grain purchase
-
చిన్న మిల్లులకు పెద్ద కష్టం
సాక్షి, భీమవరం: చిన్న మిల్లుకు పెద్ద కష్టమొచ్చిoది. ధాన్యం సేకరణ లక్ష్యం తగ్గిపోగా.. మిల్లింగ్ సామర్థ్యం మేరకు కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కేటాయింపులు చేస్తుండటం చిన్నమిల్లుల మనుగడపై ప్రభావం చూపనుంది. 5 టన్నులలోపు సామర్థ్యం గల చిన్న మిల్లులకు కొద్దిరోజులకు సరిపడా ధాన్యం మాత్రమే వస్తుండటంతో వాటిని మర ఆడిన తర్వాత మిల్లులు మూసుకోవాల్సిందేనన్న ఆందోళనలో చిన్న మిల్లర్లు ఉన్నారు. ఉదాహరణకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్వారపూడి సమీపంలోని చిన్న రైస్మిల్లుకు పాత అచీవ్మెంట్ ఆధారంగా గతంలో 45 నుంచి 50 ఏసీకే (ఎక్నాలెడ్జ్మెంట్)ల ధాన్యం వచ్చేది. ఇది దాదాపు మూడు నెలల పాటు మిల్లు తిరిగేందుకు సరిపోయేది. ఇప్పుడు ధాన్యం సేకరణ లక్ష్యం తగ్గడంతో సుమారు 35 ఏసీకేల వరకు రావాలి. కానీ.. సామర్థ్యం ఆధారంగా ఇవ్వడంతో కేవలం 12 ఏసీకే ధాన్యం మాత్రమే వచ్చింది. ఇది నెల రోజుల మిల్లింగ్కు మాత్రమే సరిపోతుంది. తర్వాత రబీ ధాన్యం వచ్చే వరకు మిల్లును మూసుకోవాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక రైస్మిల్లుకు గత ర్యాండమైజ్ పద్ధతిలో 40 ఏసీకే (ఒక ఏసీకే దాదాపు 290 క్వింటాళ్లకు సమానం)లకు పైగా ధాన్యం వచ్చేది. ఈసారి ప్రైవేట్ వ్యాపారం చేసే మిల్లులకు సీఎంఆర్ ఇవ్వడం, ప్రస్తుత ధాన్యం సేకరణలో దళారుల జోక్యానికి అవకాశం కలగడంతో తమకు నచి్చన మిల్లులకు వారు ధాన్యాన్ని చేరవేస్తున్నారు. ఈ జిల్లాలో 10 ఏసీకేల ధాన్యం సేకరణ కష్టంగా మారి మిల్లు ఎంతకాలం నడుస్తుందో చెప్పలేని పరిస్థితి. గోదావరి జిల్లాల్లో 780 వరకు రైస్మిల్లులుఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రైస్మిల్లింగ్ పరిశ్రమ విస్తరించి ఉంది. ఈ రెండు జిల్లాల్లో 780 వరకు రైస్మిల్లులు ఉండగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఆకివీడు తదితర చోట్ల 360 వరకు రైస్మిల్లులు ఉన్నాయి. రెండు జిల్లాల్లో గంటకు 5 టన్నుల నుంచి 10 టన్నులకు పైగా మిల్లింగ్ సామర్థ్యం కలిగిన పెద్ద మిల్లులు 40 శాతం ఉండగా, మిగిలినవన్నీ 5 టన్నులలోపు సామర్థ్యం గల చిన్న మిల్లులే. సాధారణంగా పెద్ద మిల్లులు ప్రైవేట్ మార్కెట్కి, ఎగుమతులకు ప్రాధాన్యమిస్తే.. చిన్న మిల్లులు ఎక్కువగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)పై ఆధారపడతాయి. రైతుల నుంచి సివిల్ సప్లైస్ శాఖ సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లులకు అప్పగిస్తుంది. క్వింటాల్ ధాన్యానికి 67 కేజీల బియ్యాన్ని తిరిగి అప్పగించాలి. అందుకోసం కమీషన్ రూపంలో వారికి వచ్చేది కేవలం రూ.10 మాత్రమే. మిల్లింగ్ చేసేటప్పుడు వచ్చే తవుడు, నూకలు, చిట్టు తదితర ఉప ఉత్పత్తులకు రైస్ బ్రాన్ ఆయిల్, ఆల్కహాల్, ఇథనాల్ తయారీలో డిమాండ్ ఉండటంతో సీఎంఆర్ చేస్తుంటాయి.గతంలో పాత అచీవ్మెంట్ల ఆధారంగా...తూర్పుగోదావరిలో మిల్లింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్, ప్రైవేట్ మార్కెట్ చేస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మిల్లులు ప్రైవేట్ వ్యాపారం తక్కువగా చేస్తుంటాయి. సీఎంఆర్ చేయడంలో ఈ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రైవేట్ వ్యాపారం చేసే, డ్రయర్లు, లేటెస్ట్ టెక్నాలజీ లేని మిల్లులకు సీఎంఆర్ కేటాయింపులు చేయకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ వాటి మనుగడ దృష్ట్యా గతంలో కొన్ని సడలింపులు ఇచ్చేవారు. సీజన్లో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని బట్టి పాత అచీవ్మెంట్ల మేరకు సీఎంఆర్ కేటాయింపులు జరిగేవి. దీనివల్ల సక్రమంగా సీఎంఆర్ చేసే చిన్న మిల్లులకు కేటాయింపులకు ఇబ్బంది ఉండేది కాదు. సేకరణ లక్ష్యాన్ని తగ్గించడంతో చిన్న మిల్లులకు చిక్కులుగత ఖరీఫ్తో పోలిస్తే ఈ సీజన్లో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని తగ్గించేశారు. దీనికితోడు మిల్లింగ్ కెపాసిటీ మేరకు సీఎంఆర్ కేటాయింపులు చేయడం చిన్న మిల్లులకు చిక్కులు తెచ్చిపెట్టింది. ప్రైవేట్ వ్యాపారం చేసే మిల్లులకు సీఎంఆర్కు అవకాశం ఇవ్వడంతో చిన్న మిల్లులకు కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం ధాన్యం సేకరణలో దళారుల జోక్యం మరింత సమస్యగా తయారైంది. గత ప్రభుత్వం ధాన్యం సేకరణలో ఏ దశలోనూ దళారుల జోక్యానికి ఆస్కారం లేకుండా రైతుకు పూర్తి మద్దతు ధర అందేలా కట్టుదిట్టం చేసింది. రైతు ఆర్బీకే/సొసైటీకి ధాన్యం శాంపిల్ తీసుకువెళితే.. మిగిలిన పనంతా అక్కడి సిబ్బంది చూసుకునేవారు. ధాన్యం ఆన్లైన్ చేయగానే ఏ మిల్లుకు వెళ్లాలో కంప్యూటర్ సూచించేది. నూతన విధానంలో అడుగడుగునా దళారుల జోక్యం పెచ్చుమీరింది. కమీషన్ ఏజెంట్లు తమకు నచ్చిన పెద్ద మిల్లర్లతో మాట్లాడుకుని ధాన్యాన్ని అక్కడికే తరలిస్తున్నారు. దీంతో చిన్న మిల్లులకు ధాన్యం సేకరణ కష్టంగా తయారైంది. నెల రోజులు తిరిగితే గొప్ప ఏటా సీజన్లో చిన్న మిల్లులకు 40 నుంచి 50 ఏసీకేల వరకు ధాన్యం సేకరణ జరిగితే ఇప్పుడు అధిక శాతం 10 నుంచి 15 ఏసీకేలలోపే ఉన్నాయి. దీంతో వాటి సామర్థ్యం మేరకు నెల నుంచి నెలన్నర రోజులు మాత్రమే మర ఆడేందుకు వస్తాయని, తర్వాత రబీ ధాన్యం మార్కెట్లోకి వచ్చే వరకు మిల్లులు మూసేయాల్సిందేనని చిన్న మిల్లర్లు అంటున్నారు. మిల్లు తిరిగినా తిరగకపోయినా వాటి చిన్న, పెద్ద మిల్లుల కెపాసిటీని బట్టి సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు, అద్దెలు, నిర్వహణ రూపంలో నెలకు రూ.2.50 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ మేరకు నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఒక్కో చిన్నమిల్లులో గుమాస్తా, డ్రైవర్, జట్టు కార్మికులు 10 నుంచి 12 మంది వరకు పనిచేస్తుంటారు. మిల్లు మూతపడితే వారంతా ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది. -
అన్నీ కోతలే.. కొన్నది ఏదీ!
అవనిగడ్డ/సాక్షి ప్రతినిధి, బాపట్ల/బండి ఆత్మకూరు: రాష్ట్రంలో ధాన్యం రైతుల విషయంలో ప్రభుత్వం చెబుతున్నది ఒకటి.. వాస్తవంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది మరొకటి. ఏ ఒక్క రైతుకూ పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వమే ధాన్యం దళారీగా మారి.. రైతులకు, మిల్లర్లకు మధ్య మధ్యవర్తిత్వం నడుపుతుంటే అన్నదాతలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? మిల్లర్లు చెప్పిన ధరకే ధాన్యం ఇచ్చేయాలని ఒత్తిడి తీసుకు రావడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా.. అని రైతులు మండిపడుతున్నారు. రెండు మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ‘మొన్నటి ఇబ్బందులు చెప్పొద్దు. ఈ రోజే మీ సమస్యను పరిష్కరిస్తాం. ఎన్ని సంచులు కావాలంటే అన్ని... ఎన్ని లారీలు కావాలంటే అన్ని లారీలు పంపిస్తాం. దళారులకు ధాన్యం అమ్మొద్దు. ఈ రోజు సాయంత్రానికే మీ ధాన్యం కొనుగోలు చేసి తీరతాం’ అని మంత్రి మనోహర్ బుధవారం అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని మాజేరు, లంకపల్లి, లక్ష్మీపురం, చల్లపల్లి, కప్తానుపాలెం, పెదప్రోలు గ్రామాల్లో ధాన్యం రాశులను పరిశీలించి రైతులకు హామీ ఇచ్చారు.గురువారం రాత్రి వరకు కూడా అటు వైపు ఏ అధికారీ కన్నెత్తి చూడక పోవడం గమనార్హం. చేత కానప్పుడు ఇలాంటి వాగ్దానాలు చేయకూడదని రైతులు హితవు పలుకుతున్నారు. ‘15 రోజుల క్రితం కోత కోయించి ధాన్యం తీసుకొచ్చి రోడ్డు పక్కన ఆరబెట్టుకుంటున్నాం. వర్షం వచ్చి ధాన్యం తడిస్తే ఎందుకూ పనికిరావు. ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని చేతులెత్తి మంత్రిని వేడుకున్నా. బుధవారం సాయంత్రానికి కొనేస్తామన్నారు. గురువారం సాయంత్రం వరకు ఎవరూ పత్తాలేరు. రైతులపై కనీస కనికరం లేదు’ అని లంకపల్లికి చెందిన మోటుపల్లి జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. బిత్తరపోయిన మంత్రులుబాపట్ల జిల్లా కొల్లూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించేందుకు వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి గొట్టిపాటి రవికుమార్కు ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా దోపిడీకి గురవుతున్న తీరును స్థానిక రైతులు ఏకరువు పెట్టారు. ‘ఏం బాబూ.. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయా’ అని మంత్రి కొలుసు పార్థసారథి ఆరా తీశారు. దీనికి కౌలు రైతు ప్రసాదరావు సమాధానమిస్తూ.. ‘ఏంటండీ కొనేది? పండించిన పంటను కొనడానికి ముప్ప తిప్పలు పెడుతున్నారు. మిల్లర్లే దళారులుగా మారి తక్కువ ధరకు ధాన్యం తీసుకుని రైతులను నట్టేట ముంచుతున్నారు. కొల్లూరులో 6 ఎకరాల్లో పండించిన ధాన్యాన్ని మిల్లుకు తెచ్చాం. ధాన్యం కొనాలని కోరుతూ తిరగని రోజు లేదు. ఈకేవైసీ చేయించిన పత్రాలు చూపెట్టా. తేమ శాతం 21 ఉన్నా.. మిల్లర్లు వారి కింద పనిచేసే బ్రోకర్లను అడ్డం పెట్టుకుని బస్తా (75 కిలోలు) రూ.1,200కే అడుగుతున్నారు’ అని అవస్థలను ఏకరువు పెట్టాడు. దీంతో బిత్తరపోయిన మంత్రులు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతులు గురువారం నంద్యాల జిల్లా సంతజూటూరు గ్రామంలో రోడ్డెక్కారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజశేఖర్, రైతు సంఘం నాయకులు వెంకట కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులు ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సన్న రకం వడ్లు బస్తా రూ.1,300 నుంచి రూ.1,400 ధర పలుకుతోందని, గత ప్రభుత్వం క్వింటాకు రూ.2,600 మద్దతు ధర ప్రకటించడంతో రూ. 2,500 నుండి రూ.2,900 వరకు ధర పలికిందన్నారు. గత ప్రభుత్వంలోనే మేలు జరిగిందని గుర్తు చేశారు. -
రైతులను ఇబ్బంది పెడితే అధికారులపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలులో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని, ఎక్కడా సమస్యలు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోళ్లపై గురువారం తన నివాసం నుంచి కలెక్టర్లు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతు ఏ మిల్లుకైనా ధాన్యం తీసుకెళ్లవచ్చన్నారు. అధికారులు మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు 1.51 లక్షల మంది రైతుల నుంచి 10.59 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని చెప్పారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు రూ.2,331 కోట్లను చెల్లించామని చెప్పారు. సంచుల కొరత రానివ్వొద్దు ధాన్యం సంచుల కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏ మిల్లు యజమాని అయినా రైతులను ఇబ్బంది పెట్టినా.. ప్రభుత్వానికి సహకరించకపోయినా వారిపై చర్యలకు వెనుకాడొద్దని కలెక్టర్లకు సూచించారు. ఎక్కడైనా సమస్య ఉందని తెలిస్తే తానే స్వయంగా ఆ ప్రాంతానికి వెళతానని, అక్కడి నుంచే అధికారుల వివరణ కోరతానని అన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్, స్మగ్లింగ్ అనేది పెద్ద మాఫియాగా మారిపోయిందని, ఈ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలని కోరారు. వల్లూరిపాలెం రైతుల ఆందోళనపై సీఎం ఆరా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కృష్ణా జిల్లా వల్లూరిపాలెం రైతుల ఆందోళనపై కలెక్టర్తో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. రైతుల ఆందోళనకు అధికారుల నిర్లక్ష్యం కారణమైతే విచారించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచి్చన నూతన విధానాలను పక్కాగా అమలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, విశాఖ పర్యటనలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్కుమార్ ప్రసాద్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడి కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి పాల్గొన్నారు. -
మాయమాటలు చెప్పి తప్పించుకున్న నాదెండ్ల.. ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళన
-
రైతులకు ప్రభుత్వం సహకరించడం లేదు
గుడ్లవల్లేరు/పామర్రు/గూడూరు(పెడన)/గుడివాడ రూరల్: ధాన్యం కొనుగోళ్లపై సమస్యలు తెలుసుకునేందుకు గురువారం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కృష్ణాజిల్లాలోని పలు మండలాల్లో పర్యటించగా రైతులు సమస్యలను ఏకరవు పెట్టారు. తుపాను గండం నుంచి బయటపడాలని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళితే... అక్కడ గోనె సంచులు లేవని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, మిల్లర్లు తేమ శాతం ఎంత చెబితే... అంతమేరకు కట్ చేసి తమకు రావాల్సిన ధాన్యం సొమ్ములో కోత విధిస్తున్నారని గుడ్లవల్లేరు మండలంలోని రైతులు ఫిర్యాదు చేశారు. ఎంటీయూ 1262 రకం ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడం లేదని పామర్రు మండలంలోని కనుమూరు, కొండాయపాలెం, అడ్డాడ గ్రామాల్లోని రైతులు ఫిర్యాదు చేశారు. ధాన్యం విక్రయించడంలో తమకు ప్రభుత్వం సహకరించడం లేదని గూడూరు మండలం, తరకటూరు రైతులు మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీకి చెందిన మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాట్రగడ్డ కృష్ణ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో ప్రభుత్వం రైతులకు సహకరించడం లేదని, తాను కూడా బస్తా రూ.1400 చొప్పున మిల్లర్లకు విక్రయించాల్సి వచ్చిందని చెప్పారు.ప్రభుత్వం తరఫున రైతుల దగ్గరకు ఏ అధికారీ రాలేదని, తనతో పాటుగా ఇక్కడి రైతులంతా బస్తా రూ.1300 నుంచి రూ.1400కు దళారులకు అమ్ముకున్నట్టు తెలిపారు. మరో రైతు అయ్యప్ప మాట్లాడుతూ.. తనకు 20 ఎకరాల పొలం ఉందని, పంట కోశాక రైతు సేవా కేంద్రానికి తీసుకెళ్లినా ఫలితం లేదని, ఆర్ఎస్కేలో సాంకేతిక సిబ్బంది లేరంటూ పంట వెనక్కి పంపారని, గత్యంతరం లేక పది ఎకరాల్లోని పంట దళారులకు బస్తా రూ.1400 చొప్పున అమ్మినట్టు మంత్రికి వివరించారు. మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల దృష్ట్యా 40 రోజుల్లో చేపట్టాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను 4 రోజుల్లో చేపట్టేలా చర్యలు తీసుకున్నామని, 24 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా రైస్ మిల్లరను ఆదేశించినట్లు తెలిపారు. -
గత ప్రభుత్వంలోనే రైతులకు మేలు
కంకిపాడు: ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు జరిగింది. 75 కిలోల బస్తా రూ.1,600 ఉంటే రైతుకి రూ.1,550 వరకు గిట్టుబాటు అయ్యింది. ఇప్పుడు 75 కిలోల బస్తా రూ.1,720 ఉన్నా రైతుకి రూ.1,420కి మించి దక్కడం లేదు. గత ప్రభుత్వంలో 25 నుంచి 27 తేమ శాతం ఉన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొన్నారు. తుపాను భయంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. ఈ పరిస్థితిలో మేముంటే 22 శాతం లోపు తేమ ఉంటేనే కొంటామని ప్రభుత్వం చెప్పడం దారుణం. 1,262 విత్తనం ధాన్యాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకున్నాం. ఇప్పుడు మాత్రం నూక అవుతుందని అధికారులు సాకు చెబుతున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. మా పరిస్థితి ఏమిటి’ అని రైతులు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను నిలదీశారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం, అధికారులు తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కనీసం సమస్య అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు, కోలవెన్ను, దావులూరుల్లో మంగళవారం మంత్రి మనోహర్ పర్యటించారు. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశులు, సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలను పరిశీలించారు. పంట అమ్మకంలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంచులు, రవాణా వాహనాలు లేక ఎక్కడి ధాన్యం అక్కడే ఉంటుందని రైతులు వాపోయారు. కోలవెన్నులో మనోహర్ను రైతులు, కౌలు రైతులు చుట్టుముట్టారు. నాలుగు రోజులుగా ధాన్యం రాశులుగా పోసి ఉంచామని, తుపాను భయంతో కంటి మీద కునుకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంచులు, లారీలు కావాలని రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నామని.. రైతుగా పుట్టడమే తమ దౌర్భాగ్యం అంటూ ఆవేదన వెలిబుచ్చారు. రైతులకు నచ్చజెప్పిన మంత్రి మనోహర్ 48 గంటల్లో కల్లాలు, రోడ్లపైన పోసి ఉన్న ధాన్యాన్ని వేగంగా రైతులు కోరుకున్న మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సంచులు, లారీలు సమకూర్చాలని సూచించారు. జీపీఎస్తో సంబంధం లేకుండా ప్రైవేటు వాహనాలను అందుబాటులోకి తెచ్చి సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, రూ.1,100 కోట్లు రైతులకు అందించామన్నారు. -
21.73 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గత సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 20.6 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోలు చేయగా, ఈ వానాకాలం సీజన్కు సంబంధించి ఇప్పటికే 21.73 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాష్ట్ర పౌర సరపరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని ఇప్పటివరకు రూ.5,040.01 కోట్ల విలువైన వడ్లు కొనుగోలు చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నుంచి ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 8 వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. గతంలో కంటే 2,447 కేంద్రాలను అధికంగా ప్రారంభించామన్నారు. మొత్తం 16.06 ఎల్ఎంటీల దొడ్డు, 5.67 ఎల్ఎంటీల సన్నాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సన్నాలకు సంబంధించి రూ.283.25 కోట్ల బోనస్ ఇవ్వాల్సి ఉండగా.. రూ.8.17 కోట్లు చెల్లించామని తెలిపారు. చెల్లింపుల్లో గత ప్రభుత్వం కంటే ముందంజలో ఉన్నామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో వానాకాలం సీజన్లో రూ.2,414.23 కోట్లు చెల్లిస్తే.. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు తాము రూ.2,760.22 కోట్లు చెల్లించామన్నారు. రికార్డు స్థాయిలో దిగుబడి ఉమ్మడి ఏపీలో కూడా రాని దిగుబడి ఈ సారి తెలంగాణలో వచ్చిందని ఉత్తమ్చెప్పారు. 66.07 లక్షల ఎకరాల్లో 40 లక్షల మంది రైతులు 153 ఎల్ఎంటీల ధాన్యాన్ని పండించారని, ఇది భారతదేశంలోనే రికార్డు సృష్టిస్తుందని అన్నారు. కాళేశ్వరం కింద మూడు బరాజ్లు పని చేయకున్నా.. రికార్డు స్థాయిలో ఉత్పత్తి రావడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, జనవరి 10వ తేదీ వరకు కొనుగోళ్లు సాగుతాయని మంత్రి చెప్పారు. రైతులు తొందరపడి దళారులకు అమ్ముకోవద్దని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి మూడు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందన్నారు. ధాన్యం ఎప్పటికప్పుడు తరలించాలిఅధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం హుజూర్నగర్ రూరల్: కొనుగోలుకేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని వేపలసింగారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. యంత్రం ద్వారా ధాన్యం తేమను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతోందని, లారీలు సకా లంలో రావడం లేదని రైతులు చెప్పారు. దీంతో మంత్రి వెంటనే అధికారులతో మాట్లాడి రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
మాటల సీఎం.. చేతలు శూన్యం
సాక్షి, హైదరాబాద్/ సిద్దిపేటరూరల్: సీఎం రేవంత్రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కాని... చేతలు దాటడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం రాఘవాపూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులతో మాట్లాడి ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ . గొప్పలకు పోయిన రేవంత్రెడ్డి నేటికి పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటివి అందించలేదని, బోనస్ కాస్త బోగస్ చేసి రైతులను మోసం చేశాడన్నారు. మంత్రి ఉత్తమ్ రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని చెప్పారన్నారు. కానీ ఇప్పటికే 30 శాతం ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. చదువుకునేందుకు వెళితే ప్రాణాలు పోతున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు వెళుతున్న విద్యార్థుల ప్రాణాలు కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల్లో ‘విష పూరిత ఆహారం’ఘటనలు చోటు చేసుకోవడంపై బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటన మరువకముందే.. మరో ఘటన జరగటం దారుణమని పేర్కొన్నారు. మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు అస్వస్తతకు గురై ఆస్పత్రి పాలుకావడం బాధాకరమని చెప్పారు. విషపూరిత ఆహారం ఘటనలు పదేపదే జరుగుతున్నా.. ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని, గురుకుల విద్యాసంస్థల్లో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. -
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ రైతులకు ఇబ్బందులు ఎదురవకుండా సాఫీగా జరిగేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రాధాన్యతాంశంగా ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యం, రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడంపై సీఎం సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వార్తా కథనాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. కాగా ఉమ్మడి జిల్లాలకు గతంలో నియమించిన ప్రత్యేకాధికారులకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. రైతులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1న ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్ను ప్రత్యేక అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. జిల్లాల ప్రత్యేకాధికారులు వీరే: ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల : కృష్ణ ఆదిత్య కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల : ఆర్వీ కర్ణన్ నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట : అనితా రామచంద్రన్ నిజామాబాద్, కామారెడ్డి : డాక్టర్ ఎ.శరత్ రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి : డి.దివ్య మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ : ధరావత్ రవి వరంగల్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ : టి.వినయ కృష్ణారెడ్డి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట : హరిచందన దాసరి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం : కె.సురేంద్ర మోహన్ -
అన్నదాత ఆగమాగం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఏడాది ధాన్యం కొనుగోలు లక్ష్యం 4,16,600 మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటివరకు 2,20,7 98 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇప్పటికే తడిసిన ధాన్యం కొనుగోలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సహనం నశించి వారం రోజులుగా భువనగిరి జిల్లాలో అక్కడక్కడ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తుతోంది. పొరుగున ఉన్న నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో «కొనుగోళ్లు పూర్తి కావొస్తున్నా ఇక్కడ మాత్రం ఇంకా ఆలస్యమవుతున్నాయి. మిల్లుల్లో జాగా లేదని... ఖాళీ స్థలం లేదని చెప్పి మిల్లర్లు ధాన్యం లారీలను మిల్లుల్లో అన్లోడింగ్ చేసుకోవడం లేదు. 2022–23 యాసంగి, వానాకాలం, 2024 యాసంగి సీఎంఆర్ 3.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంతోపాటు, ప్రభుత్వం ఈ సంవత్సరం టెండర్లతో విక్రయించిన 1.30 లక్షల «మెట్రిక్ టన్నులు మిల్లుల్లోనే ఉన్నాయి. వాస్తవానికి ఈనెల 23వ తేదీలోగా మిల్లుల్లో నుంచి ధాన్యాన్ని కాంట్రాక్టర్ ఖాళీ చేయాలి. ఇంతవరకు ఒక్క క్వింటా ధాన్యం కూడా బయటకెళ్లలేదు. దీంతో ప్రైవేట్కు కొందరు రైతులు అమ్ముకున్నారు. అయినా ఇంకా జిల్లాలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం జిల్లవ్యాప్తగా ఆయా మిల్లుల్లో 5.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంది. రోడ్డెక్కుతున్న రైతులు ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం బీబీనగర్ మండలం గూడూరులో హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ధాన్యం బస్తాలు తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కొనుగోలు కేంద్రానికి 120 మంది రైతులు ధాన్యం తీసుకొచ్చారు.8 రోజుల క్రితం 40 మంది రైతుల ధాన్యం కాంటా వేసి మిల్లులకు పంపించారు. అక్కడ ఇంకా దిగుమతి కాలేదు. ఇంకా 30 వేల బస్తాల ధాన్యం కాంటా వేసి ఉంచారు. ఇంకా 60 మంది రైతులు కాంటా కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో కడుపు మండిన రైతులు రాస్తారోకోకు దిగారు. రెండు గంటల పాటు రైతులు రహదారిపై బైఠాయించడంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ∙భువనగిరి మండలం ఆకుతోటబావికి చెందిన రైతులు తడిసి మొలకెత్తిన ధాన్యంతో మంగళవారం కలెక్టరేట్ ఎదు ట ధర్నాకు దిగారు. ∙అడ్డగూడూరు మండలం చౌళ్లరామా రం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతులు జాతీయ రహదారిపై ధాన్యం పోసి నిరసన తెలిపారు. ∙పోలింగ్ రోజు భూ దాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ రైతులు తడిసిన ధా న్యం కొనుగోలు చేస్తేనే ఓట్లు వేస్తామని ఆందోళనకు దిగా రు. ∙ఆలేరు మండలం కొలనుపాకలో ధర్నా చేశారు. ఆయా జిల్లాల్లో ఇలా ∙సంగారెడ్డి జిల్లాలో 1.80 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ కాగా, ఇప్పటివరకు 63,400 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. చాలా కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతో ప్రతి 40 కిలోల బస్తాకు రెండున్నర కిలోలు కోత విధిస్తున్నారు. ఇది చాలదన్నట్టు తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వచ్చే లారీల సిబ్బంది రైతుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ. రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా లో ఈనెల 12న గాలివాన భీభత్సం సృష్టించడంతో కొనుగో లు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. వడ్ల గింజలు చా లా వరకు వరదలో కొట్టుకుపోయాయి. తడిసిన ధాన్యాన్ని రైతులు కల్లాలు, రోడ్లపై ఆరబోసుకుంటున్నారు. తడిసిన ధాన్యాన్ని కేంద్రాల్లో కొనుగోలు చేయకపోవడంతో రైతులు అందోళనలో ఉన్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా తడిసిన ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. 1.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 76,437 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించకపోవడం, మిల్లులకు వెళ్లిన లారీలు రోజుల తరబడి అక్కడే ఉండడం, అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారు. తాలు, తప్ప ఉందని తిరకాసుతో బస్తాకు మూడు నాలుగు కిలోల చొప్పున తరుగు తీస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెలరోజులు అవుతోందికొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు అవుతోంది. వెంట వెంటనే కాంటాలు వేయడం లేదు. వారం రోజుల క్రితం 3 వేల బస్తాలు కాంటా వేసినా మిల్లుకు తరలించలేదు. దీంతో వానకు తడిసి ఎండకు ఎండిపోయాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగుతున్నాం. – మాధవరెడ్డి, గూడూరు కొనుగోలు వేగవంతం చేస్తాం కొనుగోళ్లు వేగవంతం చేస్తాం. మిల్లుల్లో వడ్లు దించుకోవడానికి స్థలం లేనందున జాప్యం జరుగుతోంది. టెండర్ ధాన్యం, సీఎంఆర్ ధాన్యం ఇంకా మిల్లుల్లో ఉంది అయితే జనగామ, హనుమకొండలకు 20 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపించడానికి చర్యలు తీసుకున్నాం. – గోపీకృష్ణ, యాదాద్రి భువనగిరి జిల్లా పౌరసరఫరాల అధికారి -
రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు..
సాక్షి, హైదరాబాద్: రైతులను మోసం చేసే మిల్లర్లు, వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారి నైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రైతు లను గోల్మాల్ చేసే మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్లిస్ట్లో పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, తాగు నీటి సరఫరాపై.. శుక్రవారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధర పొందాలి కొన్ని ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్న ట్టుగా తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల రైతు లు ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆర బెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి ధాన్యాన్ని మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని, ఒకట్రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధరపొందా లన్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు యార్డుల్లోనే ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ధాన్యం దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లను అధికారులు పర్యవేక్షించాలి ‘అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని మార్కె ట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలి. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రి యను రాష్ట్ర స్థాయిలో సీఎస్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఏరోజు కారోజు పర్యవేక్షించాలి. తాగునీటి సరఫరాపై ఉమ్మడి జిల్లాల వారీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు, ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలి. అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలి. ఎన్నికల సమయం కావటంతో కొన్నిచోట్ల రాజకీయ లబ్ధి కోసం, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు, ఉద్దేశ పూర్వక కథనాలు వస్తున్నాయి. అటువంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలి..’ అని సీఎం సూచించారు. వచ్చే రెండు నెలలు కీలకం ‘రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదు. భూగర్భ జల మట్టం పడి పోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయినప్పటికీ తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండు నెలలు కీలకం. ఫిర్యాదు వచ్చిన వెంటనే తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ఏ రోజుకారోజు సీఎస్ సారథ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలి. జిల్లాలకు ఇన్చార్జిలుగా నియమితులైన సీనియర్ ఐఏఎస్లు తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలకు వెళ్లి పరిశీలించాలి. జీహెచ్ఎంసీ పరిధిలో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా, డిమాండ్ మరింత పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. అవసరమైతే నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్కు తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. సింగూరు నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలి. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి..’ అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేవారిపై చర్యలు హైదరాబాద్లో ఇటీవల సిబ్బంది అత్యుత్సాహంతో ఒకచోట తాగునీటి సరఫరా నిలిచిపోయిన అంశం దృష్టికి రాగా సీఎం వెంటనే స్పందించారు. విచారణ జరిపించి ఉద్దేశ పూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అటువంటి ఉద్యోగులపై ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ధాన్యం..దళారుల దోపిడీ
సాక్షి, హైదరాబాద్: వరికోతలు మొదలైనా, ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దీంతో రైతులు దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో వరికోతలు పదిహేను రోజుల క్రితమే మొదలు కాగా, ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కూడా కోతలు మొదలయ్యాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని గ్రామాల రైతులు కోసిన పచ్చి ధాన్యాన్నే నేరుగా మిల్లులకు తీసుకొని వెళ్లి, వారిచ్చిన ధరకు అమ్ముకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని మండలాల్లో రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం రైతులు దళారులనే నమ్ముకుంటున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్ధిపేట జిల్లాల్లో కూడా కోతలు షురూ అయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్లో 4.16 లక్షల ఎకరాల్లో వరిసాగు ఉమ్మడినిజామాబాద్ జిల్లాలో యాసంగి సీజన్లో 4.16లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. 11.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక అవసరాలకు నాణ్యమైన ధాన్యం రైస్మిల్లర్లు కొనుగోలు చేయగా, మిగతా 6 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే వర్ని, రుద్రూర్, మోస్రా, చందూర్, సిరికొండ, మోపాల్, ధర్పల్లి, డిచ్పల్లి, చాలా మండలాల్లో కోతలు ముమ్మరం అయ్యాయి. మిల్లర్లు, వ్యాపారులు సన్నరకం ధాన్యాన్ని క్వింటాల్కు రూ.1,900 నుంచి రూ.2,300 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్లోని నాణ్యమైన ధాన్యాన్ని నల్లగొండ, మిర్యాలగూడ, ఏపీకి చెందిన మిల్లర్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. పది రోజుల క్రితం క్వింటాలు ధాన్యానికి రూ. 2,500 ధర చెల్లించిన దళారులు ఇప్పుడు రూ.1,900 కే కొంటున్నారు. మిర్యాలగూడలోని 75 మిల్లులకు ధాన్యం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మిర్యాలగూడ రైస్ మిల్లులకు «ధాన్యం భారీగా వస్తోంది. మిర్యాలగూడలోని 87 రైస్మిల్లులు ఉండగా, ప్రస్తుతం 75 మిల్లుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. ఇటీవల మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లకు ఆంక్షలు విధించగా, మంత్రి కోమటిరెడ్డి మిల్లుకు వచ్చిన ప్రతిరైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే తొలుత వ్యాపారులు మొదట క్వింటాల్కు రూ.2600 నుంచి రూ.2700 వరకు చెల్లించగా, ధాన్యం రాక పెరగడంతో వ్యాపారులు ధర తగ్గించారు. పెరిగిన ఎండల ధాటికి ట్రాక్టర్లతో ధాన్యం తెచ్చిన రైతుల నుంచి కొనుగోలు చేయకుండా సాయంత్రం వరకు వేచి ఉండేలా చేసి క్వింటాల్కు రూ.2100 నుంచి రూ.2,400 వరకు మాత్రమే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మెట్రిక్ టçన్నుల ధాన్యం కొనుగోలు చేశామ మిల్లర్లు చెబుతున్నారు. ప్రతి ఏడాది 4 నుంచి 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, ఈసారి పంట దిగుబడి ఆశించినంత రాకపోవడంతో 3లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినట్టు చెబుతున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ కొనుగోళ్లు యాసంగి సీజన్కు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7,149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 75.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేస్తే దళారుల బాధ తగ్గేదని, మిల్లర్ల ఇష్టారాజ్యానికి చెక్ పడేదని రైతులు అంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ‘ఏ’ గ్రేడ్ రకానికి రూ.2,203, ‘బి’ గ్రేడ్ కు రూ. 2,183 ధర వస్తుందని, మిల్లర్లు, దళారుల వల్ల కనీస మద్దతు ధర కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. దళారులు తరుగు తీస్తున్నారనే ఆరోపణలున్నాయి. ధాన్యానికి డబ్బులు చెల్లించేటప్పుడు లక్ష రూపాయలకు రూ.1,000 చొప్పున కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అన్నదాతల్లో ఆనందం
సాక్షి, అమరావతి: ఎంతో శ్రమించి పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజులోనే చెల్లింపులు జరపడంతో అన్నదాతల ఇళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికి గానూ వైఎస్ జగన్ ప్రభుత్వం మంగళవారం రూ.815 కోట్లు చెల్లించింది. దీంతో ఖరీఫ్లో సేకరించిన రూ.6,541.23 కోట్ల విలువైన ధాన్యానికి రూ.6,514.59 కోట్లు చెల్లించినట్లయ్యింది. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన మిగిలిన స్వల్ప మొత్తాన్ని కూడా పౌరసరఫరాల సంస్థ డీఎం అనుమతి రాగానే రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం షెడ్యూల్ చేసింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దళారులు, మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను రక్షిస్తూ ఆర్బీకే స్థాయిలోనే సంపూర్ణ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేస్తోంది. ఖరీఫ్ సీజన్లో 29.93 లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి.. 4.96 లక్షల మంది రైతులకు మద్దతు ధరను అందించింది. ఇలా ఈ ఐదేళ్లలో ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించింది. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తోంది. పెరిగిన ధాన్యం సేకరణ.. గత చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏడాదికి సగటున 56 లక్షల టన్నులు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. అదే సగటు ప్రస్తుత ప్రభుత్వంలో 77 లక్షల టన్నులుగా ఉంది. దీనికి తోడు ఆర్బీకే పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారి కల్లాల వద్దనే ధాన్యం సేకరణ చేపట్టింది. ఆర్బీకేల్లో.. ధాన్యం సేకరణకు అవసరమైన శాశ్వత ఏర్పాట్లు చేసింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా.. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే సీఎం జగన్ ప్రభుత్వంలో అదనంగా దాదాపు 20 లక్షల మంది రైతులకు సంపూర్ణ మద్దతు ధర దక్కింది. తడిచిన ధాన్యమూ కొనుగోలు.. అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా జయ రకం(బొండాలు/దుడ్డు బియ్యం) ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో జయ రకం పండించే రైతులు చాలా లాభపడ్డారు. ప్రకృతి విపత్తులు, అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని తెచ్చిన రైతులకు సైతం అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కనపెట్టి తడిచిన ధాన్యాన్ని ఆఫ్లైన్లో సేకరించి మరీ రైతులకు మద్దతు ధర అందించడంలో రికార్డు నెలకొల్పింది. ఆఫ్లైన్లో సేకరించిన ధాన్యాన్ని దూరాభారాలు చూడకుండా డ్రయ్యర్ సౌకర్యం, డ్రయ్యర్ ప్లాట్ఫాం ఉన్న మిల్లులకు తరలించి ఆరబోసి మరీ కొనుగోలు చేసింది. జగన్ ప్రభుత్వం అదనపు భారాన్నైనా మోసింది గానీ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చర్యలు చేపట్టింది. బాబు హయాంలో బకాయిలు.. చంద్రబాబు హయాంలో రైతులు ధాన్యం డబ్బుల కోసం అహోరాత్రులు ఎదురు చూడాల్సి వచ్చేది. రైతులు తాము కష్టపడి పండించిన పంటను ప్రభుత్వంపై నమ్మకంతో విక్రయిస్తే.. వారికి చెల్లించాల్సిన డబ్బులను సైతం చంద్రబాబు పక్కదారి పట్టించారు. ఇలా 2019 ఎన్నికలకు ముందు పౌరసరఫరాల సంస్థకు చెందిన రూ.4,838.03 కోట్లను వేరే కార్యక్రమాలకు మళ్లించి రైతులను నట్టేట ముంచారు. చివరకు సీఎం పదవి నుంచి దిగిపోతూ రూ.960 కోట్లు చెల్లించకుండా రైతులను మోసం చేశారు. సీఎం జగన్ వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వంలోని బకాయిలను కూడా తీర్చి.. పారదర్శక ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకొచ్చారు. అదనంగా టన్నుకు రూ.2,523 గత ప్రభుత్వం పేరుకే ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. వారంతా రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ–క్రాప్ డేటా ఆధారంగా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరిస్తోంది. దీంతో మిల్లర్లు, దళారుల దందాకు చెక్పడింది. అలాగే రైతులపై ఆర్థిక భారం తగ్గించడంలో భాగంగా ప్రతి టన్ను ధాన్యం కొనుగోలులో రవాణా, హమాలీ, గోనె సంచుల వినియోగం నిమిత్తం రైతులకు రూ.2,523 అందిస్తోంది. గతంలో రైతులే సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే.. వాటిని ప్రభుత్వ వాహనాల్లో తరలించినట్టు రికార్డుల్లో నమోదు చేసి టీడీపీ నాయకులే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా మింగేశారు. -
దండిగా ధాన్యం.. నిండుగా నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం రైతులకు బాసటగా నిలుస్తోంది. ధాన్యం కొనుగోలులో సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు.. దేశంలోనే తొలిసారిగా రైతులకు గన్నీ, హమాలీ, రవాణా (జీఎల్టి) చార్జీల కింద టన్నుకు రూ.2523 అదనంగా చెల్లిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఖరీఫ్ 2023–24లో 4.97లక్షల మంది రైతుల నుంచి రూ.6,538 కోట్ల విలువైన 29.91లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. వీటిల్లో 4.36లక్షల మంది రైతులకు రూ.5700 కోట్ల మద్దతు ధర చెల్లించింది. మిగిలిన 61 వేల మంది రైతులకు రూ.838 కోట్లు అందించేందుకు వీలుగా నిధులను సమీకరించింది. ఆర్బీకేల్లో షెడ్యూల్ చేసిన వివరాల ప్రకారం వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో మద్దతు ధర మొత్తాన్ని జమ చేయనుంది. తద్వారా ఖరీఫ్ కొనుగోళ్లలో సంపూర్ణ చెల్లింపులను చేయనుంది. ఇక రబీ సేకరణకు సమాయత్తం ఖరీఫ్ ధాన్యం సేకరణ పూర్తవడంతో ఏప్రిల్ మొదటి వారం నుంచి రబీ కొనుగోళ్లకు పౌరసరఫరాల సంస్థ సమాయత్తం అవుతోంది. రబీ సీజన్లో 25లక్షల టన్నులకుపైగా ధాన్యం వస్తుందని అంచనా వేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా గోనె సంచులు, హమాలీలు, రవాణా సదుపాయాలను కల్పించేలా క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. గోదావరి జిల్లాల్లో రబీలో సాగు చేసే జయరకం (దుడ్డు బియ్యం)ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు సేకరించనుంది. గతేడాది జయ రకం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించగా కేవలం 90వేల టన్నులు మాత్రమే వచ్చి ంది. ఈసారి 3లక్షల టన్నులు సేకరించేలా ప్రణాళిక రూపొందించింది. అయితే జయరకం ధాన్యాన్ని ప్రభుత్వం స్వయంగా మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండటం రైతులకు లాభసాటిగా మారింది. ఈ రకం ధాన్యం వినియోగం స్థానికంగా చాలా తక్కువ. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో దుడ్డు బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకునే పరిస్థితి లేకపోవడంతో గతంలో ప్రైవేటు వ్యాపారులు ఇచ్చి న రేటు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వ జోక్యంతో ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి దుడ్డు బియ్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 37.68 లక్షల మంది రైతులకు మద్దతు టీడీపీ ఐదేళ్లలో కేవలం 17.94లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. కానీ, సీఎం జగన్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం విశేషం. అంటే టీడీపీ హయాంలో కంటే 20లక్షల మంది రైతులకు అదనంగా సీఎం జగన్ ప్రభుత్వం మద్దతు ధర అందించింది. మొబైల్ బృందాలతో పరిశీలన.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. దళారీ, మిల్లర్ల వ్యవస్థకు చెక్పెడుతూ ఆర్బీకేల కేంద్రంగా ఈ–క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం సేకరణ చేసి వాస్తవ రైతుకు సంపూర్ణ మద్దతు ధరను అందిచే పటిష్ట వ్యవస్థను తీసుకొచ్చారు. క్షేత్ర స్థాయికి ఆర్బీకే అసిస్టెంట్ వెళ్లి నాణ్యతను పరిశీలించడం, ఆన్లైన్లో ధాన్యం రైతు వివరాలు నమోదు, ట్రక్ షీట్ జనరేట్, చివరికి ధాన్యం తరలించాల్సిన మిల్లును కూడా ఆటోమేటిగ్గా ఎంపిక చేసే సాంకేతిక విధానాన్ని తీసుకొచ్చారు. లోడు పక్కదారి పట్టకుండా రవాణా వాహనాలకు జీపీఎస్ను సైతం అమర్చారు. మిల్లుల్లో ధాన్యం నాణ్యత సమస్యలను రైతులతో సంబంధం లేకుండా పరిష్కరించేందుకు కస్టోడియన్ అధికారులను నియమించారు. ప్రస్తుతం ఎన్నికల సమయం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే మండలానికి ఒక ప్రత్యేక మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేసి ధాన్యం రైతుల సమస్యలను పరిష్కరించేలా దృష్టి సారించారు. ప్రభుత్వ కాల్సెంటర్కు వచ్చిన ఫిర్యాదులతో పాటు స్థానికంగా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించనున్నారు. దిగుబడిలో 60 శాతం కొనుగోలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా బీపీటీ, నెల్లూరు, స్వర్ణ రకాలను పండిస్తున్నారు. వీటికి జాతీయ, అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంటుంది. ఇవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు కాకుండా బయటకు వెళ్లిపోతాయి. మిగిలిన రకాల ధాన్యా న్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఇలా.. ఏపీలో ధాన్యం దిగుబడుల్లో రైతుల అవసరాలకు నిల్వ చేసిన తర్వాత 60 శాతం పైగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. బాబు హయాంలో బకాయిలే! గతంలో రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, మిల్లర్లకు దోచిపెట్టేవారు. పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యక్షంగా రైతులు నష్టపోయేవారు. పైగా అప్పటి ఎన్నికల ముందు రైతులకు చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల ధాన్యం డబ్బులను చంద్రబాబు ప్రచార పథకాలకు మళ్లించడంతో సమయానికి డబ్బులు అందక రైతులు అల్లాడిపోయారు. చివరికి చంద్రబాబు దిగిపోతూ ఇంకా రూ.960 కోట్లు బకాయిలు పెట్టారు. వీటిని కూడా సీఎం జగన్ ప్రభుత్వమే చెల్లించింది. -
యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: ‘మిచాంగ్’ తుపాను హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులకు ఇబ్బంది లేకుండా యుద్ధప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి తక్షణమే తరలించేలా ఏర్పాట్లు చేసింది. నూర్పిడులు చేసి ఆరబోతకు వచ్చిన ప్రతి ధాన్యం గింజను శరవేగంగా కొనుగోలు చేయనుంది. తుపాను ప్రభావంతో కొద్దిరోజులు ఆన్లైన్ విధానానికి బదులుగా ఆఫ్లైన్లో ప్రత్యేక ఎంట్రీల ద్వారా ధాన్యాన్ని సేకరించేందుకు నిర్ణయించింది. తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సుమారు 2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేస్తోంది. దీనికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో అవసరమైన గోనె సంచులు, రవాణా వాహనాలు, సిబ్బందిని సమకూరుస్తోంది. గంటల్లోనే సేకరణ తుపాను ముప్పు పొంచి ఉండటంతో వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ను తప్పించి, ఆఫ్లైన్లో ధాన్యం ఉత్పత్తుల కొనుగోలుకు వెసులుబాటు కల్పించాలని కోరుతూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ప్రతిస్పందన వచ్చేలోగా రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముందస్తు ఆఫ్లైన్ సేకరణకు వెళ్తోంది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ ధాన్యాన్ని సేకరించి సమీపంలోని మిల్లులకు తరలించనుంది. తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యాన్ని సైతం సేకరించి డ్రయర్ సౌకర్యం కలిగిన మిల్లులకు రవాణా చేయనుంది. సదరు జిల్లాల్లోని మిల్లుల్లో డ్రయర్లు లేకుంటే ఆ ధాన్యాన్ని పొరుగు జిల్లాలకు పంపించనుంది. అందుకయ్యే అదనపు రవాణా ఖర్చులను సైతం ప్రభుత్వమే భరించనుంది. అయితే.. నెల్లూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనే ఎక్కువ డ్రయర్ సౌకర్యం మిల్లులున్నాయి. క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి అక్కడి నుంచి డ్రయర్ మిల్లులకు తరలించేలోగా వర్షాలు పడితే ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలోనే పౌర సరఫరాల సంస్థ తొలుత రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుని వ్యవసాయ మార్కెట్ యార్డులు, గోడౌన్లు అనుబంధంగా ఉన్న మిల్లుల్లో స్టోర్ చేయనుంది. ప్రస్తుతం ఏడు జిల్లాల్లో సగటున ఒక్కోచోట 30వేల టన్నుల ధాన్యం ఆరబోత, లోడింగ్ దశల్లో ఉంది. రానున్న 24–36 గంటల్లోగా ఈ మొత్తం ధాన్యం తరలింపు ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇప్పటివరకు 4.66 లక్షల టన్నుల సేకరణ ఇప్పటివరకు 67,837 మంది రైతుల నుంచి రూ.1,017.77 కోట్ల విలువైన 4.66 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రవాణా, కూలి, గోనె సంచుల ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో రైతులపై ఆర్థిక భారం తగ్గింది. దీంతో రైతులెవరూ ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించట్లేదు. దీనిని గమనించిన వ్యాపారులు తేమ శాతంతో సంబంధం లేకుండా మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. రైతులు ఆందోళన చెందొద్దు రైతులెవరూ అధైర్యపడొద్దు. వీలైనంత వేగంగా ఆఫ్లైన్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ధాన్యాన్ని బస్తాల్లో నింపి వాహనంలో లోడింగ్ చేసి ట్రాక్ïÙట్ జనరేట్ చేసిన తర్వాత సమీపంలోని మిల్లులకు తరలించేలా సిబ్బందికి ఆదేశాలిచ్చాం. సోమవారం నాటికి అందుబాటులోని మొత్తం ధాన్యం సేకరించేలా సమాయత్తం అవుతున్నాం. ఆలస్యమైతే వర్షాలు కురిసి ధాన్యం తడిసి రంగు మారే ప్రమాదం ఉంది. మరోవైపు ఎఫ్టీవోలో చూపించిన మద్దతు ధర మొత్తం రైతుల ఖాతాల్లో తప్పకుండా జమవుతుంది. ఎవరూ కూడా మిల్లులకు వెళ్లాల్సిన అవసరం లేదు. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ రోడ్లపై ధాన్యాన్ని వదిలేయొద్దు ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లు, జేసీలు, పౌరసరఫరాల సంస్థ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రైతులెవరూ కోసిన ధాన్యాన్ని పట్టాలు కప్పి రోడ్లపై ఉంచొద్దు. వెంటనే ఆర్బీకేలోని ధాన్యం సేకరణ కేంద్రాలకు అప్పగించాలి. – వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ -
ధాన్యం విక్రయ టెండర్లు రద్దు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైస్మిల్లుల్లో మూలుగుతున్న గత యాసంగి నాటి ధాన్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల సంస్థ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన 10 సంస్థలు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను దక్కించుకున్నాయి. కానీ సగటున క్వింటాల్కు రూ.375 నష్టానికి బిడ్లు ఆమోదం పొందడం, ప్రభుత్వానికి వెయ్యి కోట్ల మేర నష్టం వచ్చే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ధాన్యం టెండర్లపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ టెండర్ల వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేసింది. ఈ క్రమంలో సమాలోచనలు జరిపిన ప్రభుత్వ పెద్దలు.. ఈ టెండర్లను రద్దు చేసి, కొత్తగా బిడ్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈసారి కనీస ధరను కోట్ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం మద్దతు ధరతో సేకరణ రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో పౌర సరఫరాల సంస్థ ద్వారా రూ.2,060 మద్దతు ధరతో 66.85 లక్షల టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ ధాన్యాన్ని యథావిధిగా మిల్లులకు తరలించింది. దాన్ని సీఎంఆర్ కింద ముడిబియ్యంగా మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం కోరినా.. అలా చేస్తే నూకల శాతం ఎక్కువై నష్టం వస్తుందని రైస్మిల్లులు తేల్చి చెప్పాయి. దీంతో సుమారు 9 నెలలుగా మిల్లుల్లో మూలుగుతున్న ఈ ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్న ధరకన్నా తక్కువకు.. 25 ఎల్ఎంటీ ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి టెండర్లు పిలిస్తే 11 సంస్థలు ముందుకురాగా.. ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచిన తరువాత గురునానక్ అనే సంస్థ తిరస్కరణకు గురైంది. మిగతా 10 సంస్థలకు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను కేటాయించారు. ఈ పది సంస్థలు 25 లాట్లను క్వింటాల్కు కనిష్టంగా రూ.1,618 నుంచి గరిష్టంగా రూ.1,732 ధరతో దక్కించుకున్నాయి. సగటున చూస్తే క్వింటాల్ ధర రూ.1,685 మాత్రమే అవుతోంది. ప్రభుత్వం కొన్నధర రూ.2,060తో పోలిస్తే క్వింటాల్కు రూ.375 చొప్పున తక్కువ వస్తుంది. మొత్తంగా రూ.925 కోట్ల నష్టమని అంచనా వేశారు. ఇక సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, కమీషన్లు, మిల్లులకు ధాన్యం రవాణా తదితర ఖర్చులన్నీ కలిపితే క్వింటాల్ ధాన్యానికి మరో రూ.100కుపైగా సర్కారు వెచ్చించింది. ఈ ఖర్చునూ కలిపితే.. మొత్తంగా 25 లక్షల టన్నుల ధాన్యం విక్రయంపై రూ.1,200 కోట్లవరకు నష్టం వస్తుందని లెక్కతేలింది. భారీ నష్టం నేపథ్యంలో ప్రస్తుత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
ధాన్యం కొనుగోలుకు 54 టెండర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లుల్లో మూలుగుతున్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంచి స్పందన లభించింది. తొలి విడతగా 25 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని విక్రయించాలని భావించిన పౌరసరఫరాల సంస్థ ఈ మేరకు గత నెలలో టెండర్లను ఆహ్వనించింది. 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి , ప్రతి ఎల్ఎంటీ ఒక లాట్గా ఆన్లైన్లో బిడ్స్ ఆహ్వనించింది. గురువారంతో గడువు ముగియగా, సాయంత్రం 5 గంటలకు అధికారులు టెక్నికల్ బిడ్లు తెరిచారు. 25 లాట్ల కోసం మొత్తం 54 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో 8 లాట్లకు సంబంధించి కేవలం ఒక్కో బిడ్ మాత్రమే దాఖలైనట్లు విశ్వసనీయ సమాచారం. మిగతా 17 లాట్ల కోసం 46 సంస్థలు పోటీ పడ్డాయి. యాసంగిలో 66.85 ఎల్ఎంటీల ధాన్యం సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా గత యాసంగి (2022–23)లో 66.85 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించారు. ఈ మొత్తం ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేయగా, అందులో కొంత భాగం అకాల వర్షాల కారణంగా తడిచిపోయింది. తడిచిన ధాన్యంతో పాటు మిగతా ధాన్యాన్ని కూడా ముడి బియ్యంగా మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు నిరాకరించారు. బాయిల్డ్ రైస్గా మాత్రమే ఇస్తామని చెప్పినా, కేంద్రం నిబంధనలతో అది సాధ్యం కాలేదు. దీంతో మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఏక మొత్తంగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. పౌరసరఫరాల సంస్థ సీఎండీ అనిల్కుమార్ ఈ మేరకు నివేదిక రూపొందించగా, తొలి విడత 25 ఎల్ఎంటీలు విక్రయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గత నెలలో ప్రక్రియ ప్రారంభం అయింది. గురువారం గడువు ముగిసే సమయానికి 54 టెక్నికల్ బిడ్లను ధ్రువీకరించారు. ఈ సంస్థల పూర్వాపరాలు పరిశీలించి, అర్హత పొందిన వాటిని ఫైనాన్షియల్ బిడ్లకు ఎంపిక చేస్తారు. ఈనెల 16న ఫైనాన్షియల్ బిడ్లను తెరిచిన అనంతరం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అర్హులైన సంస్థలను ఎంపిక చేయనుంది. -
రైతు దినోత్సవం రసాభాస!
సాక్షి నెట్వర్క్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం చేపట్టిన రైతు దినోత్సవ కార్యక్రమం పలుచోట్ల రసాభాసగా మా రింది. ధాన్యం కొనుగోళ్లు సరిగా చేపట్టక ఇబ్బందుల పాలయ్యామని.. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన వారికి ఇస్తామన్న పరిహారం ఏమైపోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా రైతు దినోత్సవ కార్యక్రమాల వద్ద నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని.. రూ.లక్ష రుణమాఫీ చేయలేదేమని నిలదీశారు. రైతు వేదికపై వడ్లు కుమ్మరించి.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో రైతువేదికపై భిక్షపతి అనే రైతు మొలకెత్తిన వడ్లను కుమ్మరించి నిరసన వ్యక్తం చేశారు. తన ధాన్యాన్ని సమీపంలోని సర్దార్నగర్ మార్కెట్కు తీసుకెళ్లినా.. కొనుగోలు కేంద్రం తెరుచుకోలేదని, వ్యాపారులు తక్కువ ధరకు అడిగారని వాపోయారు. మరికొందరు రైతులు కూడా అకాల వర్షాలకు పంట నష్టం, పరిహారం అందని తీరు, కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలపై నిలదీశారు. మంత్రి క్యాంపు ఆఫీసు ఎదుట ధాన్యం పోసి.. తేమ, తాలు పేరిట ఇటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అటు మిల్లర్లు దోచుకుంటున్నారన్న ఆవేదనతో జగిత్యాల జిల్లా కమలాపూర్కు చెందిన రైతు సట్టంశెట్టి రాజన్న ధర్మపురిలోని మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాలయం ఎదుట ధాన్యం కుప్పపోసి నిరసన తెలిపాడు. రైతులకు ఏం చేశారని సంబురాలు? యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లి రైతు వేదిక వద్ద కాంగ్రెస్ నేతలు, రైతులు రైతు దినోత్సవ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా, రైతు రుణమాఫీ పూర్తి చేయకుండా.. ఏం చేశారని రైతు సంబరాలు జరుపుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగాయి. ఎంపీ కవితను నిలదీసిన రైతులు మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండలో రైతు దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కవితను పలువురు రైతులు ధాన్యం కొనుగోళ్లపై నిలదీశారు. ఎంపీ ప్రసంగిస్తుండగా లేచి.. కొనుగోళ్లు సరిగా జరగడం లేదని, కొన్నా లారీలు రాక బస్తాలు కేంద్రాల్లోనే ఉండిపోతున్నాయని.. వానలకు తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసేదెప్పుడు? ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డిని రుణమాఫీపై రైతులు నిలదీశారు. ‘రైతుబంధు వస్తోంది కదా..’అని ఎమ్మెల్యే పేర్కొనగా రుణాలపై తాము కట్టే వడ్డీకే ఆ డబ్బులు సరిపోవడం లేదని రైతులు మండిపడ్డారు. ధాన్యం కొ నుగోళ్లలో అక్రమాలనూ ప్రస్తావించారు. దీనితో ఎ మ్మెల్యే అసహనంతో వెళ్లిపోయారు. కార్యక్రమాలను బహిష్కరించి నిరసన ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం, పంట నష్టపరిహారం అందకపోవడానికి నిరసనగా సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల రైతులు నిరసనలు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో సభను బహిష్కరించగా, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో రైతువేదికకు తాళం వేశారు. చందుర్తి మండల వ్యాప్తంగా రైతు సభలను బహిష్కరించారు. నష్టపరిహారం అందేదెప్పుడు? వరంగల్ తూర్పుకోటలో జరిగిన కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ప్రసంగిస్తుండగా.. రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంటనష్టంపై పరిహారం ఏదంటూ నిలదీశారు. రైతుబంధు రావట్లేదా? సిగ్గు లేదా? రైతుపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి ఆగ్రహం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని అబాది జమ్మికుంట రైతు దినోత్సవ కార్యక్రమంలో ఓ రైతుపై ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపరిహారం ఇస్తామని మూడు నెలలైనా.. ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని బుర్ర కుమార్ అనే రైతు ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు రెండు కిలోలు కోత పెడుతున్నారని పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన కౌశిక్రెడ్డి.. ‘నీకు రైతుబంధు రావడం లేదా? నీకు సిగ్గు, శరం లేదా?’అంటూ తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. -
ఆర్బీకే అనేది క్షేత్రస్థాయి వ్యవస్థ: కురసాల కన్నబాబు
సాక్షి, కాకినాడ: ఏపీలో ధాన్యం కొనుగోళ్లు, ఆర్బీకేపై ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖరీఫ్లో రూ.7,233 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు కన్నబాబు. కాగా, ఎమ్మెల్యే కన్నబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్బీకే అనేది క్షేత్రస్థాయి వ్యవస్థ. ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందుతున్నాయి. రాష్ట్రంలో 6.45లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. ఖరీఫ్లో రూ.7,233 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 99 శాతం చెల్లింపులు జరిగాయి. రైతులు ఇబ్బంది పడకూడదనే వెంటనే చెల్లింపులు చేశాం అని తెలిపారు. ఇది కూడా చదవండి: భారత్ సహా పలు దేశాల నుంచి బ్రిటన్ ఎత్తుకెళ్లిన వస్తువులు.. సంపద ఎంతంటే? -
చంద్రబాబువన్నీ డ్రామాలే..
సాక్షి, అమరావతి/ఏలూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు సీరియస్ కామెంట్స్ చేశారు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి కారుమూరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షం కారణంగా రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందులో భాగంగానే మేము ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు విధాలుగా ధాన్యం సేకరిస్తున్నాం. చంద్రబాబు తణుకులో అడుగుపెట్టడంతో భారీ వర్షం పడింది. చంద్రబాబు పర్యటనలో కార్యకర్తలే తప్ప రైతులు లేరు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అని సీరియస్ అయ్యారు. మరోవైపు ఏలూరులో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. ఆయనకు వాస్తవాలు మాట్లాడే అలవాటు లేదు. చంద్రబాబు హయాంలో రైతులను పట్టించుకోలేదు. చంద్రబాబు ఐదేళల్లో సేకరించిన ధాన్యం జగనన్న ప్రభుత్వం మూడేళ్లలోనే సేకరించింది. దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే ధాన్యం సేకరించాం. 29,074 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి డబ్బు కూడా చెల్లించాం. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో సాయం చేసిన ఘనత మాది. మాది రైతుకు అండగా ఉండే ప్రభుత్వం. కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లోపే డబ్బులు చెల్లిస్తున్నాం. ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ.. ‘ఈ-క్రాప్ ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతోంది. చంద్రబాబువన్నీ డ్రామాలే. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ఏపీ నెంబర్ వన్గా ఉంది. డ్రామా ఆర్టిస్టులతో చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నారు’ అంటూ సీరియస్ అయ్యారు. చదవండి: రైతన్నకు అండగా ప్రభుత్వం.. తడిసినా ధాన్యం తీసుకుంటాం -
AP: రైతన్నకు అండగా ప్రభుత్వం.. తడిసినా ధాన్యం తీసుకుంటాం
సాక్షి, అమరావతి: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద తిరస్కరించకుండా రైతులకు అండగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ తెలిపారు. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా తొలుత తడిసిన ధాన్యాన్ని ఆఫ్లైన్లో సేకరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గురువారం సచివాలయంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కొనసాగుతున్న వర్ష సూచనలతో రైతులు బయట ధాన్యాన్ని ఆరబెట్టుకోలేని పరిస్థితి నెలకొంది. అటువంటి ధాన్యాన్ని ఆఫ్లైన్లో సేకరించి డ్రయర్ సౌకర్యం, డ్రయర్ ప్లాట్ఫారమ్ ఉన్న మిల్లులకు తరలిస్తున్నాం. అక్కడ ఆరబోత తర్వాత ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తాం’ అని తెలిపారు. రబీలో 30 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రాథమికంగా అంచనా వేసినట్లు చెప్పారు. దీనికి అదనంగా ఆర్బీకేల వద్దకు ధాన్యం తెచ్చే ప్రతి రైతుకూ మద్దతు ధర అందిస్తామన్నారు. ఇప్పటివరకు 5.22 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 55 వేల మంది రైతులకు 21 రోజుల్లోపే రూ.803 కోట్లు చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు. ధాన్యాన్ని వేగంగా కల్లాల నుంచి మిల్లులకు తరలించేందుకు రవాణా కోసం ఐదు గోదావరి జిల్లాలకు కలెక్టర్ కార్పస్ ఫండ్ కింద రూ.కోటి చొప్పున కేటాయించామన్నారు. కోటా పూర్తవగానే తిరిగి నిధులు అందిస్తామన్నారు. గత ఖరీఫ్లో 6.40 లక్షల మంది రైతుల నుంచి 35.41 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. దాదాపు రూ.7,208 కోట్లు (99 శాతం) చెల్లింపులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ధాన్యం సేకరణలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే టోల్ఫ్రీ నంబర్ 1967కు ఫిర్యాదు చేయాలని కోరారు. తొలిసారిగా జయ రకానికి మద్దతు ధర తొలిసారిగా రాష్ట్రంలో 5 లక్షల టన్నుల బొండాలు (జయ రకం) ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఫలితంగా బయట మార్కెట్లో జయ రకం ధాన్యానికి మంచి ధర పలుకుతోందన్నారు. వేసవి ప్రారంభంలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో ధాన్యంలో నూక శాతం పెరిగినట్లు తెలిపారు. వీటిని బాయిల్డ్ రైస్ కింద కొనుగోలు చేస్తామన్నారు. గోనె సంచులకు కొరత లేదు వర్షాల నేపథ్యంలో నిత్యం ప్రతి జిల్లాలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ వేగంగా ధాన్యాన్ని తరలిస్తున్నట్లు పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్ చెప్పారు. ఎక్కడా గోనె సంచులకు కొరత లేదన్నారు. ధాన్యం సేకరణలో రైతులను ఇబ్బందులకు గురి చేసిన 31 మిల్లులపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 8 వరకు వర్షాలు.. తగ్గగానే పంట నష్టం అంచనా వర్షాల కారణంగా పంట దెబ్బతిన్న రైతులను వేగంగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. ఈ నెల 8వ తేదీ వరకు వర్ష సూచన ఉందన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే పంట నష్టం అంచనాలు, ఆర్బీకేల్లో సోషల్ ఆడిట్ పూర్తి చేసి రెండు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. ఎక్కువగా జొన్న, మొక్కజొన్న, వరి పంటలు ముంపునకు గురైనట్టు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. మొక్కజొన్నను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. వర్షాల నుంచి పంటలను రక్షించుకునేందుకు శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో రైతులకు ఇబ్బందులుంటే వ్యవసాయశాఖ టోల్ ఫ్రీ నంబర్ 155251కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్కు ముందే పరిహారం రెండు నెలల క్రితం మార్చిలో కురిసిన అకాల వర్షాలతో 23,473 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. దాదాపు రూ.34.22 కోట్ల పంట నష్ట పరిహారాన్ని రైతులకు ఖరీఫ్ సీజన్కు ముందుగానే జమ చేస్తామన్నారు. వాటితో పాటే ప్రస్తుతం వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసి ఆ పరిహారాన్ని కూడా రైతులకు ఈ నెలాఖరులోగా అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగియక ముందే రైతులకు పరిహారాన్ని చెల్లిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు రూ.1,911 కోట్ల మేర పంట నష్టం పరిహారాన్ని అందించినట్లు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ఆర్టీసీలో మల్టీ సిటీ టికెటింగ్ సదుపాయం -
రాష్ట్రవ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలు
కరీంనగర్రూరల్: యాసంగి పంటను కొనుగోలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 7,100 కేంద్రాలు ఏర్పా టు చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్, మొగ్దుంపూర్ గ్రా మాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సివిల్ సప్లైచైర్మన్ రవీందర్సింగ్తో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ రెండో పంటను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. యాసంగి పంట ముందుగా కోతకు రావడంతో సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 7,100 కేంద్రాలను ఏర్పాటు చేయ నున్నామని, ఇప్పటివరకు 420 కేంద్రాలను ఏర్పా టు చేసి రూ.4.15కోట్ల విలువైన 2వేల మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. అవ సరమైన ప్రాంతాల్లో కేంద్రాలను ప్రారంభించేందు కు కలెక్టర్లకు ఆదేశాలిచి్చనట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి సురేశ్ పాల్గొన్నారు. మంత్రి గంగులకు తప్పిన ప్రమాదం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్కు ప్రమాదం తప్పింది. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో ఆదివారం కొందరు చిరుతల రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు. అనంతరం శ్రీసీతారాముల పట్టాభిõషేకం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మంత్రి గంగుల హాజరై వేదికపైకి చేరుకున్నారు. ఆయనతోపాటు సివిల్ సప్లైచైర్మన్ రవీందర్సింగ్ కూడా ఉన్నారు. అయితే అప్పటికే పెద్దసంఖ్యలో మహిళలు వేదికపైకి ఉన్నారు. గంగుల, రవీందర్సింగ్తోపాటు స్థానిక నాయకులు వేదికపైకి వెళ్లడంతో ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో మంత్రి గంగుల కమలాకర్ ఎడమకాలుకు గాయమైంది. రవీందర్సింగ్, జెడ్పీటీసీ లలిత స్వల్పంగా గాయపడ్డారు. పడిపోయిన మంత్రి వెంటనే గన్మెన్లు, నిర్వాహకులు పైకి లేపి ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు. -
ధాన్యం కొనుగోలుకు రెడీ..!
సాక్షి, రాజమహేంద్రవరం: రబీ ముందస్తు వరి కోతలు ప్రారంభమయ్యాయి. అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, చాగల్లు, తాళ్లపూడి మండలాల్లో ఊపందుకుంటున్నాయి. మరో పది రోజుల వ్యవధిలో మరికొన్ని ప్రాంతాల్లో వేగం పుంజుకునే ఆవస్యకత ఉంది. రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసి దన్నుగా నిలవాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. దిగుబడి అందే నాటి కంటే ముందుగానే ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసువచ్చేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. సేకరణకు అవసరమైన ఏర్పాట్లలో తలమునకలైంది. కొనుగోలుకు అవసరమైన గన్నీ బ్యాగులు, యంత్రాలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ తర్వాత ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 4.55 లక్షల మెట్రిక్ టన్నులే లక్ష్యం జిల్లా వ్యాప్తంగా రబీ సాధారణ సాగు 83,880 హెక్టార్లు. అత్యధికంగా వరి సాగవుతోంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 56,433 హెక్టార్లు కాగా.. 55,095 హెక్టార్లు సాగై 95 శాతానికి పైగా లక్ష్యాన్ని అధిగమించింది. ఈ ఏడాది 5.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో రైతులు, స్థానిక అవసరాలకు మినహాయించగా 4,55,845 మెట్రిక్ టన్నులు కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. రైతులకు అనుకూలమైన మద్దతు ధర నిర్ణయించింది. సాధారణ రకం బస్తాకు (75 కిలోల బస్తా) రూ.1530, గ్రేడ్–ఏ రకానికి రూ.1545గా నిర్ణయించింది. 233 ఆర్బీకేల్లో.. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 315 ఆర్బీకేలుండగా 233 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వాటిని 147 మిల్లులకు అనుసంధానం చేశారు. ఆయా కేంద్రాలకు నియమించిన సాంకేతిక సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. సేకరణకు జిల్లా వ్యాప్తంగా 70 లక్షల గన్నీ బ్యాగుల అవసరం ఉందని, ఏ మండలానికి ఎన్ని కావాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. ఆర్బీకేల వద్ద సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఈ–క్రాప్, తేమ శాతం నిబంధనల ప్రకారం ధాన్యం సేకరిస్తారు. అనంతరం మొబైల్ యాప్లో రైతులకు కూపన్లు ఇస్తారు. కొనుగోళ్లకు మండల వ్యవసాయ అధికారులు ఇన్చార్జ్లుగా వ్యవహరించనున్నారు. గ్రామ వలంటీర్లను సైతం భాగస్వాముల్ని చేస్తున్నారు. ధాన్యం రవాణా చేసే వాహనాలపై నిఘా పెడుతున్నారు. రవాణా చార్జీలు ఎవరికి చెల్లించాలనే విషయమై జాగ్రత్తలు తీసు కుంటున్నారు. ఎకరానికి 53 బస్తాల దిగుబడి రబీ ధాన్యం దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. ఎకరానికి 52 నుంచి 53 బస్తాల దిగుబడి అందుతోంది. జిల్లాలో అత్యధికంగా ఎంటీయూ–1121 రకం ధాన్యం సేకరించనున్నారు. 3.39 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అందే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. 76,000 మెట్రిక్ టన్నులు బోండాలు, 30 వేల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉత్పత్తి అయ్యే సూచనలున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. పెట్టుబడులకు పోను లాభాలు గడించవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా దిగుబడులు టాప్.. జిల్లాలో 2021 ఖరీఫ్లో 82,695 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. ఎకరానికి (75 కిలోల బస్తా) 28 బస్తాల ధాన్యం దిగుబడి వస్తే.. 2022 ఖరీఫ్లో 73,606 హెక్టార్లలో వరి సాగయ్యింది. ఎకరానికి 33 బస్తాల దిగుబడి వచ్చింది. ఏడాది వ్యవధిలో ఎకరం పొలానికి 5 బస్తాలు వృద్ధి చెందింది. 2021 ఖరీఫ్లో మొత్తం 4,29,990 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అందితే.. 2022లో 4,52,368 మెట్రిక్ టన్నులు.. అంటే 22,378 మెట్రిక్ టన్నులు అదనంగా దిగుబడి వచ్చింది. గత ఐదేళ్లుగా ఇలాంటి దిగుబడులు ఎప్పుడూ నమోదు కాలేదని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఇప్పటికే 2321 హెక్టార్లలో కోతలు పూర్తయినట్లు సమాచారం. ప్రతి గింజా కొంటాం:– రబీలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేశాం. ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి సేకరణపై అధికారులు, సిబ్బందికి సలహాలు సూచనలు చేశాం. ముందస్తు కోతలు వచ్చే ప్రాంతాల్లో కేంద్రాలు ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నాం. 4.55 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 233 ఆర్బీకేలు సిద్ధం చేస్తున్నాం. వారం రోజుల తర్వాత కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. –ఎన్.తేజ్ భరత్, జాయింట్ కలెక్టర్ -
డిఫాల్ట్ మిల్లర్లకు.. ధాన్యం బంద్
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని (కస్టమ్ మిల్లింగ్ రైస్ –సీఎంఆర్) ఎఫ్సీఐకి అప్పగించకుండా సతాయించే మిల్లులపై కొరడా ఝలిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలల్లోగా ధాన్యం మిల్లింగ్ చేసి బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థ ద్వారా ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉన్నా.. కొందరు మిల్లర్లు ఏడాదిన్నర దాకా జాప్యం చేస్తున్నారు. అప్పటికీ కొన్ని మిల్లుల నుంచి సీఎంఆర్ బియ్యం పెండింగ్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో సకాలంలో బియ్యం ఇవ్వకుండా పౌరసరఫరాల సంస్థకు నష్టం కలిగిస్తున్న మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల మూడో వారం నుంచి మొదలయ్యే యాసంగి సీజన్ నుంచే దీనిని అమలు చేయనుంది. సీఎంఆర్లో జాప్యం చేస్తున్న 300కుపైగా మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా అధికారులు ఇప్పటికే గుర్తించి, జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ మిల్లులకు ధాన్యం కేటాయింపులను పూర్తిగా నిలిపేసి.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ అధికారులు మంత్రి గంగుల ద్వారా సీఎంకు ప్రతిపాదనలు అందజేసినట్టు సమాచారం. ఆరునెలల్లోగా ఇవ్వాల్సి ఉన్నా.. వచ్చేనెల నుంచి యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు చేర్చాక రైతుల ఖాతాలో డబ్బులు జమవుతాయి. మిల్లర్లు ఆ ధాన్యాన్ని తీసుకున్నాక ఆరు నెలల్లోగా మరాడించి బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా ఎఫ్సీఐకి అప్పగించాలి. కానీ మిల్లర్ల నుంచి తగిన సమయంలో సీఎంఆర్ రాకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐను గడువు పెంచాలని కోరడం ఏటా జరిగే తంతుగా మారింది. 2019–20 యాసంగి సీజన్కు సంబంధించి 118 మిల్లులు ఇప్పటివరకు సీఎంఆర్ ఇవ్వలేదు. మూడేళ్లుగా పెనాల్టీతో గడువు పెంచుతున్నా ఇప్పటికీ సీఎంఆర్ పెండింగ్లోనే ఉండటం గమనార్హం. గడువు ముగిసిన తరువాత ఎఫ్సీఐ బియ్యం తీసుకోకపోతే వాటిని రాష్ట్ర అవసరాలకు మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాకుండా సీఎంఆర్ ఆలస్యంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. దీనితో ఇకపై మిల్లర్ల ఆగడాలను ఉపేక్షించొద్దని, ధాన్యం కేటాయింపుల్లో కోత విధించాలని.. 6 నెలల్లో సీఎంఆర్ పూర్తి చేసే కెపాసిటీలోనే కేటాయింపులు జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది. మిల్లర్లకు కేటాయించగా మిగిలే ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ద్వారానే మిడిల్ పాయింట్ స్టోరేజీ గోడౌన్లకు తరలించి.. ప్రైవేటు వ్యక్తులకు విక్రయించాలని కూడా యోచిస్తోంది. కొనుగోళ్ల బాధ్యతలు కలెక్టర్లకు.. రాష్ట్రంలో కొన్ని సీజన్లుగా ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ ప్రక్రియ అదనపు కలెక్టర్ల నేతృత్వంలో జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల సంస్థ అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వచ్చే యాసంగి సీజన్లో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా కలెక్టర్ల నేతృత్వంలో జరపాలని నిర్ణయించారు. దీనిపై ఏప్రిల్ 10న మంత్రుల సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. సీఎంఆర్లో లేని మిల్లులకు ధాన్యం ఇప్పటివరకు సీఎంఆర్తో సంబంధం లేకుండా ప్రైవేటుగా ధాన్యం కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి అమ్ముకునే మిల్లులను ఈసారి సీఎంఆర్ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. మిర్యాలగూడ, నిజామాబాద్, నల్లగొండ వంటి కొన్ని ప్రాంతాల్లో 100కుపైగా మిల్లులు పౌరసరఫరాల శాఖ, సీఎంఆర్తో సంబంధం లేకుండా పనిచేస్తున్నాయి. వాటిని గుర్తించి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. -
ధాన్యం రైతులకు గుడ్ న్యూస్.. రూ.1,096.52 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్
సాక్షి, అమరావతి: ధాన్యం రైతులకు శుభవార్త! ఆర్బీకేల ద్వారా రైతన్నల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు రూ.1,096.52 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 3.29 లక్షల మంది రైతుల నుంచి రూ.3,781 కోట్ల విలువైన 18.52 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. తాజా చెల్లింపుతో మొత్తం 2.84 లక్షల మంది రైతులకు రూ.2,924.53 కోట్లను ఖాతాల్లో జమ చేసినట్లయింది. రైతులకు మద్దతు ధర కల్పించడంతోపాటు ప్రభుత్వం వేగంగా చెల్లింపులు కూడా జరుపుతోంది. 21 రోజుల్లోపు చెల్లించాలని నిర్ణయించినప్పటికీ ధాన్యం కొనుగోలు చేసిన వారం నుంచి పది రోజుల లోపే రైతుల ఖాతాలకు నగదు జమ చేసిన దాఖలాలున్నాయి. కొన్ని చోట్ల మాత్రం సాంకేతిక సమస్యల వల్ల ఒకటి రెండు రోజులు చెల్లింపులు ఆలస్యమయ్యాయి. తొలిసారిగా అదనపు సాయం.. ధాన్యం సేకరణలో తొలిసారిగా తెచ్చిన ఆన్లైన్ విధానంతో రైతులకు పారదర్శకంగా మద్దతు ధర లభిస్తోంది. గోనె సంచులు, రవాణా చార్జీలు, హమాలీ ఖర్చులను సైతం రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తోంది. వీటి కింద ఇప్పటివరకు రూ.45.91 కోట్లు విడుదల చేసింది. ఇందులో దాదాపు 50 శాతం చెల్లింపులను పూర్తి చేసింది. గత సర్కారు హయాంలో ఇవేమీ లేకపోగా రైతులకు ధాన్యం సొమ్ములను నెలలు తరబడి బకాయిలు పెట్టారు. మిల్లర్లు, దళారులకు లబ్ధి చేకూర్చేందుకు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేసింది. ఫలితంగా రైతన్నల్లో ఆందోళన రేకెత్తించి నష్టానికే మధ్యవర్తులకు ధాన్యం విక్రయించుకోవాల్సిన దుస్థితి కల్పించింది. ఇలాంటి వాటిని అరికడుతూ రైతులే తొలి ప్రాధాన్యంగా 21 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ధర జమ చేయాలని నిర్ణయించి సీఎం జగన్ పక్కాగా అమలు చేస్తున్నారు. దీంతో గత సీజన్ల కంటే ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి నాటికి పూర్తి ఖరీఫ్ ధాన్యం సేకరణను సంక్రాంతి నాటికి పూర్తి చేసేలా కృషి చేస్తున్నాం. ఉత్తరాంధ్రలో కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆదేశించాం. ఆన్లైన్ విధానంతో రైతులకు సంపూర్ణ మద్దతు ధర లభిస్తోంది. పండగ సీజన్లను దృష్టిలో పెట్టుకుని నిర్ణీత సమయం ప్రకారం చెల్లింపులు చేస్తున్నాం. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ, జి.వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ -
అన్నదాతకు అండ.. గింజగింజకూ మద్దతు
అన్నదాతలు పండించే ప్రతీ పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎమ్మెస్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ ఒక్క రైతన్న కూడా ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం లేకుండా పంటల కొనుగోళ్ల సమయంలో వారికి అన్ని విధాలా అండగా నిలవాలి. – అధికార యంత్రాంగానికి సీఎం జగన్ ఆదేశం సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పంటనూ ఈ–క్రాపింగ్ చేయడం వల్ల ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేశారు? ఎంత దిగుబడి వస్తుందనే విషయంలో స్పష్టత వచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో పూర్తి స్థాయిలో పారదర్శకత వచ్చిందన్నారు. పంటల నమోదు నూరు శాతం పూర్తి కాగా, వీఏఏ, వీఆర్వోల ద్వారా ఈ – కేవైసీ 99 శాతం పూర్తైనందున ఈనెల 15వ తేదీలోగా రైతుల ఈ – కేవైసీ (వేలిముద్రలు) పూర్తిచేసి ప్రతి రైతుకు డిజిటల్, ఫిజికల్ రశీదులివ్వాలని సూచించారు. పంటల కొనుగోళ్ల సందర్భంగా ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం సోషల్ ఆడిట్ పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో పాటు ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మంగళవారం సమీక్షించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం ఖరీఫ్ సీజన్ దాదాపుగా పూర్తైంది. కోతలు మొదలయ్యేలోగా కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలి. కొనుగోళ్ల సందర్భంగా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు. గన్నీ బ్యాగులు, కూలీలు, రవాణా సదుపాయాలను అవసరమైన మేరకు సమకూర్చుకోవాలి. ధాన్యం కొనుగోళ్లపై ఆర్బీకేల ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ధాన్యం కొనుగోళ్ల కోసం చేసిన ఏర్పాట్లు, నిబంధనలు, సూచనలు, సలహాలతో ఆర్బీకేల్లో పోస్టర్లు ప్రదర్శించాలి. ఆర్బీకేలకు అనుసంధానించిన వలంటీర్లు ఆర్బీకే మిత్రలుగా, ధాన్యం కొనుగోళ్లలో సహాయం కోసం తీసుకుంటున్న వలంటీర్లు రైతు సహాయకులుగా వ్యవహరించాలి. బియ్యం ఎగుమతులపై దృష్టి రాష్ట్రంలో వరి విస్తారంగా సాగు అవుతున్నందున బియ్యం ఎగుమతులపై దృష్టి సారించాలి. దేశీయంగా డిమాండ్ లేని పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను పరిశీలించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఎగుమతుల రంగంలో ఉన్న వారితో కలిసి పని చేయాలి. బియ్యం ఎగుమతిదారులకు, రైతులకు ఉభయ తారకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. రంగు మారిన ధాన్యం, బ్రోకెన్ రైస్ (నూకలు)ఇథనాల్ తయారీకి వినియోగించడంపై దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఇఫ్కో ద్వారా ఒక ప్లాంటు, మహీంద్రా ద్వారా మరో ప్లాంటు నుంచి ఇథనాల్ తయారు కానుంది. సీఎం యాప్తో ధరల పర్యవేక్షణ ఎక్కడైనా పంటలకు ఎమ్మెస్పీ కంటే తక్కువ ధర ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే జోక్యం చేసుకుని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. పంట ఉత్పత్తుల ధరలను ఎప్పటికప్పుడు సీఎం యాప్ ద్వారా సమీక్షిస్తుండాలి. ఎక్కడైనా ధర పతనమైనట్లు సీఎం యాప్ ద్వారా గుర్తిస్తే వెంటనే కొనుగోళ్లకు శ్రీకారం చుట్టాలి. ధర పతనమైన సందర్భాల్లో రైతులను ఎలా ఆదుకుంటామనే విషయంలో సర్వీస్ లెవల్ అగ్రిమెంట్ (ఎస్ఎల్ఏ) పకడ్బందీగా ఉండాలి. కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను నిల్వచేసే ప్రాంతంలో జియో ఫెన్సింగ్, ప్రతి ఉత్పత్తికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఉండేలా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేయాలి. రైతులను ఆదుకునేందుకు మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకోవాలి. దీనివల్ల ధరలు పతనం కాకుండా అన్నదాతలకు మేలు జరుగుతుంది. పొగాకు రైతులకు నష్టం జరగకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్కు ముందే భూసార పరీక్షలు.. పంటల సంరక్షణకు ప్లాంట్ డాక్టర్ ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు నిర్వహించి పూర్తి వివరాలను సాయిల్ హెల్త్ కార్డుల్లో నమోదు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా పంటల సాగుకు సంబంధించి సిఫార్సులు చేయాలి. ఏ నేలలో ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు వాడాలనే అంశంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి. ఇందుకోసం ప్రతి ఆర్బీకేలో సాయిల్ టెస్టింగ్ పరికరాలను అందుబాటులో ఉంచాలి. మధ్యలో ఏవైనా చీడపీడలు, తెగుళ్లు లాంటివి పంటలకు సోకితే ఫోటోలు తీసి శాస్త్రవేత్తల సహకారంతో నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్లాంట్ డాక్టర్ విధానాన్ని తేవాలి. విచ్చలవిడిగా క్రిమి సంహారక మందుల వాడకాన్ని నివారించాలి. ఇలా క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తూ సిఫార్సుల మేరకు పంటలను సాగు చేస్తే విచక్షణా రహితంగా ఎరువులు, రసాయనాల వాడకం తగ్గుతుంది. తద్వారా రైతన్నలకు పెట్టుబడి వ్యయం తగ్గడంతోపాటు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సాధించేందుకు దోహదం చేస్తుంది. ఈదఫా 1.15 కోట్ల ఎకరాల్లో సాగు ఖరీప్ సీజన్లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా అక్కడక్కడా వరి నాట్లు కొనసాగుతున్నందున ఈదఫా ఖరీఫ్ సాగు 1.15 కోట్ల ఎకరాలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు సీఎం దృష్టికి తెచ్చారు. మూడేళ్లలో 3.5 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు పెరిగిందని, సాధారణ పంటల నుంచి రైతులు వీటి వైపు మళ్లినట్లు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 14.10 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారని చెప్పారు. నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం 3,423 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మాయిశ్చరైజర్ మీటర్, అనాలసిస్ కిట్, హస్క్ రిమూవర్, పోకర్స్, ఎనామెల్ ప్లేట్స్, జల్లించే పరికరాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. రానున్న రబీ సీజన్లో 57.31 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేసి 96 లక్షల టన్నుల విత్తనాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన పరికరాలు, అద్దెల వివరాలతో ఆర్బీకేల్లో పోస్టర్లను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత సాయాన్ని అక్టోబరు 17న అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భూసార పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు బాంబే, కాన్పూర్ ఐఐటీల సాంకేతిక విధానాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల కమిషనర్లు చేవూరు హరికిరణ్, హెచ్.అరుణ్కుమార్, పీఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ గెడ్డం శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
వడ్లకు ర'వాన' భయం
సాక్షి, హైదరాబాద్: రోహిణి కార్తె ముగిసి రుతుపవనాలు రాష్ట్రంలోకి అడుగుపెట్టే సమయం సమీపించినా.. రాష్ట్రంలో ఇంకా యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కాలేదు. సీజన్ మొదలైనప్పటి నుంచి తప్పుల తడక ప్రణాళికలతో సాగిన పౌరసరఫరాల శాఖ ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపు దశకు వచి్చనా గాడిన పడలేదు. దీంతో ఇప్పటికీ ఇంకా 12 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం వరి కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతోంది. రెండు మూడుసార్లు కురిసిన అకాల వర్షాలకు నానిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా తంటాలు పడ్డ రైతన్నలు.. రుతుపవనాల ప్రభావంతో కురిసే భారీ వర్షాలను తలచుకుని భయాందోళనలకు గురవుతున్నారు. కొత్త గన్నీ బ్యాగులు లేకపోయినా, పాత బ్యాగులతోనే యాసంగి కథ నడిపించిన పౌరసరఫరా శాఖ.. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు, మిల్లుల నుంచి గోడౌన్లకు రవాణా సౌకర్యాన్ని కలి్పంచేందుకు అపసోపాలు పడుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. మరోవైపు మిల్లులూ ఫుల్లయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ రైతు తన వడ్లు కొనుగోలు చేయడం లేదని ఏకంగా ఐకేపీ సెంటర్ సీఈవోపైనే పెట్రోల్తో దాడి చేయగా, సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్తో రాస్తారోకోలు జరుగుతున్నాయి. పది రోజుల్లో కష్టమేనా? రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ ఇప్పటివరకు 43.70 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని 7.77 లక్షల రైతుల నుంచి సేకరించింది. రాష్ట్రంలో ఏర్పాటైన 6,584 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తయిన 3,252 కేంద్రాలను ఇప్పటికే మూసేశారు. మరో పదిరోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయని ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. కానీ ఇంకా 12 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం.. కొనుగోలు కేంద్రాలు, రైతుల కల్లాల్లోనే కుప్పలుగా పడి ఉంది. కిందటి యాసంగిలో ఇప్పటికే 79 ఎల్ఎంటీ ధాన్యాన్ని కొనుగోలు చేయగా... ఈసారి అందులో దాదాపుగా సగానికే పరిమితం కావడం, ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల వద్ద రైతులు పడిగాపులు పడడం అధికారుల అలసత్వాన్ని చాటుతోంది. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఇప్పట్లో కొనుగోళ్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రవాణా లేక ఇబ్బందులు సిద్దిపేట జిల్లాలో 412 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యాన్ని సరఫరా చేసేందుకు ముగ్గురు కాంట్రాక్టర్లను నియమించారు. కాంట్రాక్టర్లు వాహనాలు సరిగా ఏర్పాటు చేయక పోవడంతో పాటు రైస్ మిల్లుల్లో స్థలం లేక పోవడంతో అన్ లోడ్ ఆలస్యం అవుతోంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు జోకుతున్నా, మిల్లర్ల వద్ద దించుకోవడం సమస్యగా మారింది. మిల్లులకు వెళ్లిన ట్రాక్టర్లు, లారీలు రోజుల తరబడి అన్లోడింగ్ కోసం వేచి చూసే పరిస్థితి ఇప్పటికీ సిద్దిపేట, మెదక్, ములుగు, నాగర్కర్నూల్, భూపాలపల్లి వంటి జిల్లాల్లో ఉంది. మరోవైపు కాంట్రాక్టు కుదుర్చుకున్న లారీలు కూడా సమయానికి రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. రైతులు సొంతంగా ట్రాక్టర్లు సమకూర్చుకొని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు పంపించినా తీసుకోవడం లేదనే ఆరోపణలు విని్పస్తున్నాయి. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు, రైతుల కల్లాల్లో 12 ఎల్ఎంటీ వరకు ధాన్యం ఉన్నట్లు అంచనా వేస్తున్న అధికారులు దాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించే విషయంలో ఎలాంటి చొరవ చూపడం లేదు. మిల్లుల్లోనే వానాకాలం ధాన్యం గత వానాకాలం సీజన్కు సంబంధించిన సుమారు 30 ఎల్ఎంటీల వరకు ధాన్యం కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) కోసం రైస్ మిల్లుల్లోనే ఉంది. దీనికి తోడు ఇప్పటివరకు 43 ఎల్ఎంటీ ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మిల్లుల్లో జాగ లేక ప్రైవేటు గోడౌన్లలో కూడా ధాన్యాన్ని నిల్వ ఉంచారు. ఈ పరిస్థితుల్లోనే ఇంకా కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న ధాన్యాన్ని తీసుకునేందుకు మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు ధాన్యాన్ని పంపించినా, దించుకోకపోవడంతో ఓపీఎంఎస్ (ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం) లో నమోదు కావడం లేదు. దీంతో రైతులు ధాన్యాన్ని విక్రయించినా రికార్డులకెక్కడం లేదు. లారీలు, ట్రాక్టర్లు కొనుగోలు కేంద్రాలకు రాని పరిస్థితి ఉంటే స్పందించి తగిన నిర్ణయం తీసుకోవలసిన పౌరసరఫరాల అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మిల్లుల్లో ఖాళీ లేకనే ధాన్యం తరలింపు ఆలస్యమవుతోందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. వడ్ల పైసల్ పడుతలెవ్వు .. సాధారణంగా ధాన్యం విక్రయించిన వారం రోజుల్లోపు రైతుల ఖాతాల్లోకి ధాన్యం సొమ్ము వచ్చి చేరుతుంది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం వెళ్లిన వెంటనే ఓపీఎంఎస్ ద్వారా రైతు విక్రయించిన ధాన్యం వివరాలు ఆన్లైన్లోకి చేరతాయి. తదనుగుణంగా జిల్లా ఖజానా నుంచి రైతు బ్యాంకుల్లోకి డబ్బులు జమ అవుతాయి. అయితే ఈసారి రైతులకు ధాన్యం డబ్బులు ఆలస్యం అవుతున్నాయన్న ఫిర్యాదులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఓపీఎంఎస్లో రైతు వివరాలు చేరకపోవడమే. ఇప్పటివరకు 7.77 లక్షల మంది రైతులు రూ.8,553.79 కోట్ల విలువైన ధాన్యం విక్రయించగా, ఓపీఎంఎస్లోకి నమోదైన రైతుల సంఖ్య కేవలం 5.26 లక్షలే. వారికి చెల్లించాల్సిన మొత్తం 5,789.84 కోట్లు. కానీ 3.47 లక్షల మందికి మాత్రమే రూ.5,233.18 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. ఇంకా ఓపీఎంఎస్ బ్యాలెన్స్ రూ. 556.66 కోట్లు ఉండగా, ఓపీఎంఎస్లోకి ఎంటర్ కాని రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.3,320.61 కోట్లుగా ఉంది. కొనుగోళ్ల తాజా స్థితి ఇదీ... ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు: 6,584 కొనుగోళ్లు ముగిసి మూతపడ్డ కేంద్రాలు: 3,252 ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం : 43.70 ఎల్ఎంటీ ఇంకా మార్కెట్కు రానున్న ధాన్యం (అంచనా) :12 ఎల్ఎంటీ ధాన్యం విక్రయించిన రైతులు : 7,77,013 విక్రయించిన ధాన్యం విలువ : రూ. 8,553.79 కోట్లు ఓపీఎంఎస్ అయి రైతుల ఖాతాల్లోకి చేరిన మొత్తం : రూ. 5,233.18 కోట్లు సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం అంకిరెడ్డి పల్లిలోని కొనుగోలు కేంద్రంలో రైతులు రోజుల తరబడి ధాన్యం అమ్ముకునేందుకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన వడ్ల బస్తాలను మిల్లులకు చేరవేసేందుకు లారీలు, ట్రాక్టర్లను అధికారులు సమకూర్చకపోవడంతో 15 రోజులుగా కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రైతులు అంకిరెడ్డిపల్లి వద్ద ప్రధాన రోడ్డుపై రాస్తారోకో జరిపారు. వీరానగర్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు దాటింది. ఇప్పటికీ బస్తాలు ఇక్కడే ఉన్నాయి. వర్షం వచ్చే అవకాశం ఉన్నందున భయంగా ఉంది. రోజూ ఇక్కడే పడుకోవాల్సి వస్తోంది. – మన్నె స్వామి, రైతు, వీరానగర్, సిద్దిపేట జిల్లా -
కుప్పలు.. తిప్పలు
10 కేజీలు తరుగు తీస్తూ.. ధాన్యం అంతా కొనుగోలు కేంద్రంలో ఉంది. మబ్బులు కమ్మి ఉన్నాయి. కనీసం పట్టాలను కూడా సరఫరా చేయలేదు. వానొస్తే కష్టమంతా నీటి పాలవుతుంది. కొనుగోలు కేంద్రాల వద్ద 5 కేజీలు తరుగు తీసేందుకు ఒప్పుకున్నాం. ఇప్పుడు కొత్తగా 10 కేజీల తరుగు తీస్తామంటున్నారు. ఇది రైతులను నిలువు దోపిడీ చేయడమే. ప్రభుత్వం, అధికారులు కొనుగోలు కేంద్రాలపై దృష్టి సారించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడుతోంది. – గడుపుడి వెంకటేశ్వర్లు, రైతు, అనాసాగరం,నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యానికి నిదర్శనమిది. రాష్ట్రవ్యాప్తంగా వరికోతలు సాగుతూ ధాన్యం కేంద్రాలకు పోటెత్తుతున్నా ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదు. పలుచోట్ల గన్నీ బ్యా గుల కొరత, ఇతర సౌకర్యాలు సరిగా లేకపోవడం, ఇటీవలి అకాల వర్షాలతో ధాన్యం తడిసి తేమ శాతం పెరగడం, రంగు మారడం, అధికారుల అలసత్వం, మిల్లర్ల కొర్రీలు కలిసి కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు వడ్ల కుప్పలతో నిండిపోతున్నాయి. సంచులు, లారీల కొరత.. మిల్లర్ల కొర్రీలు రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఓవైపు గన్నీ సంచులకు, ధాన్యాన్ని మిల్లులకు తరలించే లారీలకు కొరత.. మరోవైపు సన్నరకాలే తీసుకుంటామంటూ, తరుగు తీస్తూ మిల్లర్లు పెడుతున్న కొర్రీలు సమస్యగా మారాయి. ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి ఇదే కారణమని కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు. ► ఇటీవలి అకాల వర్షానికి యాదాద్రి, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, కరీంనగర్, వరంగల్, మెదక్, సంగారెడ్డి మొదలైన జిల్లాల్లో పెద్ద ఎత్తున ధాన్యం తడిసిపోయింది. ఆ ధాన్యాన్ని ఆరబెట్టినా కొనుగోలు చేసేందుకు సెంటర్లలో కొర్రీలు పెడుతున్నట్టు విమర్శలున్నాయి. వేస వి ఎండలు మండిపోతున్న పరిస్థితుల్లో తేమ శాతం ఎక్కువనే సమస్య లేకపోయినా.. ధా న్యం రంగుమారి నల్లబడిందని, ఇసుక చేరింద నే సాకులు చెప్తున్నట్టు రైతులు వాపోతున్నారు. ► సరిపడిన మేర గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. గన్నీ బ్యాగులు లేక కొనుగోళ్లు చేయలేకపోతున్నామని కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు. ► అనేక ప్రాంతాల్లో హమాలీల సమస్య కూడా కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తోంది. ► చాలాచోట్ల సెంటర్లలో తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే లారీల కొరత కూడా వేధిస్తోంది. పెద్దపల్లి, కరీంనగర్ వంటి కొన్ని జిల్లాల్లో విక్రయించిన ధాన్యాన్ని రైతులే ట్రాక్టర్లను సమకూర్చుకొని మిల్లింగ్కు తరలించే పరిస్థితి ఉంది. ► సన్నరకాల ధాన్యం అయితేనే తీసుకుంటామని, ఆ ధాన్యాన్నే ముందుగా పంపాలంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై మిల్లర్లు ఒత్తిడితెస్తున్నారు. దొడ్డు రకాల ధాన్యాన్ని తూకం వేసి పంపితే.. దాన్ని దింపుకోకుండా ఆలస్యం చేస్తున్నారు. లేకుంటే ఎక్కువ తరుగుకు ఒప్పుకొంటేనే ధాన్యం తీసుకుంటామంటూ కొర్రీ పెడుతున్నారు. ఇలా లారీలు రోజుల తరబడి నిలిచిపోవడం కూడా కొనుగోళ్లలో జాప్యానికి కారణమవుతోంది. ► ఇక ఎఫ్సీఐ మిల్లుల్లో ప్రత్యక్ష తనిఖీలు చేపడుతుండటం, వానాకాలంలో సేకరించిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ప్రస్తుత ధాన్యాన్ని తీసుకోలేక పోతున్నామని కొందరు మిల్లర్లు అంటున్నారు. మిల్లింగ్ నష్టం తేలక! యాసంగిలో రాష్ట్రం నుంచి 40.20 లక్షల టన్నుల బియ్యం తీసుకుంటామని.. అందులో 37.60 లక్షల టన్నులు రారైస్, 2.60 లక్షల టన్నులు ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఎఫ్సీఐ సూచించింది. తర్వాత మరింత ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు అంగీకరించింది. ఈ మేరకు యాసంగి ధాన్యాన్ని రారైస్ (ముడిబియ్యం) చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే యాసంగి ధాన్యాన్ని రారైస్ (ముడి బియ్యం)గా మార్చితే నూకలు ఎక్కువ అవుతాయని, ఈ మేర కు ప్రభుత్వం నష్టాన్ని భరించాలని మిల్లర్లు డి మాండ్ చేస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం దీనిపై సీఎస్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ టెస్ట్ మిల్లింగ్ ఎప్పుడు పూర్తిచే స్తుంది, నష్టాన్ని ఇంకెప్పుడు నిర్ధారిస్తుందని మిల్ల ర్లు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల కూడా మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోవడంలో వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారని అధికారవర్గాలే చెప్తున్నాయి. ∙రాష్ట్రంలో ఇప్పటివరకు ఆదిలాబాద్, వికారా బాద్ మినహా 30జిల్లాల్లో 5,883 కొనుగోలు కేంద్రాలను తెరిచినట్టు పౌరసరఫరాల శాఖ చెప్తున్నా.. 28 జిల్లాల్లోని 4,068 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్ల ప్రక్రియ మొదలైంది. ► ప్రస్తుత సీజన్లో బుధవారం నాటికి 11,20,916 టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం సేకరించింది. గత (2020–21) యాసంగితో పోలిస్తే ఇది మూడో వంతు మాత్రమే కావడం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి 31.22 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించడం విశేషం. ఎక్కడ చూసినా వరి కుప్పలే.. ► మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలరోజులు గడిస్తున్నా పూర్తి స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ మొదలుకాలేదు. ఈసారి జిల్లాలో 3.77 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇప్పటివరకు 329 సెంటర్లు ఏర్పాటు చేసి 13,274 టన్నులే కొనడం గమనార్హం. జిల్లాకు కోటి గన్నీ బ్యాగులు కావాల్సి ఉండగా.. 20 లక్షల బస్తాలే వచ్చాయని అధికారులు చెప్తున్నారు. ఇక సన్నరకాల ధాన్యం అయితేనే తీసుకొంటామంటూ రైస్మిల్లర్లు మెలిక పెట్టడం వల్ల కూడా కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి. ► కరీంనగర్ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 95 వేల టన్నుల ధాన్యం సేకరించగా.. ఈసారి ఇంకా 49,911 టన్నులే కొనుగోలు చేశారు. జిల్లాలో 346 కేంద్రాలు ప్రారంభించినా.. 291 చోట్ల మాత్రమే, అదీ మందకొడిగా కొనుగోళ్లు సాగుతున్నాయి. ధాన్యం కుప్పలు పేరుకుపోతోంది. మిల్లర్లు ధాన్యం తీసుకోవడానికి కొర్రీలు పెడుతున్నారు. ► రాష్ట్రం మొత్తంలో నిజామాబాద్ జిల్లాలోనే ఓ మోస్తరుగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా యి. 449 కొనుగోలు కేంద్రాల్లో కలిపి మూడున్నర లక్షల టన్నుల మేర ధాన్యం సేకరించారు. అయితే వరికోతలు దాదాపు పూర్తవడంతో.. ధాన్యం రాశులుగా పోసి కనిపిస్తోంది. ► మహబూబాబాద్ జిల్లాలో 184 కొనుగోలు కేంద్రాలనే ప్రారంభించారు. ఇప్పటివరకు కొన్న ధాన్యం 13 వేల టన్నులే. మిల్లర్లు కొర్రీలు పెడుతూ ప్రతిబస్తాకు 3 కిలోల వరకు తరుగు తీస్తున్నారు. తీవ్ర జాప్యం జరుగుతుండటంతో.. రైతులు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లకు నేరుగా అమ్ముకుంటున్నారు. వ్యాపారులు కల్లాల వద్దే కాంటాలు పెట్టి ధాన్యం కొంటున్నారు. -
సూర్యాపేట మార్కెట్లో సజావుగా ధాన్యం కొనుగోళ్లు
భానుపురి (సూర్యాపేట): సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లు ఆదివారం సజావుగా సాగాయి. శనివారం రైతుల ఆందోళనలతో కాంటాలు నిలిచిపోవడం, కలెక్టర్ జోక్యం చేసుకుని రీ టెండర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాత్రి పొద్దుపోయే వరకు మార్కెట్ యార్డులో కలెక్టర్ రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూశారు. దీంతో ఆదివారం ఉదయం 7 గంటల నుంచే కాంటాలు మొదలయ్యాయి. 26,455 బస్తాల ధాన్యాన్ని మార్కెట్ నుంచి కొనుగోలుదారులు తరలించారు. -
కొట్లాడుడు.. కొనుడు..
సర్కారు ఆలోచన ఇదీ..: రాష్ట్ర రైతులు ప్రస్తుత యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. యాసంగి ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనబోమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గట్టిగా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ధాన్యం కొనాల్సిందేనంటూ సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ నెల 11న ఢిల్లీలో వరి దీక్ష కూడా తలపెట్టారు. అయినా కేంద్రం దిగిరాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకమంటూ ఎత్తిచూపడం, బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాలన్నింటినీ తిప్పికొట్టడంతోపాటు రైతులకు అండగా నిలిచేది రాష్ట్ర ప్రభుత్వమేనన్న సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టడం.. రైతులకు అండగా నిలిచేది రాష్ట్ర ప్రభుత్వమే అన్న సందేశాన్ని జనంలోకి పంపడమే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్కారు అడుగులు వేస్తోంది. అటు కేంద్రంపై పోరును కొనసాగిస్తూనే.. ఇటు రాష్ట్ర రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. కొన్ని జిల్లాల్లో వరికోతలు ఇప్పటికే మొదలై ప్రైవేటు విక్రయాలు సాగుతున్నాయి. ఈనెల మూడో వారం నుంచి వరి కోతలు ఊపందుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 11న ధర్నా అనంతరం ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. మొదలైన వరి కోతలు యాసంగి వరిని బాయిల్డ్ రైస్ చేస్తే తీసుకోబోమని కేంద్రం గతంలోనే ప్రకటించింది. అయితే రాష్ట్రంలో యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్గా మాత్రమే పనికొస్తుందని.. ముడి బియ్యం (రా రైస్)గా మారిస్తే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ధాన్యం కొనాలని ఓ వైపు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే.. వరిసాగు చేయవద్దని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని రాష్ట్ర రైతాంగానికి స్పష్టం చేసింది. అయినా రాష్ట్రంలో రైతులు 36 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈసారి వాతావరణం బాగుండటంతో దిగుబడి కూడా బాగానే వస్తుందని వ్యవసాయ శాఖ చెప్తోంది. ముందుగా నాట్లు వేసిన నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి వంటిచోట్ల ఇప్పటికే వరి కోతలు మొదలయ్యాయి. నిజామాబాద్ జిల్లా వర్ని పరిధిలోని నాలుగైదు గ్రామాల్లో 25 శాతం పంటను కోయడం, ప్రైవేటుగా విక్రయించడం కూడా జరిగింది. ఈ నెల 3వ వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఊపందుకోనున్నాయి. మిల్లర్లు, దళారుల మాయాజాలం షురూ.. కొనుగోళ్లపై స్పష్టత రాకపోవడంతో వరి కోతలు పూర్తయిన ప్రాంతాల్లో ధాన్యం విక్రయాలపై గందరగోళం నెలకొంది. దళారులు, మిల్లర్లు మద్దతు ధరకన్నా రూ.500 వరకు తక్కువ ఇస్తున్నారు. తరుగు, తేమ అంటూ క్వింటాల్కు రూ.1,400 నుంచి రూ.1,500 వరకే ఇస్తున్నట్టు రైతులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ ‘‘తొందరపడి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దు. ఢిల్లీ ధర్నా తరువాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం’అని రైతులకు హామీ ఇచ్చారు. పలువురు మంత్రులు కూడా ప్రైవేటు సంభాషణల్లో ఇదే విషయాన్ని చెప్తున్నా.. సీఎం కేసీఆర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకే.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేక సర్కార్గా జనం ముందు నిలబెట్టడంలో విజయం సాధించినట్టు భావిస్తున్న టీఆర్ఎస్ పెద్దలు.. ఇదే ఊపులో తాము మాత్రమే రైతాంగాన్ని ఆదుకోగలమనే సందేశం పంపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 11న ఢిల్లీలో జరిగే ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు పాల్గొని.. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. అంతా హైదరాబాద్కు తిరిగొచ్చాక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి.. పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోళ్లపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. గత యాసంగి కంటే వరిసాగు తగ్గడం, మిల్లర్లు, దళారుల కొనుగోళ్ల నేపథ్యంలో.. ఈసారి ప్రభుత్వ కేంద్రాలను తక్కువగానే ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కొనుగోలు ఇలా..! ► రైతులకు మద్దతుధర కింద సాధారణ ధాన్యాన్ని రూ.1,940 ధరతో, ఏ గ్రేడ్ ధాన్యాన్ని రూ.1,960 ధరతో కొనుగోలు చేసి.. ముడిబియ్యంగా మిల్లింగ్ చేయించాలనేది రాష్ట్ర సర్కారు ఆలోచన. ► గతంలో మాదిరిగా కాకుండా అవసరమైన మేరకే కొనుగోలు కేంద్రాలు తెరిచే అవకాశం. ► మిల్లర్లు ముడిబియ్యం ఎంతమేర కొంటారో చూసుకుని, మిగతా బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించాలనే యోచన. ► అదనపు నూకలను ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జన ► ఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,000 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. పెరిగే నూకలను ఏం చేద్దాం? ► సాధారణంగా క్వింటాల్ ధాన్యం మిల్లింగ్ చేస్తే.. బియ్యం, నూకలు కలిపి 67 కిలోలు వస్తాయి. ఇందులో 50 కిలోల బియ్యం, 17 కిలోల నూకలు ఉండటాన్ని ఎఫ్సీఐ అనుమతిస్తుంది. ఈ బియ్యం, నూకలను తీసుకుని.. క్వింటాల్ ధాన్యంగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వానికి కనీస మద్ధతు ధర అయిన రూ.1,960 చొప్పున చెల్లిస్తుంది. వానాకాలం ధాన్యం మిల్లింగ్ చేసినప్పుడు ఎఫ్సీఐ ప్రమాణాల మేరకు బియ్యం, నూకలు వస్తాయి. దానితో సమస్య ఉండదు. ► యాసంగిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మరో 17 కిలోల నూకలు అదనంగా వస్తాయి. అంటే సాధారణంగా వచ్చే 17 కిలోలు, ఈ 17 కిలోలు కలిపి 34 కిలోలు నూకలే వస్తాయి. మిగతా 33 కిలోలు మాత్రమే బియ్యం ఉంటాయి. ఈ క్రమంలోనే అదనపు నూకలను ఏం చేసుకోవాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. తగ్గిపోయే ఒక్కో కిలో బియ్యానికి రూ.30 చొప్పున లెక్కిస్తే.. ప్రతి క్వింటాల్ ధాన్యానికి రూ.400 నుంచి రూ.500 వరకు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని అంచనా. ఈ మొత్తాన్ని సర్కారు భరించగలిగితే రైతులకు న్యాయం జరుగుతుందని మిల్లర్లు కూడా చెప్తున్నారు. సర్కారు కొనడం లేదని దళారులు వస్తున్నరు నేను ఏడెకరాలలో వరి వేసిన. ఎకరానికి 40 బస్తాల లెక్కన వచ్చింది. సర్కారు కొనడం లేదంటూ దళారులు నా దగ్గరికొచ్చి వడ్లు కొనుక్కొనిపోయిన్రు. పెట్టుబడి పోను ఎకరానికి వెయ్యి రూపాయలు కూడా మిగలలేదు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు సెంటర్లు పెట్టాలి. – శివశంకర్, జకోరా, నిజామాబాద్ జిల్లా -
రైతులకు రూ.1,153 కోట్లు చెల్లించాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. ఇప్పటివరకు 17లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు ఆయన చెప్పారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 76,158 మంది రైతులకు రూ.1,153 కోట్ల చెల్లింపులు చేశామన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే నగదు జమ చేస్తున్నామన్నారు. ఇ–కేవైసీ, బ్యాంకు ఖాతాలో సమస్యలు ఉంటే కొంత జాప్యం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం రైతులకు మద్దతుగా నిలుస్తుంటే కొన్ని పత్రికలు ధాన్యం విక్రయించిన రైతులకు నగదు రావట్లేదంటూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయన్నారు. వారిపై ప్రభుత్వం న్యాయపరంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ఖరీఫ్లో 50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ప్రస్తుతం 4,837 ఆర్బీకేల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని, ఏప్రిల్ నాటికి లక్ష్యాన్ని పూర్తిచేస్తామని కమిషనర్ చెప్పారు. ఫోర్టిఫైడ్ బియ్యం మరో రెండు జిల్లాల్లో.. ఐరన్, ఫోలిక్ యాసిడ్, బి–12 విటమిన్ వంటి సూక్ష్మపోషకాలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీని దేశంలోనే తొలిసారిగా గతేడాది విజయనగరంలో ప్రారంభించినట్లు గిరిజాశంకర్ తెలిపారు. కొత్తగా విశాఖపట్నం, వైఎస్సార్ కడపలో కూడా ఈ బియ్యాన్ని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. జనవరి 18 నుంచి రెండు నెలల (డిసెంబర్, జనవరి) ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు. 1902, 155215 నంబర్లతో కమాండ్ కంట్రోల్ రూమ్ ధాన్యం కొనుగోలులో సమస్యల పరిష్కారానికి రాష్ట్రస్థాయిలో 1902, 155215 నంబర్లతో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటుచేసినట్లు పౌర సరఫరాల శాఖ ఎండీ వీరపాండియన్ తెలిపారు. పొలం వద్దే ధాన్యం కొనుగోలు చేసేలా మొబైల్ యాప్ను ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. ఆర్బీకేల్లో చేసే ఐదు రకాల టెస్టులను ఐఓటీ ఆధారంగా రియల్ టైమ్లో చేసేందుకు ఒక స్టార్టప్ కంపెనీ సహకారంతో కృష్ణాజిల్లాలో పైలట్ ప్రాజక్టుగా చేపట్టామన్నారు. త్వరలోనే దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామన్నారు. ప్రభుత్వ గోదాముల్లోకి రీసైకిల్డ్ బియ్యం రాకుండా గుర్తించేందుకు వీలుగా ఏజ్ టెస్టింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు వీరపాండియన్ తెలిపారు. -
11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
కరప: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ గిరిజాశంకర్ చెప్పారు. ఆయన గురువారం తూర్పుగోదావరి జిల్లా కరప, పాతర్లగడ్డ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుకు మద్దతు ధర అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయిస్తున్నారని చెప్పారు. రంగుమారిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తుపాన్లు, భారీవర్షాల కారణంగా రాష్ట్రంలో 2.48 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, 7.50 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోనే 1.30 లక్షల టన్నుల ధాన్యం తడిసిపోయిందన్నారు. రైతులను ఆదుకునేందుకు రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. మిల్లర్లు, కమీషన్ వ్యాపారులకు అమ్ముకోకుండా.. ఆర్బీకే సిబ్బంది కళ్లాల్లోకి వెళ్లి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రబీ సీజన్లో రైతులు బొండాలు (ఎంటీయూ 3626) రకం సాగుచేయవద్దని, వాటిని కొనుగోలుచేయబోమని చెప్పారు. రబీలో 40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయి బియ్యం పథకంలో 18 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తోందని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లు, ఇతర సంస్థలకు మరో 4 లక్షల టన్నుల బియ్యం వినియోగిస్తున్నట్లు తెలిపారు. మొత్తం మీద రాష్ట్రంలో 22 లక్షల టన్నుల బియ్యం వినియోగిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడొద్దు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎంపీలు తమ వాయిస్ను గట్టిగా వినిపించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్లో ఎంపీల ఆధ్వర్యంలో ముఖ్యంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో ఉభయ సభల్లో కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించాలన్నారు. ఇప్పటికే తాము.. చాలా ఓపిక పట్టామని.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేదీలేదని స్పష్టంచేశారు. కేంద్రం.. రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించడంలేదని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. -
కర్షకుడా... కదలిరా!
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలం టూ ఆందోళన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. టీపీసీసీ ఆధ్వర్యంలోగురువారం ఇక్కడి పబ్లిక్గార్డెన్స్ నుంచి బషీర్బాగ్లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ వరకు ‘కర్షకుడా.. కదలిరా’ పేరుతో రైతులతో ప్రదర్శన నిర్వహించ నుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అధ్యక్షతన మంగళవారం గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయిం చారు. సమావేశంలో భాగంగా పార్టీ సభ్యత్వంతో పాటు రైతుల సమస్యలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారుపై చర్చించారు. వడ్లను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించి వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రం ఇవ్వనున్నారు. అదే విధంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలంటూ మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరాలని కూడా కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం ఉదయం 10 గంటలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిల నేతృత్వంలో ఎన్నికల అధికారిని కలసి ఫిర్యాదు చేయనున్నారు. వెంకట్రామిరెడ్డిపై ఉన్న అవినీతి, భూకబ్జాల ఆరోపణల నేపథ్యంలో ఆయన నామినేషన్ను తిరస్క రించాలని కాంగ్రెస్ కోరనుంది. దీంతోపాటు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, 30 లక్షలకు తగ్గకుండా ఈసారి సభ్యత్వాన్ని పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. సమావేశానికి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, నేతలు హర్కర వేణుగోపాల్, దీపక్ జాన్ తదితరులు హాజరయ్యారు. -
Telangana: చి‘వరి’కి ఏమవుతుందో?
వానాకాలం సీజన్లో వచ్చే ధాన్యంలో కనీసం 80 లక్షల టన్నుల మేర తీసుకోవాలని ఎఫ్సీఐని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కానీ తొలుత 48 లక్షల టన్నులే సేకరిస్తామని ఎఫ్సీఐ చెప్పింది. తర్వాత 60 లక్షల టన్నులు తీసుకునేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో మిగతా ధాన్యాన్ని ఎవరు సేకరించాలన్నది ప్రశ్నగా మారింది. దీనిపై ఇంతవరకు స్పష్టత లేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం వరిపంట కోతకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ధాన్యం కొనుగోళ్లపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ధాన్యం సేకరణ విషయంగా కేంద్రం నుంచి మద్దతు కొరవడటం, అదే సమయంలో రాష్ట్రంలో భారీగా ధాన్యం దిగుబడి రానుండటంతో అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో కనీసం 90 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా.. కేంద్రం 60 లక్షల టన్నులకు మించి సేకరించలేమని కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఏమిటి, కొన్నా ఎక్కడ నిల్వ చేయాలి, ఇందుకు ఏమేం చర్యలు తీసుకోవాలి అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అంత కొనలేం..! రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలంలో నీటి లభ్యత పెరగడంతో రైతులు భారీగా వరి సాగు చేశారు. సుమారు 1.38 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని.. ఇందులో స్థానిక అవసరాలు, మిల్లర్ల అవసరాలు, పొరుగు రాష్ట్రాల నుంచి జరిగే క్రయవిక్రయాలు పోనూ కనీసం 90 లక్షల టన్నులకుపైగా సేకరించాల్సి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. గత ఏడాది వానాకాలం లో 48.85 లక్షల టన్నులే సేకరించగా.. యాసంగిలో రికార్డు స్థాయిలో 92 లక్షల టన్నుల సేకరణ జరిగింది. అయితే ప్రస్తుత వానాకాలంలో ధాన్యం సేకరణకు సంబంధించి భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) అనేక కొర్రీలు పెడుతోంది. ధాన్యం తక్కువగా కొంటామని, అందులోనూ ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) తీసుకోబోమని చెప్తోంది. మిల్లుల్లోనే ధాన్యం.. గోదాముల కొరత గత యాసంగికి సంబంధించిన ఉప్పుడు బియ్యాన్ని తీసుకునే విషయంలోనే ఎఫ్సీఐ కొర్రీలు పెడుతూ వచ్చింది. 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే తీసుకుంటామని పేర్కొంది. అయితే రాష్ట్రం ఒత్తిడితో మరో 20 లక్షల టన్నులు తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఇందులో మొత్తంగా 44.75 లక్షల టన్నులకుగాను ఎఫ్సీఐ ఇప్పటివరకు మిల్లర్ల నుంచి 18 లక్షల టన్నులే తీసుకుంది. మరో 26 లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉంది. ఈ ధాన్యా న్ని కూడా ప్రతి నెలా 3–4 లక్షల టన్నులకు మించి తరలించలేకపోతోంది. ప్రస్తుత నిల్వలు ఖాళీ అయ్యేందుకు సమయం పట్టే అవకాశముంది. గోదాములు ఇప్పటికే నిండిపోయాయి. మరోవైపు వానాకాలం దిగుబడులు పోటెత్తనున్నాయి. దీంతో ఆ ధాన్యం నిల్వ సమస్యగా మారుతోంది. కార్యాచరణ ప్రణాళిక ఏదీ? రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికీ కార్యాచరణ ఖరారు కాలేదు. దసరాకు ముందే ప్రణాళిక సిద్ధం చేసి, ఆ తర్వాత కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉన్నా ఇంతవరకు ప్రక్రియ మొదలుకాలేదు. గత ఏడాది వానాకాలంలో 48.85 లక్షల టన్నుల మేర చేసిన సేకరణ కోసం 600కుపైగా కొనుగోలు కేంద్రాలు అవసరమయ్యాయి. ఈ ఏడాది భారీగా కొనుగోళ్లు చేయాల్సి ఉండటంతో.. రెట్టింపు కొనుగోలు కేంద్రాలు అవసరమని అంచనా. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద ఈ–అకౌంటింగ్ నిర్వహించడంతోపాటు, నిర్వాహకులు కంప్యూటర్, ప్రింటర్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. దీనితోపాటు కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కోసం షెల్ట ర్లు, తాగునీరు, మరుగుదొడ్లు, అవసరమైన ప్లాడీ క్లీనర్లు, విన్నోవింగ్ మెషీన్లు, మాయిశ్చర్ మీటర్లు, టార్పాలిన్లను సమకూర్చుకోవాలి. ఈ ఏర్పాట్లకు సంబంధించి వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. -
ధాన్యం కొనుగోళ్లలో ఘరానా మోసం
-
గ్రామ స్థాయిలోనే మద్దతు ధర
సాక్షి, అమరావతి : ధాన్యాన్ని ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే కొనుగోలు చేస్తుండటంతో రవాణా ఖర్చులు తగ్గిపోవడంతో పాటు రైతులకు మద్దతు ధర దక్కుతోంది. ధాన్యం విక్రయించేందుకు రైతులు ఎలాంటి ఆందోళనకు గురవ్వకుండా ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. ఖరీఫ్ ధాన్యానికి సంబంధించి ఏ–గ్రేడ్ క్వింటాల్కు రూ.1,888, సాధారణ రకం క్వింటాల్కు రూ.1,868 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు ప్రభుత్వం గ్రామాల్లోనే తగిన ఏర్పాట్లు చేయటం వల్ల దళారులు, వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఇటీవల తుపానుకు తడిసిపోయి రంగు మారిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నిబంధనలను సడలిస్తూ జారీ చేసిన సర్క్యులర్ను పౌర సరఫరాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపింది. ఈ మేరకు ఈ–క్రాప్లో నమోదైన వివరాల ఆధారంగా నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తారు. ఈ–క్రాప్ నమోదుకు సంబంధించి సందేహాలు ఉంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి అగ్రికల్చరల్ అసిస్టెంట్ల ద్వారా అనుమానాలను నివృత్తి చేసుకునే వెసులుబాటు కల్పించారు. రైతులు నష్టపోకుండా తేమ శాతం కొలిచే, ధాన్యం ఆరబెట్టేందుకు అవసరమైన యంత్రాలు, జల్లెడ వంటి వాటిని అందుబాటులోకి తెచ్చారు. మద్దతు ధర కంటే ఎక్కువ ధర వస్తుందనుకుంటే ధాన్యాన్ని బయట మార్కెట్లో కూడా విక్రయించుకోవచ్చు. 8.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ► ఈ సీజన్లో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించగా ఇప్పటి వరకు రూ.1,582 కోట్ల విలువ చేసే 8.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో రూ.831.75 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ► రైతు భరోసా కేంద్రాలు, కొనుగోలు కేంద్రాల వద్ద హెల్ప్డెస్క్లను కూడా ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో రైతులకు సరైన సమాధానం రాకపోతే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాల కమిషనర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (18004251903)ను అందుబాటులోకి తెచ్చారు. ► ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 3.56 లక్షల మెట్రిక్ టన్నులు, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 173 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన 10 రోజుల్లోగా అందుకయ్యే మొత్తాన్ని జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. -
15 రోజుల్లోగా రైతులకు నగదు చెల్లించాలి
సాక్షి, అమరావతి: ధాన్యం సేకరించిన 15 రోజుల్లోగా రైతులకు నగదు చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో ధాన్యం సేకరణకు సంబంధించి పౌరసరఫరాల శాఖ అధికారులతో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) వద్ద రిజి్రస్టేషన్ చేయించుకున్న తర్వాత 15 రోజుల లోపలే ధాన్యం కొనుగోలు చేయాలని.. అంతకుమించి ఆలస్యం చేయొద్దని సూచించారు. రైతులు, సేకరణ వివరాలు ఆర్బీకేల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. రైతులకు కనీస మద్దతు ఇస్తూ గ్రామ స్థాయిలో ధాన్యం సేకరిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలు అమ్ముడుపోకుండా ఉంటే వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) స్థాయిలో 5,812 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు సీఎంకు వివరించారు. -
ధాన్యం కేసులో టీడీపీ నేత, మరో ఐదుగురి అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): రైతుల నుంచి కారు చౌకగా ధాన్యాన్ని కొనుగోలు చేసి, ప్రభుత్వానికి అధిక ధరకు విక్రయించి అటు రైతులను, ఇటు ప్రభుత్వాన్ని మోసం చేసిన టీడీపీ నేతతో పాటు మరో ఐదుగుర్ని నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ హరినాథ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత జి.జయపాల్, మనుబోలు మండలం లక్ష్మీనరసాపురం గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత కరియావుల మధుసూదన్రావు ఈ వ్యవహారంలో కీలక పాత్రధారులు. వీరు కొంతమంది దళారులు, రైస్ మిల్లర్లతో కలిసి రైతుల నుంచి అతి తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి.. వాటిని తామే పండించినట్టు చూపించి వెంకటాచలం మండలం నిడిగుంటపాలెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వానికి అధిక ధరకు విక్రయించారు. దీనిని గుర్తించిన డీఆర్డీఏ ఇందుకూరుపేట ఏరియా కో–ఆర్డినేటర్ కనుపూరు శ్రీనివాసులు ఈ నెల 3న వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు టీడీపీ నేత కరియావుల మధుసూదన్రావు, గుంటూరు జిల్లా కర్లపాలెంకు చెందిన శ్రీలక్ష్మి వెంకటసాయి మణికంఠ రైస్మిల్లు యజమాని బి.శ్రీనివాసరావు, కోవూరు మండలం ఇనుమడుగు గ్రామానికి చెందిన పి.మల్లికార్జునరెడ్డి, వెంకటాచలం మండలం ఈదగాలికి చెందిన ఉప్పు పద్మనాభం, వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన మస్తాన్, కిశోర్లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుల్లో ఒకరైన టీడీపీ నేత జయపాల్ పరారీలో ఉండటంతో అతని కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. -
ధాన్యం అమ్ముకునేందుకు దిగులొద్దు..
సాక్షి, అమరావతి: ధాన్యం అమ్ముకునేందుకు రైతులెవరూ దిగాలు చెందకుండా ప్రతి గింజా కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సూర్యకుమారి వెల్లడించారు. రైతులకు రవాణా ఖర్చుల భారం పడకుండా కళ్లాల వద్దే కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలు, రైతులకు మద్దతు ధర కల్పించే విషయమై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బుధవారం ఆమె ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని రైతులు తీసుకొస్తే రవాణా చార్జీలు చెల్లిస్తామన్నారు. ఆమె ఇంకా చెప్పారంటే.. ► ఖరీఫ్ సీజన్కు సంబంధించి 61 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఆ మేరకు ప్రస్తుతం 2,620 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. అవసరమైతే ఇంకా ఏర్పాటు చేస్తాం. ► అనంతపురం, కర్నూలు మినహా మిగిలిన జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఆ రెండు జిల్లాల్లోనూ ధాన్యం విక్రయించే రైతులు ఉంటే కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ధాన్యానికి మద్దతు ధర ‘ఏ’ రకం క్వింటాల్కు రూ.1,880, సాధారణ రకానికి రూ.1,868లుగా నిర్ణయించాం. తేమ 17 శాతంలోపు ఉంటే వెంటనే కొనుగోలు చేస్తాం. తేమ 17 నుంచి 23 శాతం వరకు ఉంటే ధాన్యాన్ని కళ్లాల్లో ఆరబెట్టాలని రైతులకు చెప్పి ఆ తర్వాత కొనుగోలు చేస్తాం. ► మద్దతు ధర ఇవ్వకుండా ఎవరైనా మోసం చేస్తే టోల్ఫ్రీ నంబర్లకు 1902, 18004251903 ఫోన్ చేయొచ్చు. ► పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ధాన్యం కొనుగోలు సమయంలో ప్రతి రకం ధాన్యాన్ని వేర్వేరుగా సేకరిస్తాం. ఆర్బీకేలలో రైతులు పేర్లు నమోదు చేసుకోవాలి... రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) ధాన్యం పండించిన రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఆర్బీకేలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనుసంధానం చేశాం. ప్రతి ఆర్బీకేలో కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన ఒకరు అందుబాటులో ఉంటారు. ఆర్బీకేల్లోని వ్యవసాయ సహాయకులను రైతులు కలిస్తే మొత్తం వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తారు. రైతు పేరు, ఆధార్కార్డు, బ్యాంకు పాస్పుస్తకం, పొలం వివరాలు, ఫోన్ నంబర్ ఇవ్వాలి. ఇలా వివరాలు నమోదు చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారనే విషయాన్ని ముందుగానే రైతులకు తెలియజేస్తారు. ధాన్యం విక్రయించిన పది రోజుల్లోగా రైతు బ్యాంకు ఖాతాకు డబ్బు జమ చేస్తాం. వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని కొనేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. -
రైతుల చేతికి ముందే కూపన్లు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ ధాన్యాన్ని నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల సంస్థ పక్కా ఏర్పాట్లు చేసింది. వరి పండించిన రైతులకు ఈసారి ముందుగానే కూపన్లు పంపిణీ చేస్తారు. కూపన్లో అన్ని వివరాలు నమోదు చేసి.. సంబంధిత ఉద్యోగి సంతకం చేయాల్సి ఉంటుంది. కూపన్లో పేర్కొన్న వివరాల ఆధారంగా రైతుల పొలాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు రూ.1,888, సాధారణ రకం ధాన్యం క్వింటాల్కు రూ.1,868 చొప్పున రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తారు. రబీ ధరతో పోలిస్తే క్వింటాల్కు రూ.53 చొప్పున ధర పెరిగింది. ఈ–క్రాప్ ఆధారంగా.. రైతులు దళారులు, వ్యాపారులను ఆశ్రయించి ధర, తూకాల్లో మోసపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఈ–క్రాప్లో నమోదైన వివరాల ఆధారంగా నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తారు. సాగు వివరాలను ఈ–క్రాప్ ద్వారా ఇప్పటివరకు నమోదు చేసుకోని రైతులు రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి అగ్రికల్చరల్ అసిస్టెంట్ల ద్వారా వెంటనే నమోదు చేయించుకోవాలి. ఈ–క్రాప్ నమోదు కోసం వెళ్లే రైతులు ఆధార్ కార్డు, సెల్ ఫోన్, బ్యాంక్ పాస్ బుక్ వివరాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అవసరమైతే పొలానికి సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకం కాపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జియో ట్యాగింగ్ తప్పనిసరి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే వాహనాలకు తప్పనిసరిగా జియో ట్యాగింగ్ ఉండాలి. ధాన్యంలో 17 శాతం తేమ, దెబ్బతిన్నవి లేదా మొలకెత్తిన గింజలు 5 శాతం, కుచించుకుపోయిన గింజలు 3 శాతానికి మించి ఉండకూడదు. తేమ శాతం కొలిచే యంత్రాలు, ధాన్యాన్ని ఎండబెట్టేందుకు అవసరమైన యంత్రాలు, జల్లెడ వంటి వాటిని మార్కెటింగ్ శాఖ సమకూరుస్తుంది. ధాన్యం కొనుగోలు సందర్భంగా ఎవరైనా మోసం చేస్తున్నట్టు గుర్తించినా లేదా ధాన్యం సేకరణలో సమస్యలు తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్ 1902 లేదా 1800–425–1903కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఎక్కువ ధర వస్తే బయట అమ్ముకోవచ్చు రైతులు తమ వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకుని.. కూపన్ పొందినా మద్దతు ధర కంటే ఎక్కువ ధర వస్తే బయట మార్కెట్లో విక్రయించుకోవచ్చు. ఖరీఫ్లో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఎక్కడా అవకతవకలు జరగకుండా చూసేందుకు గతంలో ఎప్పుడూ లేనివిధంగా రైతులకు ముందుగానే కూపన్లు ఇస్తాం. ఆ తర్వాత రైతుల పొలం వద్దకే వెళ్లి ధాన్యం కొంటాం. – కోన శశిధర్, ఎక్స్–అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ -
ఖరీఫ్ లక్ష్యం 62 లక్షల మెట్రిక్ టన్నులు
సాక్షి, అమరావతి: ఖరీఫ్లో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. గతేడాది ఖరీఫ్లో 1,706 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.55 లక్షల మంది రైతుల నుంచి రూ.8,705 కోట్ల విలువ చేసే 47.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఖరీఫ్లో 16.30 లక్షల హెక్టార్లలో వరి సాగు అవుతుండగా.. దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున 62 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆహార శాఖ దృష్టికి రాష్ట్ర అధికారులు తీసుకెళ్లారు. 1.50 కోట్ల కార్డుదారులకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో సంబంధిత రకాల ధాన్యాన్ని విడిగా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తద్వారా బియ్యంలో కల్తీ లేకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. గన్నీ బ్యాగులతో సమస్య.. ► దాన్యం కొనుగోలు, బియ్యం సరఫరాకు గన్నీ బ్యాగ్ల సమస్య వెంటాడుతోంది. ► వెంటనే 4.30 కోట్ల (86 వేల బేళ్ల) గన్నీ బ్యాగ్ల కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ► గన్నీ బ్యాగ్లను పశ్చిమ బెంగాల్ నుంచి సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆహార శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ► ప్రస్తుతానికి ఇబ్బందులు రాకుండా పాత గన్నీ బ్యాగ్లను రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్ల నుంచి సేకరించాలని నిర్ణయం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలివీ.. ► ధాన్యం కొనుగోళ్లలో అవకతవకల నివారణకు క్షేత్ర స్థాయిలో పకడ్బందీ చర్యలు. ► కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి విక్రయించకుండా సరిహద్దుల వద్దే అడ్డుకుంటారు. ► ప్రతి రైతుకూ మద్దతు ధర కల్పించేందుకు వీలుగా గ్రామ స్థాయిలోనే ధాన్యం కొనుగోళ్లు. ► ఈ–క్రాప్ డేటా ఆధారంగా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు, ధాన్యం కొనుగోళ్లు. ► కౌలు రైతులు, పట్టాదారుల పేర్లు ఈ–క్రాప్ ద్వారా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లచే నమోదు. ► మద్దతు ధరకు కొనుగోలు చేయకపోయినా, తూకాల్లో మోసం చేస్తున్నట్టు అనుమానం వచ్చినా రైతులు 1902 నంబర్కు ఫోన్ చేయవచ్చు. ► ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.1,728 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి లేఖ. భారీగా ధాన్యం కొనుగోలు ఖరీఫ్లో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేశాం. గన్నీ బ్యాగ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్రాన్ని కోరాం. కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,728 కోట్ల పాత బకాయిలు విడుదల చేయాలని ఇప్పటికే లేఖ రాశాం. – కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ -
మూడో పంట పండింది
జనగామ: వరి సాగు ఏడాదికి ఎన్నిసార్లు సాగు చేస్తారని అడిగితే ఎవరైనా రెండు సార్లు అంటూ సమాధానం చెబుతారు. కానీ జనగామ జిల్లా రైతులు మాత్రం మూడుసార్లు సాగు చేస్తామని అంటారు. ఏటా రబీ, వానాకాలం సాగు మధ్యలో కత్తెర పంటను సాగుతో అదనపు ఆదాయం సాధిస్తారు. మూడో పంట (కత్తెర) సాగుకు అనుకూలమైన నేలలు ఉండటంతో రైతులకు కలసి వస్తుంది. ఏప్రిల్ చివరి వారం నుంచి సాగు పనులు మొదలుపెట్టి, ఆగస్టు మొదటి వారంలో కోతలను ప్రారంభిస్తారు. ఈసారి గోదావరి జలాల పరుగులతో పాటు జోరుగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరగడంతో జిల్లాలో సుమారు 30 వేల ఎకరాలకు పైగా కత్తెర పంట సాగు చేయగా, 54 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. కొనుగోళ్లు ప్రారంభం కత్తెర పంటకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న జనగామ జిల్లాలో ఆగస్టు 24వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యా యి. ఎకరాకు 30 బస్తాలకుపైగా దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పది వేల బస్తాలకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు అంచనా. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కొనుగోళ్లకు అనుమతులు లేకపోవడంతో ప్రైవేట్ వ్యా పారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత ఆధారంగా క్వింటా ధాన్యానికి రూ.1,220 నుంచి రూ.1440 వరకు ధర లభిస్తోంది. -
రబీలో రికార్డు
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2019–20 రబీ సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 31.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. గత ఏడాది రబీ సీజన్ కంటే ఈ ఏడాది 3.61 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా అదనంగా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ► దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మొత్తం 119 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, ఇందులో మొదటి రెండు స్థానాలు తెలుగు రాష్ట్రాలు దక్కించుకున్నాయి. ► తెలంగాణ 64 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 31.14 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రెండో స్థానంలో నిలిచాయి. ► లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో తొలుత ధాన్యం సేకరణ కొంత ఆలస్యమైనా సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ సారి రైతుల కల్లాల వద్దకే వెళ్లి కొనుగోలు చేశారు. దీంతో రైతులకు రవాణా కష్టాలు కూడా తగ్గాయి. ► గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వ చర్యల వల్ల దళారుల మోసాల నుంచి రైతులకు మిముక్తి లభించింది. ► రబీలో 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. కాగా, 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేయాలని నిర్ణయం. ► ఇప్పటి వరకు 31.14 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ. ► గ్రేడ్–ఏ రకం ధాన్యం క్వింటాల్కు రూ.1,835, సాధారణ రకం ధాన్యానికి రూ.1,815లను మద్దతు ధరగా నిర్ణయించారు. ► ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా రేపటి (జూన్ 20 శనివారం) వరకే కొనుగోలు చేస్తారు. ► మొత్తం 1,434 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ. -
'వరి'వడిగా..
సాక్షి, అమరావతి: ఈసారి రబీలో రికార్డు స్థాయిలో వరి సాగు కావడంతో కోతలు ముమ్మరమయ్యాయి. లాక్డౌన్ ఆంక్షలు లేకుంటే ఈపాటికే ధాన్యలక్ష్మి సిరులొలికించేది. కూలీల కొరత లేదు, యంత్రాలూ సిద్ధంగా ఉండటంతో కోతలు జోరందుకున్నాయి. కొన్నిచోట్ల రబీ ధాన్యం కొనుగోలులో మిల్లర్లు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు అందటంతో తక్షణమే సమస్యను పరిష్కరించాలని పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖలను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ ఇలా... ► ఖరీఫ్లో 48.10 లక్షల టన్నుల ధాన్యాన్ని 4,57,823 మంది రైతుల నుంచి సేకరించారు. దీని విలువ రూ.8755 కోట్లు ఉంటుంది. 11 జిల్లాల్లో 1702 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రబీలో ఎలా జరుగుతోందంటే... ► ఇప్పటివరకు 1,295 ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కర్నూలు, అనంతపురంలో తెరవాల్సి ఉంది. ► 1.63 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటి విలువ రూ.299.28 కోట్లు ఉంటుంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల ప్రకారమే ధాన్యం సేకరణ జరుగుతోంది. వరి సాగు ఇలా... ► ఖరీఫ్లో 15,18,984 హెక్టార్లలో వరి సాగు లక్ష్యం కాగా 14,67,069 హెక్టార్లు సాగు అయింది. రబీలో సాగు విస్తీర్ణ లక్ష్యం 6,98,398 హెక్టార్లు కాగా అంతకుమించి రికార్డు స్థాయిలో 8,06,803 హెక్టార్లలో సాగయింది. రబీలో 60,14,189 టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. ► ఖరీఫ్లో హెక్టార్కు దిగుబడి 5,248 కిలోలు కాగా రబీలో హెక్టార్కు రికార్డు స్థాయిలో 7,095 కిలోలు ఉండవచ్చని భావిస్తున్నారు. తెలంగాణలో రబీలో హెక్టార్కు 5,928 కిలోలు దిగుబడి ఉంది. ► లాక్డౌన్తో రబీ కోతలకు ఎలాంటి ఇబ్బందులు లేవని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ► అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి వరి కోత యంత్రాలను అవసరాలకు తగ్గట్టుగా పంపిస్తున్నారు. ► రాష్ట్రంలో 2,985 కంబైన్డ్ హార్వెస్టర్లు, 1,746 వరి రీపర్లు అందుబాటులో ఉన్నాయి. యంత్రాల అద్దె గంటకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు ఉంది. ఇంతకు మించి ఎక్కడైనా అదనంగా వసూలు చేస్తే సమీపంలోని వ్యవసాయాధికారికి లేదా 1902కి రైతులు ఫిర్యాదు చేయవచ్చు. రైతులకు వ్యవసాయ కమిషనర్ సూచనలు ఇవీ... ► లాక్డౌన్ వల్ల కూలీలు వెళ్లలేని ప్రాంతాలకు సైతం హార్వెస్టర్లను తరలిస్తున్నందున రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ► ఇతర జిల్లాల నుంచి కూడా హార్వెస్టర్లను తెప్పించి పాస్లు ఇచ్చాం. యంత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ► ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్ రూ.1815, ఏ గ్రేడ్ రకం రూ.1835కి కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశాం. ఈ ధర కన్నా ఎవరూ తక్కువకు అమ్ముకోవద్దు. ► వరి కోతలు, ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించండి. మాస్క్లు ధరించండి. 3 కిలోల అదనంపై సీఎంకు ఫిర్యాదు... ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు క్వింటాల్కు అదనంగా మూడు కిలోలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా తిరువూరు రైతులు రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రక్షణ నిధి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. సాధారణంగా 17 శాతం తేమను బట్టి ధాన్యాన్ని తీసుకోవాల్సి ఉండగా 21 శాతం తేమ ఉందంటూ తరుగు తీసుకుంటున్నారని, గోనె సంచులు రైతులే తెచ్చుకోవాలంటూ మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా ఒక్కో రైతు సుమారు రూ.55 వరకు నష్టపోతుండటంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించింది ‘మా జిల్లాలో 80 శాతం వరికోతలు యంత్రాల ద్వారానే సాగుతున్నాయి. లాక్డౌన్ ప్రారంభంలో రూ.3,000 చొప్పున అద్దె వసూలుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంది’ – కె.చిరంజీవి, పెరవలి,పశ్చిమ గోదావరి జిల్లా -
రైతు చెంతకే వెళ్లి ధాన్యం కొనుగోలు
కాకినాడ రూరల్: రైతు చెంతకే వెళ్లి రబీ ధాన్యం కొనుగోలు చేయనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రైతులు తమ పంటల వివరాలను గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్ల వద్ద నమోదు చేసుకోవాలని, ఆ వివరాల ఆధారంగా నేరుగా రైతుల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తామని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పీపీసీ), మార్క్ఫెడ్ ద్వారా ధాన్యం, ఇతర పంటలు కొనుగోలు చేస్తామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ–క్రాప్లో ఉన్న ప్రతి పంటనూ కొనుగోలు చేయడంతో పాటు వెబ్ల్యాండ్లో లేని భూములను కూడా పరిశీలించి, వాటిలో వరి సాగు ఉంటే ఆ పంట కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రతి జిల్లాలో వ్యవసాయ శాఖ జేడీ ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేశామన్నారు. వరి కోత యంత్రాలకు కొరత లేకుండా చూడటం, వాటికి అద్దెను నిర్ణయించడంతో పాటు పర్యవేక్షణ బాధ్యతలను జాయింట్ కలెక్టర్లకు అప్పగించామన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► గత నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 57 వేల మెట్రిక్ టన్నుల అరటి కొనుగోళ్లు జరిగాయి. ► మామిడికి స్థానికంగా తక్కువ ధర వస్తే కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. ► గుంటూరు జిల్లాలో మిర్చికి సంబంధించి కూలీలు, రవాణా సమస్యలు లేకుండా చర్యలు తీసుకున్నాం. సమస్యలు ఉంటే 1902 నంబర్కు రైతులు ఫిర్యాదు చేయాలి. ► వచ్చే ఖరీఫ్కు అన్ని రకాలూ కలిపి 8 లక్షల క్వింటాళ్ల విత్తనాలు కావాలి. ఇప్పటికే 6 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ► ఏయే జిల్లాల్లో ఏయే పంటలు ఏయే కాలాల్లో దిగుబడికి వస్తాయనే దానిపై పంటల దిగుబడి కేలండర్ రూపొందిస్తున్నాం. ► పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు వ్యాపారులు కరోనా సాకుతో రైతుల నుంచి తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది. వారిపై చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేసి లెవీ చూపేందుకు కొందరు మిల్లర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. వీటికి వారు స్వస్తి చెప్పాలి. ► పట్టుగూళ్లకు సంబంధించి హిందూపురం, ధర్మవరం, కదిరి మార్కెట్లలో కిలోకు రూ. 250 నుంచి రూ. 300 పలుకుతుండగా చేబ్రోలులో రూ.130 మాత్రమే వస్తోంది. దీనిపై ఉద్యానవన కమిషనర్తో మాట్లాడి, ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా కర్ణాటక, ఇతర రాష్ట్రాల బయ్యర్లను రప్పించాలని కోరాం. ► రాష్ట్రంలో 101 రైతుబజార్లు, 402 డీసెంట్రలైజ్డ్ రైతుబజార్లు, 260 మొబైల్ రైతుబజార్లు, 926 టేక్ హోమ్ డోర్ డెలివరీ, 38,440 కిరాణా, నిత్యావసర సరుకుల దుకాణాలు అందుబాటులో ఉన్నాయి. ► ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. కుంటి సాకులతో రైతులను వ్యాపారులు నష్టపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ► నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, కేంద్ర సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమదిగా ప్రచారం చేసుకుంటోందనే చౌకబారు ఆరోపణలను టీడీపీ నాయకులు మానుకోవాలి. -
44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్కు సంబంధించి రైతుల నుంచి ఇప్పటివరకు 44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు అంశంపై కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రెండవ, మూడవ త్రైమాసికాలకు సంబంధించి ధాన్యం నిధులు విడుదల కాకపోవడం వల్ల చెల్లింపుల్లో స్వల్ప జాప్యం జరిగిందన్నారు. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. బ్యాంకులు, నాబార్డ్ నుంచి అడ్వాన్సులు తీసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చెల్లింపులు జరపాలని ఆదేశించారని చెప్పారు. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను బుధవారం చెల్లిస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ చెప్పారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తప్పుడు వార్తలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా 1902కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 1నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ఉభయ గోదావరి జిల్లాల్లో ఏప్రిల్ కు1వ తేదీ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని కోన శశిధర్ చెప్పారు. కృష్ణా జిల్లాలో మినునులు, పెసలు పంట వేయడం వల్ల ధాన్యాన్ని ముందుకు తీసుకురాలేకపోతున్నట్లు రైతులు చెబుతున్నారన్నారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు ఎప్పుడు వీలైతే అప్పుడే ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయించవచ్చన్నారు. -
రైతులకు చకచకా చెల్లింపులు
సాక్షి, అమరావతి : ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాలపై పంపిణీ చేసే బియ్యానికి సంబంధించి అవసరమైన ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు రూ.1,835, సాధారణ రకం ధాన్యం క్వింటాల్కు రూ.1,815 చొప్పున మద్దతు ధర చెల్లిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రైతులు ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తోంది. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పౌర సరఫరాల శాఖకు కేటాయించిన నిధులను ఇతర పథకాలకు మళ్లించడంతో సంస్థ ఖజానా ఖాళీ అయింది. ఫలితంగా రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి రైతు ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ చేసేందుకు వీలుగా నిధులు కేటాయింపజేశారు. ధాన్యం సొమ్ము కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా 48 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఖరీఫ్లో ఇప్పటివరకు 10.24 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లైస్ అధికారులు సేకరించారు. దీనికి సంబంధించి 84,683 మంది రైతులకు రూ.1,416.62 కోట్లు చెల్లించారు. మరో 26,369 మంది రైతులకు రూ.451.34 కోట్లు త్వరలోనే వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం సేకరణ కేంద్రాల వివరాలు, కనీస మద్ధతు ధర వంటి వాటిపై రైతులకు అవగాహన కల్పిస్తూ దళారులను నియంత్రిస్తున్నారు. స్వయం సహాయక, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్లు), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా ఉభయ గోదావరి జిల్లాల్లో దిగుబడి వచ్చింది. జిల్లాల వారీగా ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం, బిల్లుల చెల్లింపు వివరాలిలా ఉన్నాయి. సకాలంలో చెల్లిస్తాం రైతులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తాం. దళారులను ఆశ్రయించకుండా రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే మోసాలకు అవకాశం ఉండదు. దళారులను ఆశ్రయిస్తే తూకాల్లో మోసం చేసే అవకాశం ఉంది. క్షేత్ర స్థాయిలో రైతులకు ఇబ్బందులు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళితే తక్షణమే పరిష్కరిస్తారు. –కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ -
62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి ఏటేటా భారీగా ధాన్యం దిగుబడి పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు పౌరసరఫరాల శాఖ 11 లక్షల మంది రైతుల నుండి 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో ఖరీఫ్లో 3,297 కొనుగోలు కేంద్రాల ద్వారా 8,09,885 మంది రైతుల నుండి 40.41 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. రబీలో ఇప్పటివరకు 3,447 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.52 లక్షల మంది రైతుల నుండి 22.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిం దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలతో గిట్టుబాటు ధర పంటకు కనీస గిట్టుబాటు ధర లభిస్తుందన్న భరోసాతో రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ధాన్యం కొనుగోలు, కొనుగోలు కేంద్రాల సమాచారాన్ని రైతులకు సెల్ఫోన్ ద్వారా అందించేలా, కనీస మద్దతు ధర చెల్లింపులతో రైతులకు మరింత ప్రయోజనం కలిగేలా ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఓపీఎంఎస్) సాఫ్ట్వేర్ను పౌరసరఫరాల శాఖ అభివృద్ధి చేసింది. రేషన్ డీలర్ల నుంచి గోనె సంచులను సేకరించింది. ధాన్యం రవాణాలో ఎలాంటి జాప్యం లేకుండా ఏరోజుకారోజు ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. ఫిర్యాదుల స్వీకరణకు పౌరసరఫరాల శాఖ కేంద్ర కార్యాలయంలో ముగ్గురు సీనియర్ అధికారులతో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నంబర్ 1800 425 00333, వాట్సప్ నంబర్ 7330774444లను అందుబాటులో ఉంచింది. కంట్రోల్ రూంకు 506 ఫిర్యాదులు రాగా 477 పరిష్కరించింది. ముమ్మర పర్యటనలు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నల్లగొండ, సూర్యాపేట్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. అకాల వర్షాలు, మండుటెండల నేపథ్యంలో ధాన్యం సేకరణలో సమస్యలు రాకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా పౌరసరఫరాల శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి సూచనల మేరకు కమిషనర్ అకున్ సబర్వాల్ ప్రతిరోజూ జిల్లా జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. -
ధాన్యం కుప్పపైనే తనువు చాలించిన రైతన్న
ఎల్లారెడ్డి: ఎండ దెబ్బ తగిలి ఓ రైతు ధాన్యం కుప్పపైనే తనువు చాలించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ గ్రామ శివారులోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద చోటు చేసుకుంది. మండలంలోని కొట్టాల్ గ్రామానికి చెందిన బోదాస్ గోపాల్ (49) వారం క్రితం తన రెండెకరాలలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. రోజూ ధాన్యం కుప్ప వద్ద ఎండలో కాపలాగా ఉన్నాడు. మంగళవారం ధాన్యం తూకం వేయగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలోనే ఉన్నాడు. రాత్రి యథావిధిగా ధాన్యం కుప్ప వద్ద నిద్రించాడు. బుధవారం ఉదయం తోటి రైతులు గోపాల్ను నిద్ర లేపగా, లేవకపోవడంతో కుటుంబీకులకు సమాచారమిచ్చారు. అధికారుల నిర్లక్ష్యంతోనే గోపాల్ మృతి చెందాడని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని రైతులు ధర్నా నిర్వహించారు. అధికారులు ధాన్యం తరలించేందుకు లారీలను ఏర్పాటు చేయలేదని, తూకం వేయడంలో ఆలస్యం వల్లే ఎండలో కాపలా ఉన్న రైతు ఎండదెబ్బ తగలి మృతిచెందినట్లు ఆరోపించారు. పోలీ సులు రైతులను సముదాయించారు. జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డితో మాట్లాడి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామనడంతో ధర్నా విరమించారు. -
రూ.20.17 కోట్లు కడ్తా పేరిట దోపిడీ
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది.. రైతాంగం రూ.కోట్లల్లో నష్టపోతోంది.. తరుగు పేరుతో మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు కలిసి రూ.కోట్ల విలువైన ధాన్యం కొల్లగొడుతున్నారు. కడ్తా అంటూ విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. దళారుల కంటే దారుణమైన రీతిలో సర్కారీ కొనుగోలు కేంద్రాల్లో అంతు లేని అవినీతి కొనసాగుతోంది. ఆయా కేంద్రాల్లో తరుగు పేరుతో రైతుల ధాన్యం క్వింటాలుకు ఐదు కిలోల చొప్పున కోత పెడుతున్నారు. తూకం వేసినప్పుడు రెండు నుంచి నాలుగు కిలోల వరకు, అలాగే తూకం వేసిన ఈ ధాన్యం లారీని దించుకునేటప్పుడు రైస్మిల్లరు మరో రెండు నుంచి నాలుగు కిలో.. ఇలా కనీసం క్వింటాలుకు ఐదారు కిలోల వరకు కోత పెడుతున్నారు. ఇలా తరుగు పేరుతో ఇప్పటివరకు నిర్వాహకులు, మిల్లర్లు కలిసి చేసిన దోపిడీ విలువ అక్షరాల రూ.20.20 కోట్లకు పైమాటే. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను లోతుగా పరిశీలిస్తే కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూస్తున్నాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన సర్కారు కొనుగోలు కేంద్రాల్లో శుక్రవారం (ఈ నెల 3) నాటికి 2.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. క్వింటాలుకు ఐదు కిలోల చొప్పున లెక్కేస్తే.. 2.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి తరుగు పేరిట 1.14 లక్షల క్వింటాళ్లు ధాన్యం కోత విధించారు. ధాన్యం ధర క్వింటాలుకు రూ.1,770 చొప్పున 1.14 లక్షల క్వింటాళ్లకు రూ.20.17 కోట్లు అవుతుంది. ఈ డబ్బంతా రైతులకు చెందాల్సింది. కానీ, నిర్వాహకులు, మిల్లర్లు అక్రమంగా కాజేస్తున్నారు. నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కు.. జిల్లాలో 291 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 262 కేంద్రాలను పీఏసీఎస్లకు అప్పగించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్న కేంద్రాలను మినహాయిస్తే, పీఏసీఎస్లు నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల్లో మాత్రం యథేచ్ఛగా> దోపిడీ జరుగుతోంది. ఆయా కేంద్రాలకు అలాట్ చేసిన రైస్మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కలిసి ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులను నిండా ముంచుతున్నారు. ఒక్కో సీజనులో మిల్లర్లు, కొందరు పీఏసీఎస్ చైర్మన్లు రూ.లక్షల్లో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఆందోళన చేస్తున్నా ఆగని అక్రమాలు.. సర్కారు కేంద్రాల్లో నిలువు దోపిడీకి గురవుతున్న రైతులు ఆందోళనకు దిగినా అధికారులు పెద్దగా స్పందించిందీ లేదు.. అక్రమాలు ఆగిందీ లేదు. తరుగు పేరుతో తమను నిండా ముంచుతున్నారని ఇటీవల నవీపేట్లో రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. అంతకు ముందు నాళేశ్వర్ గ్రామానికి చెందిన రైతులు సుమారు 30 మంది కలెక్టరేట్కు వచ్చి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. అయినా కడ్తా విషయంలో పెద్దగా మార్పు రాలేదు. దళారులకు మించి.. ఆరుగాలం శ్రమించి, తీవ్ర ప్రతికూల పరిస్థితులను అధిగమించి రైతులు ధాన్యాన్ని పండిస్తున్నారు. చేతికందిన పంటను దళారులకు విక్రయిస్తే నష్టపోతామని భావిస్తున్న రైతులు ఎంతో ఆశతో సర్కారు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. తీరా ప్రభుత్వ కేంద్రాల్లోనూ దళారుల మాదిరిగా దగా జరుగుతుండటంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రకటనలు చేస్తున్న అధికారులు.. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల దోపిడీకి అడ్డుకట్ట వేయకపోవడం వెనుక తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం ఈ దోపిడీని చూసీ చూడనట్లు వదిలేస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. ఈ దోపిడీపై ఇప్పటికే రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట పడుతున్నారు. ఈ దోపిడీ ఇలాగే కొనసాగితే ధాన్యం రైతులు పోరాటాలకు దిగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘నిధి’వంచితులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రైతులకు మద్దతు ధరను అందించి ధాన్యం కొనుగోళ్లు నిర్వహించిన ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి (పీఏసీఎస్) సంఘాల వారికి రావాల్సిన కమీషన్ నిలిచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే కమీషన్తో తమ తలరాత మార్చుకుందామనుకుంటే..సీజన్లవారీగా శ్రమించిన వీరికి మాత్రం డబ్బులు ముట్టక తిప్పలు మామూలే అన్నట్లుగా పరిస్థితి మారింది. గత ఖరీఫ్, రబీ, ఈ ఏడాది ఖరీఫ్లో ఎంతో కష్టపడి ధాన్యం సేకరించి, కాంటాలు, తరలింపు, రికార్డుల నిర్వహణ ప్రక్రియ చేసిన వీరికి ఆర్థిక చేయూత లేక అవస్థలు పడుతున్నారు. మూడు వ్యవసాయ సీజన్లకు సంబంధించిన సొమ్ము రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలంలో ఎంతో కష్టపడ్డామని, రైతులను చైతన్యవంతం చేసి ధాన్యం తీసుకొచ్చేలా చూశామని, రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే అధిక సమయం వెచ్చించి..ధాన్యం సేకరణను విజయవంతం చేశామని వీరు చెబుతున్నారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల బాధ్యులు, సొసైటీల వారు డబ్బులు అందక తమ విధిరాత మారట్లేదని ఆవేదనగా చెబుతున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 2017–18లో ఖరీఫ్, రబీతోపాటు 2018–19 ఖరీఫ్లో వడ్ల కొనుగోళ్లు నిర్వహించారు. గ్రేడ్–ఏ రకం ధాన్యం కొన్నందుకు క్వింటాకు రూ.32, సాధారణ రకం ధాన్యం క్వింటాకు రూ.31.25 కమీషన్ కింద చెల్లించాలి. మొత్తం మూడు సీజన్లకు సంబంధించిన కమీషన్ రూ.10,82,53,703 రావాల్సి ఉంది. 2017–18 నుంచి 2018–19 సీజన్లలో ఇలా.. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్, రబీ సీజన్లకు ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి రూ.5,67,37,911 కమీషన్ రావాల్సి ఉంది. 2017–18 ఖరీఫ్లో ఐకేసీ, పీఏసీఎస్ సిబ్బంది కలిపి 60 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరు 4,296 మంది రైతుల వద్ద నుంచి 39,360మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రైతులకు నగదు చెల్లింపులు పూర్తి చేశారు. అయితే గ్రేడ్–ఏ రకం ధాన్యానికి రూ.1,02,33,088, కామన్ రకానికి సంబంధించి రూ.23,06,963 ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి కమీషన్ చెల్లించాలని తేలింది. మొత్తం 1,25,40,051 కమీషన్ రావాలి. రబీ సీజన్కు సంబంధించి 90 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 16,566 మంది రైతుల నుంచి 1,38,154 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి గ్రేడ్–ఏ రకం ధాన్యానికి రూ.4,37,12,204, కామన్ రకానికి సంబంధించి రూ.4,85,656 చొప్పున మొత్తం రూ.4,41,97,860 కమీషన్ రూపంలో రావాల్సి ఉంది. 2018–19 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి కూడా పీఏసీఎస్, ఐకేపీ సిబ్బందికి కమీషన్ పెండింగ్లో ఉంది. ఈ ఖరీఫ్లో 86 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి..20,327 మంది రైతుల నుంచి 1,61,665 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గ్రేడ్–ఏ రకం ధాన్యానికి రూ.4,24,70,742, కామన్ రకానికి సంబంధించి రూ.90,45,050 మొత్తం కలిపి రూ.5,15,15,792 పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది 98 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 76 కేంద్రాలను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన కొనుగోళ్లు కూడా చేస్తున్నారు. తమకు పెండింగ్లో ఉన్న కమీషన్ను చెల్లించకుండానే మళ్లీ పని చేయించుకుంటున్నారని వీరంతా బాధ పడుతున్నారు. ఇకనైనా నిధులు మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వానికి నివేదించాం.. ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బందికి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కమీషన్ చెల్లింపు అంశాన్ని ప్రభుత్వానికి నివేదించాం. మాకు ఫండ్స్ రాగానే నిర్వాహకులకు అందిస్తాం. ఎవరూ కంగారు పడొద్దని కోరుతున్నాం. – వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, ఖమ్మం కష్టపడ్డందుకు లాభమేది? కూసుమంచి మండలంలోని పాలేరులో శ్రీవాణి గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో గ్రూపు సభ్యులమంతా కలిసి ధాన్యం కొనుగోలు చేశాం. మొత్తం 10,551 క్వింటాల వడ్లు కొన్నాం. క్వింటాకు రూ.32 చొప్పున కమీషన్ ఇవ్వాలి. ఇలా మాకు రూ.3.50లక్షల కమీషన్ డబ్బులు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూపాయి కూడా ఇయ్యలే. మళ్లీ కొత్తగా రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. పెండింగ్లో ఉన్న డబ్బులు ఇలా ఆపుజేస్తే.. మేం కష్టపడ్డందుకు ఏం లాభం ఉంటదండి. అధికారులు మా గోస తీర్చాలని కోరుతున్నాం. -
ధాన్యం కొనేవారేరి..?
వీణవంక(హుజూరాబాద్): పంట పండించడం ఒక ఎత్తయితే.. వచ్చిన దిగుబడిని విక్రయించడం రైతులకు కత్తిమీద సాములా మారుతోంది. ఇక మగ వడ్లు సాగు చేసిన అన్నదాతలు కల్లాల్లో ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆడ, మగ వరి సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ పండించిన ధాన్యం ఆరేళ్లయినా మొలకెత్తే స్వభావం కలిగి ఉంటుంది. హైబ్రీడ్ వరిని 32 ఏళ్లుగా ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. గత ఏడాది మగ వడ్లను ప్రభుత్వ రంగసంస్థలు కొనుగోలు చేయకపోవడంతో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురించగా.. అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి.. ప్రస్తుత వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెంటనే స్పందించి మగ వడ్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ఆదేశించారు. అప్పుడు కొనుగోలు చేసిన సంస్థలు మళ్లీ ఈ రబీలో ముఖం చాటేశాయి. కేంద్రాలకు తరలించిన మగ ధాన్యం కొనుగోలుకు తిరస్కరిస్తున్నారు. దీంతో రైతులు మగ వడ్లను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్–ఏకు క్వింటాల్కు రూ.1770, కామన్ రకం రూ.1750 ఉండగా మిల్లర్లు మగ వడ్లను రూ.1200కే అతికష్టం మీద కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. గింజ పొట్టిగా ఉంటుందనే సాకుతో.. మగ(హైబ్రీడ్) ధాన్యం గింజ పొట్టిగా ఉంటుందనే సాకుతో కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని తిరిగి పంపిస్తున్నారు. కనీసం గ్రేడ్ బీ(కామన్రకం) కింద కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వ రంగసంస్థలు చేతులెత్తేశాయి. మగ ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అధికారులకు రైతులు విన్నవించినా ఫలితం లేకుండా పోతోంది. గ్రామాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి విక్రయించడం సవాల్గా మారింది. కొందరు రైతులు గత్యతంరం లేక మిల్లర్లకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. ఆడ వడ్లను విత్తన కంపెనీలు కొనుగోలు చేస్తాయి. వీటికి మాత్రమే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మగ ధాన్యాన్ని రైతులే మార్కెట్లో అమ్ముకోవాలి. రైతులతో కంపెనీలు ముందస్తుగా అలా ఒప్పందం చేసుకుంటున్నాయి. మార్కెట్లో మగ ధాన్యానికి డిమాండ్ లేకపోవడంతోపాటు కనీసం కొనేవారు లేక నానా తంటాలు పడుతున్నారు. సాగుకు అనుకూలం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 45వేల ఎకరాలలో హైబ్రీడ్ వరి సాగులోకి వచ్చింది. ఇందులో 8వేల ఎకరాలు ఎండిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1.75 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ఇందులో 40 నుంచి 50 వేల క్వింటాళ్లు మగ ధాన్యం పండినట్లు సమాచారం. ప్రస్తుతం వరి కోతలు 60శాతం పూర్తయ్యాయి. హైబ్రీడ్ వరి సాగులో రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఈసారి ఎకరాకు 6నుంచి 9క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా. ఆడ వరి ధాన్యానికి క్వింటాల్కు రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు కంపెనీలు ధర చెల్లిస్తున్నాయి. ఎకరాకు రూ.38వేల వరకు పెట్టుబడి పెట్టామని, మగ ధాన్యం కొనుగోలు చేస్తేనే కష్టాల నుంచి గట్టేక్కుతామని రైతులు అంటున్నారు. కొనుగోలు చేయని ప్రభుత్వ రంగసంస్థలు.. ప్రభుత్వ రంగ సంస్థలు మగ ధాన్యం కొనుగోలు చేయడంలో చేతులెత్తేసింది. గ్రేడ్ ఏ రకం కింద 1010ధాన్యం, కామన్ రకం కింద మరి కొన్ని రకాల వడ్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మగ ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని కేంద్రాల నిర్వాహకులు తెలిపారు. కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందనే ఆశతో కొందరు రైతులు కళ్లాల వద్ద రాశులు పోసి వేచి చూస్తున్నారు. ధాన్యం మిల్లర్ల పాలు.. మగ ధాన్యం మిల్లర్ల పాలవుతోంది. రైతులకు తక్కువ ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. ఈ నెలలో వివాహ శుభకార్యాలు ఉండడంతో ఖర్చుల కోసం రైతులు గత్యంతరం లేక మిల్లర్లకే విక్రయిస్తున్న సంఘటనలు ఉన్నాయి. క్వింటాల్కు ప్రభుత్వ మద్దతు ధర రూ.1770 ఉండగా మిల్లర్లు రూ.1200లోపే చెల్లిస్తున్నారు. తరుగు, తేమ పేరుతో మరింత కోత విధిస్తున్నారు. జిల్లా మంత్రి ఈటల రాజేందర్ చొరవ తీసుకొని మగ ధాన్యం ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మగ ధాన్యం కొనుగోలు చేయాలి.. మగ ధాన్యాన్ని ప్రభుత్వ రంగసంస్థలు కొనుగోలు చేయాలి. గింజ పొట్టిగా ఉంటుందని కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. ఇదేం పద్ధతి, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకపోతే ఎలా..? రైతులు సెంటర్లకు ధాన్యం తరలిస్తే వెళ్లగొడుతున్నరు. మిల్లర్లు రూ.1200కే అడుగుతున్నరు. కనీసం కామన్ రకం కిందనైన కొనుగోలు చేయాలి. ఎక్కువ మంది రైతులు మగ వడ్లనే పండించారు. ఎవ్వరూ కొనకపోవడంతో ఇబ్బంది పడుతున్నరు. – అంబాల రంగయ్య, రైతు ఐక్యవేదిక నాయకులు ఆదేశాలు రాలేదు.. మగ వడ్లను కొనుగోలు చేయాలని ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉన్నతాధికారుల సూచన మేరకే గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ రకాలను మాత్రమే కొనుగోలు చేస్తున్నాం. మా పరిధిలో 14సెంటర్లను ప్రారంభించాం. గతంలో జమ్మికుంట మార్కెట్లో మాత్రమే మగ వడ్లను కొనుగోలు చేశారు. రైతులు మగ వడ్లను సెంటర్లకు తరలించ వద్దు. – ప్రకాశ్రెడ్డి, పీఏసీఎస్, సీఈవో -
ఊపందుకోని వరి ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రైతులు ధాన్యాన్ని అమ్మకానికి మార్కెట్లకు తరలిస్తున్నారు. ఈ సీజన్లో జిల్లాలో 1.02లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గ్రేడ్ను బట్టి రేటును నిర్ణయించారు. రైతులకు మద్దతు ధర కల్పించి ధాన్యం కొనాలని భావించినా అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. స్థానికంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రవాణా భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండటం, 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా కావడంతో అధికారులు వద్దని చెప్పినా వినకుండా రైతులు రబీలో వరి సాగు చేశారు. తీరా సాగునీరు సరిపోక చాలాచోట్ల పంటలు ఎండిపోయిన పరిస్థితి. అయితే గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ, పంట కోతదశలో ఉన్న సమయంలో నాలుగైదు రోజులుగా వాతావరణంలో మార్పులు రావడం, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పంటను తీస్తే కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. రబీలో 11,993 హెక్టార్లలో సాగు జిల్లాలో ఈ రబీలో 11,923 హెక్టార్ల విస్తీర్ణంలో వరిపంటను సాగు చేశారు. ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులు నింపడం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందింది. జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్కర్నూల్, నియోజకవర్గాలకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా చెరువులోకి నీటిని విడుదల చేశారు. కాల్వలకు సమీపంలో వ్యవసాయ భూములు కలిగిన రైతులు మోటార్ల ద్వారా వరి పంటకు సాగు నీటిని అందించారు. బోరుబావుల కింద కూడా వరి పంటలను సాగు చేశారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ఈ ఏడాది జిల్లాలో 61 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా.. ఐకేపీ ద్వారా 17 కొనుగోలు కేంద్రాలు, మెప్మా ఆధ్వర్యంలో 3, పీఏసీఎస్ల ద్వారా 41 కేంద్రాలను ఏర్పాటు చేసి 1.02లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ప్రభుత్వం ఏ–గ్రేడ్ రకం వరి ధాన్యానికి రూ.1,770, బీ–గ్రేడ్ రకం ధాన్యానికి రూ.1,750 మద్దతు ధరగా నిర్ణయించింది. దానితో పాటు అనేక నిబంధనలు విధించింది. రైతాంగం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా ధాన్యం విక్రయించాలంటే నిబంధనలు పాటించాలని మార్కెటింగ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ధాన్యం నాణ్యతగా ఉండటంతో పాటు 17శాతం కంటే తక్కువ తేమ ఉండాలని తప్పనిసరిగా ఆరబెట్టిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే 61 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఇప్పటివరకు కేవలం పీఏసీఎస్ ఆధ్వర్యంలో గంట్రావ్పల్లి, లక్నారంలో, మెప్మా ఆధ్వర్యంలో కల్వకుర్తి, నాగర్కర్నూల్లో మాత్రమే ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు మార్కెట్కు తరలించేందుకు ఇబ్బంది పడుతున్నారు. అయితే నాలుగు రోజులుగా కోత దశలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో వారు మరింత ఆందోళన పడుతున్నారు. ధాన్యాన్ని పొలాల వద్ద ఆరబెట్టేందుకు కూడా భయపడుతున్నారు. ప్రభుత్వం అన్ని మండల కేంద్రాల్లో, ఎక్కువగా పంటలు ఉన్న ఊర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు. అక్రమాలకు జియో ట్యాగింగ్తో చెక్ ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు అధికారులు జియోట్యాగింగ్ను వినియోగించుకుంటున్నారు. కొందరు సిబ్బంది దళారులతో కుమ్మక్కై కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి అనధికారికంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి, అక్రమంగా రైసు మిల్లులకు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు నేపథ్యంలో ప్రభుత్వం వరిధాన్యం కొనుగోళ్లలో పారదర్శకతను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జియోట్యాగింగ్ విధానాన్ని అనుసంధానించాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల అధికారులు తమ కార్యాలయాల నుంచే ధాన్యం కొనుగోలు తీరును పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. జియో ట్యాగింగ్ అమలు వల్ల కేంద్రాల్లో దళారుల అక్రమాలకు అడ్డుకట్ట వేసి వరి ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేసి రైతులకు లబ్ధి చేకూర్చవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అవసరానికి అనుగుణంగా కేంద్రాలు పంట పొలాల నుంచి వస్తున్న ధాన్యానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. జిల్లాలో మొత్తం 61 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మరికొన్ని కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తాం. ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీ బ్యాగులు, హమాలీలు, టార్ఫలిన్లు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయించాలి. కేంద్రాల్లో వరి ధాన్యాన్ని విక్రయించాలనుకున్న రైతులు తమ వెంట పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్లను తీసుకురావాలి. – మోహన్బాబు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సింగిల్విండో ద్వారా కొనుగోలు చేస్తామన్నారు చాలా ఏండ్ల నుండి తెల్కపల్లిలో సింగిల్విండో ద్వారా కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు తెల్కపల్లిలో కొనుగోలు చేయలేదు. ప్రతి ఏడాది నాగర్కర్నూల్ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి వడ్లు అమ్ముకుంటాం. మా ఊరి నుండి ఇక్కడి వరిధాన్యాన్ని తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుంది. – వెంకట్రెడ్డి, రైతు, గడ్డంపల్లి, తెలకపల్లి -
ముగింపు దశలో ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తంగా 32లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా 27 లక్షల మేర సేకరణ పూర్తయింది. మరో 5లక్షల మెట్రిక్ టన్నుల సేకరణను ఈ నెలాఖరు వరకు ముగించాలని పౌర సరఫరాల శాఖ భావిస్తోంది. ఖరీఫ్ సాగు ఆలస్యమైన జిల్లాల్లో సేకరణ పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. ఈ ఏడాది విస్తారంగా జరిగిన పంటల సాగు దృష్ట్యా 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా 3,284 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. సేకరణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంది. అక్టోబర్ తొలివారం నుంచే ధాన్యం సేకరణను ముమ్మరం చేసింది. ఇప్పటివరకు 3,147 కేంద్రాలను తెరిచి, శనివారం నాటికి 27లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సేకరణ పూర్తి చేసింది. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.4,700 కోట్ల వరకు ఉంది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 4.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కామారెడ్డిలో 3.17లక్షలు, కరీంనగర్లో 2.24 లక్షలు, నల్లగొండలో 2లక్షలు, జగిత్యాలలో 2.31లక్షలు, మెదక్లో 1.54 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ పూర్తి చేసింది. సేకరణ అధికంగా జరిగిన జిల్లాలో ఇప్పటికే వెయ్యికి పైగా కేంద్రాలను మూసివేశారు. గత ఏడాది ఇదే సమయానికి 14లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ జరగ్గా, ఈ ఏడాది డిసెంబర్లోనే కొనుగోళ్లు ముగింపుకు రావడం గమనార్హం. ఇక ఆలస్యంగా ఖరీఫ్సాగు జరిగిన ఖమ్మం, కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లిలో నెలాఖరు వరకు సేకరణ సాగనుంది. ఈ జిల్లాల్లోనే దాదాపు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాల్సి ఉంది. సేకరించిన ధాన్యంలో ఇప్పటికే 20 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద బియ్యంగా మార్చేందుకు మిల్లర్లకు అప్పగించింది. -
నేటినుంచి ధాన్యం కొనుగోళ్లు..
జిల్లాలో బుధవారం ఖరీఫ్ సీజన్ వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదట రామన్నపేట, మోత్కూరు, చౌటుప్పల్, భువనగిరి వ్యవసాయ మా ర్కెట్ యార్డుల్లో కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. ఇందుకో సం జిల్లా వ్యాప్తంగా 113 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ 63, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 50కేంద్రాలు ఉన్నాయి. కాగా ఈసీజన్కు గాను 1.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాక్షి, భువనగిరి : ఖరీఫ్ సీజన్ వరిధాన్యం కొనుగోళ్లు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్దం చేశారు. మొదట రామన్నపేట, మోత్కూరు, చౌటుప్పల్, భువనగిరి వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లను ప్రారంభించనున్నారు. ఈ సీజన్కుగాను 1.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా 113 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 63, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 50 కేంద్రాలు ఉన్నాయి. రబీ సీజన్లో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని అవి పునరావృతం కాకుండా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 1.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సన్నాహాలు జిల్లాలో సాధారణ విస్తీర్ణం 34,066 హెక్టార్లు కాగా ప్రస్తుత సాగు విస్తీర్ణం 42,770 హెక్టార్లు ఇందులో మూసీ పరీవాహక ప్రాంతంలో వ్యవసాయం పెద్ద ఎత్తున చేపట్టారు. దీంతో ఖరీఫ్ సీజన్కు గానూ 1.96 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ అంచనాతో అధికారులు ముందుకు సాగుతున్నారు. మూసీ పరీవాహకేతర ప్రాంతాల్లో వరి సాగు విస్తీర్ణం కొంత వరకు తగ్గింది. కొన్ని ప్రాంతాల్లో వరి ఎండిపోయింది. ప్రస్తుతం మూసీ ఆయకట్టుతో పాటు చిన్న నీటి పారుదల కాల్వల కింద సాగు చేసిన పంట నుంచి ధాన్యం రావడానికి కొంత సమయం పట్టనుంది. అయితే మూసీ పరీవాహకేత ర ప్రాంతాల్లో ముందుగా సాగు చేయడంతో ఇప్పటికే వరికోతలు మొదలై ధాన్యం విక్రయాలు కూడా ప్రారంభించారు. పెరిగిన మద్ధతు ధర.. కేంద్ర ప్రభుత్వం ఈసారి మద్ధతు ధరను పెంచడంతో కొంత వరకు రైతులలో ఆశ కలిగింది.ధాన్యానికి క్వింటాకు ఏ–గ్రేడ్ రూ.1,770, బీ–గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.1,750 చొప్పున పెంచారు. గతంతో పోల్చుకుంటే ఏ–గ్రేడ్కు రూ.180, బీ–గ్రేడ్కు 200 చొప్పున కేంద్ర ప్రభుత్వం పెంచింది. జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం వివిధ శాఖల సమన్వయంతో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికను రూపొందించారు. ఖరీఫ్సీజన్కు గానూ 33.75 లక్షల గన్నీ బ్యాగులు అవసరమని గుర్తించారు. ప్రస్తుతం 33.59 లక్షల గన్నీ బ్యాగ్లను అందుబాటులో ఉంచారు. వీటితో పాటు టార్పాలిన్లు, ప్యాడీక్లీనర్లు సిద్ధంగా ఉంచారు. ఏర్పాట్లు పూర్తి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నాం. బుధవారం కాకుంటే గురువారమైనా వ్యవసాయ మార్కెట్లలో కొనుగోళ్లను ప్రారంభిస్తాం. హమాలీలు అందుబాటులో ఉంటే ఇదేరోజు కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. – సంధ్యారాణి, డీఎస్ఓ మద్ధతు ధర పెరిగింది ధాన్యం కొనుగోలు చేసే కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లకు సంబంధించిన సామగ్రిని సిద్ధంగా ఉంచాం. ఈసారి వరి ధాన్యానికి మద్ధతు ధర పెరిగింది. పెరిగిన మద్ధతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పెరిగిన మద్ధతు ధర గురించి రైతులకు తెలియజేస్తాం. – సారిక, మార్కెట్ శాఖ జిల్లా అధికారి -
రైతులు ఆందోళన చెందవద్దు: హరీశ్
సాక్షి, మెదక్: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని, ఎలాంటి ఆందోళన చెం దవద్దని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ నెల 9న సీఎం కేసీఆర్ మెదక్ పట్టణానికి రానున్న నేపథ్యంలో శనివారం మంత్రి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని, బహిరంగసభాస్థలిని ఆయన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డితో కలసి పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఊహించిన దాని కంటే ఎక్కువగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడం, హమాలీల కొరత కారణంగా కొనుగోలులో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెప్పారు. రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న విమర్శలు అర్థరహితమన్నారు. -
కరీంనగర్లో రైతుల ఆందోళన
మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది, లక్ష్మీపూర్, రంగంపేట వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం మార్కెట్కు తెచ్చిన ధాన్యం సరిగా లేదని సాకు చెబుతూ కొనేందుకు నిరాకరించారు. దాంతో ఆగ్రహించిన రైతులు వరి ధాన్యానికి నిప్పుపెట్టి ఆందోళన చేపట్టారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సాకులు చెబుతూ ధాన్యం కొనుగోలును ఆపేశారు. దాంతో రైతులు ధర్నాకు దిగారు. -
ఐకేపీ కేంద్రాల్లో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయాలి
• వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ • రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి మిర్యాలగూడ/ నేరేడుచర్ల: ఖరీఫ్లో రైతులు పండించిన ధాన్యం మొత్తం ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా వేముల పల్లి మండల కేంద్రంలో ఐకేపీ ధాన్యం కొను గోలు కేంద్రాన్ని పరిశీలించి, మద్దతు ధర విష యంపై రైతులతో మాట్లాడారు. అనంతరం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో విలేకరులతో మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మిల్లర్లు తక్కువ ధర చెల్లించి దోచుకుంటున్నారని ఆరోపించారు. తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో తక్కు వ ధర చెల్లిస్తున్నారన్నారు. మిల్లర్లు కూడా సిం డికేట్గా తక్కువ ధరలు చెల్లిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఐకేపీ కేంద్రాలను ఎక్కువగా ప్రారం భించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తి స్థారుు లో మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని కోరారు. ఏ రోజు ధాన్యం అదేరోజు కాంటా లు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాల న్నారు. ధాన్యం విక్రరుుంచిన రైతులకు సాధ్య మైనంత త్వరగా డబ్బులు చెల్లించాలని కోరా రు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలో రబీ పంటకు నీటి విడుదల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలన్నా రు. గత రెండు సంవత్సరాలుగా తీవ్ర వర్షాభా వంతో సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బం దులు పడ్డారని గుర్తుచేశారు. శ్రీశైలం డ్యాంలో నీరు నిల్వ ఉన్నందున విద్యుత్ ఉత్పాదన ద్వారా సాగర్కు విడుదల చేసి ఎడమ కాల్వ పరిధిలో రబీ పంటకు సాగునీరివ్వాలని డిమాండ్ చేశారు. నవంబర్ 15 నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పి ఇంతవరకు దానిపై ఎలాంటి ప్రకటన చేయలే దన్నారు. ప్రభుత్వం వెంటనే నీటి విడుదల తేదీలను ప్రకటించాలని తెలిపారు. రాష్ట్రంలో వివిధ పార్టీల ఎమ్మెల్యే లు, నాయకులను చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలను పరిష్కరించడంలో టీఆర్ ఎస్కి లేదని విమర్శించారు. రెండున్నర సంవ త్సరాలు కావస్తున్నా పార్టీ మారిన ఎమ్మె ల్యేలపై ఇంతవరకు ఎలాంటి స్పందనలేద న్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అధికా రాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి ఎలక్షన్ కమిషన్కు ఇవ్వాలని తెలి పారు. రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతి స్తోందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు వేముల శేఖర్ రెడ్డి, సలీం తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు దిగులు!
చేతికొచ్చిన పంటలు ఆలస్యమవుతున్న కొనుగోళ్లు ఆందోళనలో అన్నదాతలు పత్తికి 5 సీసీఐ కేంద్రాలు ఖరారు దీపావళి నుంచి కొనే అవకాశం ‘వరి’కి ఖరారు కాని తేదీలు.. సోయా విషయంలోనూ సందిగ్ధం మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న.. ఆరుగాలం కష్టించి చేతికి వస్తున్న పంటలను చూసి రైతన్నలు మురిసిపోతున్నారు. కానీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో దిన దినం ఆవేదన చెందుతున్నారు. దీపావళి ముందు రైతు ఇంట కాంతులు వెదజల్లాల్సిన సమయంలో ప్రభుత్వం నుంచి కొనుగోళ్లపై స్పష్టత రాకపోవడంతో దిగాలు పడుతున్నారు. పత్తి, సోయా, వరి పంటలు ఎవరు కొనుగోలు చేస్తారు.. వాటి మద్దతు ధర ఎంత.. కేంద్రాలు ఎక్కడెక్కడ అనేవి పూర్తిగా తెలియకున్నా కనీసం కొనుగోలు తేదీలపై కూడా నిర్ణయం వెలువడకపోవడం రైతుల్ని కలవరానికి గురిచేస్తోంది. సాక్షి, నిర్మల్ : రెండేళ్లుగా సరైన పంటలు రాక పూర్తిగా నష్టపోయిన రైతన్నకు ఈ ఖరీఫ్లో కూడా భారీ వర్షాలు కురవడంతో పంట నష్టం సంభవిం చింది. గుడ్డిలో మెల్లలాగా చేతికి అందిన పం టను నమ్ముకోవడం ద్వారా దీపావళి పండుగ సంబురాలు, రబీకి పెట్టుబడుల కోసం రైతన్నకు ఇప్పుడు పైసాల అవసరం ఏర్పడింది. పంటల వారీగా పరిస్థితి ఇలా ఉంది. పత్తి... నిర్మల్ జిల్లాలో 51 వేల 657 హెక్టార్లలో పత్తి సాగువుతుందని అంచన వేయగా 72 వేల 420 హెక్టార్లలో సాగైంది. 7 లక్షల 74 వేల 855 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. గతేడాది 6 లక్షల 85 వేల 674 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ సీజన్ 2016–17కు పత్తి మద్దతు ధర రూ.4,160(పొడవు పింజ రకం) ధర ప్రకటించింది. ప్రస్తుతం వరంగల్ మార్కెట్లో ప్రైవేట్ ట్రేడర్స్ క్వింటాలుకు రూ.5,100 ధర చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీఐ కొనుగోలుకు రంగంలోకి దిగేది అనుమానంగా కనిపిస్తోంది. ప్రైవేట్ ట్రేడర్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. పత్తి తేమ ఆధారంగా ట్రేడర్స్ ధరలో కోత పెట్టే అవకాశం ఉండడంతో రైతు లు ఆవేదన చెందుతున్నారు. సీసీఐ కూడా రం గంలో నిలిచి ప్రైవేట్ ట్రేడర్స్కు పోటీగా కొనుగోలు చేసిన పక్షంలోనే రైతులకు న్యాయం జ రుగుతుందని ఆశిస్తున్నారు. భైంసా, నిర్మల్, సారంగాపూర్, కడెం, కుభీర్లలో పత్తి కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రానికి జతపర్చిబడిన మండలాల రైతులు వెళ్లవలసి ఉంటుంది. సీసీఐ చెల్లింపులన్నీ ఆన్లైన్లో రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. వరి... వరి ఈ ఖరీఫ్ సీజన్లో 18 వేల 931 హెక్టార్ల లో సాగైంది. లక్షా 04 వేల 121 క్వింటాళ్ల దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, ఐటీడీఏ ప్రొక్యూరింగ్ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఐకేపీ 53, పీఏసీఎస్ 26, డీసీఎంఎస్ 16, ఐటీడీఏ 7 కేంద్రాల్లో కొనుగోలు చేయనుంది. వారం పదిరోజులలో కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు డీఎం పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. వరి మద్దతు ధర గ్రేడ్ 1కు రూ.1,510, సాధారణ రకం రూ.1,470 క్వింటాలుకు నిర్ణయించారు. ఇటీవల జరిగిన సమావేశంలో డీఎం పౌరసరఫరాల శాఖ అధికారులు గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లు, తేమ కొలిచే , తూకం యంత్రాల కోసం ప్రతిపాదనలు చేశారు. 6 లక్షల 13 వేల 855 కొత్త గన్నీ బ్యాగులు, 57 వేల 607 పాత గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. టార్ఫాలిన్లు ఒక్కో సెంటర్కు 40 చొప్పున అవసరం కాగా.. 6,800లకు గానూ 3,548 అందుబాటు లో ఉన్నాయని, మరో 3,252 అవసరం అని పే ర్కొంటున్నారు. తేమ కొలిచే యంత్రాలు సెం టర్కు రెండు చొప్పున మొత్తం 340 అవస రం కాగా 130 అందుబాటులో ఉన్నాయి. మ రో 210 సమకూర్చుకోవాల్సి ఉంది. తూకం కొలిచే యంత్రాలు సెంటర్కు రెండు చొప్పున 340 అవసరం కాగా 131 అందుబాటులో ఉ న్నాయని, మరో 209 అవసరమని వివరించా రు. అకాల వర్షాలు కురిసిన పక్షంలో మార్కెట్ కు తీసుకువచ్చిన పంటలు తడిసిపోయి రైతు లు నష్టపోయే పరిస్థితి ఉంది. గతంలో ఇలాం టి అనుభావాలు ఉన్నాయి. వాటి నుంచి అధికారులు పాఠం నేర్చి రైతులు నష్టపోకుండా అన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సోయా... సోయా పంట సాధారణ విస్తీర్ణం 28 వేల 587 హెక్టార్లు కాగా.. 51 వేల 119 హెక్టార్లలో సాగైంది. 71 వేల 567 మెట్రిక్ టన్నులు(7లక్ష ల 15వేల 670 క్వింటాళ్లు) దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఆయిల్ ఫెడ్ ద్వారా సో యా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కు భీర్, భైంసా, సారంగాపూర్లలో కొనుగోలు కేంద్రాల కోసం జాయింట్ కలెక్టర్ ద్వారా రా ష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీకి ప్రతిపాదనలు పంపా రు. ఇప్పటికే మార్కెట్లోకి పెద్ద ఎత్తున సో యా నిల్వలను రైతులు తీసుకువస్తున్నారు. కొ నుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆ దుకోవాలని కోరుతున్నారు. సోయాబిన్ మద్ద తు ధర క్వింటాలుకు పసుపుపచ్చ రకానికి రూ.2,675, నలుపు రకానికి రూ.2,625 ఉం ది. కానీ వ్యాపారులు రూ.2,300 చెల్లిస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ యిల్ ఫెడ్ వెంటనే రంగంలోకి దిగి మద్దతు ధరకు కొనాలని రైతులు కోరుతున్నారు. మొక్కజొన్న... మొక్కజొన్న ఈ ఏడాది 9,878 హెక్టార్లలో సాగైంది. ఒక హెక్టారుకు 40 క్వింటాళ్ల చొప్పున 3 లక్షల 95 వేల 120 క్వింటాళ్లు దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. మద్దతు ధర రూ.1,365 నిర్ణయించారు. మార్కెట్లో మొన్నటి వరకు రూ.1,800 పైబడి పలికిన ధరను వ్యాపారులు కుమ్మక్కై వరంగల్, నిజామాబాద్ మార్కెట్లలో రూ.14,00 లోపు ఇవ్వడంతో ఈ సోమవారం ఆయా మార్కెట్ యార్డుల్లో రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. మార్క్ఫెడ్ ద్వారా సారంగాపూర్, నిర్మల్, మామడ, లక్ష్మణచాంద, వడ్యాల్, ఖానాపూర్లలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కజొన్న కొనుగోలు చేయాలని నిర్ణయించారు. మంగళవారం ఖానాపూర్లో కొనుగోళ్లను ప్రారంభించారు. సారంగాపూర్, నిర్మల్లో బుధవారం, లక్ష్మణచాంద, వడ్యాల్, మామడల్లో గురువారం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. టార్ఫాలిన్లు అవసరం మేరకు ఉన్నాయని మార్క్ఫెడ్ అధికారులు పేర్కొంటున్నారు. నిర్మల్లో గోదాంను ఏర్పాటు చేయనున్నట్లు వివరిస్తున్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం పంట నిల్వలను విక్రయించేందుకు మార్కెట్ యార్డుకు తీసుకువచ్చే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. నాణ్యమైన పంటలను తీసుకువచ్చి రైతులు గిట్టుబాటు ధరను పొందాలి. టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, తూకం చేసే యంత్రాలు, గన్నీ బ్యాగులు మార్కెట్ యార్డుల్లో అందుబాటులో ఉంచుతాం. కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఆంటకాలు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటాం. – టి.శ్రీనివాస్ జిల్లా మార్కెటింగ్ అధికారి -
దండేపల్లిలో మహిళల రాస్తారోకో
దండేపల్లి(ఆదిలాబాద్): ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ మహిళలు ఆందోళనకు దిగారు. ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) గ్రూపు మహిళలు సుమారు 100 మంది శుక్రవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలోని బస్టాండ్ వద్ద రాస్తారోకోకు పూనుకున్నారు. వెంటనే ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కారణంగా రోడ్డుకు రెండు వైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. -
ధాన్యం కొనుగోలుకు ఆన్లైన్ విధానం
ఏలూరు: రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొత్తం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు పశ్చిమగోదావరి జిల్లా పౌరసరఫరాల శాఖ ఎండీ కె. రామ గోపాల్ తెలిపారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ...ఖరీఫ్లో పౌరసరఫరాల కేంద్రాల నుంచి రూ. 2 వేల కోట్ల విలువైన 25 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. నూతన నిబంధనలను అనుసరించి 75 శాతం వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసే వీలు కలిగిందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టరు బి. కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలుకు...230 కేంద్రాలు
చిలకలపూడి (మచిలీపట్నం) : జిల్లాలో 2014-15 సంవత్సరానికి గాను సార్వా ధాన్యం కొనుగోలు కోసం 230 కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ జె.మురళి తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో మద్దతు ధర చెల్లిస్తామని ఆయన చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం నియమించిన ఐకేపీ సిబ్బంది, పౌరసరఫరాల శాఖ అధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీ సిబ్బంది ద్వారా 135, పీఏసీఎస్ల ద్వారా 95 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ధాన్యం ఎక్కడ ఎక్కువగా కొనుగోలు చేయడానికి వీలవుతుందో ఆయా ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక్కొక్క కేంద్రంలో నలుగురు సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. ఈ సిబ్బందికి ఈ నెల 26, 27, 28 తేదీల్లో విజయవాడలోని గొల్లపూడి డీఆర్డీఏ కార్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ.1,400, సాధారణ రకం ధాన్యానికి రూ.1,360 చెల్లించనున్నట్లు వివరించారు. పౌరసరఫరాల శాఖ ద్వారా ఎక్కువ మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలో ఈ ఏడాది కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. తేమ శాతంపై రైతులకు అవగాహన... జిల్లాలో 85 శాతం మంది రైతులు యాంత్రీకరణ ద్వారా ధాన్యం నూర్పిళ్లు చేస్తున్నారని, దీనివల్ల ధాన్యంలో 25 నుంచి 30 శాతం తేమ ఉండే అవకాశం ఉంటుందని జేసీ చెప్పారు. కొనుగోలు కేంద్రం సిబ్బంది, పౌరసరఫరాల సిబ్బంది రైతులకు యాంత్రీకరణ ద్వారా నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఎక్కువగా ఆరబెట్టే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం తేమ మించకుండా ఉన్న ధాన్యాన్నే కొనుగోలు చేయాల్సి ఉందని, ఈ విషయాన్ని గ్రామీణ ప్రాంత రైతులకు తెలియజేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మార్కెటింగ్ శాఖ ద్వారా తేమను గుర్తించే యంత్రం, పోటు తొలగించే యంత్రం, గోనె సంచులు అన్నీ సిద్ధం చేసుకోవాలని సిబ్బందికి చెప్పారు. ఈ సమావేశంలో ఏజేసీ బీఎల్ చెన్నకేశవరావు, డీఎస్వో ఎ.కృష్ణారావు, డీఎంసీ సివిల్ సప్లయిస్ జయదేవ్సింగ్, పీడీఎస్ డీటీలు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. -
72 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు
మెదక్ మున్సిపాలిటీ: వరి, మొక్కజొన్న కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని జాయింట్ కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని భారత్ ఫంక్షన్ హాల్లో వరి, మొక్కజొన్న కేంద్రాల కొనుగోలు విషయమై పాయింట్ వర్కర్స్, ఏపీఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ శరత్ మాట్లాడుతూ రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24గంటల్లోనే సంబంధిత రైతుల బిల్లులు డీఆర్డీఏ కార్యాలయానికి చేరాలని సూచించారు. ఆవిధంగా చర్యలు తీసుకున్నప్పుడే 72గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. బిల్లులు సకాలంలో పంపించడంలో అధికారులు ఎలాంటి నిర్లక్ష్య వైఖరి అవలంబించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో ఒక్కసారిగా ధాన్యం పేరుకుపోకుండా ముందస్తుగానే కేంద్రాలను ప్రారంభించాలన్నారు. వరి కామన్ రకాన్ని క్వింటాల్కు రూ.1360, గ్రేడ్ ఏ రాకానికి రూ. 1400, మొక్కజొన్నకు రూ. 1310లు మద్ధతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఏ కొనుగోలు కేంద్రాల్లోను ఈ ధర కంటే తక్కువగా చెల్లిస్తే వారి పై కేసులు నమోదు చేయాలని సూచించారు. ధాన్యంలో తేమ 15 శాతం, రంగు మారిన ధాన్యం 5 శాతం, ముడుచుకుపోయిన ధాన్యం 3 శాతం, చెత్త, మట్టి పెడ్డలు 1శాతం కంటే ఎక్కువగా ఉండకూడదన్నారు. ధాన్యం కొనుగోలులో కనీస ప్రమాణాలను పాటించాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తరువాత రైతుల వద్ద నుంచి సరైన బ్యాంకు ఖాతా నంబరును తీసుకోవాలని, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే కనీసం అందులో రూ.500 ఉండేలా చూడాలని రైతులకు సూచించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఏసురత్నం, డీఎం మార్క్ఫెడ్ నాగమల్లిక, డీఎం సివిల్ సప్లయీస్ జయరాం, ఏపీడీ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ విజయలక్ష్మి, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, ఎరియా కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో డబ్బు చెల్లించాలి
మెదక్ మున్సిపాలిటీ,న్యూస్లైన్: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ ఏ. శరత్ ఆదేశించారు. శుక్రవారం మెదక్ వచ్చిన ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో పౌర సరఫరాలు, ఐకేపీ, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, తహశీల్దార్లు, సివిల్ సప్లయ్ డిప్యూటీ తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే కేంద్రాల్లోని ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. అలా చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించని పాపన్నపేట డిప్యూటీ తహశీల్దార్, సివిల్ సప్లయ్ అధికారికి మెమో జారీ చేయాల్సిందిగా జిల్లా పౌరసరఫరాల అధికారి రత్నంను ఆదేశించారు. కొనుగోలు కోసం ఎంత ధాన్యం వస్తుంది...ఎన్ని రోజుల్లో కొనుగోలు చేస్తారో అంచనా వేసుకున్నాకే కేంద్రాలను మూసివేయాలన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం వివరాల నమోదులో ఎలాంటి జాప్యం చేయరాదన్నారు. అదే విధంగా కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో 70 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నాయని, బియ్యంతోపాటు ఇతర సరుకులు కూడా సరైన సమయంలో చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీకి సిద్ధం చేయాలని ఆయన సూచించారు. డీడీలు సకాలంలో చెల్లించని డీలర్లపై శాఖాపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత తహశీల్దార్లపై ఉందన్నారు. గతంలో గుర్తించిన ప్రభుత్వ భూముల్లో బోర్డులు పాతడంతో పాటు చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, ఈ పనిని పది రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ వనజాదేవి, డీఎస్ఓ ఏసురత్నం, పంచాయతీరాజ్ అధికార్లు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు పాల్గొన్నారు. -
‘ని’స్సహాయకం
నార్తురాజుపాళేనికి చెందిన జ్యోతి తోటి స్వయం సహాయక మహిళలు 20 మందితో కలిసి అవిశ్రాంతంగా శ్రమించి 750 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. దళారులతో పోటీపడి మరీ ధాన్యం కొనుగోలు చేశారు. మహిళలైనా ఏ మాత్రం భయపడకుండా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చినట్టు ఆమె చెప్పింది. ఇంత వరకూ ఫలితం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యామని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు రూ.18 లక్షలకు పైగా కమీషన్ రావాలని చెబుతోంది. జిల్లా అధికారులు చొరవ తీసుకుని తమకు కమీషన్ ఇప్పించి న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది. కోవూరుకు చెందిన వెంకటరమణమ్మ తోటి మహిళలతో కలిసి 800 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. రూ.18 లక్షలకు పైగా కమీషన్ను ప్రభుత్వం వారికి చెల్లించాల్సి ఉంది. కొనుగోళ్లకు సంబంధించి రికార్డులను కూడా సక్రమంగా నమోదు చేసినా ఏవేవో సాకులు చెబుతూ కమీషన్ను ఇచ్చేందుకు జాప్యం చేస్తున్నారనేది వెంకటరమణమ్మ ఆరోపణ. కలెక్టర్ శ్రీకాంత్ చొరవ తీసుకుని కమీషన్ను చెల్లించి తమ శ్రమకు తగిన ఫలితాన్ని దక్కేట్టు చేయాలని విన్నవిస్తున్నారు. నెల్లూరు(పొగతోట), న్యూస్లైన్ : కష్టానికి తగిన ఫలితం దక్కకపోవడంతో స్వయం సహాయక సంఘాల మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినా తమకు ప్రతిఫలం అందలేదని నిర్వేదానికి లోనయ్యారు. 2012లో నాటి కలెక్టర్ ఎన్.శ్రీధర్ స్వయం సహాయక మహిళలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి కమీషన్ చెల్లిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. మహిళలు పోటీపడి 1,13,461 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మహిళల శ్రమకు ప్రతిఫలంగా కమీషన్ కింద రూ.3.13 కోట్లు చెల్లించాల్సి ఉంది. రికార్డులు సక్రమంగా లేవనే సాకుతో నాలుగు పర్యాయాలు వాటిని పరిశీలించారు. మండల సమాఖ్య కమిటీ సభ్యులు డీఎస్ఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పలు దఫాలు రికార్డులు పరిశీలించి గత ఏడాది రూ.1.55 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ.1.58 కోట్లు చెల్లించడానికి రికార్డులు సక్రమంగా లేవని అధికారులు సాకులు చెబుతూ జాప్యం చేస్తున్నారు. కమీషన్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న స్వయం సహాయక మహిళలు తీవ్ర నిరాశ, నిస్పృహకు లోనయ్యారు. నార్త్రాజుపాళేనికి చెందిన జ్యోతి, కోవూరు నివాసి వెంకటరమణయ్య దళారులతో పోటీపడి ధాన్యం కొనుగోలు చేశారు. వారి కష్టానికి ఇంత వరకూ ఫలితం దక్కలేదు. బిల్లుల చెల్లింపులో అవకతవకలు బిల్లుల చెల్లింపుల్లో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్తువెత్తాయి. సౌత్మోపూరు కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులకు రూ.70 లక్షలు అధికంగా చెల్లించారు. రికార్డుల పరిశీలనలో ఈ వాస్తవం వెల్లడై రైతుల నుంచి అధికారులు రూ.70 లక్షలు రికవరీ చేశారు. బోగోలు, కావలి మండల సమాఖ్యలకు అధికంగా చెల్లించారని డీపీఎం శంకర్ తెలిపారు. రెండు మండలాల రికార్డులు పూర్తి స్థాయిలో పరిశీలించాల్సింది ఉందని ఆయన వెల్లడించారు. రూ.125 కోట్ల ధాన్యం కొనుగోలు 2012 వ్యవసాయ సీజన్లో 63 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన ప్రాంతంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులు రైస్ మిల్లర్లు, దళారులతో పోటీపడి కల్లాల్లోకి వెళ్లి రూ.125 కోట్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఇది రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్టు. అధికారులు పాల్పడిన అవకతవకలకు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు కమీషన్ చెల్లించకపోవడంతో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళల్లో కొరవడిన ఉత్సాహం కమీషన్ దక్కక పోవడంతో ధాన్యం కొనుగోలు చేసేందుకు మహిళలు ఉత్సాహం చూపడం లేదు. గత ఏడాది 50 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రూ.1.35 లక్షలకు ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వలన నష్టం వచ్చింది. ధాన్యం కొనుగోలు చేసినా చేయకపోయినా మహిళలకు కూలీ చెల్లించాలి. కేంద్రం నిర్వహణకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన రైస్ మిల్లర్లు, దళారులు మద్దతు ధరకు మించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెలవెలపోతున్నాయి. ప్రస్తుతం 35 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైస్ మిల్లర్లు, దళారులు ధాన్యం ధరలు తగ్గించి కొనుగోలు చేస్తారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకే కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. -
కొనుగోళ్లు సరే.. కమీషన్ ఊసేది..!
సాక్షి, మంచిర్యాల : జిల్లాలోని మహిళా సంఘాలను అధికారులు విస్మరిస్తున్నా రు. ఖరీఫ్, రబీల్లో రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ అండగా నిలుస్తు న్న సంఘాలపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ధాన్యానికి కమీషన్ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. అడిట్కు లింకు పెట్టి కాలయాపన చేస్తున్నారు. దీంతో వారికి రావాల్సిన రూ.కోట్ల కమీషన్ రావడం లేదు. ధాన్యం కొనుగోలులో సింహభాగం రైతులు పండించిన చోటే మద్దతు ధరతో ధాన్యాన్ని అమ్ముకోవడం.. రవాణా భారం తగ్గించడం.. మహిళలను ఆర్థికం గా బలోపేతం చేయడానికి ప్రభుత్వం గ్రామైఖ్య సంఘాల ధ్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. జిల్లాలో 2005-06 నుంచి ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ప్రతి సీజన్లో రైతులు పండిం చిన ధాన్యంలో సింహభాగం గ్రామైక్య సంఘాలే కొనుగోళ్లు చేస్తున్నాయి. ఈ సంఘాలకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలో 2.5 శాతం కమీషన్ చెల్లిస్తుంది. ఎనిమిదేళ్ల నుం చి గ్రామైక్య సంఘాలు ధాన్యం కొనుగోలు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నాయి. 2012-13 ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 121 గ్రామైక్య సంఘాలు 66,415 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాయి. ఇందులో 90 శాతం ‘ఏ’గ్రేడ్ ధాన్యం ఉంది. కొనుగోలు చేసినందుకు అయిన ఖర్చు రూ. 84.14 కోట్లు. ఇందులో 2.5 శాతం చొప్పున రూ. 2.10 కోట్ల కమీషన్ ఇవ్వాల్సి ఉంది. అదే ఏడాది ర బీలో 82 గ్రామైక్య సంఘాలు కలిసి రూ. 39.08 కోట్లు చెల్లించి 30,515 మె.ట. ధాన్యం కొనుగోలు చేశాయి. వీరికి కమీషన్ రూపంలో రూ. 97 లక్షలు రావాల్సి ఉంది. అయితే.. ఏటా ధాన్యం కొనుగోలు చేసిన మూడు నెలల నుంచి ఐదు నెలలలోపు ఐకేపీ అధికారులు కమీషన్ డబ్బులు చెల్లించే వారు. అడిట్ అయితేనె.. గ త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కమీషన్ డబ్బులు చెల్లించాల్సిన ఐకేపీ అధికారులు ముందుగా కొనుగోళ్లపై ‘ఆడిట్’ చేపట్టిన తర్వాతే కమీషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇంత వరకు ఆడిట్ పూర్తి కాకపోవడంతో ఆయా సంఘాలకు కమీషన్ అందలేదు. 2005-06 నుంచి ఇప్పటి వరకు ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా జరిగిన కొనుగోళ్లు.. గ్రామైక్య సంఘాలకు చెల్లించిన కమీషన్ తదితర వివరాలపై అడిట్ చేస్తున్నారు. అయితే.. సాధ్యమైనంత త్వరలో ప్రక్రియ పూర్తి చేసి కమీషన్ డబ్బులు చెల్లించాలని సంఘాలు కోరుతున్నాయి. ఈ విషయమై ఐకేపీ మార్కెటింగ్ ప్రాజెక్టు మేనేజర్ తిరందాసు అడుగగా.. కొనుగోలు కమిటీ సభ్యుల నుంచి సమాచారం సేకరించాం. ఆడిట్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే కమీషన్ డబ్బులు చెల్లిస్తాం’ అని చెప్పారు.