మెదక్ మున్సిపాలిటీ: వరి, మొక్కజొన్న కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని జాయింట్ కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని భారత్ ఫంక్షన్ హాల్లో వరి, మొక్కజొన్న కేంద్రాల కొనుగోలు విషయమై పాయింట్ వర్కర్స్, ఏపీఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ శరత్ మాట్లాడుతూ రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లోనే సంబంధిత రైతుల బిల్లులు డీఆర్డీఏ కార్యాలయానికి చేరాలని సూచించారు. ఆవిధంగా చర్యలు తీసుకున్నప్పుడే 72గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు.
బిల్లులు సకాలంలో పంపించడంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్య వైఖరి అవలంబించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో ఒక్కసారిగా ధాన్యం పేరుకుపోకుండా ముందస్తుగానే కేంద్రాలను ప్రారంభించాలన్నారు. వరి కామన్ రకాన్ని క్వింటాల్కు రూ.1360, గ్రేడ్ ఏ రాకానికి రూ. 1400, మొక్కజొన్నకు రూ. 1310లు మద్ధతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఏ కొనుగోలు కేంద్రాల్లోను ఈ ధర కంటే తక్కువగా చెల్లిస్తే వారి పై కేసులు నమోదు చేయాలని సూచించారు. ధాన్యంలో తేమ 15 శాతం, రంగు మారిన ధాన్యం 5 శాతం, ముడుచుకుపోయిన ధాన్యం 3 శాతం, చెత్త, మట్టి పెడ్డలు 1శాతం కంటే ఎక్కువగా ఉండకూడదన్నారు. ధాన్యం కొనుగోలులో కనీస ప్రమాణాలను పాటించాలన్నారు.
ధాన్యం కొనుగోలు చేసిన తరువాత రైతుల వద్ద నుంచి సరైన బ్యాంకు ఖాతా నంబరును తీసుకోవాలని, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే కనీసం అందులో రూ.500 ఉండేలా చూడాలని రైతులకు సూచించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఏసురత్నం, డీఎం మార్క్ఫెడ్ నాగమల్లిక, డీఎం సివిల్ సప్లయీస్ జయరాం, ఏపీడీ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ విజయలక్ష్మి, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, ఎరియా కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
72 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు
Published Fri, Oct 10 2014 12:15 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
రేపు స్టాక్ మార్కెట్ పనిచేస్తుందా?
సూసేకి.. అగ్గిరవ్వమాదిరి.. హన్సిక డ్యాన్స్ అదిరిపోయింది!
వాతావరణానికనుగుణంగా.. ఉపయోగపడే కొత్త పరికరాలు ఇవే..!
ఢిల్లీ నీటి సంక్షోభం.. ‘వాటర్ పైప్లైన్ల వద్ద భద్రత పెంచండి’
పెద్ద చదువు లేదు, ఉన్న ఇల్లమ్మేసింది, రూ.500 అప్పుతో..
అందానికి హై ఫ్రీక్వెన్సీ మెషిన్! ఇదొక మంత్రదండంలా..
T20 World Cup 2024: ఓడినా రికార్డు నెలకొల్పారు..!
హైదరాబాద్ సీసీఎస్ ప్రక్షాళన.. 12 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
యూపీలో వడదెబ్బకు 33 మంది మృతి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (16-06-2024)
తప్పక చదవండి
- టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు
- సినిమా కోసం అధిక వడ్డీకి అప్పులు.. దేశం విడిచి వెళ్లిపోలేదు: నటుడు
- పెద్ద చదువు లేదు, ఉన్న ఇల్లమ్మేసింది, రూ.500 అప్పుతో..
- T20 World Cup 2024: ఓడినా రికార్డు నెలకొల్పారు..!
- వివాహేతర సంబంధం: భర్తను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భార్య
- ఇదేంటో తెలుసా? దీనిని తాకితే.. ప్రాణాలకే?
- నా భర్తతో హోటల్ రూమ్లో ఆ హీరోయిన్.. అందుకే విడాకులు: శ్రీదేవి
- ఆగని టీడీపీ దాడులు.. పెరిగిన విధ్వంసం
- చెక్పోస్టు ఉద్యోగం భలే కిక్కు!
- టీడీపీ అరాచకం!
Advertisement