
రేపు నగరానికి కేంద్రమంత్రి దత్తాత్రేయ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండారు దత్తాత్రేయ ఈ నెల 14వ తేదీన(శుక్రవారం) ఢిల్లీ నుంచి నగరానికి విచ్చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేస్తారు. ఈ సభలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు,బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి,అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొంటారు.