స్టీల్ప్లాంట్లో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
Published Wed, Oct 12 2016 5:59 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం సంభవించింది. మరుగుతున్న ఉక్కుద్రవం పడి ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్టీల్ప్లాంట్లోని ఎస్ఎంఎస్-2 విభాగంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement