hulchul
-
Suryapet: ఉండ్రుగొండలో అఘోరీ ప్రత్యక్షం
చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో అఘోరీ హల్చల్ చేసింది. శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరి నుంచి వేములవాడకు వెళ్తూ మార్గమధ్యంలో ఉండ్రుగొండ గ్రామ శివారులోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఆర్చి వద్ద భోజనం చేసేందుకు ఆగింది. పలువురు ఆమెను ఫొటోలు తీస్తుండటంతో తనను ఎందుకు ఫొటోలు తీస్తున్నారని వారిపై దాడికి ప్రయత్నించింది. దీంతో వారు ఆమెను కొట్టారు. ఆమె తన కారులో ఉన్న తల్వార్ తీసి గొడవ చేసింది. గ్రామస్తులు సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెకు నచ్చజెప్పి గ్రామం నుంచి తీసుకువచ్చారు. రాత్రి ఖాసీంపేట గ్రామ శివారులో తన కారులోనే నిద్రించింది. ఆదివారం తెల్లవారుజామున టిఫిన్ చేయడానికి వెళ్లడంతో ఓ యువకుడు ఆమెను సెల్ఫీ అడగడంతో అతడిపై దాడికి దిగింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహేశ్వర్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను అక్కడి నుంచి పంపించారు. -
సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ లో ముగ్గురు యువకుల హల్ చల్
-
గంజాయి బ్యాచ్ వీరంగం
ఉప్పల్: రామంతాపూర్లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. ఏకంగా ఇంట్లోకి చొరబడి ఓ యువకుడిని చితక బాదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పొలీసులు, బాధితులు తెలిపిన మేరకు..రామంతాపూర్ లక్ష్మీ శ్రీకాంత్నగర్ కాలనీలో నివాసముంటున్న బాల నర్సింహ కుమారుడు భరత్ కుమార్(30) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన ఆటోను ఇంటి ముందు పార్క్చేసి లోపలకు వెళ్లాడు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి ఆటోలో కూర్చుని గంజాయి తాగుతున్నారు. ఇది గమనించిన భరత్ వారిని మందలించడంతో వారు మరికొందరిని పిలిపించారు. దీంతో భరత్ భయపడి ఇంట్లోకి వెళ్లాడు. రెచ్చి పోయిన అల్లరి మూక తలుపులు పగుల గొట్టి ఇంట్లోకి చొరబడి భరత్ను విచక్షణా రహితంగా చితక బాదారు. ఈ దాడిని చూసిన స్థానికులు అక్కడకు వెళ్లడంతో వారు పరారయ్యారు. భరత్ను చికిత్స నిమిత్తం ప్రైవేటు అసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయులో ఉంచినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో కాలనీ వాసులంతా ఉప్పల్ పోలీస్స్టేషన్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొంత మంది పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
పులికి చుక్కలు చూపించిన ఫారెస్ట్ ఆఫీసర్స్..
-
ఒంగోలు జిల్లాలో పులి సంచారం
-
నాగ్ బాబా హల్ చల్
-
‘సార్..దయచేసి మా అమ్మను ఇంటికి పంపకండి.. జైలుకు పంపండి..’
ఫిలింనగర్: మద్యం మత్తులో ఓ మహిళ (44) పార్కు పక్కన తూలిపోతూ..రోడ్డు పక్కన పడుకుని న్యూసెన్స్ చేస్తుండగా సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని సయ్యద్నగర్ బస్తీలో నివసించే ఓ మహిళ గత కొంతకాలంగా మద్యానికి బానిసై అర్ధరాత్రి దాకా రోడ్లపై తిరుగుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. శుక్రవారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఎన్బీటీనగర్ ప్రాంతంలో మద్యం మత్తులో న్యూసెన్స్ చేస్తుండగా బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడకు వెళ్లి ఆమె ఇంట్లో అప్పగించి వచ్చారు. అయితే ఇంట్లో చెప్పకుండానే ఆమె మళ్లీ అదే అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో బయటకు వచి్చంది. ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని లోటస్పాండ్ పార్కు వద్ద వివస్త్రగా పడి ఉంది. శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమె గురించి ఆరా తీయగా సయ్యద్నగర్లో నివసిస్తుందని తెలిసింది. దీంతో ఆమె కూతురికి ఫోన్ చేయగా ‘సార్..దయచేసి మా అమ్మను ఇంటికి పంపకండి..జైలుకు పంపండి..’ అంటూ ఆమె ఇంట్లో చేసిన న్యూసెన్స్ను మొరపె ట్టుకుంది. ఆమె భర్త పెయింటర్గా పనిచేస్తుంటాడని, ముగ్గురు పిల్లలు ఉన్నారని, మద్యానికి బానిసై నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. గత నెల రోజుల నుంచి 10 మార్లు పోలీసులు ఆమెను ఇలా గే రోడ్లపై మద్యం మత్తులో తిరుగుతుండగా కు టుం బసభ్యులకు అప్పగించారు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
-
సూర్యాపేటలో దొంగల ముఠా హల్చల్
-
బాబు అండతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
-
మంత్రి కాన్వాయ్ అడ్డుకుని మందుబాబులు రచ్చ..
-
మహానందిలో మరోసారి చిరుత సంచారం
-
కారుపై పెద్దపులి దాడి..
-
వికారాబాద్ జిల్లా గడిసింగాపూర్ గ్రామంలో లారీ బీభత్సం
-
నాకు సీఎం సార్ కావాలి...ప్రగతి భవన్ ముందు యువకుడు హల్ చల్
-
ఏలూరు జిల్లా దెందులూరులో పెద్దపులి సంచారం
-
Vizag: విశాఖ రైల్వేస్టేషన్లో వ్యక్తి హల్చల్..
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. రైల్వేస్టేషన్లో రూఫ్ టాప్పైకి ఎక్కి కరెంట్ తీగలను పట్టుకుంటాను అంటూ అక్కడున్న వారిని బెదిరించాడు. దీంతో, ప్రయాణికులు హడిలిపోయారు. రైల్వేస్టేషన్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. విశాఖ స్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ సృష్టించాడు. ప్రయాణికులతోపాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులను టెన్షన్ పెట్టాడు. రూఫ్టాప్ పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుంటానని బెదిరింపులకు దిగాడు. అతడిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. తొలుత విద్యుత్ సరఫరా నిలిపి ఆ వ్యక్తి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా.. నాలుగో నంబర్ ప్లాట్ఫామ్పై ఉన్న పూరీ-తిరుపతి ఎక్స్ప్రెస్ రైలుపైకి దూకాడు. దీంతో అతడి వెంట పరుగులు పెట్టిన పోలీసులు.. ఎట్టకేలకు ప్రయాణికుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే, సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తోంది. అనంతరం, పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
సలార్2 లో అదిరిపోనున్న శ్రీయ రెడ్డి క్యారెక్టర్..
-
కామారెడ్డిలో రేవంత్ రెడ్డి తమ్ముడు హల్ చల్
-
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేత దండెం రాంరెడ్డి, అనుచరుల హంగామా
-
విందు కోసం హారన్ కొట్టు.. చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేం..
న్యూఢిల్లీ: కొంతమంది క్రియేటివిటీని చూస్తే.. దడపుట్టాల్సిందే. అలాంటిదే ఈ కారు వెనుక ఉన్న అస్థిపంజరం బొమ్మ. కానీ, ముందు భయపడినా ఆ క్రియేటివిటీలోని సరదాను చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేం. ఇన్స్ట్రా గామ్లో హల్చల్ చేస్తున్న ఈ కారు వీడియోకు లైక్ కొట్టుకుండా ముందుకు కదలేం. @behindtheshield911 ఇన్స్టా అకౌంట్లో షేర్ చేసిన ఆ వీడియోలో ఏముందంటే.. ఓ కారు, కారు వెనుక అస్థిపంజరం బొమ్మ. పక్కనే ‘విందు కావాలంటే హరన్ కొట్టు’ అనే కాప్షన్. దాన్ని చూసి సరదాగా హరన్ కొడితే ఆ అస్థి పంజరం బొమ్మ వెనక ఉన్న కారుపై పడేలా నీళ్లను వెదజల్లుతుంది. అస్థిపంజరాన్ని చూసి భయపడిన మనకు అది నీళ్లు వెదజల్లే విధానం చూస్తే నవ్వురాకుండా ఉండదు. చదవండి: థియేటర్ మొత్తం మంటలు, సినిమా చూస్తూ నిమగ్నమైన ప్రేక్షకులు -
మన్యం జిల్లాలో గజరాజుల గుంపు బీభత్సం
-
డోంగర్ గామ్ లోని హనుమాన్ ఆలయంలో పాము సంచారం
-
రోడ్లపై తిరుగుతూ హల్చల్ చేసిన ఎలుగు బంటి
-
హడల్ పుట్టిస్తున్న రంగూన్ రాణులు