వర్ధన్నపేటలో దొంగలు బీభత్సం
Published Fri, Apr 14 2017 11:36 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
వర్ధన్నపేట: వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం లేబర్తి గ్రామంలో గురువారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని మూడు ఇళ్లలో దొంగలుపడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. శుక్రవారం ఉదయం తాళాలు పగలగొట్టి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు. పెద్ద ఎత్తున నగదుతో పాటు 5 తులాల బంగారు ఆభరణాలు, ఓ ద్విచక్రవాహనం చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Advertisement
Advertisement