కనిగిరిలో ఆర్టీసీ బస్సు బీభత్సం
Published Tue, Mar 21 2017 11:05 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM
కనిగిరి: ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్న పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలోలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని కనిగిరి బస్టాండ్ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మతుడు ప్రసాద్(45)గా గుర్తించారు.
Advertisement
Advertisement