
ఓ వేదికపై 102 జంటలు ఒక్కటవుతున్న వేళ
మహబూబ్నగర్ : ఒకే ముహూర్తంలో (శుక్రవారం ఉదయం 11.05 గంటలకు) 102 జంటలు ఒక్కటవబోతున్నాయి. అదీ ఒకే వేదికపై. ఈ అపూర్వ వేడుకకు మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూలు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శుక్రవారం వేదిక అయింది. ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఈ సామూహిక వివాహాలను నిర్వహిస్తున్నారు.
అందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వివాహ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.