'విద్యుత్ సంక్షోభానికి కారణం ఆ రెండు పార్టీలే'
'విద్యుత్ సంక్షోభానికి కారణం ఆ రెండు పార్టీలే'
Published Thu, Oct 9 2014 6:28 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలకు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ 22 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణం ముమ్మాటికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని అందులో పేర్కొన్నారు. మొన్నటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా పాలించిన ఈ రెండు పార్టీలు ప్రస్తుతం విద్యుత్ సంక్షోభంపై దుష్ప్రచారం చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.
విద్యుత్ సంక్షోభంపై కాంగ్రెస్, టీడీపీ మొసలి కన్నీరు కారుస్తున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన విద్యుత్ వాటాపై కాంగ్రెస్, టీడీపీలు ఎందుకు ప్రశ్నించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.
Advertisement
Advertisement