తైక్వాండోలో జిల్లా విద్యార్థుల సత్తా | prakasam district students raising in taekwondo competitions | Sakshi
Sakshi News home page

తైక్వాండోలో జిల్లా విద్యార్థుల సత్తా

Published Sun, Oct 9 2016 9:19 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

prakasam district students raising in taekwondo competitions

ఒంగోలు : ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు కర్నూలు జిల్లాలో నిర్వహించిన అండర్‌–19 స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ తైక్వాండో పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. వ్యక్తిగత విభాగం(54 కేజీలు)లో పి.సాయిచరణ్‌తేజ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో అతనిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.

2017 జనవరి 4 నుంచి 8వ తేదీ వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ పోటీల్లో చరణ్‌తేజ పాల్గొననున్నాడు. 70 కేజీల విభాగంలో షేక్‌ ఫరూక్‌ కాంస్య పతకాన్ని, 66 కేజీల విభాగంలో సాయితేజ కాంస్య పతకాన్ని సాధించారు. వీరు శనివారం జిల్లా అధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆర్‌ఐఓ రమేష్‌బాబు, అండర్‌–19 స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి ఎం.హరనాథబాబు విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన తైక్వాండో జిల్లా కార్యదర్శి అబ్దుల్‌ సలాం, టీం కోచ్‌ అఖిల్‌ను అభినందించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement