జీతాల ‘ఈ–చెల్లింపు’ కోసం ఆర్డినెన్స్‌! | Ordinance likely for wage payment via e-mode, cheque | Sakshi
Sakshi News home page

జీతాల ‘ఈ–చెల్లింపు’ కోసం ఆర్డినెన్స్‌!

Published Wed, Dec 21 2016 2:20 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

నగదు కొరత నేపథ్యంలో కేంద్రం జీతాలను ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది.

న్యూఢిల్లీ: నగదు కొరత నేపథ్యంలో కేంద్రం జీతాలను ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. పరిశ్రమలు, వ్యాపారాల్లో పనిచేసే వారికి జీతాలను చెక్కులు లేదా, ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో చెల్లించడానికి వీలుగా ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే వీలుంది. ‘ఈమేరకు 1936 నాటి వేతన చెల్లింపుల చట్టానికి సవరణ చేసేందుకు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే వీలుంది. ఆ బిల్లును 15న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది బడ్జెట్‌ సమావేశాల్లో దీన్ని ఆమోదించడానికి యత్నిస్తారు.  మరో రెండు నెలలు వేచి ఉండేందుకు బదులు ఆర్డినెన్స్‌ తెచ్చి, ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదింపజేసుకోవచ్చు.’ అని అధికార వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement