మహామాతకు పద్మశ్రీ | padma sri award to sulagithi narasamma | Sakshi
Sakshi News home page

మహామాతకు పద్మశ్రీ

Jan 26 2018 8:02 AM | Updated on Jan 26 2018 8:02 AM

padma sri award to sulagithi narasamma - Sakshi

సాక్షి, బెంగళూరు:  ఆమె ఎన్నో వేల మందికి ప్రసవాలు చేసి తల్లీబిడ్డలకు ప్రాణాలు నిలిపింది. తల్లులకే తల్లిగా ప్రసిద్ధిచెందింది. కర్ణాటక మహామాతగా పేరుగాంచిన సూలగిత్తి నరసమ్మను పద్మశ్రీ పురస్కారం వరించింది. గురువారం ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 97 ఏళ్ల నరసమ్మ స్వస్థలం తుమకూరు జిల్లా పావుగడ తాలుకాలోని కృష్ణాపురం గ్రామం. ఆమె 70 ఏళ్లుగా సుమారు 15 వేల మందికి పైగా గర్భిణిలకు కాన్పులు చేశారు. ఒక్కరి నుంచి కూడా డబ్బు తీసుకోరు.

తన చల్లని చేతులతో బిడ్డను తల్లి ఒడిలో పెట్టి మనసు నిండా సంతృప్తితో ఇంటిముఖం పడతారు. ఇటీవలే తుమకూరు విశ్వవిద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఆమె తుమకూరు, చిత్రదుర్గం జిల్లాలతో పాటు అనంతపురం సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలకు పురుడు పోయడం గమనార్హం. మహామాత నరసమ్మ చేసిన ఘనమైన సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement