
సుద్దపల్లి రైతులకు వైఎస్ జగన్ మద్దతు
గుంటూరు: అధికార పార్టీ నేతల అక్రమ క్వారీలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన దీక్షకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు. గుంటూరు జిల్లా సుద్దపల్లిలో రైతులు మూడు రోజులుగా దీక్ష చేస్తున్నారు. శుక్రవారం సుద్దపల్లికి చేరుకున్న వైఎస్ జగన్.. అక్రమ క్వారీలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.