Published
Sat, Feb 25 2017 6:16 AM
| Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
కారు బోల్తా: మాజీ ఎంపీకి గాయాలు
కరీంనగర్: వేములవాడ మండలం నాంపల్లి సమీపంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు శనివారం వేకువజామున బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పొన్నంతో పాటు ఆరుగురు గాయపడ్డారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది.
ప్రమాదంలో జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిటీ కాంగ్రెస్ అధక్షులు కర్ర రాజశేఖర్, పొన్నం బంధువులు సందీప్, రామకృష్ణ, చందర్, డ్రైవర్ శ్రీనివాస్కు గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం క్షతగాత్రులను కరీంనగర్లోని అపెక్స్ ఆసుపత్రికి తరలించారు.