ఇంటర్‌ బోర్డు ముట్టడికి యత్నించిన వామపక్షాలు | Left Parties Protest At Telangana Intermediate Board | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ బోర్డు ముట్టడికి యత్నించిన వామపక్షాలు

Published Fri, Apr 26 2019 2:56 PM | Last Updated on Fri, Apr 26 2019 3:27 PM

Left Parties Protest At Telangana Intermediate Board - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం వామపక్ష నేతలు నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అయితే వామపక్ష నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. అనంతరం నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలన్నారు. ప్రశ్నించిన వాళ్లను ప్రభుత్వం అణిచివేస్తోందని మండిపడ్డారు. చనిపోయిన ఇంటర్‌ విద్యార్థుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement