సభలో ఇక ‘ఐక్య’ పక్షం | All oppositions are decided to maintain unity | Sakshi
Sakshi News home page

సభలో ఇక ‘ఐక్య’ పక్షం

Published Thu, Mar 19 2015 1:34 AM | Last Updated on Sat, Aug 11 2018 6:44 PM

సభలో ఇక ‘ఐక్య’ పక్షం - Sakshi

సభలో ఇక ‘ఐక్య’ పక్షం

  • ఏకతాటిపై ఉండాలని విపక్షాల నిర్ణయం
  • సాక్షి, హైదరాబాద్: శాసనసభలో అధికార టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు కలసికట్టుగా ఉండాలని విపక్షాలన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి. పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలను పక్కకు పెట్టి ఐక్యతతో లేకుంటే కష్టమన్న భావనకు వచ్చిన కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ ఎమ్మెల్యేలు బుధవారం చర్చించుకున్నారు. ‘కేవలం ఈ ఒక్క సెషన్స్‌కు అని మాత్రమే కాదు. భవిష్యత్తు గురించి కూడా చర్చించుకున్నాం. ప్రభుత్వాన్ని నిలవరించాలంటే  ప్రతిపక్ష పార్టీలు ఒక్కటిగా ఉండాల్సిన అవసరం ఉంది..’ అని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి లాబీల్లో విలేకరులతో వ్యాఖ్యానించారు.

    ప్రస్తుతం నామమాత్రంగానే చర్చించినా, ఆ తర్వాత టీడీపీ సభ్యులనూ కలుపుకొని పూర్తిస్థాయిలో వ్యూహాన్ని ఖరారు చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా, టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి స్పీకర్ ఎస్.మధుసూదనాచారిని కలసి విజ్ఞప్తి చేశారు. బుధవారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిశాక కిషన్‌రెడ్డి స్పీకర్‌ను ఆయన చాంబర్‌లో కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement