబానికి న్యాయం చేయాలంటూ రూ. 15లక్షలు పరిహారం అందజేయాలని డి మాండ్ చేశారు. ఆసుపత్రి యాజమాన్యం 3గంటల పాటు చర్చల అనంతరం రూ.2లక్షల ఇచ్చేదుకు అంగీకరించడంతో వివాదం సర్దుమనిగింది. 16గంటల పాటు పోలీస్ పహారా.... ఆసుపత్రి ఎదుట ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుండా ఉండేందుకు ఈ నెల 18న రాత్రి 8గంటలకు ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు ఈ నెల19న ఉదయం11 గంటల వరకు అంటే 16గంటల పాటు పోలీసులు ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. -
సర్వజనాస్పత్రిలో ఉద్రిక్తత
ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు సర్వజనాస్పలో మృతి చెందాడు. వైద్యసేవలు అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చేయడం వల్లే అతడు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. డ్యూటీ డాక్టర్పై దాడికి యత్నించడం ఉద్రిక్తతకు తారికి తీసింది. సాక్షి, అనంతపురం న్యూసిటీ: ధర్మవరం పట్టణానికి చెందిన కె.శ్రీనివాస్ (20) ఈ నెల నాలుగో తేదీన విషపుద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కలెక్టర్ సత్యనారాయణ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసినపుడు అతడి పరిస్థితిని గమనించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపాలని సిబ్బందికి సూచించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి 9.54 గంటలకు సర్వజనాస్పత్రిలోని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో చేర్చారు. కొద్దిసేపటి తర్వాత శ్రీనివాస్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని కుటుంబ సభ్యులు మల్లి, నారాయణస్వామి, వెంకటేశ్లు డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్కు తెలియజేశారు. ఇంతకుముందే చికిత్స మొదలు పెట్టామని, ఏమీ కాదులే అని డాక్టర్ సమాధానమిచ్చారు. అర్ధరాత్రి దాటాక 12.05 గంటల సమయంలో శ్రీనివాస్ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు డాక్టర్ రమేష్ను దుర్భాషలాడారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు మృతదేహాన్ని బెడ్పై నుంచి తీయకుండా నిరసన తెలిపారు. చివరకు ఔట్పోస్టు ఏఎస్ఐలు త్రిలోక్, రాము సర్తి చెప్పడంతో మృతదేహాన్ని మార్చురికీ తరలించారు. వైద్యుడిని నిలదీసిన బంధువులు యువకుడి మృతిపై వివరణ ఇవ్వాలని ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామినాయక్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావులు డ్యూటీ డాక్టర్ రమేష్కు సూచించారు. డాక్టర్ రమేష్ మెడిసిన్ వార్డు నుంచి ఆర్థో వార్డు వైపుగా వస్తున్నాడు. ఆ సమయంలో మృతుని కుటుంబీకులు ఒక్కసారిగా వైద్యున్ని నిలదీశారు. మీ నిర్లక్ష్యం కారణంగానే శ్రీనివాస్ మృతి చెందాడంటూ మండిపడ్డారు. చివరకు సెక్యూరిటీ మధ్య డాక్టర్ రమేష్ను సూపరింటెండెంట్ చాంబర్కు తీసుకొచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ రమేష్ను విధుల నుంచి తొలగించాలంటూ మృతుని కుటుంబీకులు సూపరింటెండెంట్ చాంబర్ ముందు బైఠాయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం రాత్రే మెరుగైన వైద్య సేవలందించామని సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ తెలిపారు. విషపుద్రావకం చాలా ప్రమాదకరమని, తమవైపు నుంచి అందించాల్సిన వైద్య సేవలందించామని డాక్టర్ రమేష్ తెలిపారు. వీరి సమాధానంతో సంతృప్తి చెందని మృతుని కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట రోడ్డుపై ధర్నా చేపట్టారు. చివరకు ఎస్ఐ లింగన్న, ఏఎస్ఐ రాము వారిని సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామినాయక్ వద్దకు తీసుకెళ్లారు. విచారణకు ఆదేశం శ్రీనివాస్ మృతిపై ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ విచారణకు ఆదేశించారు. చిన్నపిల్లల విభాగం, అనస్తీషియా, ఈఎన్టీ హెచ్ఓడీలు 24 గంటల్లోగా విచారణ చేయాలని సూచించారు. డాక్టర్ రమేష్కు మెమో జారీ చేశారు. ఉద్యోగాలు చేయలేం.. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ పట్ల మృతుని కుటుంబీకులు వ్యవహరించిన తీరును ఆస్పత్రి వైద్యులు, స్టాఫ్నర్సులు, సిబ్బంది తప్పుబడుతున్నారు. వైద్యో నారాయణో హరి అని వైద్యున్ని దేవునిగా పోల్చుతారని, అటువంటిది వైద్యునిపై దాడికి యత్నించడమే కాకుండా నోటికొచ్చినట్లు దుర్భాషలాడడమేంటని వాపోతున్నారు. ప్రాణం పోయాలని చూస్తామే కానీ.. తీయాలని ఎవరికీ ఉండదని పేర్కొన్నారు. తమ తప్పు లేకపోయినా దూషిస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రాణం తీసి.. ‘బీ పాజిటివ్’ అంటున్నారు
అనంతపురం న్యూ సిటీ: అనంతపురం సర్వజనాస్పత్రిలో తాడిపత్రికి చెందిన బాలింత ఎస్.అక్తర్భాను మృతిపై తక్షణ విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో కలెక్టర్ ఎస్.సత్యనారాయణ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చేందుకు సాక్షాత్తు జిల్లా కలెక్టర్నే బురిడీ కొట్టించేందుకు వైద్యుల బృందం యత్నించింది. సర్వజనాస్పత్రిలో వైద్యసేవలు పొందుతూ ఈ నెల 27న బాలింత ఎస్.అక్తర్భాను మృతి చెందిన విషయం విదితమే. ఆమెకు ఓ పాజిటివ్ రక్తం ఎక్కించాల్సి ఉండగా.. బీ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె మరణించింది. ఈ విషయమై ‘ఆస్పత్రి నిర్లక్ష్యం–బాలింత మృతి’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితం కాగా.. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. బాలింత మృతికి కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణను ఆదేశించారు. రంగంలోకి దిగిన కలెక్టర్ విచారణలో భాగంగా సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్తో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఘటనపై పక్కా నివేదిక ఇవ్వాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్కు వెళ్లారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, బ్లడ్ బ్యాంక్ వైద్యులు, పెథాలజిస్టులు మృతురాలు అక్తర్భాను బ్లడ్ గ్రూపు బీ పాజిటివ్ అని రాసి ఉన్న రికార్డులను కలెక్టర్కు చూపించారు. అంతేకాకుండా వేరొకరి రక్తాన్ని తీసుకొచ్చి కలెక్టర్ సమక్షంలో బీ పాజిటివ్గా నిర్థారణ చేశారు. అయితే, ఆస్పత్రి యాజమాన్యం వాదనతో ఏకీభవించని కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్, ఐఏఎస్ అధికారిణి పి.ప్రశాంతిని విచారణ అధికారిగా నియమించగా, వారు సుదీర్ఘంగా విచారించి మృతురాలి బ్లడ్ గ్రూపు ఓ పాజిటివ్ కాగా.. బీ పాజిటివ్ రక్తం ఎక్కించినట్టు గుర్తించారు. గైనిక్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బాలింత మరణించినట్టు నిర్థారణకు వచ్చారు. కాగా, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం ఆస్పత్రిని సందర్శించి వివరాలు తెలుకుంటారు. డీఎంహెచ్ఓ చొరవతో వెలుగులోకి.. ఈ నెల 26న ఇతర రక్త పరీక్షల కోసం ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు బాలింత బ్లడ్ శ్యాంపిల్స్ను రాయలసీమ డయాగ్నొస్టిక్కు పంపారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ డాక్టర్ కేవీఎన్ఎస్ అనిల్ పలుమార్లు పెథాలజిస్టుతో బ్లడ్ శాంపిల్స్ పరీక్ష చేయించగా అసలు నిజం వెలుగు చూసింది. -
చికిత్స కోసం వస్తే వికలాంగురాలిని చేశారు..
సనత్నగర్: కాలికి గాయమైన తమ కుమార్తెను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువస్తే ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె శాశ్వతంగా కాలును కోల్పోవాలి వచ్చిందని ఆరోపిస్తూ బాధితురాలి తల్లిదండ్రులు సనత్నగర్ పోలీసులను ఆశ్రయించారు. చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఎస్ఆర్నగర్ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్, పావని దంపతుల కుమార్తె అక్షర (5) గత నెల 13న ఇంట్లో ఆడుకుంటుండగా కబోర్డు మీద పడటంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు ఆమెను సనత్నగర్లోని నీలిమ ఆస్పత్రికి తీసుకువెళ్లగా పాప కాలిని ఎక్స్రే తీయించిన వైద్యులు.. పాపకు ఎలాంటి ప్రమాదం లేదు..కాలికి ఫ్రాక్చర్ అయినందున ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అప్పటికి తాత్కాలికంగా సిమెంట్ పట్టీ వేసి మరుసటి రోజు మే 14న ఉదయం ఆపరేషన్ చేస్తామని తెలిపారు. దీంతో తల్లిదండ్రులు మర్నాడు ఉదయం పాపను తీసుకుని ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ థియేటర్లోకి అక్షరను తీసుకువెళ్లిన వైద్యులు రెండు గంటల తర్వాత పాపను బయటికి తీసుకువచ్చి సీటీ స్కాన్ చేయించాలని సూచించారు. సీటీస్కాన్ చేయగా కాలికి రక్తప్రసరణ జరగడం లేదని, సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతెఓ వారు పాపను తీసుకుని యశోద ఆస్పత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి పాప కాలికి ఇన్ఫెక్షన్ సోకిందని ఆరు గంటల్లో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, ఇప్పటికే చాలా ఆలస్యం జరిగినందున కాలు తీసేయాల్సి ఉంటుందని, లేని పక్షంలో పాప ప్రాణానికే ప్రమాదమని తేల్చి చెప్పారు. దీంతో వారు సెకండ్ ఒపీనియన్ కోసం సన్షైన్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ చిన్న పిల్లలను చేర్చుకోరని చెప్పడంతో కిమ్స్ ఆస్పత్రికి వెళ్లగా. అక్కడి వైద్యులు కూడా కాలు తీయాల్సిందేనని స్పష్టం చేయడంతో గత్యంతరం లేక ఆపరేషన్కు అంగీకరించడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి కాలును తొలగించారు. నీలిమ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె కాలిని కోల్పోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సకాలంలో సరైన రీతిలో స్పందించి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చి ఉండేది కాదన్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై సనత్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి తండ్రి చంద్రశేఖర్ తెలిపారు. అయితే పోలీసులు నీలిమ ఆస్పత్రి యాజమాన్యానికే కొమ్ము కాస్తున్నారని, తమ ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం లేదు చిన్నారి అక్షర కేసులో ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం లేదు. చిన్నారిని తీసుకువచ్చినప్పుడు తగిన చికిత్స అందించాం. అయితే పాప తల్లిదండ్రులకు న్యాయం చేస్తాం, వారితో చర్చలు జరుపుతున్నాం...–నీలిమ ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనివాస్ -
వైద్యం వికటించి మహిళా వీఆర్వో మృతి
ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ పశ్చిమ): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళా వీఆర్వో మృతి చెందారని కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. కాలం చెల్లిన ఇంజక్షన్ వేయడం వల్లే చనిపోయారని ఆరోపించారు. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 7న ఉబ్బసం వ్యాధి ఉందంటూ అనకాపల్లి మండలం తుమ్మపాల ప్రాంతానికి చెందిన వీఆర్వో ఉప్పాడ రామలక్ష్మి(37) సన్రైజ్ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజులు వైద్యం అనంతరం ఆమె కోలుకుంది. వైద్యుడు జి.శ్రీధర్ శుక్రవారం డిస్ఛార్జ్ చేస్తానని చెప్పాడు. అయితే శుక్రవారం శ్రీధర్ వ్యక్తిగత పనిమీద గోవా వెళ్లిపోయాడు. మధ్యాహ్నం సమయంలో రామలక్ష్మి ఒక్కసారిగా అస్వస్థతకు గురయింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆమెకు ఇంజక్షన్ వేయగా అరగంట గడిచిన తరువాత ఆమె చనిపోయింది. ఇంజక్షన్ వికటించి మృతి చెందిందని.. దీనికి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. రామలక్ష్మి భర్త ఉప్పాడ నాగేంద్ర జగదీష్ ప్రతాప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. రామలక్ష్మీకి 5 నెలల కుమార్తె ఉంది. ఆసుపత్రి సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో రామలక్ష్మి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. -
ప్రసవానికి వచ్చిన గర్భిణి మృతి
తిరువొత్తియూరు: కోవైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన గర్భిణి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె మృతిచెందిందని ఆరోపిస్తూ బంధువులు గురువారం ఆందోళన చేపట్టారు. వివరాలు.. కోవై శివానందం కాలనీకి చెందిన సురేష్కుమార్ భార్య నిర్మల (35) కోవై ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంగతి తెలుసుకున్న కోవై ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ మహిళా డాక్టర్ తాను పార్ట్టైంగా పనిచేస్తున్న రామనాథపురంలోని ఎన్ఎం ఆస్పత్రిలో చెక్అప్లకు రమ్మని పిలిచినట్టు తెలిసింది. ఈ క్రమంలో నిర్మలను ప్రసవం కోసం గత 15వ తేదీ ఆమె చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అయితే గర్భంలో శిశువు మృతి చెందినట్లు తెలిసింది. తరువాత అక్కడ డాక్టర్లు లేక పోవడంతో ఆమెకు శస్త్రచికిత్స చేయనట్టు తెలిసింది. మరుసటి రోజు మంగళవారం డాక్టర్లు నిర్మలకు శస్త్ర చికిత్స చేసి మృతశిశువును బయటకు తీసి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రి నిర్వాహకులు నిర్మలను చికిత్స నిమిత్తం మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయినా నిర్మల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో కోవై ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ నిర్మల బుధవారం రాత్రి మృతి చెందింది. బంధువుల ఆందోళన నిర్మల మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు గురువారం ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న రేస్కోర్సు పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరపించారు. -
వైద్యుల నిర్లక్ష్యమే ప్రాణం తీసింది
కృష్ణరాజపురం : వైద్యుల నిర్లక్ష్యంతో తమ మూడేళ్ల కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ దంపతులు ప్రైవేటు ఆసుపత్రి ఎదుట నిరసన చేసిన ఘటన సోమవారం మారతహళ్లిలో చోటు చేసుకుంది. మారతహళ్లిలో నివాసముంటున్న రవి, సుజాత దంపతులు తమ కుమారుడు ప్రీతమ్ (3) ఫుడ్ పాయిజన్ కావడంతో కొద్ది రోజుల క్రితం మారతహళ్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రీతమ్కు చికిత్స చేసిన వైద్యులు అదేరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే మరోసారి మరోసారి ప్రీతమ్ అస్వస్థతకు గురి కావడంతో మూడు రోజుల క్రితం తల్లితండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ప్రీతమ్ సోమవారం చికిత్స ఫలించక మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమారుడిని ప్రాణం తీసిందని ఆరోపిస్తూ ప్రీతమ్ తల్లితండ్రులు ఆసుపత్రి ఎదుట నిరసన చేశారు. -
తెల్ల కోటు.. వేసుకుంటే ఒట్టు
శుభ్రంగా డ్రెస్ వేసుకుని, నీట్గా షేవింగ్ చేసుకుని కర్నూలుపెద్దాసుపత్రిలో తిరిగితే చాలు రోగులు, వారి కుటుంబసభ్యులు మాకు వైద్యం చేయండని వెంటపడతారు. ఇక్కడ డాక్టర్ ఎవరో.. సాధారణ వ్యక్తి ఎవరో అర్థం గాని పరిస్థితి నెలకొంది. వైద్యుల్లో చాలా మంది డ్రెస్ కోడ్ పాటించడం లేదు. వారిని చూసి జూనియర్ వైద్యులూ తెల్లకోటు జోలికి వెళ్లరు. ఫలితంగా ఎవరు ఎవరికి వైద్యం చేస్తున్నారో అర్థం గాని పరిస్థితి. ఈ క్రమంలోనే అగంతకులు మోసాలకు పాల్పడుతున్నారు. కర్నూలు (హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 400 మంది దాకా వైద్యులు (ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు), అంతకు రెట్టింపు సంఖ్యలో జూనియర్ వైద్యులు, హౌస్ సర్జన్లు కలిసి రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రికి ప్రతిరోజూ 3 వేల మంది ఓపీ రోగులు, 1500 మంది దాకా ఇన్ పేషంట్లు చికిత్స పొందుతున్నారు. అటు కేసీ కెనాల్ నుంచి ఇటు హంద్రీనది వరకు దాదాపు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో సువిశాల ప్రాంతంలో ఏర్పాటైన ఈ బోధనాసుపత్రిలో పాత, కొత్త భవనాలు 30కి పైగా ఉన్నాయి. ఇంత పెద్ద ఆసుపత్రిలో ఎవరు, ఎక్కడ ఉంటారో, ఏ వార్డు ఎక్కడో తెలుసుకోవడం ఒక్కోసారి ఏళ్లకొద్దీ ఆసుపత్రిలో పనిచేసే వారికే సరిగ్గా అర్థం కాదు. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ పనిచేసే వారిని గుర్తించడమూ కష్టమే. డ్రెస్ కోడ్కు నీళ్లొదిలారు...! సాధారణంగా ప్రతి చిన్న ఆసుపత్రిలో, ప్రైవేటు కార్యాలయాల్లో డ్రెస్ కోడ్ ఉంటుంది. కార్పొరేట్ ఆసుపత్రులు, సంస్థల్లో అయితే ఇది తప్పనిసరి. డ్రెస్ కోడ్ లేకపోతే హాజరు కూడా తీసుకోరు. వారు చేసే పనిని బట్టి దుస్తులు, ఐడీ కార్డు ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఉండాలి. అయితే నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఆఫ్ హాస్పిటల్(ఎన్ఏబీహెచ్) గుర్తింపు కోసం వెళ్తున్న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో డ్రెస్ కోడ్కు నీళ్లొదిలారు. మెజారిటీ వైద్యులు సాధారణ వ్యక్తుల్లాగే ఆసుపత్రిలో తిరుగుతుంటారు. అలాగే రోగులకు వైద్యం అందిస్తుంటారు. వారికి ఎలాంటి డ్రెస్ కోడ్ ఉండదు. కొందరు వైద్యుల మెడలో స్టెత్ ఉండటాన్ని బట్టి వారిని డాక్టర్ అనుకోవాలి. మరికొందరైతే అసలు స్టెత్ కూడా వాడరు. సాధారణ డ్రెస్లో వెళ్లి రోగులను పలకరించి వైద్యం సూచించి వెళ్తుంటారు. యథా రాజా తదా ప్రజా అన్నట్లు వీరిని చూసి పీజీ వైద్య విద్యార్థులు, హౌస్సర్జన్లు సైతం అధిక శాతం డ్రెస్ కోడ్ పాటించడం లేదు. హౌస్సర్జన్లకు, పీజీ వైద్యులకు వేర్వేరుగా ఆప్రాన్(తెల్లకోటు) ఉంటుంది. కానీ వారు తెల్లకోటు వాడరు. మరికొందరైతే టీ షర్ట్ ధరించి చేతిలో స్టెత్ పట్టుకుని తిరుగుతూ వైద్యం చేస్తుండటం అత్యవసర విభాగాల్లోనూ కనిపిస్తుంది. డ్రెస్ కోడ్ పాటించాలని అటు ఉన్నతాధికారులు గానీ, ఇటు వారి చీఫ్లు గానీ గట్టిగా చెప్పకపోవడం గమనార్హం. దర్జాగా అపరిచిత వ్యక్తుల సంచారం ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులకు, సెక్యూరిటీ గార్డులకు వేర్వేరుగా డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. వీరితో పాటు నర్సులు, నర్సింగ్ విద్యార్థినిలు డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారు. వీరు మినహా రెగ్యులర్ వైద్యులు, ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బందితో పాటు నాల్గవ తరగతి సిబ్బంది సైతం డ్రెస్ కోడ్ పాటించడం లేదు. ఈ కారణంగా ఆసుపత్రిలో ఇటీవల కాలంలో అపరిచిత వ్యక్తుల సంచారం అధికమైంది. రెండు రోజుల క్రితం ఓ అపరిచిత వ్యక్తి వైద్యునిగా చెప్పుకుంటూ నేరుగా క్యాజువాలిటీలోనే తిరిగాడు. కొందరు రోగులకు వైద్యం చేస్తున్నట్లు నటించాడు. శరీన్నగర్కు చెందిన లక్ష్మిదేవి అనే మహిళకు వైద్యం చేస్తున్నట్లు నటించి, ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును అపహరించి ఉడాయించాడు. ఇతనే కాదు ఆసుపత్రిలో అపరిచితుల సంచారం ఇటీవల అధికమైంది. ఆసుపత్రి సిబ్బంది మాదిరిగా ఇక్కడ తిరుగుతూ రోగులు, వారి కుటుంబీకుల నుంచి అందినకాడికి దండుకుని పారిపోతున్నారు. ఆసుపత్రిలో అధిక శాతం డ్రెస్ కోడ్ ఎవరూ పాటించకపోవడంతో ఎవరు ఆసుపత్రికి చెందిన వారో ఎవరు పరాయి వ్యక్తులో రోగులకు, వారి కుటుంబీకులకు గుర్తించడం కష్టం అవుతోంది. ఫలితంగా అపరిచిత వ్యక్తుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అన్ని విభాగాల్లో డ్రెస్ కోడ్ అమలు చేస్తాం ఎన్ఏబీహెచ్ నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ పాటించాలి. వారి వారి వృత్తి, హోదాను బట్టి డ్రెస్ ధరించాలి. దీంతో పాటు ప్రతి ఒక్కరి మెడలో గుర్తింపు కార్డు (ఐడీ కార్డు) ఉండాలి. ఈ మేరకు సోమవారం నుంచి ఆయా విభాగాల వారీగా వైద్యులతో సమావేశమై ఆదేశాలు జారీ చేయనున్నాము. –డాక్టర్ పి. చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
వైద్యుల నిర్వాకం... మహిళకు దుస్థితి
భువనేశ్వర్ : వైద్యుల నిర్లక్ష్యంతో రోగుల పరిస్థితి ప్రాణసంకటంగా మారింది. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో ఓ మహిళకు శస్త్ర చికిత్స చేసి ఆమె కడుపులో కత్తెర మరిచిపోయిన ఘటన మరవకముందే.. ఒడిశాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత మహిళ ఎడమ కాలికి గాయంతో ఆస్పత్రిని ఆశ్రయిస్తే వైద్యులు ఆమె కుడి కాలికి ఆపరేషన్ చేసిన నిర్వాకం వెలుగుచూసింది. కెంజార్ జిల్లాలోని కాబిల్ గ్రామానికి చెందిన మితారాణి జెనా అనే మహిళ రెండ్రోజుల కిందట తన ఎడమకాలికి గాయం కావడంతో చికిత్స కోసం ఆనంద్పూర్ సబ్డివిజన్ ఆస్పత్రిలో చేరారు. రోగి పరిస్థితిని పరిశీలించిన ఆస్పత్రి వైద్యుడు గాయానికి డ్రెస్సింగ్ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ క్రమంలో గాయమైన కాలికి కాకుండా వైద్య సిబ్బంది వేరే కాలికి డ్రెస్సింగ్ చేశారు. డ్రెస్సింగ్ రూమ్లో సిబ్బంది తొలుత రోగికి అనస్తీషియా ఇచ్చారు. మరోవైపు తాను స్పృహలోకి వచ్చిన అనంతరం ఎడమ కాలికి బదులు తన కుడి కాలుకు చిక్సిత చేశారని గుర్తించానని వైద్యాధికారికి బాధితురాలు జెనా ఫిర్యాదు చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో తాను నడవలేకపోతున్నానని ఆమె వాపోయారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ఈ ఘటనపై కెంజార్ జిల్లా కలెక్టర్ అశీష్ థాక్రే విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు చేపడతామని ఆనంద్పూర్ సబ్ డివిజనల్ ఆస్పత్రి ఇన్చార్జ్ డాక్టర్ కృష్ణ చంద్ర దాస్ పేర్కొన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి
సాక్షి, వైఎస్సార్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణి మృత్యువాత పడింది. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్ కడప జిల్లాలోని గాలివీడు మండలంలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చంద్రకళ అనే గర్భిణిని బంధువులు నూలివీడు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఏవరూ లేకపోవటంతో కాంపౌండర్ ఇచ్చిన ఫ్లూయిడ్తో చంద్రకళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మరో బిడ్డను ప్రసవించాల్సి ఉండగా సరైన వైద్యసేవలు అందక చంద్రకళ మృతిచెందింది. దీంతో వైద్యాధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా గర్భిణి కుటుంబసభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. -
వైద్యం అందక యువకుడి మృతి
సిరిసిల్ల టౌన్: వైద్యాన్ని పక్కనబెట్టి.. ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి సిబ్బంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. చికిత్స కోసం వచ్చినా పట్టించుకోకపోవడంతో ఆ యువకుడు చనిపోవడం జిల్లాలో కలకలం సృష్టించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే సదరు యువకుడు చనిపోయాడని పేర్కొంటూ బీజేపీ నాయకులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. చందుర్తి మండలం లింగంపేట శివారులో శుక్రవారం రాత్రి గొంటి సునీల్ (23) ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతడిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే వైద్యసిబ్బంది క్రిస్మస్ సంబరాల్లో ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పినా పట్టించుకోలేదు. దాదాపు 25 నిమిషాలపాటు కొట్టుమిట్టాడినా ఫలితం లేకుండా పోయింది. తీరా డ్యూటీ డాక్టర్ 9 గంటలకు వచ్చి పరిశీలించి అప్పటికే సునీల్ చనిపోయినట్లు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే సునిల్ చనిపోయాడని, సదరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ తిరుపతి వివరణ ఇస్తూ.. శుక్రవారం రాత్రి ఎమర్జెన్సీ వార్డులోని సిబ్బంది ఎవరూ వేడుకల్లో పాల్గొనలేదని, డ్యూటీలో లేనివారు మాత్రమే హాజరయ్యారని పేర్కొన్నారు. తీవ్ర గాయాలతో వచ్చిన సునీల్ను డాక్టర్ పరిశీలించి అప్పటికే మరణించాడని ధ్రువీకరించారని, ఆ తర్వాత క్రిస్మస్ వేడుకలను నిలిపివేశామని పేర్కొన్నారు. -
ఆపరేషన్కు వస్తే.. ఆయువు తీసేశారు!
శ్రీకాకుళం న్యూకాలనీ /పొందూరు: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైపోయింది. టాన్సిల్స్ ఆపరేషన్ వికటించడంతో తొమ్మిదేళ్ల చిన్నారి మృత్యువాతపడింది. ఈ విషాద ఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..పొందూరు మండలం అలమాజీపేట గ్రామానికి చెందిన చిగిలిపల్లి శ్రీనివాసరావు, రమా దంపతులకు ఇద్దరు పిల్లలు. తొమ్మిదేళ్ల కుమార్తె చాందిని (4వ తరగతి), ఏడేళ్ల కుమారుడు సాయిచందన్(3వ తరగతి) కింతలిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. శ్రీనివాసరావు జేసీబీ డ్రైవర్గా పనిచేస్తుండగా, రమా గృహిణి. చాందినికి వారం రోజుల క్రితం మెడ వద్ద టాన్సిల్స్ సమస్య రావడంతో శ్రీకాకుళం డేఅండ్నైట్ జంక్షన్ వద్ద ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ కింతలి సోమేశ్వరరావుకు వద్దకు తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసి టాన్సిల్స్ తీయాల్సి ఉంటుందని చెప్పడంతో సరేనని తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. అయితే వైద్యుడికి సొంతంగా ఆపరేషన్ థియేటర్ లేకపోవడంతో సురక్ష కిడ్నీ మెటర్నిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం చాందినిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు.లోపలికి వెళ్లిన రెండు గంటల తర్వాత హార్ట్పల్స్రేట్ సరిగా లేదని.. కార్డియాలజిస్ట్కు పిలిచామని వైద్యులు తల్లిదండ్రులకు చెప్పారు. మరో 30 నిమిషాల తర్వాత పాప చనిపోయిందని చావుకబురు చల్లగా చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. పాప చనిపోయిందని సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. తమ పాపని ఏం చేశారో చెప్పాలని డాక్టర్లను నిలదీయడంతో వారంతా బిక్కమొహం వేశారు. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు, ప్రైవేటు డాక్టర్ల సంఘ ప్రతినిధులు రంగ ప్రవేశం చేసి బంధువులను సముదాయించారు. అనస్థీషియా పనిని కూడా డాక్టర్ కింతలి సోమేశ్వరరావే చేయడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. డ్రగ్ డోస్ ఎక్కువగా ఇవ్వడంతో బ్రెయిన్ పనిచేయడం మానేసి.. హార్ట్పల్స్ రేట్ పడిపోయి పాప ప్రాణాలు విడిచిందని పరిశీలనకు వచ్చిన వైద్యులు గుర్తించారు. పాప మృతి చెందిన తర్వాత ముక్కు, చెవుల నుంచి రక్తం ధారకట్టింది. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పడంతో సాయంత్రం అలమాజీపేటలో దహనసంస్కారాలు పూర్తిచేశారు. కాగా, ఈ ఘటన విషయంలో ఇరువర్గాలకు రాజీ కుదిరినట్లు తెలిసింది. అలమాజీపేటలో విషాదఛాయలు.. చిన్నారి చాందిని స్వగ్రామం అలమాజీపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. నిన్నమొన్నటి వరకు తమతోనే ఉన్న కుమార్తె ఇక లేదని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అక్క ఎందుకు రాలేదని తమ్ముడు సాయిచందన్ అడుగుతుండటం స్థానికులను కంటతడి పెట్టించింది. -
ఆస్పత్రికి వెళితే..ఆయువు తీశారు..!
అది ఏ దిక్కూలేని దవాఖానా. అక్కడ వైద్యులు ఉండరు. సకాలంలో వైద్యం అందదు. కళ్లుతిరిగి పడిపోయిందని ఆస్పత్రికి తీసుకెళితే వృద్ధురాలి ఆయువు తీశారు. ప్రాణాలు పోతున్నా వైద్యం చేసేవారు కరవు అనేందుకు రాజంపేట ఏరియా ఆస్పత్రిలో శనివారం జరిగిన ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. అధికారులు, వైద్యుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట: ఆకేపాడు గ్రామపరిధిలోని రామిరెడ్డిగారిపల్లెకు చెందిన ఆవుల సుభద్రమ్మ (68) అనే వృద్ధురాలు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు... సుభద్రమ్మ కళ్లు తిరిగి కిందకిపడిపోయింది. ఆమెను రాజంపేట ఏరియా ఆసుపత్రి(వైద్యవిధానపరిష్)కు తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో డ్యూటీలో ఉన్న నర్స్ స్థానిక వైద్యునికి సమాచారం తెలియజేశారు. ఆయన వచ్చే సరికే వృద్ధురాలి పరిస్థితి విషమించింది. మృత్యుఓడిలోకి చేరుకుంది. వృద్ధురాలిని పరిశీలించి అక్కడి నుంచి వైద్యుడు వెళ్లిపోయారు. సకాలంలో వృద్ధురాలు ఆసుపత్రికి వచ్చినప్పటికి వైద్యం అందించలేకపోవడంతో బంధువులు ఆగ్రహించారు. అన్ని సౌకర్యాలు ఉంటాయనే (ట్రామాకేర్సెంటర్) ఉద్దేశంతో వృద్ధురాలిని తీసుకు వచ్చామని.. ఆస్పత్రి దుస్థితి తమకు తెలిసి ఉంటే తీసుకొచ్చేవాళ్లం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదైనా కార్పొరేట్ హాస్పిటల్కు తీసుకెళ్లినా కాపాడుకునేవాళ్లమని మృతురాలి సంబంధీకులు వాపోయారు. కాల్డ్యూటీలు.. రాజంపేట ఏరియా హాస్పిటల్లో కాల్డ్యాటీలు అమలుచేస్తున్నారు. వైద్యులు, వైద్యసిబ్బంది కొరత సమస్య వెంటాడుతోంది. ఈ క్రమంలో కాల్డ్యాటీలు తెరపైకి వచ్చాయి. వైద్యుడు 10 నుంచి 15 నిమిషాల్లో వచ్చి చికిత్స చేసేలా నిర్ణయం తీసుకున్నారని ఆసుపత్రి వర్గాలు మరోవైపు చెబుతున్నాయి. అయితే కొందరు వైద్యులు జీవో ప్రకారం స్థానికంగా లేకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైవుతాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కాల్డ్యూటీలో రోగులు తమకు సహకరించాలని ముందస్తుగా సెంటర్లో ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ఆ లెక్కన చూస్తే శనివారం వృద్ధురాలని 12.15గంటలకు తీసుకొస్తే 12.40గంటలకు కానీ వైద్యం చేసేందుకు ఎవరూ రాలేదు. దీంతో వృద్ధురాలి కానరాని లోకాలకు చేరుకుంది. వైఎస్సార్సీపీ నేతల ఆందోళన వృద్ధురాలి మృతికి సకాలంలో వైద్య సేవలందించకపోవడమే కారణమని, ఇక్కడ వైద్యులు అందుబాటులో లేరని వైఎస్సార్సీపీ నేతలు మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ జిల్లా రైతు ప్రధానకార్యదర్శి గీతాల నరసింహారెడ్డి, నీనేస్తం అధ్యక్షుడు పెంచలయ్యనాయుడు, దళితనాయకులు దండుగోపి, ఆర్సీ పెంచలయ్య, సొంబత్తిన శ్రీనివాసులు, మాజీ సర్పంచి బుర్రునాగేశ్వరరావు, మాధవరం వల్లి, ఆకేపాడు గ్రామానికి చెందిన నాయకులు ట్రామా కేర్ సెంటర్ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యవిధానపరిషత్ నిర్వహణ విఫలమయ్యిందని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైద్యులు నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి కృషితో ట్రామాకేర్సెంటర్ను తీసుకొచ్చారని, ఇప్పుడు టీడీపీ పాలనలో దిక్కులేని దవాఖానాగా మారిపోయిందని విమర్శించారు. ప్రాణాలు కాపాడలేని పెద్దాసుపత్రి ప్రాణాలు పోసేవిధంగా ఉండాలే కానీ, ప్రాణాలను కాపాడలేని విధంగా రాజంపేట పెద్దాసుపత్రి నిర్వహణ తీరు కనిపిస్తోంది. గతంలో చిన్నారి భవ్యశ్రీ మృతి సంఘటనలో చట్టపరమైన చర్యలు తీసుకుని ఉండి ఉంటే ఈ రోజు వృద్ధురాలి ప్రాణంపోయి ఉండేది కాదు. తాను ఎంతో కృషిచేసి ట్రామాకేర్సెంటర్ మంజూరు, ఓపీబ్లాక్ ఆధునీకరణ లాంటివిచేపడితే పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని భావించాను. టీడీపీ పాలకుల వల్లే ఆస్పత్రికి ఈ దుస్థితి వచ్చింది. –ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాజంపేట డీసీహెచ్కు ఫోన్చేశాను.. అవ్వ అస్వస్థతకు గురికావడంతో రాజంపేట ఏరియా హాస్పిటల్కు తీసుకువచ్చాను. అయితే అందుబాటులో వైద్యులు లేరు. వైద్యుని కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. మృతిచెందినట్లుగా తెలిసి, ఇక్కడున్న పరిస్థితులను డీసీహెచ్కు ఫోన్ ద్వారా వివరించాను. పొంతనలేని సమాధానాలు చెప్పి, ఫోన్ కట్చేశారు. –ఆవుల విష్ణుకాంత్రెడ్డి, మృతురాలి మనవడు, ఆకేపాడు -
బండితోస్తేనే వైద్యం
నగరంలోని నాల్గో రోడ్డుకు చెందిన నాగలక్ష్మి అనే వృద్ధురాలు అనారోగ్యంతో ఎఫ్ఎం వార్డులో చేరింది. మంగళవారం ఉదయం 9 గంటలకు ఆమెను పరీక్షించిన వైద్యులు స్కానింగ్కు రెఫర్ చేశారు. 11 గంటల సమయంలో నాగలక్ష్మిని స్కానింగ్ రూంకు తీసుకెళ్లేందుకు వచ్చిన ఎంఎన్ఓ ఆరోగ్య శ్రీ కార్యాలయం ముందు వరకూ తీసుకువెళ్లి..పని ఉందంటూ వెళ్లిపోయాడు. గంటన్నర గడిచినా ఎవరూ రాకపోవడంతో కుటుంబీకులు వార్డుకెళ్లి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు వారే స్ట్రెచర్ తోసుకుంటూ స్కానింగ్ రూంకు తీసుకువెళ్లారు. అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలో ఎంఎన్ఓ, ఎఫ్ఎంఓలది ఆడింది ఆట..పాడింది పాటగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారం విధులు నిర్వర్తిస్తున్నారు. రోగులను వార్డుల్లోనుంచి రక్త పరీక్షలు, స్కానింగ్కు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వారిదే అయినప్పటికీ పట్టించుకోవడం లేదు. పైగా నడవలేని స్థితిలో ఉన్న వారిని హీనంగా చూస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోగులను తరలించాల్సి వచ్చినా...స్ట్రెచర్పై ఉన్న రోగులను ఎక్కడపడితే అక్కడే వదిలేసి వెళ్తున్నారు. దీంతో సకాలంలో వైద్యం అందక రోగులు నకరం చూస్తున్నారు. అయినా పట్టించుకునే నాథుడే కరువవుతున్నారు. పత్తాలేని సిబ్బంది ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో 30 మంది ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు రెగ్యులర్ ఎంఎన్ఎఓ, ఎఫ్ఎన్ఓలు 29 మంది వరకు ఉన్నారు. వీరు రౌండ్ ద క్లాక్ రోగులకు సేవలందించాల్సి ఉంది. కానీ వార్డుల్లో పూర్తి స్థాయిలో ఉండడం లేదు. ఆస్పత్రిలో అడ్మిషన్లో ఉన్న వారిని వైద్య పరీక్షల(ఎక్స్రే, సిటీ స్కాన్, ఆల్ట్రాసౌండ్ స్కాన్, ఎంఆర్ఐ)తదితర సేవలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొన్ని వార్డుల్లో ఉదయం వైద్యులు రెఫర్ చేస్తే మధ్యాహ్నం వరకైనా సిబ్బంది తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో రోగులు కుటుంబీకులే వైద్య పరీక్షలకు అతి కష్టం మీద తీసుకెళ్తున్నారు. నిద్రమత్తులో ఉన్నతాధికారులు ఆస్పత్రిలో అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్(ఆర్ఎంఓ) ఆవైపుగా దృష్టి సారించడం లేదు. వాస్తవంగా ఆర్ఎంఓ, డిప్యూటీ ఆర్ఎంఓ, అసిస్టెంట్ ఆర్ఎంఓలు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు వార్డులను పర్యవేక్షించి, అక్కడ రోగులేమైనా ఇబ్బందులు పడుతుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఆర్ఎంఓ కార్యాలయానికే పరిమితం కాగా... ఇదే అదునుగా సిబ్బంది పత్తా లేకుండా పోతున్నారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలు..రోగుల ఇబ్బందులపై కలెక్టర్ వీరపాండియన్ చొరవ చూపితే బాగుంటుందని రోగులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం రోగులను వైద్య పరీక్షల కోసం ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలే తీసుకెళ్లాలి. అలా చేయకుండా మధ్యలోనే వదిలేయడం సరికాదు. అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ లలిత, ఆర్ఎంఓ -
ఆదుకుంటామన్నారు.. పట్టించుకోలేదు
తాడేపల్లి రూరల్(మంగళగిరి): వైద్యుల నిర్లక్ష్యం వల్ల బిడ్డను పోగొట్టుకొని అన్ని విధాలా నష్టపోయిన తమను ఆదుకుంటామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోలేదని.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినా న్యాయం జరగలేదంటూ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు కొరకడంతో మృతి చెందిన పసికందు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు కోర్టులో పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవాలంటూ గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు బెదిరింపులకు దిగుతున్నారని వాపోయింది. డిసెంబర్ 6న కోర్టు వాయిదా ఉందని.. దానికి వెళ్లాలంటేనే భయమేస్తోందని తెలిపింది. వీటిపై తన గోడు వెళ్లబోసుకునేందుకు సోమవారం ఆమె ఉండవలి–అమరావతి కరకట్ట వెంట ఉన్న సీఎం చంద్రబాబు నివాసం వద్దకు వచ్చింది. అయితే ఆమెకు మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో అక్కడే ఉన్న మీడియా వద్ద బాధితురాలు చావలి లక్ష్మి తన బాధ చెప్పుకున్నారు. ‘2015 ఆగస్టు 20న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ అయ్యింది. మగబిడ్డ పుట్టగా.. సమస్య ఉందంటూ మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు పంపించారు. గుంటూరు వైద్యులు ఆపరేషన్ చేసి.. వార్డులోకి ఎవరినీ రానివ్వలేదు. 2015 ఆగస్టు 26న వార్డులో ఎలుకలు కొరకడంతో.. మా బిడ్డ చనిపోయాడు. దానిపై ప్రభుత్వం విచారణ చేయగా వైద్యులదే తప్పని తేలింది. అప్పటి వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు, కలెక్టర్ కాంతిలాల్ దండే మమ్మల్ని పరామర్శించి.. నష్టపరిహారంగా రూ.10 లక్షలు అందజేస్తామన్నారు. కానీ రూ.5 లక్షలే ఇచ్చారు. ప్రభుత్వం మాత్రం మాకు రూ.10 లక్షలు ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటోంది. అలాగే పక్కా నివాసం, ఉద్యోగం ఇస్తామన్నారు. వీటి గురించి కృష్ణా జిల్లా కలెక్టర్ను ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రికి చెప్పుకుందామని ఏడుసార్లు ఆయన ఇంటి వద్దకు వచ్చాం. ఈ ఏడాది జూన్ 23న, ఆగస్టు 6న రెండు సార్లు సీఎంతో మాట్లాడాం. కలిసిన ప్రతిసారీ కలెక్టర్ దగ్గరకు వెళ్లాలని చెబుతున్నారు. కలెక్టర్ను కలిస్తే.. ఆయన తమకు ఉత్తర్వులేమీ రాలేదని చెబుతున్నారు. -
ప్రసవ వేదన.. అరణ్యరోదన
వేమనపల్లి: గతుకుల రోడ్లు.. స్థానికంగా ఉండని వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణికి గర్భశోకం మిగిలింది. పురిటి నొప్పులతో అడవిలోనే మృతశిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బుయ్యారంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోమాస లావణ్యకు శనివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు మొదలయ్యాయి. మొదటి కాన్పు కావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. అయితే.. సిబ్బంది అందుబాటులో లేని కారణంగా రాలేమని చెప్పారు. దీంతో గ్రామంలోని ఆశవర్కర్ సరస్వతీ, ఆర్ఎంపీ సహాయం తీసుకున్నారు. పక్క గ్రామం జిల్లెడలో ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఎన్నడూ ఏఎన్ఎం, ఇతర సిబ్బంది గానీ స్థానికంగా ఉండరు. ఇటీవల ప్రైవేటు ఆస్పత్రిలో లావణ్య స్కానింగ్ పరీక్ష చేయించుకోగా.. పాప ఎదురుకాళ్లతో జన్మించే అవకాశం ఉందని వైద్యులు నిర్ధారించారు. నిబంధనల ప్రకారం పాప అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వైద్యుడు, హెల్త్ సూపర్వైజర్, ఏఎన్ఎం పర్యవేక్షణ అవసరం కానీ.. ఎవరూ అందుబాటులో లేరు. ఇంటి వద్ద సాధారణ ప్రసవం కాకపోవడంతో చేసేదేమీ లేక ఆటోలో వేమనపల్లి పీహెచ్సీకి బయల్దేరారు. మార్గమధ్యంలోని నాగారం గ్రామం నుంచి మంగనపల్లి వరకు అటవీమార్గం మట్టిరోడ్డు గుంతలమయంగా ఉంది. గతుకులతో ఉన్న మట్టి రోడ్డులో కుదుపులే ప్రమాదకరంగా మారాయి. నాగారం అటవీ ప్రాంతంలోనే రాళ్లకుప్ప వద్దకు రాగానే నొప్పులు తీవ్రమయ్యాయి. అక్కడే లావణ్య మగ మృతశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం బాలింతను వేమనపల్లి పీహెచ్సీకి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. -
కడుపు నొప్పితో వస్తే కాటికి పంపారు
భాగ్యనగర్కాలనీ: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మరణించాడని మృతుడి తల్లితో పాటు కుటుంబ సభ్యులు గురువారం ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి (32) చింతల్లో నివాసముంటూ కూకట్పల్లిలోని హోండా షోరూమ్లో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం విధుల్లో ఉండగా కడుపు నొప్పి వచ్చింది. దీంతో శ్రీనివాసరెడ్డిని తోటి ఉద్యోగులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. శ్రీనివాసరెడ్డి మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు. -
పాల్ మృతికి నిర్లక్ష్యమే కారణమా!
సాలూరు రూరల్ : మండలంలోని కందులపధం గ్రామానికి చెందిన దళితుడు సురాపాటి పాల్(38) మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈయన మృతికి వ్యసనాలే కారణమా? లేక వైద్య సిబ్బంది నిర్లక్ష్యమా? అన్నది తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళ్తే...పాల్ థింసా నృత్యానికి డప్పు వాయిస్తూ జీవనం గడుపుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాలూరు సీఎం పర్యటనలో ఈయనకు డప్పు వాయించే అవకాశం లభించింది. అయితే చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్దు కావడంతో పాల్ మంగళవారం తోణాంలోని బంధువుల ఇంటికి వేడుకకని వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత 3.30 గంటల సమయంలో ఫిట్స్ వచ్చింది. వెంటనే పాల్ను తోణాం పీహెచ్సీకి తరలించారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో సిబ్బంది పరీక్షించి పాల్ శరీరంలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో వైద్యాధికారికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఆయన సూచన మేరకు సాలూరు సీహెచ్సీకి తరలించాలని సూచించారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో 108కి ఫోన్ చేయగా 5.15కు వాహనం రాగా అప్పటికే పాల్ మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. ఉదయాన్నే వచ్చా.. దీనిపై స్థానిక పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ స్వాతిని వివరణ కోరగా తాను మంగళవారం సారిక సబ్సెంటర్కు వెళ్లానని చెప్పారు. పాల్ ఉదయం ఆస్పత్రికి వచ్చారని సిబ్బంది పాల్కు రక్త పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఇచ్చారని తెలిపారు. పాల్ అతిగా సారా తాగడమే మృతికి కారణం కావచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు నివేదించానని చెప్పారు. -
కాన్పు చేసిన నర్సులు
కల్వకుర్తి టౌన్ : వైద్యులు లేకుండా నర్సులే ఓ మహిళకు ప్రసవం చేయడంతో చిన్నారికి పేగు చుట్టుకుని మృతి చెందిందింది. ఈ ఘటన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభత్వ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. కల్వకుర్తి ఎస్ఐ రవి, బాధితురాలి భర్త రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండ లం ఫిరోజ్ నగర్ గ్రామపంచాయతీకి చెందిన మంగమ్మ కాన్పు కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి సోమవారం ఉదయం వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు సాయంత్రం సాధారణ కాన్పు చేద్దాం.. అంతా సిద్ధం చేయాలని నర్సులకు సూచించి వెళ్లిపోయారు. అయితే, మంగమ్మ నొప్పులు తీవ్రమవుతున్నా వైద్యులు రాకపోవటంతో నర్సులే కాన్పు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాన్పు చేస్తుండగా.. బిడ్డకు పేగు చుట్టుకుని ఉండడంతో ఆందోళన చెందిన నర్సులు వైద్యుడు శివరాంకు ఫోన్లో సమాచారం ఇవ్వగా ఆయన బయలుదేరగా.. వచ్చేటప్పటికే బాబు చనిపోయాడు. ఈ విషయమై వైద్యుడు శివరాంను అడగగా.. మంగమ్మ పరిస్థితిని నర్సులు తనకు చెప్పగా.. సాధారణ ప్రసవం వీలు కాకపోతే సిజేరియన్ చేద్దామని ప్రయత్నించినా అప్పటికే బిడ్డ బయటకు రావడంతో చనిపోయాడని తెలిపారు. నర్సులు కాన్పులు చేయొచ్చా అని అడిగితే.. సాధారణ కాన్పులు చేయొచ్చు కానీ క్లిష్ట పరిస్ధితి ఎదురైతే వైద్యులకు సమాచారం ఇస్తారని పేర్కొన్నారు. కానీ ఈ విషయమై మంగమ్మ బంధువులు మాట్లాడుతూ కాన్పు పూర్తిగా నర్సులే చేశారని, పూర్తిగా బిడ్డ బయటకు వచ్చాకే వైద్యుడు చేరుకున్నారని తెలిపారు. ఈ విషయం తెలియగానే కల్వకుర్తి సీఐ సురేందర్రెడ్డి, ఎస్సై రవి చేరుకుని బాధితులతో మాట్లాడారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి ..బాలింత మృతి
విజయనగరం ఫోర్ట్ : ఘోషాస్పత్రిలో తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నా వైద్య సిబ్బందిలో మార్పు రావడం లేదు. కొద్ది రోజుల కిందట చీపురుపల్లి మండలం జి.ములగాం గ్రామానికి చెందిన భవాని, సత్యనారాయణ దంపతులకు జన్మించిన మగ శిశువు ఘోషాస్పత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో శిశువు తండ్రి పోలీసులు, కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం దానిపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మరో విచారకర సంఘట చోటుచేసుకుంది. మగ బిడ్డ పుట్టాడని ఎంతో సంబరపడ్డ ఆ తల్లి పుట్టిన శిశువును తనివితీరా ముద్దాడకుండానే తనువు చాలించింది. బాలింత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలం పోరలి గ్రామానికి చెందిన కొప్పల సంతోషి ఈనెల 25న ప్రసవం కోసం ఘోషాస్పత్రి లో చేరింది. 26వ తేదీ రాత్రి 10.20 గంటల సమయంలో ఆమెకు సాధారణ ప్రసవం అవ్వగా మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వైద్య సిబ్బంది ఆమెను కాన్పు గది నుంచి వార్డుకు తరలించారు. రాత్రి ఒంటి గంట సమయంలో సంతోషికి తీవ్ర రక్తస్రావం అవ్వడంతో ఆమె బంధువు నర్సు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆమె నేను డ్యూటీలో లేను.. ఇంకోనర్సుకు చెప్పు అని తెలిపింది. ఇలా ఒకరు మీద ఒకరు చెప్పుకుంటూ శుక్రవారం ఉదయం వరకు బాలింతను పట్టించుకోలేదు. ఉదయం 6 గంటల సమయంలో వైద్యురాలి వద్దకు బాలింతను తీసుకుని వెళ్లగా వారు రక్తం ఎక్కించారు. అయినప్పటికీ రక్తస్రావం అగకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో రక్తస్రావం తగ్గడానికి గర్భసంచి తొలిగించాలని బంధువులకు చెప్పారు. బంధువులు అందుకు అంగీకరించడంతో ఆపరేషన్ చేసి గర్భసంచి తొలిగించారు. ఆపరేషన్ అనంతరం రక్తస్రావం తగ్గిందని వైద్యురాలు బంధువులకు తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రక్తస్రావం అగినప్పటికి బ్రెయిన్లో సమస్య ఉందని.. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించాలని సిబ్బంది సూచించారు. దీంతో 2.45 గంటల సమయంలో అంబులెన్స్లో సంతోషిని కేజీహెచ్కు తరలించారు. అయితే కేజీహెచ్ గేట్ వద్ద సంతోషిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పారు. మృతదేహంతో ఆందోళన సంతోషి చనిపోయిందని కేజీహెచ్ సిబ్బంది చెప్పడంతో రాత్రి ఎనిమిది గంటలకు అంబులెన్స్లో మృతదేహాన్ని తీసుకువచ్చి స్థానిక ఘోషాస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. మా బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారంటూ రోధించారు. ఘోషాస్పత్రిలోనే చనిపోతే విశాఖకు తరలించా రని ఆరోపించారు. ఆందోళన విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ సీతారామరాజు ఆస్పత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. సంఘటనపై విచారణ చేపడతామని చెప్పగా, ఇంతవరకు ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయని, ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారని బాధితులు ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరగడంతో రెండో పట్టణ ఇన్చార్జి సీఐ చంద్రశేఖర్, ఎస్సైలు అశోక్, దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘోషాలోనే చనిపోయింది ఘోషాస్పత్రిలోనే మా చెల్లి చనిపోయింది. ఏమీ తెలియకుండా వైద్యులు కేజీహెచ్కు తీసుకెళ్లమని చెప్పారు. అక్కడ వైద్యులు పరీక్షించి చనిపోయిందని చెప్పారు. ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే మా చెల్లి చనిపోయింది. – జి. చంద్రినాయుడు, మృతిరాలి సోదరుడు విచారణ చేయిస్తాం వైద్యుల నిర్లక్ష్యం లేదు. సంతోషి కోమాలోకి వెళ్లిపోవడంతో మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తరలించాం. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తాం. వైద్య సిబ్బంది నిర్లక్షం ఉంటే చర్యలు తీసుకుంటాం. కె.సీతారామరాజు, సూపరింటెండెంట్ , ఘోషాస్పత్రి -
కాన్పుకోసం వస్తే కాదుపొమ్మన్నారు..
అనంతగిరి : నేడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెరిగాయి. కాని డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల గర్భిణులు హైద్రాబాద్లో, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవం అయ్యే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఇది వికారాబాద్లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఎదురవుతున్న దుస్థితి. వికారాబాద్లోని వెంకటపూర్ తండాకు చెందిన గర్భిణి రెండు రోజుల కిందట ప్రసవం కోసం వచ్చింది. ఆమె ప్రతి నెలా రెగ్యులర్గా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చెక్ చేయించుకుంది. అక్కడికి వచ్చిన ఆమెకు నీవు ఇక్కడ కాన్పు చేయించుకోవడం కష్టం అవుతుంది. వెంటనే హైదరాబాద్లోని ప్రసూతి ఆస్పత్రికి (జజ్గిఖానా)కు వెళ్లాలని సిబ్బంది సూచించారు. దీంతో ఆమె కుటుంబీకులు భయపడి వెంటనే హైదరాబాద్కు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన అనంతరం డాక్టర్లు పరిక్షించి ఇక్కడికి ఎందుకు వచ్చారు. వికారాబాద్కే వెళ్లండి నార్మల్ డెలివరీ అవుతుంది. ఎలాంటి సమస్య లేదనడంతో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి గురువారం వచ్చారు. అక్కడ ఉన్న సిబ్బందితో డాక్టర్లు చెప్పిన విషయాన్ని వివరించారు. అయినా ఆమె మాటలు పట్టించుకోకుండా డాక్టర్లు లేరు బయట ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోమని సిబ్బంది సమాధానం చెప్పారు. దీంతో సదరు గర్భిణి బంధువులు ఇదేం పద్ధతి ప్రభుత్వ దవాఖానాలో డాక్టర్లు లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, శివారెడ్డిపేట పీఏసీఎస్ చైర్మన్ కిషన్ నాయక్ వచ్చి ఇదేం పద్ధతి దవాఖానకు వచ్చేది పేదవాళ్లు, వాళ్లను బయటకు వెళ్లమంటే వారి వద్ద అన్ని డబ్బులు ఉంటాయా అని సిబ్బందిని ప్రశ్నించారు. డ్యూటీలో డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రం ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో నిరాక్షరాస్యులు ఎక్కువగా ఉండడంతో వచ్చిన రోగులను సిబ్బంది సముదాయించి చెప్పాలి తప్ప కోపగించుకోకూడదని సూచించారు. ఈ విషయమై వారు కలెక్టర్కు ఇక్కడ ఉన్న పరిస్థితిని తెలియజేయగా వెంటనే ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్కు ఫోన్ చేశారు. ఆయన అక్కడికి వచ్చి డాక్టర్లను పిలిపించి వైద్య సేవలు అందించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు కొన్ని జరిగాయి. కాగా గురువారం బాధితురాలితో పాటు రావులపల్లికి చెందిన మరో గర్భిణి కూడా కాన్పుకోసం వస్తే ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించింది. ఆస్పత్రిలో గర్భిణులు ప్రసవం కోసం వస్తే వారినుంచి డబ్బులు సైతం డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో పలువురు జిల్లా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈమధ్యలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఆస్పత్రి పనితీరు సక్రమంగా కొనసాగడంలేదని రోగులు, వారి కుటుంబీకులు పేర్కొంటున్నారు. -
అర్ధరాత్రి నారాయణ హృదయాలయలో ఉద్రిక్తత
-
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి
రాంగోపాల్పేట్: ప్రసూతి కోసం వచ్చిన గర్భిణీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో మరణించిందని ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళన చేశారు. బాధితుల కథనం మేరకు.. మణికొండకు చెందిన సౌమ్య (25) కాన్పు కోసం గత నెల 27 నవోదయ ఆస్పత్రికి వచ్చింది.ఆమెకు మరుసటి రోజు సిజేరియన్ చేయగా పాప, బాబు కవల పిల్లలు జన్మించారు. మెరుగైన చికిత్స కోసం బర్కత్పురలోని నవోదయ శాలిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సౌమ్యకు మళ్లీ శస్త్ర చికిత్స చేశారు.తరువాత ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో బంధువులు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. దీంతో బంధువుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతదేహా తీసుకుని వచ్చి నవోదయ ఆస్పత్రి ముందు ఉంచి ఆందోళనకు దిగారు. రాంగోపాల్పేట్, సైఫాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. శస్త్ర చికిత్స విఫలం కావడంతో పాటు వైద్యులు ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండటంతోనే సౌమ్య మరణించిందని బంధువులు ఆరోపించారు. సుమారు రూ.12లక్షలు ఖర్చు పెట్టినా బ్రతికించలేకపోయారని వాపోయారు. -
అప్పటివరకు మాట్లాడింది..అంతలోనే..
గొంతులో వచ్చిన సమస్యకు చికిత్స పొందిన ఆ పాప గళం.. అంతలోనే శాశ్వతంగా మూగబోయింది. ఒక్కగానొక్క బిడ్డ అని అల్లారుముద్దుగా చూసుకుంటున్న అమ్మానాన్నల హృదయాల్లో ఆరని శోకాగ్ని రగిలింది. కాకినాడ జీజీహెచ్లో టాన్సిల్స్కు చికిత్స పొందిన రాయవరం మండలం వెదురుపాకకు చెందిన ప్రేమాంజలి (13) గురువారం మరణించింది. చికిత్సలో లోపమే పాపను బలిగొందని అయినవారు ఆక్రోశిస్తున్నారు. తూర్పుగోదావరి, సర్పవరం (కాకినాడ సిటీ): కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో వైద్యులు, నర్సుల నిర్లక్ష్యం కారణంగా చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. రాయవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన రాయుడు వెంకటరమణ, సత్యవేణిల ఏకైక కుమార్తె రాయుడు ప్రేమాంజలి(13) ఏడో తరగతి చదువుతుంది. ఆమెకు టాన్సిల్స్(గొంతుకు ఇరువైపులా కాయలు) రావడంతో బుధవారం సాయంత్రం కాకినాడ సామాన్య ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. జీజీహెచ్లోని ఈఎన్టీ విభాగంలో చికిత్స పొందుతుండగా గురువారం ఉదయం 7.20 గంటల వరకు అందరితో బాగానే మాట్లాడిందని, జ్వరం, కడుపుమంట ఉండడంతో నర్సుని పిలిస్తే ఇంజక్షన్ ఇచ్చినట్టు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. ఇంజక్షన్ ఇచ్చిన పది నిమిషాల్లోపే ఆమె ఒళ్లంతా దద్దుర్లు, విరేచనాలు, నోట్లో నుంచి రక్తం వచ్చిందని వెంటనే పీఐసీయూకి తరలించారని తెలిపారు. తరువాత ఎవ్వరినీ లోపలికి రానివ్వకుండా బాలిక తండ్రిని పదినిమిషాలు మాత్రమే లోపలికి అనుమతించారు. కొంత సమయం తరువాత మీ పాప చనిపోయిందని మధ్యాహ్నం 1.30 గంటలకు వైద్యులు తెలిపారని మృత్యురాలు మేనమామ బోరున విలపిస్తూ చెప్పారు. చాలా బాధాకరం హిమరేక్స్ ఫీవర్స్ కావచ్చు. బాలికకు ఇచ్చిన ఇంజక్షన్ పారాసిటమాల్ మాత్రమే. దీని వల్ల ప్రమాదం కాదు. ఇంజక్షన్ వల్ల మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కాబట్టి వైద్య బృందాన్ని వివరణ కోరాను. కొన్నిసార్లు హిమరేక్స్ ఫీవర్స్ ఉన్నప్పుడు కొన్ని ఇంజక్షన్లు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయినా ఈ బాలికకు అటువంటి సూచనలు కనిపించలేదు. ఈ సంఘటనపై విచారిస్తున్నాం. మళ్లీ పునరావృతం కాకుండా చూస్తా.– డాక్టర్ ఎం.రాఘేవేంద్రరావు,జీజీహెచ్ సూపరింటెండెంట్, కాకినాడ -
ఆరోగ్య శ్రీ వైద్యం.. వికటించి బాలుడి మృతి!
సాక్షి, కర్నూలు : నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. సోమసుందర్ అనే 12సంవత్సరాల బాలుడికి ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కింద డాక్టర్లు వైద్యం చేశారు. అయితే, ఆ వైద్యం వికటించడంతో బాలుడు మృతిచెందినట్టు తెలుస్తోంది. సరైన విధంగా వైద్యం అందించలేదని, బాలుని మృతికి డాక్టర్లే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. డాక్టర్లు డబ్బులకు ఆశించడం, నిర్లక్ష్యం చేయడం వల్లే బాలుడు మృతి చెందాడని వారు తెలిపారు. పోలీసులు వారిని సముదాయించి నిజాన్ని నిగ్గు తేలుస్తామని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించి మృతికి గల కారణాలను తెలుసుకుంటామని తెలిపారు. -
వైద్యుల నిర్లక్ష్యం?
శ్రీకాకుళం అర్బన్ : నగరంలోని డే అండ్ నైట్ కూడలి సమీపంలో బ్రిడ్జి పక్కన గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల బుడ్డయ్యగారిపేటకు చెందిన మైలపల్లి రామారావు(45) మృతి చెందాడని ఆయన బంధువులు శుక్రవారం రాత్రి ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే... గార మండలం శ్రీకూర్మాం పంచాయతీ బుడ్డయ్యగారిపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు మైలపల్లి రామారావు మూడు రోజుల క్రితం కడుపునొప్పితో ఈ ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రిలో ఆయనకు శస్త్రచికిత్స చేశారని, తర్వాత ఆ చికిత్స విషమించడంతో అప్పటికప్పుడు మృతుని బంధువుల అనుమతి లేకుండా ఆస్పత్రి వాహనంలోనే రాగోలులోని ఓ ఆస్పత్రికి తరలించారని బాధితులు పేర్కొన్నారు. అయితే శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి మృతిచెందాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే శస్త్ర చికిత్స పేరిట రూ. 50 వేలకు పైగా వసూలు చేశారని తెలిపారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
వైద్యుల నిర్లక్ష్యం.. ఓ తల్లికి గర్భశోకం
నంద్యాల : స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బట్టబయలైంది. కాన్పుకోసం వచ్చిన మహిళకు ప్రసవం చేయకుండా ఈరోజు, రేపు అంటూ నాన్చుడు ధోరణితో వ్యవహరించారు. దీంతో శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ బాధితు లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో ప్రభుత్వాసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆదివారం చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వీసీ కాలనీకి చెందిన హారూన్, సలీమాలకు 11సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం. మగసంతానం కోసం ఆపరేషన్ చేయించుకోకుండా ఉన్నారు. సలీమా ఈనెల 7వ తేదీన కాన్పు కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అప్పటి నుంచి వైద్యపరీక్షలు చేస్తున్న వైద్యులు కాన్పు చేయడంలో నాన్చుడు ధోరణి వ్యవహరించారని బాధితులు ఆరోపిస్తున్నారు. శనివారం ఉదయం కాన్పు కోసం ఇంజక్షన్ వేసి అనంతరం కాన్పు చేయకుండా థైరాయిడ్ ఉందని, పరీక్షల కోసం పంపారు. పరీక్షల్లో థైరాయిడ్ లేదని వచ్చిందని, ఆపరేషన్ చేయమని కోరినా వైద్యులు రేపు చేస్తామని పేర్కొన్నారని, ఆదివారం కూడా ఉదయం, మధ్యాహ్నం అంటూ నిర్లక్ష్యం వహించారని బాధితులు తెలిపారు. అనంతరం కడుపులో శిశువు మరణించిందని ఒకసారి, గుండెపోటుతో శిశువు మృతి చెందిందని మరోసారి పొంతనలేని జవాబులు చెప్పారని హారూన్ పేర్కొన్నారు. డబ్బులు లేక తాము ప్రభుత్వాసుపత్రికి వచ్చామని, వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పలుకుబడి ఉన్న వారికి మాత్రమే వైద్యం చేస్తున్నారని, పేదవారి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. శిశువు మృతితో ఆందోళన... శిశువు మృతి చెందారని తెలుసుకున్న బాధితుల బంధువులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న నంద్యాల టూటౌన్ సీఐ శివభాస్కర్రెడ్డి ఆసుపత్రికి చేరుకొని బాధితులకు సర్దిచెప్పారు. విచారించి బాధితులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
ఓపికుంటేనే వైద్యం
పాలకుల తీరుతో రిమ్స్లో వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. ఓపికుంటేనే ఓపీ అన్నట్లు పరిస్థితి తయారైంది. రోజు ఉదయాన్నే 12వందల నుంచి 15వందల మంది క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి. రోగులకు వైద్యం పరీక్షలానే ఉంది. సీటీస్కాన్ టైం పూర్తయింది. ఎంఆర్ఐ ఇంతవరకు రాలేదు. వైద్యులు ఉన్నా చూసేదంతా ఎక్కువగా హౌస్ సర్జన్లు, మెడికోలే.. వైద్యుల ధ్యాసంతా బయటి క్లినిక్లపైనే ఉంటుందనే ఆరోపణలున్నాయి. మరుగుదొడ్లు దారుణంగా ఉన్నాయి. సూపర్స్పెషాలిటీ అర్హత ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ హోదా దక్కడం లేదు. దీంతో అత్యవసర కేసులు తిరుపతికి పంపాల్సి వస్తోంది. కడప అర్బన్ : కడప నగర శివార్లలో పన్నెండేళ్ల కిందట వైద్యవరాన్ని రిమ్స్ రూపంలో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లా ప్రజలకు అందించారు. ఆయన అప్పట్లో ఆస్పత్రి అభివృద్ధికోసం నిధులను వరదలా తీసుకొచ్చారు. అప్పట్లో ప్రతిపక్షాలు గోల చేస్తున్నప్పటికీ రిమ్స్ అభివృద్ధికి తమ వంతు శక్తివంచన లేకుండా అహర్నిశలు శ్రమించారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం రిమ్స్ను పూర్తిస్థాయిలో పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రత్యేకంగా రిమ్స్లో ‘సాక్షి’ చేపట్టిన పరిశీలనలో పేషెంట్లు ఎదుర్కొంటున్న సమస్యల ‘గ్రౌండ్ రిపోర్ట్’. ♦ కడప రిమ్స్లో ప్రతిరోజు దాదాపు 9 విభాగాల్లో ఓపీ, ఐపీ సేవలను అందిస్తున్నారు. ఓపీకి 1,200 నుంచి 1,400 మంది వైద్య పరీక్షల కోసం వస్తున్నారు. ఐపీలో 700 మంది నుంచి 730 వరకు ఇక్కడే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ♦ రోగులు ఇబ్బందిపడకుండా ఓపీ, ఐపీల్లో ఏర్పాటు చేసిన లిఫ్ట్లు పనిచేయకపోవడం.. మరమ్మతులు చేయించడం, మరలా కొన్నిరోజులకు పనిచేయకపోవడం షరా మామూలైపోయింది. దాతలు ఇచ్చిన కుర్చీలను కూడా సక్రమంగా వాడడం లేకదు. సిబ్బంది సరిగా లేకపోవడంతో పేషెంట్ల బంధువులే వీల్చైర్లను తోసుకుపోవాల్సి వస్తోంది. ♦ కడప రిమ్స్లో ఓపీ, ఐపీ విభాగాల్లో దాదాపు 300కుపైగా బాత్రూంలు, లెట్రిన్ గదులు ఉన్నాయి. వీటికి డోర్లు, గడియలు, బేసిన్లు, ట్యాప్లు దిష్టిబొమ్మల్లా వెక్కిరిస్తున్నాయి. అధ్వానంగా వున్న వీటి పరిస్థితి ప్రత్యేకంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న క్యాజువాలిటీ, ఓపీ విభాగాల్లోనే ఉండటం దారుణం. వీటిల్లో దాదాపు 257లకు మరమ్మతులను చేయాల్సి వుంది. ♦ రిమ్స్ ప్రారంభంలో రూ.2కోట్ల విలు వ చేసే సిటీ స్కానింగ్ యంత్రాన్ని రేడియాలజీ విభాగంలో ఏర్పాటు చేశా రు. సాధారణంగా ఒక సిటీ స్కానింగ్ యం త్రం 20వేల స్కానింగ్లను మాత్రమే తీయగలదు. కానీ ఈ యంత్రం తో 50వేలకు పైగా స్కానింగ్లను తీశారు. త్వరలో కొత్త యంత్రం వస్తుందని అధికారులు గతేడాది నుంచి చెప్పుకొస్తున్నారు. అంతేగాక ఈ విభాగంలో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లతోనే కాలం వెల్లదీస్తున్నారు. పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాల్సి ఉంది. ♦ సిటీ స్కానింగ్ యంత్రం మాట అటుంచితే... ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం అందనంత దూరంలో ఉందని రిమ్స్ వైద్యులే చెప్పుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వం ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాన్ని అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలకు మంజూరు చేశారు. కానీ కడప రిమ్స్ పీజీ స్థాయికి చేరుకుని, పీజీ గుర్తింపును కూడా తెచ్చుకున్నప్పటికీ ఎంఆర్ఐని ప్రభుత్వం మంజూ రు చేసేందుకు మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. మంత్రి కామినేని శ్రీనివాస్ వచ్చిన ప్రతిసారీ ఈ అంశం గురించి రిమ్స్ అధికారులు ప్రస్తావిస్తూనే వచ్చారు. ♦ రిమ్స్లో వైద్యుల కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. 299మంది వైద్యులకు గాను కేవలం 145మంది మాత్రమే ఉన్నారు. కనీసం 105 మందినైనా ప్రభుత్వం నియమిస్తే పేషెంట్లకు సరైన సమయంలో వైద్య సేవలను అందించే అవకాశం ఉంది. అలాగే 182 మంది స్టాఫ్ నర్సులు ఉన్నారు. వీరిలో కొంతమంది డిప్యుటేషన్, బదిలీలపై వెళ్లారు. ఆరు నెలలుగా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అలాగే ఇతర సిబ్బంది 750కాగా, 155 మంది కొరత ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఔట్ సోర్సింగ్ విభాగంలో 40మంది నియామకాలను చేపట్టేందుకు ఏడాది కాలంగా జిల్లా అధికారులు నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారు. తద్వారా కొన్ని విభాగాల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ♦ రోగులకు, వారి బంధువులకు రిమ్స్ ఆవరణంలో ప్రత్యేకంగా ఎలాంటి పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులను పడాల్సి వస్తోంది. ఓపీ, ఐపీలకు ఎదురుగా ఉన్న డివైడర్లు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో పార్కింగ్ చేస్తున్నారు. వైద్యులు, సిబ్బంది మాత్రం ఐపీ–ఓపీ మధ్య భాగంలో, కారిడార్లో పార్కింగ్ చేసుకుంటున్నారు. ♦ రోగుల సహాయకులు ఉండేందుకు ఇటీవల దాతల సహాయంతో ఒక షెల్టర్ కట్టారు. దగ్గరగా లేదనే ఉద్దేశంతో దానిని వారు ఉపయోగించడం లేదు. తమ వారికి దగ్గరగా ఉండాలని కారిడార్లలోనే ఉంటున్నారు. ♦ రిమ్స్ ప్రారంభంలో దాతల సాయంతో పేషెంట్ల కోసం కడప పాత రిమ్స్ నుంచి కొత్త రిమ్స్కు నాలుగు బస్సులను ఉచితంగా నడిపించారు. కాలక్రమేణ నిర్వహణ చేయలేమనీ బస్సులను పూర్తిగా మూలన పెట్టారు. ♦ రిమ్స్కు సూపర్స్పెషాలిటీ హోదా ఊరిస్తూనే ఉంది. అన్ని రకాలైన అర్హత ఉన్నా ఎందులో ప్రభుత్వం రిమ్స్ను పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా జిల్లావాసులు సూపర్స్పెషాలిటీ సేవలను కోల్పోతున్నారు. అత్యవసర సమయాల్లో తిరుపతి, కర్నూల్కు పంపాల్సి వస్తోంది. సమస్యలను పరిష్కరిస్తున్నాం.. రిమ్స్లో పూర్తి స్థాయిలో టాయ్లెట్స్ను ఏర్పాటు చేసేందుకు ఏపిఎంఎస్ఐడీసీ ద్వారా మంజూరైన నిధులతో ఇప్పటికే పనులను ప్రారంభించామనీ సూపరింటెండెంట్ డాక్టర్ టి.గిరిధర్ వివరణ ఇచ్చారు. సిటీ స్కానింగ్ యంత్రం మంజూరైందనీ, త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులపై ఎప్పటికపుడు నివేదికను పంపిస్తున్నామన్నారు. -
అనంతపురంలో పడకేసిన వైద్యం
-
నిర్లక్ష్యంపై ఆపరేషన్ షురూ
నెల్లూరు (బారకాసు): జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగి కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేసిన నిర్లక్ష్య వైఖరిపై గురువారం నుంచి ‘విచారణ ఆపరేషన్’ జరగనుంది. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హెచ్చార్సీ) తీవ్రంగా స్పందించింది. నవంబర్ 6వ తేదీలోపు సమగ్ర విచారణ నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జిల్లా వైద్యాధికారి, జీజీహెచ్ సూపరింటెండెంట్కు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ ఒకమిటీని నియమించారు. జేసీ ఇంతియాజ్ అధ్యక్షతన జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న డాక్టర్ రమాదేవి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణరాజు, డీసీహెచ్ఎస్ డాక్టర్ సుబ్బారావును సభ్యులుగా నియమించినట్లు తెలిసింది. కమిటీ విచారణకు రోగి చలపతికి మొదటి సారి ఆపరేషన్ చేసిన సమయంలో వైద్యులు, నర్సులు ఎవరైతే ఉన్నారో వారందరిని, రెండో సారి ఆపరేషన్ చేసిన సమయంలో ఉన్న వైద్యులు, నర్సులు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశించారు. తప్పించుకునే యత్నాలు ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించి తప్పు చేసిన డాక్టర్లు తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తున్నారు. కడుపులో కత్తెర పెట్టి ఆపరేషన్ చేసిన జనరల్ సర్జన్ హెడ్ డాక్టర్ పద్మశ్రీ మంగళవారం ఆస్పత్రికి హాజరయ్యారు. ఆమెతో పాటు సహచర వైద్యులు, వైద్యాధికారులంతా సమావేశమై ఈ తప్పిదం నుంచి తప్పించుకునేందుకు ఏఏ మార్గాలు ఉన్నాయో వాటిపై సుధీర్ఘంగా చర్చించుకున్నట్లు సమాచారం. సహజంగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వైద్యులంతా ఒక్కటై జరిగిన తప్పిదంలో తమకు సంబంధం లేదని, అంతా నర్సులదేనని, లేకుంటే కింది స్థాయి సిబ్బందని వారిపై మోపి తప్పించుకునేవారు. అయితే ఈ ఘటనలోనూ అదే జరుగుతుందని అని తెలుస్తోంది. వాస్తవాలను తప్పదోవ పట్టించకుండా సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటారో లేక వైద్యులను తప్పించి వైద్య సిబ్బందిని బలి చేస్తారో వేచి చూడాల్సిందే. రోగికి చేయాల్సిన ఆపరేషన్పైనే స్పష్టత లేదు రోగికి చేసిన ఆపరేషన్ విషయంలో జరిగిన నిర్లక్ష్యంపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్నాయి. రోగి చేయాల్సిన ఆపరేషన్పైనే డాక్టర్లకు స్పష్టత లేదు. తొలుత చలపతికి 24 గంటల కడుపునొప్పి ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఈ విషయాన్ని నర్సులకు తెలియజేసి అందుకు అవసరమైన పరికరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. చలపతికి ఆపరేషన్ ప్రారంభించిన సమయంలో 24 గంటల కడుపునొప్పి ఆపరేషన్ కాదు మరో పెద్ద ఆపరేషన్ చేయాలని అప్పటికప్పుడు వైద్యులు నిర్ధారించారు. దీంతో చేయబోయే ఆపరేషన్కు సంబంధించిన పరికరాలు కావాలని వైద్యులు నర్సులను ఆదేశించడం, వారు ఆయా పరికరాలను సహాయకులతో అందుకుని ఆపరేషన్ పూర్తి చేశారు. ఇది ఆపరేషన్ థియేటర్లో జరిగిన విషయం. ఆపరేషన్కు ఉపయోగించే పరికరాలను లెక్కకట్టి సరి చూసుకోవాలని నర్సులకు చెప్పాల్సిన బాధ్యత వైద్యులదే. అటువంటిది ఇక్కడి జరిగిన దాఖాలు లేవని సమాచారం. కేస్షీట్లో ‘కత్తెర’ విషయం రహస్యం పోలీస్ కేసుల విషయంలో ఎఫ్ఐఆర్ ఎంత ముఖ్యమో.. వైద్యులు రోగికి అందించే వైద్య సేవల్లో కేస్ షీట్ అంతే ముఖ్యం. వ్యక్తికి ఏమి బాగలేదు, అందుకు అవసరమై చేసిన వైద్య పరీక్షలు, నిర్ధారైన జబ్బు, అందుకు అవసరమైన అందించాల్సిన, అందించిన వైద్యసేవలు ఇలా పూర్తి వివరాలన్ని కేస్షీట్లో వైద్యులు పొందుపరుస్తారు. అటువంటి కేస్షీట్ రెండో సారి చలపతికి ఆపరేషన్ వివరాలన్నీ కేస్షీట్లో పొందుపరిచారు. అయితే కడుపులో ఎక్స్రేలో కత్తెర ఉన్నట్లు గుర్తించినా ఆ విషయం మినహా ఇతర సాధారణ విషయాలన్నీ కేస్షీట్లో పొందుపరిచారు. చలపతి కడుపులో కత్తెర ఉన్న విషయాన్ని ఎక్స్రేలో గుర్తించిన వైద్యులు కేస్షీట్లో ఎందుకు పొందు పరచలేదు. ఈ విషయాన్ని దాచాల్సిన అవసరం ఏముంది. అంటే వైద్యులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తోటి వైద్యులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారని ఆస్పత్రి వైద్యులే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జరగబోయే విచారణలో ఎవరు దోషులో వెల్లడికానుంది. -
వైద్యుల నిర్లక్ష్యం బాలింత మృతి
-
వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు బలి!
► రిమ్స్ ఆస్పత్రిలో నవజాత శిశువు మృతి ► సరైన వైద్యం అందక ప్రాణాలు విడిచిన మగ బిడ్డ ► భోరున విలపిస్తున్న తల్లిదండ్రులు శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని రిమ్స్ జనరల్ ఆస్పత్రిలో ప్రసూతి వార్డులో గురువారం నవజాత శిశువు మరణించింది. ప్రసవం జరిగిన కొన్ని గంటలకే శిశువు మృతి చెందడంపై ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు ప్రాణాలు విడిచిందని బాలింత బంధువులు ఆరోపిస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంపై ప్రజలకు ఇటీవల కాలంలో పూర్తిగా నమ్మకం పోయింది. చిన్న చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగినన్ని ప్రసవాలు కూడా ఇక్కడ జరగడంలేదు. దీనికి కారణం పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడం, ఉన్నవారు విధులకే సకాలంలో హాజరుకాకపోవడం, వారి సొంత క్లినిక్ల్లో వైద్య సేవలు అందిస్తూ రిమ్స్లో ఈ విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న అభియోగాలు ఉన్నాయి. తాజాగా గురువారం రిమ్స్లో ప్రసవం తర్వాత నవజాత శిశువు మృతి చెందడంతో ఈ అభియోగాలకు బలం చేకూర్చుతుంది. ఆస్పత్రి వైద్య సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి పరిస్థితి దాపురించిందని బాలింత బంధువులు ఆరోపిస్తున్నారు. సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం గ్రామానికి చెందిన పొన్నాడ రమేష్ తన భార్య రాజులమ్మకు పురిటి నొప్పులు రావడంతో గురువారం ఉదయం 11 గంటల సమయంలో రిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. రిమ్స్లో వైద్యులు రాజులమ్మను పరిశీలించి సాధారణ ప్రసవం వస్తుందని చెప్పారు. ఈ మేరకు సాయంత్రం 4 గంటల సమయంలో సాధారణ ప్రసవం జరిగింది. మగ శిశువు జన్మించగా, శిశువుని ఐసీయూలో పెట్టారు. అయితే ఈ విషయాన్ని బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి, ఆమె బంధువులకు ఆస్పత్రి వర్గాలు తెలియజేయలేదని వారు ఆరోపిస్తున్నారు. గంట తర్వాత శిశువు మరణించిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారని వారు ఆవేదన చెందారు. ప్రసవ సమయంలో వైద్యులు లేకపోవడం, కేవలం కింది స్థాయి సిబ్బంది ప్రసవయం చేయడం వల్లే తమ బిడ్డ మరణించిందని, తగిన జాగ్రత్తలు తీసుకోలేదని శిశువు తండ్రి ఆరోపిస్తున్నాడు. డ్యూటీలో ఉండాల్సిన వైద్యాధికారి లేరని, కేవలం హౌస్ సర్జన్, నర్సింగ్ సిబ్బంది పర్యవేక్షణలో ఈ ప్రసవం చేయడం వల్లే ఘోరం జరిగిపోయిందని లబోదిబోమంటున్నాడు. నిర్లక్ష్యం లేదు: కాగా నవజాత శిశువు మృతిపై ఆస్పత్రి ప్రసూతి విభాగం అధిపతి డాక్టర్ అరవింద్ వద్ద సాక్షి ప్రస్తావించగా శిశువు పుట్టినప్పటికే ఇబ్బందులు ఉన్నాయన్నారు. శిశువు మెడపై పేగులు వేసుకొని పుట్టినందున ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. ఈ సమయంలో డ్యూటీ డాక్టర్ రిమ్స్ ఆపరేషన్ థియేటర్లో ఇతర ప్రసూతి శస్త్ర చికిత్సలు చేస్తున్నారని చెప్పారు. ఈ శిశువు మృతి వెనుక వైద్యుల నిర్లక్ష్యం లేదని ఆయన వివరించారు. -
సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త వాతారణం నెలకొంది. వైద్యం కోసం వచ్చిన గర్భిణికి సరైన సమయంలో వైద్యం అందించక పోవడంతో.. కడుపులో ఉన్న బిడ్డ మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పట్టణానికి చెందిన బోగ మమత పురిటి నొప్పులతో బాధపడుతూ మంగళవారం రాత్రి సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చేరింది. అక్కడ సమయానికి వైద్యం చేయకపోవడంతో పాటు.. పరిస్థితి విషమించిన తర్వాత వేరే ఆస్పత్రికి తీసుకెళ్లండని సూచించారు. దీంతో బుధవారం ఉదయం పట్టణంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా కడుపులో ఉన్న బిడ్డ మృతి చెందిందని వైద్యలు తెలిపారు. దీంతో ఆమె బంధువులు ఏరియా ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. -
నిలోఫర్లో మరణమృదంగం
► వారం రోజుల్లో పది మంది బాలింతలు మృతి ► ఆపరేషన్ థియేటర్లపై మృతుల బంధువుల దాడి ► మూడు రోజుల నుంచి ఓటీలు బంద్ ► నేడు అన్ని విభాగాధిపతులతో అత్యవసర సమావేశం సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిలోఫర్ నవజాత శిశువుల సంరక్షణ కేంద్రంలో రోజుకు సగటున 20 ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిలో పది సహజ ప్రసవాలు కాగా, మరో పది సిజేరియన్లు. మందుల్లో నాణత్యా లోపం, ఆపరేషన్ థియేటర్లలోని ఇన్ఫెక్షన్తో పాటు వైద్యపరమైన నిర్లక్ష్యం వల్ల కేవలం వారం రోజుల్లో ఇక్కడ పది మంది బాలింతలు మృతి చెందినట్లు సమాచారం. ఈ మరణాలపై బాలింతల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మృతురాలికి సంబంధించిన బంధువులు ఏకంగా ఆపరేషన్ థియేటర్పై దాడికి దిగారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా ఆదివారం మరో ఇద్దరు బాలింతలను చివరి నిమిషంలో ఉస్మానియాకు తరలించగా వారు అక్కడ కన్నుమూసినట్లు తెలిసింది. ఈ విషయం బయటికి పొక్కకుండా ఆస్పత్రి యంత్రాంగం జాగ్రత్త పడుతోంది. అత్యవసర ప్రసవాలు మినహా మిగిలన వాటన్నింటినీ నిలిపివేసింది. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలను సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. పొట్టలో దూది పెట్టి కుట్టిన వైద్యులు ప్రసవ సమయంలో అధిక రక్తస్రావ సమస్యలు తలెత్తుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వీరికి ఎక్కించేందుకు అవసరమైన రక్తం ఆస్పత్రిలో దొరకడం లేదు. క్రిటికల్కేర్ యూనిట్ కూడా లేక పోవడంతో అధిక రక్తస్రావం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలింతలను చివరకు ఉస్మానియా, గాంధీ బోధనాసుపత్రులకు తరలిస్తున్నారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో బాలింతలు మత్యువాత పడుతున్నారు. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం ఓ గర్భిణికి సిజేరియన్ చేశారు. ప్రసవ సమయంలో అవుతున్న రక్తస్త్రావాన్ని తూడ్చేందుకు ఉపయోగించే దూది బట్టను కడపులో అలాగే పెట్టి కుట్టేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ బాధితురాలిని చివరి నిమిషంలో ఉస్మానియాకు తరలించారు. తీరా అక్కడి వైద్యులు స్కానింగ్ నిర్వహించగా ఈ విషయం బయటపడింది. వైద్యులు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడం వల్లే ఇలా జరిగిందని తేలింది. ఉదయం సిజేరియన్ చేసిన బాలింతల్లో రోజుకు సగటున ఒకరికి మధ్యాహ్నం మరోసారి సర్జరీ చేస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటిండెంట్ సురేష్కుమార్ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. కాగా గైనిక్ వార్డులో అసలే సిబ్బంది కొరత ఉంది. దీనికితోడు యూనిట్ 1, యూనిట్–2కు సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్లు లాంగ్లీవులో విదేశాలకు వెళ్లారు. పీజీ విద్యార్థుల వల్ల సిజేరియన్లు చేయించడం, డెలివరి అనంతరం బాలింతలకు వేస్తున్న ఇంజెక్షన్లు వికటించడం వల్ల మృతులు పెరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
పురుగులున్న సెలైన్ ఎక్కించేశారు
► పురుగులున్న సెలైన్ బాటిల్ ► ఆరేళ్ల పాపకు ఎక్కించేశారు ► గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్వాకం సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఆరేళ్ల బాలిక పాలిట శాపమైంది. పురుగుల అవశేషాలు ఉన్న సెలైన్ బాటిల్ను ఎక్కించడంతో ఆ చిన్నారి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆస్పత్రి సిబ్బంది కనీసం సెలైన్ బాటిల్ను పరిశీలించకుండానే ఎక్కించారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు బిక్షపతి, సుమలతతో పాటు బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు పురుగుల అవశేషాలున్న సెలైన్ బాటిల్ను పరీక్షలకు పంపారు. మిగిలిన వాటిని సీజ్ చేశారు. గాంధీలో వెలుగు చూసిన ఘటనతో ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్, సహా ఇతర ఆస్పత్రుల అధికారులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రి స్టోర్రూమ్లో ఫంగస్, బ్యాక్టీరియా ఉన్న వాటిని గుర్తించి, వినియోగానికి దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆయా ఆస్పత్రులు సిబ్బంది అదే పనిలో నిమగ్నమయ్యారు. పరిశీలించకుండానే రోగికి సరఫరా జనగాం జిల్లా కొడకల్ మండలం మైదం చెరువుతండాకు చెందిన సాయి ప్రవళిక (6)గత కొంతకాలంగా మెదడుకు సంబంధించిన ‘న్యూరోనల్ సెరాయిడ్ లిపో ఫ్యూసినోసిస్’అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. చికిత్సలో భాగంగా పలుమార్లు గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఈమె ఈ నెల 7న పీడియాట్రిక్ విభాగంలో చేరింది. గురువారం ఉదయం డెక్స్ట్రోస్ 10 శాతం (500 ఎంఎల్)ఐవీ ఫ్లూయిడ్ బ్యాటిల్ను ఏర్పాటు చేశారు. అర్ధగంట తర్వాత బాలిక శరీరం రంగు మారడంతో పాటు ప్రాణాపాయస్థితికి చేరుకుంది. సెలైన్ బాటిల్ తీసి చూడగా అందులో పురుగుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రి డ్రగ్స్టోర్లోని సిబ్బంది, వార్డులోని నర్సులు కూడా బాటిల్ను పరిశీలించకపోవడం విశేషం. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఫంగస్ ఉన్న సెలైన్ వల్ల 13 మంది కళ్లు పోయిన ఘటనను మరిచిపోకముందే మళ్లీ అలాంటి దారుణమే గాంధీలో బయటపడటం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు సంబంధం లేదు: టీఎస్ఎంఐడీసీ పురుగుల అవశేషాలు బయటపడిన డెక్స్ట్రోస్ ఐవీ ప్లూయిడ్ బాటిళ్లను మాత్రం తాము సరఫరా చేయలేదని, వీటితో మాకు ఎలాంటి సంబంధం లేదని టీఎస్ఎంఐడీసీ ఎండీ వేణుగోపాల్ ప్రకటించారు. ఎంపిక చేసే కొనుగోలు చేశాంః డాక్టర్ జేవీరెడ్డి, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి రోగులకు అవసరమైన అన్ని మందులూ టీఎస్ఎంఐడీసీ సరఫరా చేయడం లేదు. కొన్ని అత్యవసర మందులను ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నిధులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాం. ఇదే తరహాలో పుణేకు చెందిన ప్రెసినియస్కాబి కంపెనీకి చెందిన డెక్స్ట్రోస్ 10 శాతం(500 ఎంల్)సెలైన్ బాటిళ్లు కొనుగోలు చేశాం. బాటిల్లో పురుగుల అవశేషాలు బయటపడిన అంశంపై విచారణకు ఆదేశించాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాదు ఆస్పత్రి స్టోర్ రూమ్లోని(బ్యాచ్ నంబర్ 82కేఈ107602)ఫ్లూయిడ్ బ్యాటిళ్లను పక్కకు పెట్టాం. బాలికకు ఎక్కించిన ఫ్లూయిడ్తో పాటు ఇతర బాటిళ్లను కూడా పరీక్షలకు పంపాం. గాంధీలో ఆందోళనకు దిగిన బాలిక బంధువులు ప్రవళికకు చికిత్స అందించే విషయంలో ఆస్పత్రి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని రోగి తరపు బంధువులు ఆరోపించారు. తక్షణమే సెలైన్ బ్యాటిళ్లను తయారు చేసిన సంస్థతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ముందు బైఠాయించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
తణుకు ఆస్పత్రిలో బాలింత మృతి
-
డెంగీతో పది నెలల చిన్నారి మృతి
• 16కు పెరిగిన డెంగీ మృతుల సంఖ్య • వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు తిరుత్తణి: డెంగీ జ్వరానికి తిరుపతికి చెందిన పది నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తిరువళ్లూరు జిల్లాలో మాత్రం డెంగీ మృతుల సంఖ్య 16కు చేరింది. తిరువళ్లూరు జిల్లాలో రెండు నెలలకు పైబడిన విష జ్వరాలు వ్యాప్తి చెందిన వందలాది మంది ఆసుత్రుల్లో చేరి చికిత్స పొందారు. వీరిలో చిన్నారులకు జ్వరం అధిగమించి తిరువాలాంగాడు యూనియన్ కావేరిరాజపురం ఆది ఆంధ్రవాడకు చెందిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో డెంగీ బెంగ పట్టుకుంది. అదే సమయంలో తిరుత్తణి, పళ్లిపట్టు, ఆర్కేపేట సహా అనేక గ్రామాల్లో ప్రజలకు విష జ్వరాలు సోకడంతో తిరుత్తణి, తిరువళ్లూరు, చెన్నై ప్రభుత్వాసుపత్రుల్లో విష జ్వరాల బాధితుల సంఖ్య వందల సంఖ్యలో పెరిగింది. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం విష జ్వరాలు వేగంగా వ్యాప్తి చెంది చిన్నారులు వరుస క్రమంలో ప్రాణాలు కోల్పోవడంతో మృతులకు వైరస్ జ్వరాలు మాత్రమేనని, డెంగీ కాదని ప్రభుత్వం ప్రకటించుకుంది. గ్రామాల్లో పరిశుభ్రత పనులు వేగవంతం చేశారు. అదే సమయంలో వైద్య బృందాలను, సంచార వాహనాల బృందాలను రంగంలోకి దింపి ఆరోగ్య వైద్య సేవలు విస్తృతం చేశారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు చేస్తుండిన నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు. మళ్లీ విజృంభించిన విష జ్వరాలు పరిశుభ్రత, ఆరోగ్య సేవలను ఆలస్యం చేపట్టిన ప్రభుత్వం ఆ పనులను కొనసాగించడంలో మాత్రం విఫలం కావడంతో కొద్ది రోజుల్లోనే తిరుత్తణి పట్టణంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో డెంగీ మృతుల సంఖ్య 15కు చేరింది. ఈ క్రమంలో తిరుపతి అలమేలుమంగాపురం అంబేద్కర్ కాలనీకి చెందిన తిరుమూర్తి పది నెలల కుమారుడు జోసెఫ్ విష జ్వరంతో తిరుపతిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. జ్వరం తగ్గక పోవడంతో తిరుత్తణిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అయినా ఫలితం లేక పోవడంతో తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం జ్వరం పెరిగి మృతి చెందాడు. దీంతో డెంగీ మృతుల సంఖ్య 16కు పెరిగింది. వైద్యులు పూర్తి స్థాయిలో వైద్య సేవలు చేపట్టక పోవడంతోపాటు సకాలంలో వైద్యం చేయడంలో అలసత్వంతోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు బాధితులు వాపోయారు. -
విజయనగరం ఆస్పత్రిలో దారుణం
-
విజయనగరం ఆస్పత్రిలో దారుణం
పార్వతీపురం : విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళ కడుపులో డాక్టర్లు కాటన్ పెట్టి కుట్టేశారు. అనంతరం బాధిత మహిళను డిశ్చార్జ్ చేశారు. గత కొద్ది రోజులుగా ఆమెకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో పార్వతీపురంలోని ఓ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు స్కానింగ్ చేయడంతో కడుపులో కాటన్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి కాటన్ను తొలగించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకంపై బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పేదల ఆస్పత్రికి పెద్ద జబ్బు..!
-
ఆపరేషన్ వికటించి.. మహిళ మృతి
వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపించిన భర్త మైసూరు: కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ మృతి చెందిన ఘటన బుధవారం మైసూరులో చోటుచేసుకుంది. వివరాలు...నగరంలోని గాయత్రిపురకు చెందిన శివకుమార్ భార్య ప్రతిభా(38) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం మంగళవారం నగరంలోని కృష్ణమూర్తి నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. బుధవారం ఉదయం అల్పాహారం తీసుకెళ్లిన శివకుమార్కు తన భార్య కనిపించకపోయే సరికి వైద్యలను ఆరా తీశాడు. ఆరోగ్యం విషమించడంతో కే.ఆర్.ఆసుపత్రికి తరలించామని బదులిచ్చారు. దీంతో కే.ఆర్.అసుపత్రికి వెళ్లిన శివకుమార్కు తన భార్య విగతజీవిగా కనిపించింది. వైద్యలను అడగ్గా ఇక్కడికి తీసుకొచ్చేలోపు ఆమె మృతి చెందిందని పేర్కొన్నారు. తన భార్య మృతికి వైద్యులే కారణమని, శస్త్ర చికిత్స చేసేటపుడు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని శివకుమార్ ఆరోపించారు. తన భార్య మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. -
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం
-
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం
గుంటూరు : గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. బతికున్న శిశువు చనిపోయిందంటూ వైద్యులు చెప్పిన సంఘటన మంగళవారం జీజీహెచ్లో చోటుచేసుకుంది. శిశువు మృతి చెందినట్లు చెప్పడటంతో తీసుకు వెళుతుండగా, బిడ్డలో కదలికలను తండ్రి గుర్తించాడు. ఈ విషయాన్ని అతడు వైద్యుల దృష్టికి తీసుకు వెళ్లడంతో చికిత్స నిమిత్తం శిశువును ఐసీయూకు తరలించారు. దీంతో బతికుండగానే చనిపోయినట్లు చెప్పిన వైద్యుల అలక్ష్యంపై శిశువు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటనపై మంత్రి కామినేని శ్రీనివాస్ డీఎం అండ్ హెచ్వో, సూపరింటెండెంట్ కు ఫోన్ చేసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి జీజీహెచ్ను సందర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ జీజీహెచ్లో ఎలుకలు దాడి చేయగా శిశువు మృతిచెందిన విషయం తెలిసిందే. -
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం
గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వివరాలు..గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంనకు చెందిన భవానీ(23) కాన్పు కోసం మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. ఆరున్నర గంటలకు సాధారణ డెలివరీ అయింది. పురిటిలోనే బాబు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది తండ్రి చేతిలో బాబును పెట్టారు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లి పూడ్చి పెట్టండి అని తండ్రికి చెప్పారు. దీంతో తండ్రి జగన్నాధం శిశువును సొంతూరికి తీసుకెళ్లి పూడ్చుతుండగా బాబులో కదలిక కనపడింది. కొద్దిసేపటి తర్వాత ఏడవటం మొదలుపెట్టాడు. కాసింత ఆలస్యం చేసి ఉంటే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణంపోయేది. దీంతో జగన్నాధం కుటుంబసభ్యులు నిర్లక్ష్యానికి పాల్పడిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూపరిండెంట్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. -
పాడెపైకి ఎక్కిస్తుండగా స్పృహలోకి..
గాంధీ ఆస్పత్రి: అపస్మారకస్థితి చేరుకుని చికిత్స పొందుతున్న రోగి మృతి చెందాడని భావించి ఇంటికి తీసుకెళ్లి పాడె సిద్ధం చేస్తుండగా స్పృహలోకి వచ్చిన రోగి తనకేమైందంటూ ప్రశ్శించడంతో కుటుంబసభ్యులు, బంధువులు అవాక్కయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి... ఖమ్మంజిల్లా కొత్తగూడెం మండలం రూపాలతండాకు చెందిన బీ. బిక్కు (35) ఐదు రోజుల క్రితం మద్యం మత్తులో బైక్పై నుంచి పడి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అతడిని ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించగా, మెదడులో రక్తనాళాలు గడ్డకట్టుకుపోయినందున మెరుగైన వైద్యచికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో ఈనెల 1న గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఎంఆర్ఐ స్కానింగ్ తీసి వైద్యపరీక్షలు నిర్వహిస్తుండగా అపస్మారకస్థితిలో ఉన్న రోగి బిక్కు మృతి చెందాడని బంధువులు భావిం చారు. ఎంఎల్సీ కేసు కావడంతో పోస్టుమార్టం చేస్తారన్న భయంతో వైద్యులు, సిబ్బందికి తెలియకుండా ఈనెల 2న అతడిని అంబులెన్స్లో స్వగ్రామానికి తరలించారు.శనివారం ఉదయం దహనసంస్కారాలు చేసేందుకు పాడె సిద్ధం చేస్తుండగా స్పృహలోకి వచ్చిన బిక్కు ఏం జరుగుతోందని ప్రశ్శించడంతో వారు నివ్వెరపోయారు. మంత్రికి ఫిర్యాదు... బిక్కును తీసుకువచ్చిన బంధువులను వివరణ కోరగా గాంధీ ఆస్పత్రి వైద్యులు మృతిచెందాడని చెప్పినందునే తాము తీసుకువచ్చామన్నారు. విషయం తెలుసుకున్న రూపాలతండా మాజీ సర్పంచ్ బధ్రు విషయాన్ని స్థాని క ఎమ్మెల్యేకు చెప్పగా, ఆయన వైద్యమంత్రి లక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. గాంధీ యంత్రాంగం పరుగులు... వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దీనిని తీవ్రంగా పరిగణిస్తూ ఏం జరిగిందో తక్షణమే తనకు సమాచారం అందించాలని ఆదేశించడంతో గాంధీ ఆస్పత్రి పాలన యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టారు. ఆస్పత్రిలో శుక్రవారం జరిగిన మరణాల జాబిత అందించాల ని వైద్యులను అదేశించారు. అందులో బిక్కు మృతి చెందిన సమాచారం లేదు. ఎక్కడో తిరకాసు జరిగిందని భావించి గురు, శుక్రవారాల్లో అడ్మిట్ అయిన కేస్షీట్లను పరిశీలించడగా న్యూరోసర్జరీ విభాగంలో బిక్కు కేస్షీట్ లభించింది. బిక్కు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారా, మృతి చెందాడని భావించి బంధువులే వార్డునుంచి తరలించారా, వైద్యులు, సిబ్బందికి తెలియకుండా అపస్మారకస్థితిలో ఉన్న రోగిని ఎలా తీసుకువెళ్లారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్ జేవీరెడ్డి తెలిపారు. ప్రస్తుతం బిక్కు కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు రూపాలతండా మాజీ సర్పంచ్ బధ్రు తెలిపారు. -
ప్రైవేట్ ఆసుపత్రిలో వివాహిత మృతి
♦ వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ♦ బంధువుల ఆందోళన ♦ ఆసుపత్రి అద్దాలు ధ్వంసం ♦ నిరసనకారులపై లాఠీచార్జి సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు శనివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులు శాంతించకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. బాధితుల కథనం ప్రకారం.. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి పంచాయతీ మదిర గ్రామమైన గొల్లగూడెంకు చెందిన పండరి, శంకరమ్మ దంపతుల కూతురు మానస (24) ఇంటి దగ్గర పురుగుల మందు తాగిందని శుక్రవారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డిలోని గోకుల్ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత నయమవుతుందని డాక్టర్లు తెలిపారు. సాయంత్రం వరకు మానన బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు. శనివారం తెల్లవారుజామున వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పి డాక్టరు వెళ్లిపోయారు. చేసేదేమిలేక పోతిరెడ్డిపల్లిలో ఉన్న మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మానస చనిపోయి చాలాసేపైందని అక్కడి వైద్యులు తెలిపారు. ఆగ్రహం ఊగిపోయిన వారు శవాన్ని తీసుకొచ్చి అక్కడే బైఠాయించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతిచెందిందని ఆమె భర్త మహేశ్ ఆరోపించారు. పోలీసుల లాఠీచార్జి మానస బంధువులు పెద్ద ఎత్తున గోకుల్ ఆసుపత్రికి చేరుకుని ఉదయం 10.30 గంటలకు వరకు ఆందోళన కొనసాగించారు. వైద్యులను వాగ్వాదానికి దిగారు. అద్దాలు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జి చేశారు. అక్కడున్న వారందరిని స్టేషన్కు తరలించారు. 12 మందిపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. డాక్టర్లే నా బిడ్డను బలిగొన్నారు.. మానస మంచిగానే ఉందని చెప్పి డాక్టర్లు ప్రాణాలు తీశారు. మాతో కాదని చెబితే వేరే ఆసుపత్రి పోతుంటుమి. అంతా బాగుందని రాత్రి వరకు చెప్పారు. అర్ధరాత్రి వచ్చి వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. చనిపోయిన తర్వాత అప్పగించారు. డాక్టర్లే నా బిడ్డను బలి తీసుకున్నారు. - పండరి, మృతురాలి తండ్రి -
పసి ప్రాణం ఖరీదు 5 లక్షలు!
♦ వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి ♦ మృతుడి తల్లిదండ్రుల ఆరోపణ ♦ మృతదేహంతో ఆసుపత్రి ఎదుట బైఠాయింపు సంగారెడ్డి టౌన్: డబ్బు కోసం పసివాడి ప్రాణాలతో వైద్యులు ఆడుకున్నారు. ఇదేమని అడిగదితే రూ.5 లక్షల వెలకట్టారంటూ బాధితులు బోరున విలపించారు. తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని మిగిల్చిన ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం తొగర్పల్లికి చెందిన బీ రాజు, లావణ్య దంపతుల కుమారుడు వర్శిత్ (6) వాంతులు చేసుకుంటుండటంతో గురువారం గాయత్రి ఆసుపత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ చక్రపాణి బాబును పరిశీలించి చికిత్స ప్రారంభించారు. ఆ తర్వాత హడావుడిగా అంబులెన్సును పిలిపించి, బాబుకు ఆక్సిజన్ పెట్టి హైదరాబాదుకు తీసుకెళ్లాలని చెప్పారు. రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లగా అక్కడి డాక్టర్లు పరిశీలించి బాబు మృతిచెంది చాలా సేపైనట్టు వెల్లడించారు. డాక్టర్ చక్రపాణి నిర్లక్ష్యం వల్లే బాబు మృతి చెందాడంటూ బాధితులు చిన్నారి మృతదేహంతో గాయత్రి ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ముందే చికిత్స తమ వల్ల కాదని చెప్పి ఉంటే వేరే చోటకు తీసుకెళ్లే వారమని చిన్నారి బాబాయి శ్రీనివాస్ విలపించారు. తన అన్నకు ఈఎస్ఐ కార్డు ఉండటంతో డబ్బులు గుంజేందుకే వైద్యం చేస్తున్నట్టు నటించారని, ఇదేమని అడిగితే ఆస్పత్రి సిబ్బంది ఎదురుదాడికి దిగారని ఆయన ఆరోపించారు. కాగా, ఆసుపత్రి నిర్వాహకుల్లో ఒకరైన డాక్టర్ కుమార్రాజ చిన్నారి ప్రాణానికి పరిహారంగా రూ.5 లక్షలిస్తామని బేరమాడారని బాధితులు ఆరోపించారు. కోర్టుకెళ్లండి: డాక్టర్ చక్రపాణి బాబుకు మెదడు వాపు వ్యాధి ఉందని, ప్రాథమిక చికిత్స అందించి ఆపై హైదరాబాదు తీసుకెళ్లాలని చెప్పామని గాయత్రి చిల్డ్రన్ నర్సింగ్ హోమ్ వైద్యుడు చక్రపాణి చెప్పారు. ఇక్కడి నుంచి వెళ్లే సరికి బాబు ప్రాణాలతోనే ఉన్నాడన్నారు. బాధితులు కోర్టుకెళ్లాలని, కోర్టు తీర్పు ప్రకారం పరిహారం చెల్లిస్తామని అన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత బలి
మాచర్ల: గుంటూరుజిల్లా ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి ఓ బాలింత మృతి చెందింది. మాచర్ల మండలం బైరనిపాడు గ్రామానికి చెందిన బత్తుల సంధ్యారాణి (20)ని కాన్పు కోసం కుటుంబసభ్యులు బుధవారం తెల్లవారుజామున మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు సాధారణ కాన్పు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు రక్తస్రావం అవుతున్నా పట్టించుకోలేదు. రక్తస్రావం ఆగక సంధ్యారాణి ఆరోగ్యం విషమిస్తుండడంతో మధ్యాహ్నం సమయంలో ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్లో తరలించే చర్యలు చేపట్టారు. అయితే, అంబులెన్స్ నర్సారావుపేటకు చేరుకుంటున్న సమయంలో సంధ్యారాణి మృతి చెందింది. బాధితురాలి బంధువులు ఆందోళనకు వస్తున్నారన్న సమాచారంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించి.. తమ గదులకు తాళాలు వేసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. నవజాత శిశువు వారోత్సవాల సమయంలో ఇలాంటి ఘటన జరగడం ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనం మారింది. -
వైద్యుల నిర్లక్ష్యంతో వివాహిత మృతి
పాల్వంచ రూరల్(ఖమ్మం): విషజ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన వివాహితకు ఆస్పత్రిలో సరైన వైద్యం అందించకపోవడంతో.. ఆమె పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఆమె మృతికి ఆస్పత్రి వర్గాలే బాధ్యత వహించాలని కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ రూరల్ మండలం మామిడిగూడెంలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సురేష్(25), అనూష(22) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అనూష అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. చికిత్స నిమిత్తం ఉల్వనూరులోని గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. నర్సులే ఆమెకు వైద్యం అందించారు. దీంతో ఆమె పరిస్థితి మరింత విషమించడంతో.. కొత్తగూడెంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. దీంతో అనూష మృతికి ఉల్వనూరు ఆస్పత్రి నిర్లక్ష్యమే కారణమని ఆందోళ నకు దిగారు. -
నందిగామ ప్రభుత్వాసుపత్రిలో దారుణం
విజయవాడ : కృష్ణాజిల్లా నందిగామ ప్రభుత్వాసుపత్రిలో శనివారం దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన మహిళ రోగికి ఆక్సిజన్ లేదని వైద్యులు తిప్పి పంపారు. ఆ కమ్రంలో సదరు మహిళ మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణంగానే మహిళ మృతి చెందింది అని ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొలంది. సకాలంలో వైద్యం అంది ఉంటే ఆమె బతికి ఉండేదని ఆమె బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఆక్సిజన్ అందక చిన్నారి మృతి
వైద్యుల నిర్లక్ష్యం వల్ల పది రోజుల బాలుడు మృతిచెందాడని బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్కు చెందిన రాములు, సంగీత దంపతుల కుమారుడికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. రెండు రోజుల కిందట జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబు ఆక్సీజన్ అందక ఈ రోజు మృతిచెందాడు. ఐసీయూలో వెంటిలెటర్ మీద ఉన్న చిన్నారికి విద్యుత్ అంతరాయంతో ఆక్సీజన్ అందకపోవడంతో.. ఈ దుర్ఘటన జరిగిందని.. ఆస్పత్రిలో జనరేటర్ ఉన్నా దాన్ని వాడటంలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని.. బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపడుతున్నారు. -
బొడ్డుతాడు కోయబోతే పీక తెగింది!
పసికందు ప్రాణాలు బలిగొన్న వైద్యుల నిర్లక్ష్యం కర్నూలు పెద్దాసుపత్రిలో ఘటన కర్నూలు (జిల్లా పరిషత్) : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యుల నిర్లక్ష్యం మరో పసికందు ప్రాణం బలిగొంది. బొడ్డుతాడు కోయబోయి ఏకంగా పీక కోసి పసికందు మృతికి వైద్యులు కారణమయ్యారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల పనితీరును దుయ్యబట్టారు. వెల్దుర్తికి చెందిన నబీరసూల్ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య షబానా, నలుగురు సంతానం. ఐదో కాన్పు కోసం షబానా ఈ నెల 16న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గైనిక్ విభాగంలో చేరింది. శనివారం ఆమె ఐదో సంతానంగా మగబిడ్డను ప్రసవించింది. అయితే ఆ బిడ్డ బొడ్డుతాడు మెడలో మూడు చుట్లు చుట్టుకుని ఉండటంతో దానిని తొలగించేందుకు ప్రయత్నించారు. ఇదే క్రమంలో కత్తిగాటు కాస్తా పీకపై పడటంతో ఆ శిశువుకు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే వైద్యులు చిన్నపిల్లల విభాగానికి తీసుకెళ్లి చికిత్స చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ శిశువు కన్నుమూసింది. శిశువు గొంతుపై కత్తి గాటు ఉండటం చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ కన్నుమూసిందని ఆరోపించారు. ఇదిలాఉంటే ఇలాంటి కష్టతరమైన కేసుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గరుండి పీజీలచేత చికిత్స చేయిం చాలి. కానీ పీజీ వైద్యులే స్వయంగా బొడ్డుతాడు తొలగించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. -
చెంపలు టపటపా వాయించాలి
‘తల్లి కావడం ఏ తల్లికి ఆనందాన్నివ్వదు చెప్పండి? రెండోసారి గర్భవతినయ్యానని తెలిశాక చాలా సంతోష పడ్డాను. పెద్దాడికి తోడుగా దేవుడు ఇంకో బిడ్డను పంపిస్తున్నాడని సంబరపడ్డాను. ఎంత కష్టమైనా సరే ఇద్దరు పిల్లల్ని బాగా పెంచాలని ఆరాటపడ్డాను. కానీ పొత్తిళ్లలోనే రెండో పిల్లాడు పోవడం.. ఆ బాధ... పగవాడికి కూడా వద్దు. దాన్నుంచి ఇప్పటికీ కోలుకోలేక పోతున్నాం. కళ్లు మూసినా తెరిచినా వాడే కనిపిస్తున్నాడు. తట్టుకోలేక ఏదైనా చేసుకుందామని కూడా ప్రయత్నించా. నా భర్త పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇలా జరిగేదా? పిల్లోడిని బతికించుకోవాలనే ఆశతోనే గుంటూరు ఆసుపత్రికెళ్లాం. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది. డాక్టర్లు, నర్సులు పట్టించుకొని ఉంటే ఇలా జరిగేదా? ‘ఆ ఏముందిలే వీళ్లు పేదోళ్లు! ఎవరికి చెప్పు కోగలరు? వీళ్ల మాటలు విని మమ్మల్ని ఎవరేం చేయగలరు’ అనే నిర్లక్ష్యంతోనే మా పిల్లాడిని చంపేశారు. ఆదివారం రాత్రి (ఆగస్ట్ 23) ఎడమ చేయి అయిదు వేళ్లు, కుడిచేయి రెండు వేళ్లను ఎలుకలు కొరికాయి. ఆ రాత్రి ట్రీట్మెంట్ లేదు. సోమవారం ఉదయం డాక్టర్ను అడిగా - ‘మా బాబును మాకు ఇచ్చేయండి... బయట చూపించుకుంటాం’ అని. దానికి డాక్టర్ ఒకటే చెప్పారు... ‘బాబు చనిపోయే వరకు ఇంక్యుబేటర్ నుంచి తీయం మేం!’ అని. తర్వాత సిస్టర్కు మందు ఇమ్మని చెప్పి వెళ్లిపోయారు. సిస్టర్ ‘‘అంత జాగ్రత్త వున్నదానివి... ఇలాంటి పిల్లాడిని ఎలా కన్నావే’’ అని వెటకారాలాడింది. ‘‘పెద్దబాబు బాగానే ఉన్నాడుగా... ఈ బాబు మీద ఆశలు వదులుకోండి’’ అంటూ విసుక్కుంది. తొమ్మిది నెలలు మోసింది బిడ్డ మీద ఆశలు వదులుకోవడానికా? మేమడిగినట్టు సోమవారమే పంపించేస్తే మా బిడ్డ మాకు దక్కేవాడు. బుధవారం తెల్లవారుజామున బిడ్డను రెండోసారి (26 ఆగస్ట్) ఎలుకలు కొరికితే మధ్యాహ్నం రెండు గంటల వరకు డాక్టర్లు రాలేదు. చనిపోయిన బాబుకు రెండు గంటల సమయంలో ట్రీట్మెంట్ చేయడానికి వస్తారా? ఇదేనా డాక్టర్ల బాధ్యత? ఇక నర్సులయితే కబుర్లు చెప్పుకోవడం, వెళ్ళిపోవడం. నైట్ డ్యూటీలో ఉన్నవాళ్లయితే పదకొండింటికే నిద్రపోతారు. ఎలుకల నుంచి మా బిడ్డలను మేం కాచుకోవాలి. మాకు మేమే కాపాడుకుంటూ, మాకు మేమే ట్రీట్మెంట్ చేసుకునేవాళ్లమే అయితే ఈ ఆసుపత్రికి ఎందుకు వెళ్తాం? ఇప్పుడు ఎలుకలను చూస్తేనే మా బాబు గుర్తుకొస్తున్నాడు. పసిపిల్లాడు.. ఆ బాక్స్లో ఎలుకలు కరుస్తుంటే ఎలా భరించాడో నా తండ్రి.. ఎంత క్షోభపడ్డాడో! కిచకిచ శబ్దానికి మెలకువ వచ్చి చూసేసరికే నా బిడ్డ రక్తపు ముద్దయ్యాడు. వెంటనే సిస్టర్కి కబురు పెట్టాం. సిస్టర్ వచ్చి ‘మీరు ఉంది ఎందుకు? పిల్లోడి దగ్గర మిమ్మల్ని ఎందుకు పెట్టాం? మీరే చూసుకోవాలి. పదేపదే మమ్మల్ని ఎందుకు పిలుస్తారు?’ అంటూ విసుక్కుంది. తీరిగ్గా వచ్చిన మాధవరావు డాక్టర్ జేబులో చేతులు పెట్టుకొని చూసి వెళ్లిపోయాడు. బాబు మీద చేయి వేసి చూస్తే ఒళ్లు చల్లగా తగిలింది. ఇంక్యుబేటర్ దగ్గర ఉన్న ఓ చిన్న చెక్క స్టూల్ మీద కూర్చొనే ఎలుకలు రాకుండా కాపలా కాసేదాన్ని. పెద్దాపరేషన్ అయింది (సిజేరియన్). కుట్లు నొప్పిపుడుతున్నా... అలాగే కూర్చొని కాపలా కాసేదాన్ని. మొదటిసారి ఎలుకల నుంచి బిడ్డను కాపాడుకున్నా. కానీ రెండోసారి... (ఏడుస్తూ ఆగిపోయింది లక్ష్మి. మళ్ళీ గొంతు పెగుల్చుకొని...) గురువారం ఆపరేషన్ చేశారు. శనివారం మమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు. కానీ ఎలుకలకు బాబు నైవేద్యం అయిపోయాడు. బాబు పోయాక కూడా మేం పోలీస్ కేసు పెడితేనే బాబును మాకు అప్పగించారు. రక్తపు ముద్దగా బారిన బిడ్డను చేతుల్లో పెట్టుకున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలనిపించింది. బాధ్యత లేని వాళ్ల చెంపలు టపాటపా వాయించాలనిపించింది. బాధేస్తోంది... ఇంత జరిగినా బాధ్యుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధేస్తోంది. ప్రభుత్వం ఆ రోజు మాకిచ్చిన మాటేంటి? డబ్బులిచ్చేసి తమ బాధ్యత అయిపోనట్టు, మా బాధ తీరిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. మా బాధ తీరలేదు. మా బాబు చనిపోవడానికి కారకులైన డాక్టర్లను తొలగిస్తేనే మాకు కొంచెం ఊరట. కొంచెం తృప్తి. మాలాగా ఇంకే తల్లిదండ్రులకూ కడుపుకోత రాకూడదు. అబద్ధాలు చెప్తున్నారు కళ్ల ముందే బిడ్డను చంపుకున్న క్షోభను మేం అనుభవిస్తున్నాం. జీవితాంతం ఆ బాధ మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. పిల్లాడు బతికి, ఎదిగి మాకు ఎంత సంతోషాన్ని ఇచ్చేవాడో.. అయిదు లక్షల పరిహారం అంత సంతోషాన్నిస్తుందా. పైగా నేను పదిలక్షలు అడిగానని అబద్ధాలు చెప్తున్నారు (డాక్టర్లు, నర్సులు). మాకు డబ్బు ప్రధానం కాదండి... మాలాగా ఇంకో తల్లీ తండ్రీ బాధపడకూడదు. ప్రభుత్వం నుంచి మాకు న్యాయం కావాలి. పసిపిల్లలకు ట్రీట్ మెంట్ ఇవ్వాలంటే జాగ్రత్తగా ఉండాలనే భావం రావాలి. దేవుడి తర్వాత దండం పెట్టేది డాక్టర్కే. ఆ గౌరవం కాపాడుకోవాలి. అలాంటి పరిస్థితి వచ్చేవరకు పోరాడుతాం. ఎంతవరకైనా వెళతాం. ఒకటే కోరిక... వార్డుల్లోకి చెప్పులు వేసుకొని రావద్దని చెప్తుంటారు. కానీ డాక్టర్లు మాత్రం దాన్ని పాటించరు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఆడవాళ్లకు, మగవాళ్లకు బాత్రూమ్స్ ఒకటే. నీళ్ళు రావు. కంపుగొట్టి లేని రోగాలు వస్తున్నాయి. నా బిడ్డకు జరిగినట్టే వాళ్ల బిడ్డలకూ జరుగుతుందేమోనని హాస్పిటల్లో ఉన్న మిగతా తల్లిదండ్రులూ భయపడ్డారు. ఆ ఆసుపత్రి నుంచి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా బయటపడితే బాగుండు అని దేవుడికి దండం పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నేను కోరుకునేది ఒకటే... ఏ ప్రభుత్వం వల్ల నేను నష్టపోయానో అదే ప్రభుత్వం మా కుటుంబానికి న్యాయం చేయాలి. నాకు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా కల్పించాలి. కనీసం ఉన్న ఒక్క కొడుకునైనా మంచిగా పెంచుకోవడానికి సహకరించాలి. ఇన్పుట్స్: ఎన్. మాధవ్ రెడ్డి, సాక్షి, గుంటూరు జి. రాజారమేష్, సాక్షి టీవి, విజయవాడ -
నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం
అనంతపురం మెడికల్ : వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం ‘అనంత’ వాయువుల్లో కలిసిపోయింది. చెల్లెలికి పసుపు, చీర ఇద్దామని వెళుతూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి అనంతపురం సర్వజనాస్పత్రి వైద్యులు సకాలంలో చికిత్స అందించలేదు. దీంతో అతను మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కలకు చెందిన లక్ష్మయ్య (55), లక్ష్మమ్మ భార్యాభర్తలు. స్థానికంగా ఉపాధి లేక బెంగళూరుకు వలస వెళ్లారు. టెంకాయల పండగ (వినాయక చవితి) సందర్భంగా ఆడబిడ్డలకు పసుపు, కుంకుమ ఇవ్వాలని బుధవారం స్వగ్రామానికి వచ్చారు. గురువారం లక్ష్మయ్య తన చెల్లెలి కొడుకు హరీష్ (25)తో కలిసి ద్విచక్రవాహనంపై ధర్మవరం మండలం బిలవంపల్లికి పసుపు, కుంకుమ, చీర తీసుకుని బయలుదేరాడు. యర్రగుంట్ల వద్ద ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరూ గాయపడ్డారు. వెంటనే ధర్మవరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స తర్వాత అనంతపురం సర్వజనాస్పత్రికి రెఫర్ చేశారు. ఉదయం 11.55 గంటలకు ఆస్పత్రి క్యాజువాలిటీకి వచ్చారు. డ్యూటీ డాక్టర్ మల్లీశ్వరి వారిని పరీక్షించారు. లక్ష్మయ్య తలకు తీవ్ర గాయమైందని గుర్తించారు. కుడి కాలు విరిగినట్లు, ఛాతీ, కడుపు భాగంలో గాయాలైనట్లు నిర్ధారించి ఆర్థోవార్డుకు రాశారు. 12.30 గంటలకు వార్డుకు తీసుకెళ్లగా డ్యూటీ డాక్టర్లు ఎవరూ లేరు. నర్సులు మాత్రమే ఉన్నారు. వార్డులోని ఓ గదిలో అడ్మిట్ చేశారు. తల భారంగా ఉందని, ఛాతీ వద్ద నొప్పిగా ఉందని లక్ష్మయ్య చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే డాక్టర్లు ఉంటున్న గది వద్దకు వెళ్లి పరిస్థితి వివరించారు. ఫలితం లేకపోవడంతో డిశ్చార్జ్ చేస్తే వేరే ఆస్పత్రికి వెళతామని వారు చెప్పారు. డాక్టర్లు వచ్చి చూశాక డిశ్చార్జ్ చేస్తామన్నారు. అప్పటి నుంచి నిమిష నిమిషానికి లక్ష్మయ్య పరిస్థితి విషమించింది. తీరా సాయంత్రం 4.45కు డాక్టర్ కిరణ్, సీనియర్ రెసిడెంట్ శ్యాం వచ్చారు. లక్ష్మయ్యను చూసిన డాక్టర్ పరిస్థితి విషమించినట్లు గుర్తించి ‘ఒకవేళ చనిపోతే డాక్టర్లకు సంబంధం లేదు’ అని కుటుంబ సభ్యులతో రాయించుకున్నారు. ఆ తర్వాత పది నిమిషాలకు లక్ష్మయ్య మృతి చెందాడు. ‘అసలు మీరు మనుషులేనా? మృతదేహాన్ని వార్డు నుంచి మార్చురీకి తరలించాలని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు మీరు మనుషులేనా.. బతికున్నప్పుడు రాలేదు.. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్నారు. కనీస మానవత్వం లేదా? ఈ డాక్టర్లను సస్పెండ్ చేసే దాకా మృతదేహాన్ని తీసేది లేదు’ అంటూ లక్ష్మయ్య తమ్ముడి కుమారుడు నరేంద్ర, అల్లుడు ఎర్రిస్వామి, చెల్లెలి కుమార్తె శ్రావణి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకుని వార్డు వద్దకు వచ్చిన సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ వైవీ రావుతో వాగ్వాదానికి దిగారు. చివరకు బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని రాతపూర్వకంగా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రోగులకు ‘పరీక్ష’ అనంతపురం మెడికల్ : అనంతపురం సర్వజనాస్పత్రిలో వైద్య పరీక్షల కోసం రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఓడీచెరువు మండలం జంబులవాండ్లపల్లికి చెందిన రంగప్ప(65) ఆస్పత్రికి వచ్చాడు. ఇతడికి గతంలోనే కాలు విరిగింది. ప్రస్తుతం గొంతు వద్ద గడ్డలు ఉండడంతో ఎంఎస్-2లో అడ్మిట్ అయ్యాడు. పరీక్ష చేయించుకోవాలని రాసిచ్చారు. నడవలేని అతణ్ని వీల్చైర్లో పై అంతస్తు నుంచి కిందకు తీసుకొచ్చారు. అయితే అక్కడ సిబ్బందెవరూ లేరు.ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాలీకి వెళ్లారు. దీంతో రంగప్పతో పాటు మరికొంత మంది రోగులు వార్డు బయటే 2 గంటలు నిరీక్షించాల్సి వచ్చింది. -
నిర్లక్ష్యం ఖరీదు ఓ పసిప్రాణం..!
వెంటిలేటర్పై ఉన్న శిశువుపై ఎలుకల దాడి వైద్యుల నిర్లక్ష్యంతో మృత్యు ఒడిలోకి.. ఎలుకలకు మేం కాపలా కాయాలా..అంటూ తల్లిపై వైద్యుల ఆగ్రహం గుంటూరు: జబ్బుతో ఉన్న బిడ్డను వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకువస్తే.. అక్కడి వైద్యులు అసలు ప్రాణాలు లేకుండానే చేశారు.ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచిన శిశువును ఎలుకల బారి నుంచి కాపాడేందుకు కనీస చర్యలు తీసుకోలేదు. అప్పటికే ఓసారి శిశువుపై ఎలుకలు దాడిచేశాయని ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ నిండు పసిప్రాణం బలైంది. పది గంటల తర్వాత తీరుబడిగా డెత్ డిక్లేర్ (మరణ ధ్రువీకరణ)కు వైద్యులు రావడంతో తట్టుకోలేని ఆ తల్లి హృదయం వైద్యులను నిలదీసింది.ఎలుకలకు మేం కాపలా ఉండాలా అని ఓ వైద్యుడు... ఇంకో బిడ్డ ఉన్నాడుగా ఈ బిడ్డపై ఆశలు వదులుకోమంటూ సిబ్బంది ఉచిత సలహా ఇవ్వడం వారి కర్కశత్వానికి అద్దం పట్టింది. విజయవాడ కృష్ణలంక కు చెందిన చావలి నాగ, లక్ష్మి దంపతులకు ఈ నెల 17న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రెండో సంతానంగా మగబిడ్డ జన్మించాడు. శిశువుకు మూత్రసంచి, మూత్రనాళాలు బయటకు రావడంతో మెరుగైన వైద్యసేవల నిమిత్తం ఈ నెల 18న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని శిశు శస్త్ర చికిత్సా విభాగానికి తరలించారు. వైద్యులు ఈ నెల 20న శిశువుకు ఆపరేషన్ నిర్వహించి ఐసీయూలోని వెంటిలేటర్పై ఉంచారు. ఈ దశలోనే శిశువుపై ఈ నెల 24న ఎలుకలు దాడిచేసి కుడి చేయితోపాటు కాలి వేళ్లను కొరికివేశాయి.తీవ్ర ఆందోళనకు గురైన తల్లి లక్ష్మి వైద్యులు, ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసింది. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇలా బుధవారం తెల్లవారుజామున 4గంటల వేళ రెండోసారి ఎలుకలు పసికందుపై దాడిచేసి ఛాతీ, ఎడమ కణిత, బుగ్గ భాగాలతోపాటు చేతివేళ్లు, కాలివేళ్లు కొరుక్కుతిన్నాయి. తీవ్ర రక్తస్రావం కావడం గమనించిన లక్ష్మి కదలలేని స్థితిలోనూ కేకలు వేస్తూ ఎలుకలను తోలే ప్రయత్నం చేసింది. వైద్యులుగానీ, సిబ్బందిగానీ స్పందించలేదు. పది గంటలపాటు చికిత్స చేసేందుకు వైద్యులెవరూ అక్కడకు రాకపోవడంతో మృత్యువుతో పోరాడిన శిశువు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సీనియర్ ప్రొఫెసర్తో విచారణ కమిటీ... ఆసుపత్రిలో శిశువు మృతి చెందడం దురదృష్టకరమని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావు చెప్పారు. దీనిపై సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ సుబ్బారావుతో విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. 24గంటల్లో కమిటీ నివేదిక అందిస్తుందని, దీని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఆస్పత్రికి వెళ్లి తల్లిదండ్రులు చావలి లక్ష్మి, నాగ దంపతులను పరామర్శించారు. సిగ్గుతో తలదించుకుంటున్నా..: కామినేని గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జీజీహెచ్)లో ఎలుకలు కొరికి శిశువు మృతిచెందడంపై సిగ్గుతో తలదించుకుంటున్నానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాత్రి గుంటూరు జీజీహెచ్లో శిశువు మృతిచెందిన వార్డుతోపాటు, మార్చురీలో శిశువు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ ఇలాంటి సంఘటన జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేతో మెజిస్టీరియల్ విచారణ, గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠితో పోలీసుల విచారణ, వైద్యారోగ్య శాఖ పరమైన విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. సంఘటన జరిగేందుకు కారకులైన శానిటేషన్ కాంట్రాక్టును పూర్తిగా తొలగించినట్లు చెప్పారు. పారిశుద్ధ్య విభాగం ఇన్చార్జి ఆసుపత్రి ఆర్ఎంఓతోపాటు, శానిటరీ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రిలో శానిటేషన్ను మున్సిపల్ కార్పొరేషన్కు అప్పగించి మున్సిపల్ కమిషనర్ అనురాధ నేతృత్వంలో పారిశుధ్యం మెరుగు పరుస్తామన్నారు. ఎలుకలు కరిచిన అనేక గంటల వరకు వైద్యులు స్పందించకపోవడంపైనా విచారణ నిర్వహించి, వైద్యుల ప్రమేయం ఉంటే వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు ఉన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి
ఆస్పత్రి వద్ద మృతుడి బంధువుల ఆందోళన పిడుగురాళ్ళ : గుండెనొప్పి వస్తుందని వైద్యశాలకు వెళ్లిన వ్యక్తి వైద్యుల నిర్లక్ష్యంతో శవమైన సంఘటన పిడుగురాళ్ళ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. మండలంలోని తుమ్మలచెరువు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ పొట్లసిరి సాంబశివరావు(27) పట్టణంలోని కార్పొరేట్ స్థాయి ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం ఏడు గంటల సమయంలో గుండెనొప్పి అని వచ్చాడు. ఆసుపత్రిలో వైద్యుడు రాకముందే కాంపౌండర్లు రక్తపరీక్షలు, ఈసీజీ అంటూ పలు పరీక్షలు చేశారు. వీటికి సంబంధించి ఫీజు కూడా వసూలు చేశారు. నొప్పి తగ్గేందుకు కాంపౌండర్ ఇంజక్షన్ చేశాడు. చేసిన కొద్దిసేపటికి గుండెనొప్పి మరింత పెరిగి బాధపడుతున్నప్పటికీ,కాంపౌండర్లు ఇంజక్షన్ చేసి మొదట్లో అలాగే ఉంటుందని, తర్వాత నొప్పి తగ్గుతుందన్నారు. చివరకు నొప్పి తట్టుకోలేకపోతున్న రోగిని చూసి బంధువులు సిబ్బందిని నిలదీశారు. తొమ్మిది గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చిన వైద్యులు రోగి నోట్లో పైపును అమర్చి వైద్యం ప్రారంభించారు. ప్రాణాపాయం ఏమీ లేదని వెంటనే గుంటూరుకు తీసుకెళ్లాలని తెలపడంతో బంధువులు అంబులెన్స్లో రోగిని హుటాహుటిన నోట్లో పైపు అలాగే ఉంచి గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి రోగి చనిపోయి రెండు గంటలు పైగానే అయిందని నిర్థారించారు. దీంతో బంధువులు సాంబశివరావు మృతదేహాన్ని తీసుకుని పిడుగురాళ్ళ పట్టణంలోని వైద్యశాల వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. వైద్యశాల సిబ్బంది మృతుడి బంధువులతో చర్చించి రాజీ మార్గాన్ని కుదిర్చారు. అనంతరం బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతుడికి తల్లి దుర్గ, భార్య వెంకటరమణ కుమార్తె లక్ష్మీభవాని, కుమారుడు సాయి గణేష్ ఉన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి రూ. 1.8 కోట్ల పరిహారం
చెన్నై: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ 18 ఏళ్ల యువతి కంటి చూపు కోల్పోయిన సంఘటనను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. బాధితురాలికి 1.8 కోట్ల రూపాయలను పరిహారంగా అందజేయాలని తీర్పు వెలువరించింది. అయితే తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి చెన్నైకు చెందిన ఈ అమ్మాయి కంటి చూపు పోవడానికి కారణమయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె పుట్టకతోనే అందురాలిగా పుట్టింది. దీనిపై యువతి తండ్రి న్యాయపోరాటం చేశాడు. బాధితురాలికి భారీ పరిహారం ఇవ్వాలని బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
దవడ నొప్పికి చికిత్స చేస్తే.. బ్రెయిన్డెడ్తో మృతి
పంజగుట్ట: వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భర్త చనిపోయాడంటూ ఓ మహిళ పంజగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నాగార్జునాసాగర్ వద్ద ఎస్పీఎఫ్ పోలీస్ విభాగంలో పనిచేసే ఎం. శంకర్(38) దవడ నొప్పితో బాధపడుతూ.. ఈ నెల 19వ తేదీన నిమ్స్లో అడ్మిట్ అయ్యాడు. వైద్యపరీక్షలు పూర్తిచేసిన బరడా పి.డి. సాహూ వైద్య బృందం శంకర్కు 25వ తేదీన శస్త్ర చికిత్స నిర్వహించారు. అనంతరం రోగి పరిస్థితి చెప్పమని శంకర్ భార్య మాధవి ఎన్ని సార్లు వైద్యులను అడిగినా వారు స్పందించలేదు. తెలిసిన మరో వైద్యునితో మాధవి బంధువులు నిమ్స్ వైద్యులకు ఫోన్ చేయించి రోగి పరిస్థితి గూర్చి వాకబు చేయగా శంకర్ బ్రైయిన్డెడ్ అయ్యారని తెలిపారు. కోమాలో ఉన్న శంకర్ గురువారం ఉదయం మృతిచెందినట్లు వైద్యులు తెలపడంతో శంకర్ భార్య మాధవి తన భర్త నడుచుకుంటూ వచ్చి నిమ్స్లో అడ్మిట్ అయ్యారని కేవలం దవడ నొప్పి ఉంటే వైద్యులు నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతో మృతిచెందాడని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించి ఇద్దరు వైద్యులు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.