ట్రూ జెట్ విమానం రద్దు, ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ : తిరుపతి నుంచి హైదరాబాద్ రావాల్సిన ట్రూ జెట్ విమానం రద్దు అయింది. దీంతో బుధవారం ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని ఎలా రద్దు చేస్తారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే యాజమాన్యం మాత్రం ప్రయాణికుల ఆందోళనను ఏమాత్రం స్పందించడంలేదని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.