గోదావరి పుష్కరాలకు రూ.750 కోట్లు: ఇంద్రకరణ్ | 750 crore Godavari puskaralaku: indrakaran | Sakshi

గోదావరి పుష్కరాలకు రూ.750 కోట్లు: ఇంద్రకరణ్

Mar 16 2015 1:22 AM | Updated on Aug 15 2018 9:27 PM

వచ్చే జూలైలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల కోసం రూ.750 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ మంజూరు చేశార ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

నిజామాబాద్: వచ్చే జూలైలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల కోసం రూ.750 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ మంజూరు చేశార ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఈ నిధులతో అన్ని పుష్కరఘాట్లలో తగిన వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. నిజామాబాద్ మండలం ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఆయన ఆదివారం సతీసమేతంగా హాజరయ్యూరు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 1,850 దేవాలయాలలో ధూప, దీప నైవేద్యాల కోసం రూ.13 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. అనంతరం ఆలయ ట్రస్టు సభ్యులు, సినీ నిర్మాత దిల్ రాజు, నర్సింహారెడ్డి తదితరులు మంత్రిని సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement