* వచ్చే నెల 3 నుంచి 9 వరకు నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పాఠశాలల్లో ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహించాల్సిన అర్ధవార్షిక పరీక్షలను విద్యాశాఖ వాయిదా వేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు జగదీశ్వర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరీక్షలను వచ్చే నెల 3 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మార్చిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓలను ఆయన ఆదేశించారు.
సంక్రాంతి సెలవులకు ముందు పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డికి పీఆర్టీయూ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ మార్పు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా పరీక్షల షెడ్యూల్ మార్చినందుకు మంత్రి జగదీశ్రెడ్డికి పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్రెడ్డి, సరోత్తంరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
పాఠశాలల్లో అర్ధవార్షిక పరీక్షలు వాయిదా
Published Tue, Dec 16 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM
Advertisement
Advertisement