ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం పలుగుల గ్రామం వద్ద పోలీసులు భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనాస్థలంలో 158 డిటోనేటర్లు, 25 జిలెటిన్ స్టిక్స్, 51 బండిళ్ల వైరును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
Published Thu, Aug 27 2015 1:29 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement