హైదరాబాద్: ప్రభుత్వం సోమవారం నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తిచేశారు. కౌన్సెలింగ్ ఇప్పటికి 3 సార్లు వాయిదాపడిందని, దానిని ప్రారంభించకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు.
శనివారం సచివాలయంలో కడియంను శ్రీనివాస్గౌడ్, శ్రీనివాసరావు, గుడుగు భాస్కర్, బి.రాజుగౌడ్, సింగం నగేష్, జూకంటి ప్రవీణ్, పి.లింగం కడియంకు వినతిపత్రాన్ని సమర్పించారు.
‘ఎంసెట్ కౌన్సెలింగ్ చేపట్టాలి’
Published Sun, Jul 12 2015 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM
Advertisement
Advertisement