Left parties
-
విజయవాడ: ‘గో బ్యాక్ అమిత్ షా’
విజయవాడ, సాక్షి: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ పర్యటనలో నిరసన సెగ తగిలింది. అంబేద్కర్పై షా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ‘‘ గో బ్యాక్ అమిత్ షా’’ నినాదాలతో నగరంలో ఆదివారం వామపక్షాలు నిరసన చేపట్టాయి. అంబేద్కర్ని అవమాన పరిచిన అమిత్ షా రాజీనామా చేయాలని, ఆయన వెంటనే వెనక్కి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు వాళ్లు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రధాని మోది అమిత్ షాకు మద్దతు ఇవ్వడం సిగ్గుమాలిన చర్య. రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడికి మీరు ఇచ్చిన గౌరవం ఇదేనా. అంబేద్కర్ ను అవమానించిన షా.. తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘పార్లమెంట్ వేదికగా నిండు సభలో అవమానించారు. పైగా ఆయన తన వ్యాఖ్యల్ని సమర్ధించుకుంటున్నారు. అమిత్ షా ఆ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలి’’ అని సీపీఎం నేత ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఇతర వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. కేంద్ర సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి: అమిత్ షానగరంలోని నోవాటెల్ హోటల్లో ఏపీ బీజేపీ (BJP) నేతలతో ఆ పార్టీ అగ్రనేత అమిత్షా (Amit shah) సమావేశం ముగిసింది. సుమారు గంటన్నరపాటు ఈ భేటీ కొనసాగింది. కీలక అంశాలపై రాష్ట్ర భాజపా నేతలకు అమిత్షా దిశానిర్దేశం చేశారు.ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో భాజపా బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ‘హైందవ శంఖారావం’ సభ విజయం పట్ల పార్టీ, వీహెచ్పీ నేతలకు అమిత్షా అభినందనలు తెలిపారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై కేంద్రహోంశాఖ దృష్టిపెట్టిందని అమిత్షా చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేతలు ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో షా.. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) 20వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని 10వ NDRF బెటాలియన్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (NIDM) సౌత్ క్యాంపస్ను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ముగ్గురు మొక్కలు నాటారు. అంతకు ముందు.. నగరంలోని నోవాటెల్లో అమిత్ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పది నిమిషాలపాటు భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి కొండపావులూరు చేరుకున్నారు. అంతకంటే ముందే పవన్ అక్కడికి చేరుకున్నారు. -
సీపీఐ,సీపీఎం ఆందోళన..అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
సాక్షి,అనంతపురం: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్సిక్స్ హామీలను అమలు చేయాలని సీపీఐ,సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు,కార్మికులు అనంతపురం జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ వినోద్కుమార్ వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళకారులు కలెక్టర్ వాహనాన్ని అరగంట సేపు దిగ్భందించారు.ఈ సందర్భంగా పోలీసులు,ఆందోళకారులకు మధ్య వాగ్వాదం,తోపులాటజరిగింది. హామీల అమలులో టీడీపీ,బీజేపీ, జనసేన విఫలమయ్యాయని సీపీఎం నేతలు మండిపడ్డారు. చంద్రబాబు కు రైతుల ఆత్మహత్యలు పట్టవా అని వారు ప్రశ్నించారు.రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం ఎందుకివ్వలేదో చెప్పాలని నిలదీశారు.వైఎస్సార్ వాహనమిత్ర ఇవ్వకపోవడం వల్ల ఆటో,ట్యాక్సీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: Andhra Pradesh: ఆందోళనలతో అట్టుడికిన రాష్ట్రం -
హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తే ఉపేక్షించం..మిత్రపక్షం మిత్రపక్షమే.. పోరాటం పోరాటమే!
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ చేసిందేమీలేదు. ఏడాది పాలనలో సీఎం రేవంత్రెడ్డి ఉచిత బస్సు సౌకర్యం తప్ప వేటినీ అమలు చేయలేదు. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విదేశీ పెట్టుబడిదారులకు మూసీ భూములు, ఫార్మా భూముల్ని కట్టబెట్టేందుకు మూసీ సుందరీకరణ జపం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల కోసం పని చేస్తున్న వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు రాబోయే కాలంలో ఐక్య పోరాటాల్ని నిర్వహించేలా ఊరూరా ఎర్రజెండా ను తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి స్నేహపూర్వకంగా చెప్పాం.ఇక నుండి రోడ్ల పైకి వస్తాం. మాకు గెలవడం రాకపోయినా, ఓడించడం వచ్చు..’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవలచేసిన తీవ్రమైన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రాజేశాయి. మొన్నటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యమేంటన్న చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్ తమకిచ్చిన హామీ నెరవేర్చక పోవడం, రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా, మూసీ సుందరీకరణ తదితర అంశాలకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు.. రైతులు, ఇతర వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని సీపీఎం భావిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇటీవల గ్రూప్–1 అభ్యర్థులపై లాఠీచార్జి వంటి మరికొన్ని అంశాలను కూడా ఆ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వంపై ఒకపక్క సీపీఎం విరుచుకు పడుతుంటే, మరోపక్క సీపీఐ కూడా వివిధ సమస్యలపై తన నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రజలకు దూరమవుతామన్న భావన.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకొని ఒక సీటు గెలవగా, సీపీఎం పార్టీ పొత్తు కుదరక ఒంటరిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్లమెంటు ఎన్నికల నాటికి కాంగ్రెస్కు రెండు కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. సీపీఐకి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని అసెంబ్లీ పొత్తుల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇవ్వగా, పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు ప్రకటించినందుకు సీపీఎంకు కూడా ఎమ్మెల్సీ లేదా స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించాలన్న అవగాహన కుదిరినట్లు ప్రచారం జరిగింది.అయితే ఏడాది కావొస్తున్నా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్న అసంతృప్తి కామ్రేడ్లలో ఉందని అంటున్నారు. అలాగే పలు సందర్భాల్లో సమస్యలపై సీఎంకు వినతిపత్రాలు ఇచ్చినా లెక్క చేయడంలేదని వామపక్షాలు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీలు దూకుడుగా ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే.. ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే తాము మిన్నకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, వారికి దూరం అయ్యేందుకు అవకాశం ఉందనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. దీని ఫలితమే సీపీఎం, సీపీఐల ప్రతిస్పందనలని అంటున్నారు. ఇటీవలి పరిణామాలేంటి..?బెటాలియన్ కానిస్టేబుళ్ల పనిభారాన్ని పెంచే జీవోను రద్దుచేసి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను పడగొట్టి ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని, ఒకవైపు ప్రజాపాలన అంటూనే ప్రజలపై నిర్బంధాన్ని కొనసాగిస్తోందని సీపీఎం విమర్శించింది. ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోలీసులను, అధికారులను ప్రయోగిస్తోంది. ఇళ్ల కూలి్చవేతకు ఏర్పాట్లు చేస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఇంత హడావుడిగా నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదంటూ సీఎం రేవంత్రెడ్డికి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. ‘రైతులకు ప్రకటించిన రు.2 లక్షల రుణమాఫీని అర్హులైనవారందరికీ అమలు చేయాలి. అలాగే పంటకాలం పూర్తవుతున్నప్పటికీ వానాకాలం రైతుభరోసా ఇవ్వలేదు. తక్షణమే రైతు భరోసా చెల్లించాలి..’అని సీపీఎం కోరింది. గ్రూప్–1 అభ్యర్థులపై లాఠీచార్జీని తీవ్రంగా ఖండించింది. వారికి న్యాయం చేసేవిధంగా ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని, అభ్యర్ధులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. వానాకాలం, యాసంగికి రైతుభరోసా, రుణమాఫీలను వెంటనే అమలు చేయాలని సీపీఐకి చెందిన రైతుసంఘం డిమాండ్ చేసింది. ఈ విషయమై జిల్లాల్లో ధర్నాలు చేపట్టింది. హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, మిత్రపక్షం మిత్రపక్షమే.. పోరాటం పోరాటమేనంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
భారత్, చైనాల మధ్య నలిగిపోము: శ్రీలంక అధ్యక్షుడు
కొలంబో: భారత్, చైనా దేశాలతో విదేశాంగ విధానంలో శ్రీలంక సమానమైన వైఖరిని పాటిస్తుందని ఆ దేశ కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే అన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భారత్, చైనా విదేశాంగ విధానంపై స్పందించారు. భారత్, చైనాల మధ్య నలిగిపోయే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యులో పొరుగుదేశాలతో విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మా నాయకత్వంలో దేశం భౌగోళిక, రాజకీయ ప్రత్యర్థుల జోలికి వెళ్లకుండా చూస్తాం. నేషనల్ పీపుల్స్ పవర్( ఎన్పీపీ) ప్రభుత్వం ఏ దేశంతోను జతకట్టదని, పొరుగు దేశాలైన భారత్, చైనా రెండు దేశాలతో సమతుల్య సంబంధాలను పెంపొందించుకోవాలని భావిస్తోంది.మేము భౌగోళిక, రాజకీయ పోరాటంలో ఎవరితో పోటీదారులం కాదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య నలిగిపోవాలనే ఉద్దేశం మాకు లేదు. రెండు దేశాలు విలువైన స్నేహితులుగా మా ప్రభుత్వ సన్నిహిత భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాం. యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో కూడా సంబంధాలను కొనసాగించుతాం” అని అన్నారు.పొరుగు దేశాల ఆధిపత్య పోరులో శ్రీలంక నలిగిపోవద్దని ఇరుదేశాలతో పరస్పర ప్రయోజనకరమైన దౌత్య భాగస్వామ్యం నిర్మించడంపై దృష్టి సారిస్తోందని అన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తటస్థ విదేశాంగ విధాన విధానమే కీలకమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: సంక్షోభ లంకపై నెలవంక! -
ప్రపంచవ్యాప్తంగా రైట్వింగ్ నేతలపైనే టార్గెట్: అస్సొం సీఎం
ఢిల్లీ: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పులను ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. తాజాగా ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనపై అస్సొం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రైట్ వింగ్ నేతలను లెఫ్ట్ వింగ్ పార్టీలు టార్గెట్ చేస్తున్నాయని అన్నారు. దేశమే తొలి ప్రాధాన్యం అనే జాతీయవాదాన్ని కలిగి ఉన్న నేతలను ఎవరు ఓడించలేరని తెలిపారు.‘‘భౌతికంగా, మరోరకంగా ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ నేతలపై లెఫ్ట్ పార్టీ దాడులతో టార్గెట్ చేస్తోంది. ఈ దాడులు జాతీయవాదం కలిగి ఉండే నేతలను ఓడించలేవు. జాతీయవాదం అనేది పూర్తిగా ఆధ్యాత్మిక సనాతనతత్వం నుంచి ప్రేరణ పొందింది. డొనాల్డ్ ట్రంప్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.Physical or otherwise, right-wing leaders across the globe are now active targets of the radical left. However, these attacks will not be able to defeat the "nation first" ideology. This is rooted in deep spirituality and inspired by the Sanatan philosophy of "Janani Janmabhoomi…— Himanta Biswa Sarma (@himantabiswa) July 14, 2024 ఇక, శనివారం పెన్సిల్వేనియాలో చేపట్టిన ప్రచారంలో పాల్గొన్న ట్రంప్పై ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ పక్కనుంచి దూసుకుపోవటంతో గాయమైంది. వెంటనే అప్రత్తమై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదిక పైకి వచ్చి.. ట్రంప్ను అక్కడి కిందకు దించి ఆస్పత్రికి తరలించారు.ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) తాజాగా గుర్తించింది. అతణ్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్గా ధ్రువీకరించారు. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు క్రూక్స్ను షూట్ చేసినట్లు ఎఫ్బీఐ ఏజెన్సీ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్తో సహా ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. -
Lok sabha elections 2024: ఆర్జేడీకి 26.. కాంగ్రెస్కు 9
పట్నా: వచ్చే లోక్సభ ఎన్నికలకు గాను బిహార్లో ఆర్జేడీ సారథ్యంలోని మహాఘఠ్బంధన్లో సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు గాను దాదాపు మూడింట రెండొంతుల సీట్లలో లాలూ ప్రసాద్కు చెందిన ఆర్జేడీ పోటీ చేయనుంది. మిగతా వాటిని కాంగ్రెస్, మూడు వామపక్ష పార్టీలు పంచుకున్నాయి. 2019 ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క సీటూ దక్కించుకోలేకపోయినప్పటికీ ఈసారి 26 చోట్ల పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారీ 9 చోట్ల పోటీ చేయనుంది. ఆ తర్వాత సీపీఐ ఎంఎల్ లిబరేషన్ మూడు, సీపీఐ, సీపీఎంలు చెరో చోట బరిలోకి దిగనున్నాయి. బిహార్లో ఆర్జేడీ ఇప్పటికే నాలుగు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఒక సీటును కాంగ్రెస్ ఆశిస్తోంది. కాంగ్రెస్ పోటీ చేయాలని ఆశిస్తున్న పుర్నియా స్థానానికి లాలూ ప్రసాద్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేశారు. సీపీఐ, సీపీఐ(ఎంఎల్) కూడా బెగుసరాయ్, ఖరారియా సీట్లకు అభ్యర్థులను ప్రకటించుకున్నాయి. -
కూటమి కుదురుకునేనా?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ‘ఇండియాకూటమి’ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నా, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఇంకా అంతరం కొనసాగుతోంది. కూటమిలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కీలకంగా ఉన్నా, రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీల మధ్య సఖ్యత కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడినా..పొత్తులపై ఇప్పటికీ ఆ పార్టీల మధ్య అవగాహన కుదరలేదు. ఒకవైపు బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుందని కాంగ్రెస్, వామపక్షాలు చెబుతున్నా, ఐక్యత మాత్రం ప్రదర్శించలేకపోతున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి కూడా గణనీయమైన ఎంపీ స్థానాలు వస్తాయనే అంచనాలున్న నేపథ్యంలో ఎంతోకొంత ప్రభావం చూపగలిగే వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకోవడం లేదని, గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచీ కాంగ్రెస్ వైఖరి ఇలాగే ఉందని లెఫ్ట్ నేతలు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల వరకు నానబెట్టి చివరకు సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ సీపీఎం రెండూ రాజీకి రాలేకపోయాయి. ఎన్నికల వేళ మాటల యుద్ధం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. అభ్యర్థులను ప్రకటించుకుంటూపోతోంది. ఈ నేపథ్యంలో తమతో చర్చలు జరపకపోవడంపై వామపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు వివిధ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నా, సమయం ఇవ్వడం లేదని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేరళ వెళ్లి అక్కడి సీపీఎం సీఎం పినరయి విజయన్ను విమర్శించడాన్ని కూడా కామ్రేడ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బహిరంగంగానే విమర్శించారు. మరోవైపు సీపీఐ నేతలు కూడా కాంగ్రెస్ వైఖరిని తూర్పారబడుతున్నారు. పార్టీలు మారిన వారికి పెద్దపీట వేస్తూ, తమకు ఒక ఎంపీ సీటు ఇవ్వడానికి వెనుకాడుతున్నారని సీపీఐ విమర్శిస్తోంది. తమిళనాడు రాష్ట్రాన్ని చూసైనా నేర్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్కు సూచించారు. అభ్యర్థిని ప్రకటించిన సీపీఎం పొత్తులపై స్పష్టత రాకపోవడంతో సీపీఎం ఇటీవల భువనగిరి లోక్సభ సెగ్మెంట్కు జహంగీర్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇతర చోట్ల ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో కలిసి పనిచేసే విషయంలో బీఆర్ఎస్ నుంచి తమకు ప్రతిపాదన వస్తే ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య చెప్పడం గమనార్హం. ఇక సీపీఐ కూడా కాంగ్రెస్ తీరుపై గరంగరంగా ఉంది. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఒక స్థానంలో గెలవడంతో దూకుడుగా వెళ్లడానికి సీపీఐ కాస్తంతా వెనుకాముందు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో చర్చలుంటాయా? కాంగ్రెస్ పార్టీ నాలుగైదు రోజుల్లో తమతో చర్చలు జరుపుతుందని అంటున్నారని వామపక్ష నేత ఒకరు పేర్కొన్నారు. ఏదిఏమైనా ఈ చర్చల్లో చెరో సీటు అడగాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఒకవేళ ఎంపీ సీట్లు ఇవ్వకుండా మద్దతు కాంగ్రెస్ కోరితే కనీసం చెరో ఎమ్మెల్సీ అడిగే ఆలోచనలో వామపక్షాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు చెరో ఎంపీ స్థానంలో తమ అభ్యర్థిని స్నేహపూర్వకపోటీ పెట్టడం ద్వారా బరిలో నిలపాలని కూడా లెఫ్ట్ వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది. -
‘రాష్ట్రంలో శత్రువులు.. ఢిల్లీలో చెట్టాపట్టాలు!
తిరువనంతపురం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడూ విడిపోని ప్రాణ స్నేహితులని కానీ కేరళ మాత్రం బద్దశత్రువులని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ యాత్ర ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ‘కేరళలో కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు ఒకరికొకరు శత్రువులు. ఇతర రాష్ట్రాల్లో మాత్రం ప్రాణ స్నేహితులు. ఈ పార్టీలు తిరువనంతపురం భిన్నమైన భాష మాట్లాడి.. ఢిల్లీలో మాత్రం ఒకే భాష మాట్లాడుతాయి’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. మరోవైపు కేరళలో కాంగ్రెస్ పార్టీ సీపీఐ(ఎం) ప్రత్యర్థులు.. అదే పశ్చిమ బెంగాల్లో మాత్రం మళ్లీ మిత్రపక్షాలు. ఇటువంటి వైరుధ్యాలు కలిగిఉన్న కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఢిల్లీ, గుజరాత్, గోవాల్లో సీట్లు సర్దుబాటు చేసుకుందని దుయ్యబట్టారు. ‘కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అవినీతిపరుడు. కేరళలో గత కమ్యూనిస్ట్ పార్టీ పాలకులు కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ చార్జీలు చేశారు. కమ్యూనిస్ట్ నేత పలు కుంభకోణాలకు పాల్పడ్డారు. కానీ.. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లో మాత్రం ఇరుపార్టీ నేతలు ఢిల్లీలో కూర్చొని బిస్కెట్లు, సమోసాలు తింటూ చాయ్ తాగుతారు’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. కేరళలో ఒకటి చెప్పి.. ఢిల్లీలో మరోటి చెప్పి ద్రోహం చేసేవారికి (కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు) వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేరళ ప్రజలు తగినబుద్ధి చెప్పాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేరళలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు ఇవ్వాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. కేంద్ర పథకాలతో కేరళ లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. గత 2019 లోక్సభ ఎన్నికల్లో 20 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లను గెలుచుకోగా.. బీజేపీ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. -
కాంగ్రెస్ తో కామ్రేడ్లు కటీఫ్
-
పెండింగ్ 19పై నేడు భేటీ
సాక్షి, హైదరాబాద్: పెండింగ్లో ఉన్న 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్పార్టీ సోమ వారం తుది చర్చలు జరపనుంది. వామపక్షాలతో పొత్తుతో పాటు పోటీ తీవ్రంగా ఉన్న ఈ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై ఢిల్లీ వేదికగా నేతలు సమా వేశం కానున్నారు. ఈ భేటీ కోసం టీపీసీసీ నేతలు ఆదివారమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ కార్యాలయంలోని వార్ రూంలో పార్టీ అధిష్టానంతో జరిగే సమావేశానంతరం సోమవారం రాత్రి లేదంటే మంగళవారం తుది జాబితా వస్తుందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. లెఫ్ట్తో ‘లెఫ్టా.. రైటా?’ లెఫ్ట్ పార్టీలతో పొత్తుల విషయంలోనూ సోమవారం జరిగే సమావేశాల్లో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా సీపీఎం పార్టీతో పీటముడి పడిన వైరా, మిర్యాలగూడ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు సీపీఐకి ఇవ్వాలనుకుంటున్న కొత్తగూడెం, చెన్నూరు సీట్ల విషయంలోనూ తేడా వచ్చిందనే చర్చ జరుగుతోంది. వివేక్ కుమారుడికి చెన్నూరు సీటు? చెన్నూరు స్థానాన్ని మాజీ ఎంపీ వివేక్ కుమారుడికి కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని, ప్రస్తుతం బీజేపీలో ఉన్న వివేక్ను పార్టీలో చేర్చుకుని ఆయన్ను పార్లమెంటుకు పోటీ చేయించాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తోందని సమాచారం. ఈ మేరకు శనివారమే మొయినాబాద్లోని వివేక్ ఫాంహౌస్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, వివేక్లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సీపీఐకి చెన్నూరు అసెంబ్లీ కేటాయించడం కష్టమేనని, సీపీఐ, సీపీఎంలకు చెరొక్క సీటును మాత్రమే కాంగ్రెస్ ఆఫర్ చేస్తుందని, ఇందుకు ఆ పార్టీలు అంగీకరిస్తే కలిసి ముందుకెళ్లవచ్చని, లేదంటే ఎవరి దారిలో వారు వెళ్లాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలంటుండడం గమనార్హం. -
‘పొత్తు’ పొడిచేనా!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, వామపక్షాల పొత్తుపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఆ పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? లేదా? అన్న సందిగ్ధత ఏర్పడుతోంది. సీపీఐ విషయంలో స్పష్టత వచ్చినా, సీపీఎంకిస్తామన్న రెండుస్థానాల్లో మిర్యాలగూడ ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ.. వైరా స్థానంపై ఎటూ తేల్చకపోవడంతో ఆదివారం సీన్ మారిపోయింది. వైరా ఇవ్వనిపక్షంలో కాంగ్రెస్తో పొత్తు ఉండదని సీపీఎం స్పష్టం చేసింది. కాంగ్రెస్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో అసలు వామపక్షాలు, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. సీపీఐ మౌనం.. సీపీఐ, సీపీఎంలకు రెండేసి చొప్పున అసెంబ్లీ స్థా నాలు కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. అయితే వామపక్షాలు కోరుకున్న విధంగా స్థానాలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. సీపీఐ కొత్తగూడెం, మునుగోడు స్థానాలు కోరగా, కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు కేటాయించింది. సీపీఎం మిర్యాలగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు స్థానాలు ఇవ్వాలని కోరగా మిర్యాలగూడ మాత్రమే సాధ్యమవుతుందని, మిగిలిన రెండింటిలో ఏ సీటూ ఇవ్వలేమని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. ఆ రెండు స్థానాలకు తమ అభ్యర్థులను కూడా ప్రకటించింది. దీంతో వైరా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్టు భావించినా ఒక్కరోజులో పరిస్థితి మారింది. తాజా పరిణామాలపై సీపీఐ మౌనంగా ఉంది. ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. కాగా ముందు ప్రకటించిన చెన్నూరు స్థానం కూడా సీపీఐకి కేటాయించే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. అదే నిజమైతే సీపీఐ వైఖరి కూడా మారే అవకాశముందని చెబుతున్నారు. ఒక వేళ చెన్నూరు ఖరారైతే కాంగ్రెస్తో ముందుకు వెళుతుందా? సీపీఎంతో ముడిపెడుతుందా? అనే చర్చ జరుగుతోంది. సహకారంపై సందేహాలు పొత్తు కుదిరినా కాంగ్రెస్ ఏమేరకు సహకరిస్తుందోనన్న చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే మిర్యాలగూడలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిని ఆ పార్టీ అనధికారికంగా ప్రోత్సహిస్తోందని సీపీఎం వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగూడెంలోనూ అలాంటి పరిస్థితే నెలకొందని సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇలాగైతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రెబల్ అభ్యర్థులను ప్రోత్సహించకూడదనే షరతును కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టాలని వామపక్షాలు భావిస్తున్నట్టు సమాచారం. -
లెఫ్ట్ పార్టీలకు ఏమైంది?
-
ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కారు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్డీఎఫ్) ఏర్పాటైంది. ఇందులో సీపీఐ, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ (యూ), ఆర్ఎస్పీ, బీఎల్ఎఫ్, భారత జాతీయ ఉద్యమ సంఘం తదితర అనేక లౌకిక ప్రజాసంఘాలు కలిసి టీఎస్డీ ఎఫ్ను ఏర్పాటు చేశాయి. ఈ వేదికకు చైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, కో కన్వీనర్లుగా పార్టీకొకరు చొప్పున ఉండాలని నిర్ణయించారు. రాష్ట్ర సమన్వయకర్తగా నైనాల గోవర్ధన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీఎస్డీఎఫ్ విధాన పత్రం, ఉమ్మడి కార్యాచరణను నాయకులు ప్రకటించారు. చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంతృత్వ పాలనకు వ్యతిరే కంగా వామపక్ష పార్టీలు, లౌకిక ప్రజాస్వామిక సంస్థలు కలిసి ఈ వేదికను ఏర్పాటు చేశాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అదానీ, అంబానీ లాంటి కొద్దిమంది పెట్టు బడిదారులకు దోచిపెడుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ చేతిలో రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసమయ్యాయన్నారు. బీజేపీ మతోన్మాద విధా నాలు, బడా సంపన్న అనుకూల విధానాలు, పేదల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తామ న్నారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం అడ్డూ అదుపులేని అవినీతికి పాల్పడుతోందని దుయ్య బట్టారు. తెలంగాణలో అవినీతి ప్రపంచ రికార్డు లను కూడా బద్దలు కొట్టిందన్నారు. ఈ అవినీతి తెలంగాణ ప్రజల పురోభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారిందని, అందుకే అంతా కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జువ్వాడి చలపతిరావు, సీపీఐ రాష్ట్ర నాయకులు బాల మల్లేశ్, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకుడు హన్మేష్, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తుకారాం, ఇతర నాయకులు గుర్రం విజయ్ కుమార్, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్డీఎఫ్ విధాన పత్రం ముఖ్యాంశాలు ఇవీ.. ప్రతి మండలంలో అవసరమైనన్ని నాణ్యమైన పాఠశాలలు స్థాపించాలి. నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఐదు వేల మంది జనాభాకు ఒక రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని నెలకొల్పాలి. స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగ హక్కును కల్పించాలి. లేకుంటే నిరుద్యోగులందరికీ జీవించే నిరుద్యోగ భృతిని ఇవ్వాలి. భూమిలేని పేదలకు భూములను పంపిణీ చేయాలి. దళితులకు 3ఎకరాల భూమి ఇవ్వాలి. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. కుల ప్రాతిపదికగా జన గణన జరగాలి. చట్టసభల్లో బీసీలకు, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కాళేశ్వరం, భగీరథ ప్రాజెక్టుల్లో జరిగిన భారీ అవినీతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. -
కాంగ్రెస్.. కామ్రేడ్స్ కలిసే..!
కాంగ్రెస్...కామ్రేడ్స్ కలిసే..! -
‘కొడవలి’తో కుదిరేనా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి విడిపోయిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలను వచ్చే ఎన్నికల్లో తమతో కలుపుకోవడంపై కాంగ్రెస్ పారీ్ట ఊగిసలాటలో ఉంది. సీపీఎం, సీపీఐలతో కలసి వెళ్లడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ నేతలు పొత్తులు వద్దనే అభిప్రాయంతో ఉండగా, పార్టీ హైకమాండ్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేస్తోంది. జాతీయ స్థాయిలో ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్, లెఫ్ట్ భాగస్వాములైన కారణంగా రాష్ట్ర స్థాయిలోనూ దోస్తీ కొనసాగించాలని రెండు పక్షాల హైకమాండ్లు భావిస్తున్నాయి. రాష్ట్రంలోని ఉభయ కమ్యూనిస్టు పారీ్టలు కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. కానీ మెజార్టీ కాంగ్రెస్ నేతలు మాత్రం గతంలోలా ఓట్ల బదిలీ జరిగే అవకాశం లేదని అందువల్ల ఒంటరి పోటీయే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారు. జాతీయ స్థాయిలోనే ప్రతిపాదనలు లెఫ్ట్, కాంగ్రెస్ల మధ్య పొత్తు వ్యవహారం ఇంకా కింది స్థాయికి రాలేదని, ఇప్పటిరకు ఏఐసీసీ, లెఫ్ట్ పారీ్టల జాతీయ నాయకత్వం స్థాయిలోనే ఈ ప్రతిపాదన ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే ఇరు కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నేతలతో ఫోన్లో మాట్లాడారని వివరిస్తున్నాయి. ‘వారు మాట్లాడుకున్న తర్వాత వ్యవహారం రాష్ట్ర పారీ్టల వరకు వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం.’ అని టీపీసీసీకి చెందిన ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు ఎన్ని స్థానాల్లో ఏ మేరకు ప్రభావితం చూపుతాయన్న దానిపై కూడా కాంగ్రెస్ నేతలు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో లెఫ్ట్ పారీ్టల ప్రభావం బాగా తగ్గిపోయిందని, 10–15 చోట్ల అంతోఇంతో ఓటుబ్యాంకు ఉందని, నాలుగైదు చోట్ల మాత్రం గెలుపోటములను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. ఆ ఆరూ.. అసాధ్యమే ఇతర పార్టీలతో పొత్తు కుదరితే ఏయే అసెంబ్లీ స్థానాలు అడగాలన్న దానిపై సీపీఎం, సీపీఐ నేతలు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీల్లో చర్చించిన అనంతరం ఈ సీట్లపై ఏకాభిప్రాయం కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, భద్రాచలం, మధిర, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, మిర్యాలగూడతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోనికి వచ్చే ఇబ్రహీంపట్నం స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనతో సీపీఎం ఉంది. అయితే ఈ ఆరు స్థానాల్లో ఒక్క స్థానం వదులుకోవడం కూడా సాధ్యం కాదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మధిర, భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుండగా, పాలేరులో గతంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు రఘువీర్రెడ్డి లాంటి బలమైన నేతలున్నారు. నకిరేకల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. దీంతో సీపీఎం అడిగే ఈ ఆరుస్థానాల విషయంలోనూ చిక్కుముడి ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. అతికష్టంగా ఆ ఒక్కచోట..! సీపీఐ ఐదు సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా, నల్లగొండ జిల్లా మునుగోడు, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ స్థానాలపై ఆ పార్టీ దృష్టి ఉంది. కాంగ్రెస్తో చర్చల్లో ఈ స్థానాలను అడిగే అవకాశాలున్నాయి. అయితే కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకీ కాంగ్రెస్ ఇచ్చే అవకాశం లేదు. వైరాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరోక్ష మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్లో చేరారు. దీంతో అక్కడ పోటీకి రాందాస్ నాయక్తో పాటు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వర్గానికి చెందిన విజయాబాయి పోటీ పడుతున్నారు. కాబట్టి ఈ స్థానాన్ని సీపీఐకి ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. బెల్లంపల్లిలో మాజీ మంత్రి గడ్డం వినోద్, హుస్నాబాద్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లు బరిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండు స్థానాలను వదులుకోవడం కూడా కాంగ్రెస్కు కష్టమే. ఇక మిగిలిన మునుగోడులోనే సీపీఐని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మునుగోడులో 2018 ఎన్నికల్లో గెలిచినా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఈసారి ఈ స్థానాన్ని పాల్వాయి స్రవంతి, పున్నా కైలాశ్నేత, చల్లమల్ల కృష్ణారెడ్డి ఆశిస్తున్నారు. అయితే అక్కడ బీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశముంది. దీంతో ఒకవేళ ఇస్తే మునుగోడునే సీపీఐకి ఇవ్వాల్సి వస్తుందని మెజారిటీ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే వామపక్షాలతో చర్చలకు వెళ్లి పొత్తు కుదుర్చుకోవాల్సి వస్తే మాత్రం కనీసం చెరో రెండు సీట్లను వదులుకోవాల్సి ఉంటుందని, దానివల్ల పారీ్టకి నష్టమే జరుగుతుంది తప్ప ఎలాంటి లాభం ఉండదనేది కొందరి అభిప్రాయంగా ఉంది. ఆ రెండు సీట్లు అసలు కుదరవు? ఉభయ కమ్యూనిస్టు పార్టీల సారథులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు పోటీ చేయాలని భావిస్తున్న పాలేరు, కొత్తగూడెం స్థానాలపై పీటముడి పడే అవకాశం ఉందని, ఆ రెండు సీట్లు వదులుకోవడం కాంగ్రెస్ పారీ్టకి సాధ్యం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. పాలేరు, కొత్తగూడెంలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, స్థానిక ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్లినా ఆ రెండు చోట్లా 2018లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించిందని, అలాంటప్పుడు ఆ సీట్లను ఎలా వదులుకుంటామని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘పొత్తులపై చర్చలు జరిగితే సీపీఐ, సీపీఎంలు ఆ రెండు సీట్లపైనే పట్టుపట్టడం ఖాయం. కానీ మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు స్థానాలు ఇవ్వలేం. అందువల్ల చర్చలకు వెళ్లకపోవడమే మంచిదేమో..’ అని కాంగ్రెస్ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచే మేం మెజార్టీ సీట్లు గెలుస్తామని అనుకుంటున్నాం. అక్కడ నాయకత్వం బాగా కష్టపడి పార్టీని నిలబెట్టింది. అలాంటి చోట్ల సీట్లు కమ్యూనిస్టులకు ఇస్తామంటే స్థానిక నాయకత్వం ఎలా స్పందిస్తుందో తెలియదు. కాబట్టి ఆచితూచి ముందుకెళ్లాలని భావిస్తున్నాం.’ అని మరో ముఖ్యనేత చెప్పారు. -
‘బీఆర్ఎస్కు మద్దతు కొనసాగుతుంది.. త్వరలో కేసీఆర్తో చర్చలు’
సాక్షి, హైదరాబాద్: ‘వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలు విడివిడిగా పోటీ చేసి ఎంతో నష్టపోయాయి. ఇకపై వేరువేరుగా పోరాటం చేయకుండా ఐక్యంగా ముందుకు పోవాలని నిర్ణయించాం. అంతేకాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీకికి మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నాం. దేశంలో బీజేపీ వ్యతిరేక లౌకిక శక్తులను ఏకం చేయడం ద్వారా కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే మా లక్ష్యం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు కొనసాగిస్తూ మాకు బలం ఉన్న చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. అతి త్వరలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో చర్చిస్తాం..’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఎంబీ భవన్లో సీపీఎం, సీపీఐల ఉమ్మడి సమావేశం జరిగింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. అనంతరం తమ్మినేని, కూనంనేని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్తో జట్టు కట్టం: తమ్మినేని బీఆర్ఎస్తో కమ్యూనిస్టులు దూరంగా ఉన్నారని, కాంగ్రెస్ పారీ్టతో జత కడతారనే తప్పుడు వార్తలను తమ్మినేని ఖండించారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్కు ఉందని, అందుకే మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ తనకు తానుగా చొరవ చేసి మునుగోడులో కలిసి పని చేద్దామని కోరిందని, రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని చెప్పారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు సీట్ల అంశంపై మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. సీట్ల కేటాయింపులపై సీఎం కేసీఆర్తో ఇప్పటివరకు తాము చర్చించలేదన్నారు. కమ్యూనిస్టులు ఎన్నికలకు సమాయత్తం అవ్వడం లేదని కొందరు అనుకుంటున్నారని, కానీ తమకు బలం ఉన్న చోట సన్నాహాలు చేసుకుంటున్నామని తెలిపారు. ఓట్లు, సీట్ల కోసం దిగజారం: కూనంనేని మునుగోడులో ఏర్పడిన విపత్తును వామపక్షాలు అడ్డుకున్నాయని కూనంనేని అన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే ప్రభుత్వాన్ని అస్థిర పరిచేదని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఎల్ సంతోష్ ప్రయత్నం చేశారని ఆరోపించారు. కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ, పార్లమెంటులను ప్రజలు ఊహించుకోవడం లేదన్నారు. బీజేపీకి ప్రజల సమస్యలు పట్టవని, వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతుందని విమర్శించారు. జాతీయ స్థాయిలో లౌకిక శక్తులతో కేసీఆర్ కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు వివరించారు. గిరిజనేతరులకూ పోడు భూములు ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ అంశం త్వరలో సీఎంకు వివరిస్తామన్నారు. -
బీఆర్ఎస్ తీరుపై కామ్రేడ్ల కస్సుబుస్సు
సాక్షి, హైదరాబాద్: పొత్తుల విషయంలో బీఆర్ఎస్ తీరుపై వామపక్షాలు గరంగరంగా ఉన్నాయి. పొత్తులుంటాయా ఉండవా అనే అంశంపై సీపీఐ, సీపీఎం కేడర్లో గందరగోళం నెలకొంది. పొత్తులు, ప్రజాసమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ను అపాయింట్మెంట్ కోరినా ఇప్పటివరకు లభించకపోవడంపై కామ్రేడ్లు కస్సుబుస్సులాడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ తమను ఉపయోగించుకొని పొత్తులపై చర్చించాలనే సరికి మాత్రం పక్కనపెడుతోందని కొందరు నేతలు మండిపడుతున్నారు. ఖమ్మంలో నిర్వహించిన సభకు తమ జాతీయ నేతలైన కేరళ సీఎం పినరయి విజయన్, డి.రాజా వంటి వారిని వెంటపడి మరీ పిలిపించుకున్న సీఎం కేసీఆర్... ప్రస్తుతం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలు శుక్రవారం ఎంబీ భవన్లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ఆ పార్టీల ముఖ్య నేతలు హాజరుకానున్నారు. బీజేపీని వ్యతిరేకించే శక్తులతోనే ముందుకు... మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి అడ్డుకట్ట వేయగలిగేది బీఆర్ఎస్ మాత్రమేనని భావించి ఆ పార్టీకి వామపక్షాలు మద్దతిచ్చాయి. అనుకున్నట్లుగానే బీజేపీ గెలవకుండా అక్కడ వామపక్షాల ఓట్లు సహకరించాయి. రానున్న ఎన్నికల్లోనూ బీజేపీని ఓడించే సత్తాగల పార్టీకే మద్దతు ఇవ్వాలన్నది వామపక్షాల వైఖరి. ఇందులో భాగంగా సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్ను చెరో 10 అసెంబ్లీ స్థానాలు కోరాలనుకుంటున్నాయి. చర్చల్లో చివరకు చెరో ఐదు స్థానాలు తప్పనిసరిగా అడగాలన్నది వారి ఉద్దేశం. కానీ ఈ స్థానాలు ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదన్న వాదనలు వస్తున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్లున్న ఆయా స్థానాలను కామ్రేడ్లకు ఇవ్వడం వల్ల ప్రస్తుత ఎమ్మెల్యేలు అలిగి సహకరించకపోతే ఓటు బదిలీ జరగక వారు ఓడిపోయే ప్రమాదం ఉందన్న భావనలో బీఆర్ఎస్ ఉందని వామపక్షాలు అంచనా వేస్తున్నాయి. అలాగే పది సీట్లు ఇచ్చినా వామపక్షాలు డబ్బు ఖర్చు పెట్టవని, దానివల్ల కూడా సీట్లు కోల్పోవాల్సి వస్తుందని కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్తో పొత్తు కుదరకపోతే కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకొనే దిశగా కూడా వామపక్షాలు ఆలోచిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు వామపక్షాలతో పొత్తుపై ఆసక్తి చూపించడంలేదని సమాచారం. -
TS: పొత్తుల విషయంలో వామపక్షాలు మౌనం.. కారణం అదేనా!
కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. దీంతో పొత్తుల విషయంలో కమ్యూనిస్టు పార్టీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయనే వాదన వినిపిస్తోంది. అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయించుకోలేకపోతున్నాయనే చర్చ కూడా నడుస్తోంది. బీఆర్ఎస్ విషయంలో క్లారిటీ రాలేదా? కాంగ్రెస్ బలపడుతున్నదని ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఎర్రన్నల ఆలోచనలు ఎలా ఉన్నాయి? కొంతకాలంగా పొత్తుల విషయంలో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలు మౌనం పాటిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సాధారణ ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగుతుందని రెండు వైపుల నుంచి ప్రచారం ఊపందుకుంది. కాని తాజా పరిణామాల నేపథ్యంలో పొత్తుల సంగతి తర్వాత ముందు మన బలం పెంచుకుందామని రెండు వామపక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తమకు పట్టున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బహిరంగసభలతో బలాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగూడెంలో సీపీఐ భారీ బహిరంగ సభ నిర్వహించి బీజేపీని టార్గెట్ చేసింది. ఖమ్మం అంటే కమ్యూనిస్టుల అడ్డా అని..ఇక్కడ కాషాయ పార్టీ పప్పులు ఉడకవని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అంటున్నారు. అదే సమయంలో లెఫ్ట్ పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకుంటాయనే విషయమై ఎలాంటి చర్చలూ జరగలేదని ఆయన చెప్పారు. పొత్తుల అంశంపై ఎన్నికల సమయంలోనే స్పష్టత వస్తుందని కూడా ఆయన ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతోందని.. అదే సమయంలో కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడ బీజేపీ పూర్తిగా బలహీనపడిందని లెఫ్ట్ నేతలు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా కూడా గట్టిగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. వారి అంచనాలు, అభిప్రాయాలు చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, వైరా, పినపాక స్థానాలపై సీపీఐ గురిపెట్టింది. అందులో భాగంగానే కొత్తగూడెంలో భారీ బహిరంగ సభతో బలప్రదర్శన చేసింది. కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సీపీఏం సైతం అదే ఫార్ములాను అనుసరిస్తోంది. పొత్తుల విషయం పక్కన పెట్టి వారికి పట్టు ఉన్నా ప్రాంతాల్లో బలం పెంచుకునే ప్రయత్నంలో సీపీఎం నాయకులు ఉన్నారు. ఇటివలే ఖమ్మం నగరంలో సీపీఏం కూడా భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటే ప్రయత్నం చేసింది. ఉమ్మడి జిల్లాలో సీపీఏంకి పాలేరు, మధిర, భద్రాచలం నియోజకవర్గాల్లో బలం ఉంది. పాలేరు నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ సైతం మొదలుపెట్టారు. సీట్ల విషయంలో బీఆర్ఏస్ నుంచి క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో.. ముందు తమకు పట్టు ఉన్న ప్రాంతాల్లో బలం చూపించుకుంటే సీట్లు అవే వస్తాయన్న భావనలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పొత్తుల విషయంలో మౌనంగా ఉంటున్నాయి. అయితే సీపీఎం, సీపీఐ కలిసే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. మరి వారి పొత్తు కాంగ్రెస్తో ఉంటుందా? బీఆర్ఎస్తో ఉంటుందా? బహుశా వారికి కావాల్సిన సీట్లు ఎవరిస్తే వారితో ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చదవండి: బండ్ల గణేష్ పొలిటికల్ ట్వీట్.. రాజకీయాల్లోకి రీఎంట్రీ! -
చంద్రబాబు బరితెగింపునకు నిదర్శనం ‘కరకట్ట నివాసం’: సజ్జల
సాక్షి, విజయవాడ: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుకబడిన వర్గాల అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారని తెలిపారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లెఫ్ట్ పార్టీలు సంపన్నుల వైపు నిలబడతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏజెంట్లా పవన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ రాజకీయ నిర్ణయాలు చంద్రబాబుకు రాజకీయంగా ఉరితాడు లాంటివని అన్నారు. అందుకే తోడేళ్ల మందలా ఏకమై దాడి చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణసీకారోత్సవ కార్యక్రమం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. 'రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు చేసేలా సీఎం జగన్ పాలన ఉంది. మేనిఫెస్టోలో 98.2 శాతం హామీలను అమలు చేసి చూపించారు. చంద్రబాబు హయాంలో జరిగిన దేశంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతి. బాబు అక్రమాలకు చిరునామా చంద్రబాబు కరకట్ట నివాసం. లింగమనేని రమేష్కి, హెరిటేజ్కి మధ్య లావాదేవీలు జరిగాయి. చంద్రబాబు బరితెగింపునకు నిదర్శనం ఈ అక్రమ నివాసం. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చట్టం చేసిన వ్యక్తి చంద్రబాబు. డబ్బున్న వాళ్లకోసం పేదలకు ఇవ్వకుండా చేశారు. రియల్ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా చంద్రబాబు గొడవ చేయిస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు.' అని సజ్జల ఫైర్ అయ్యారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం.. -
ఆపత్కాలంలో ఐక్యతా రాగం!
దేశంలో వామపక్షాలు బలహీనమై పోతున్న కాలమిది. ఇదే సమయంలో మతతత్త్వ శక్తులు బలపడిపోతుండటం ప్రగతి శీల ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఉభయ కమ్యూనిస్టు పార్టీల (సీపీఐ, సీపీఎం) జాతీయ నాయకత్వాలు హైదరాబాద్లో సమావేశమై వామపక్షాల ఐక్యత అవసరంపై చర్చించాయి. ఈ పార్టీల్లో సీపీఐ తాజాగా ‘జాతీయ పార్టీ’ హోదాను కోల్పోయిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు వామపక్షాలు ఐక్యమైతేకాని మతతత్త్వ శక్తులను అడ్డుకోవడం సాధ్యం కాదని ప్రకటించాయి. వామపక్షాల ఐక్యత అవసరాన్ని ఎనభై ఏళ్ల క్రితమే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రమాణ పత్రం ఒకటి నొక్కి వక్కాణించడం గమనార్హం. ‘‘భారతదేశాన్ని ‘హిందూ దేశం’గా మార్చేందుకు, భారత సెక్యులర్ రాజ్యాంగం స్థానంలో దేశాన్ని విభజించి కేవల ‘హిందూ’ దేశంగా మార్చే ‘మను స్మృతి’ని అమలు పరిచేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ప్రయత్నిస్తు న్నాయి. మితవాద రాజకీయాలపై శక్తిమంతంగా పోరాడాలంటే దేశంలో వామ పక్షాల మధ్య ఐక్యత మరింత అవసరం. దేశంలోని మితవాద రాజకీ యాలపై నిరంతర పోరుకు వామపక్షాల ఐక్యత నేడు తక్షణావసరం. ఈ ఐక్యత పరస్పర విశ్వాసం ద్వారానే సాధ్యం’’. – సీపీఐ, సీపీఎం పార్టీలు హైదరాబాద్లో తొలిసారిగా జరిపిన సంయుక్త సమావేశంలో (10.4.2023) తీసుకున్న నిర్ణయం. వామపక్షాలైన సీపీఐ, సీపీఎంల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి ‘యూనిటీ’ సమావేశం వామపక్ష అభిమానులలో నూతనోత్తే జానికి కారణమయింది. ఉభయపక్షాల ఐక్యత తక్షణావసరాన్ని ఇరు పక్షాల నాయకులు, కార్యకర్తలు గుర్తించడం ముదావహం. నిజానికి ఉభయ పార్టీలూ కలవ వలసిన అవసరాన్ని కొత్తగా ఇప్పుడు గుర్తించారని చెప్పనవసరం లేదేమో. ఎనిమిది దశాబ్దాల క్రితమే కాన్పూర్ కేంద్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఎస్. సత్యభక్త కమ్యూనిస్టుల ఐక్యత కోసం తొలి ప్రమాణ పత్రాన్ని వెలువరించారు. హైదరాబాద్ కేంద్రంగా వెలువడిన ఉభయ పార్టీ (సీపీఐ, సీపీఎం)ల సంయుక్త సమావేశంలో ప్రసంగించిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, ïసీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలు ఉగ్గడించిన ‘ఉభయ పక్షాల ఐక్యత అవసరం’ గుర్తించ డానికి ఇన్నేళ్ల సమయం పట్టడం... ఉభయ వామ పక్షాల ఉమ్మడి వార సత్వానికి ఒక రకంగా ‘మచ్చ’గానే భావించాలి. అయినా ఇప్పటికైనా ఏకపక్షంగా ఉభయపక్షాల ఐక్యతావాంఛ... అనేక సమస్యల పరిష్కా రానికి ఎదురుచూస్తున్న దేశానికి శుభసూచకంగా భావించాలి. ఈ సందర్భంగా కాన్పూర్ తొలి పార్టీ ప్రమాణ పత్రాన్ని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, ఆ పత్రం ఆనాటికే కాదు, ఎప్పటికీ పోరాట పటిమ గల పార్టీకి ఒక బలమైన దిక్సూచిగా ఎలా నిలబడి పోయిందో గుర్తించడం కోసమే! అందులో పేర్కొన్న ప్రమాణాలలో కొన్నింటిని ఒక్కసారి పరిశీలిద్దాం: ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా లేని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలనుకొనేది సంపాదన కోసం, అది వీలు చిక్కకపోతే ప్రజలపై నిర్బంధ విధానాల ద్వారా ఒడుపుకోవడం కోసమే గానీ ప్రజల ప్రయోజనాలను గుర్తించి వారిని సకాలంలో ఆదుకోవడానికి కాదు; ఈ పరిస్థితుల్లో వామపక్షాల బాధ్యత పెట్టుబడిదారీ శక్తుల తరఫున కొమ్ము కాయడం కాదు, ఆ కొమ్ములను విరిచి ప్రజాబాహుళ్యం మౌలిక అవసరాలైన తిండి, బట్ట, వసతి, ఉపాధి సౌకర్యాలను కల్పించడం. తద్వారా ప్రజలు తమ కష్టార్జితాన్ని తాము స్వేచ్ఛగా అనుభవించడానికి దోపిడీకి తావు లేకుండా చేయడం కమ్యూనిస్టుల విధిగా ఉండాలి. ఇదీ స్థూలంగా 1924 నాటి కాన్పూర్ డాక్యుమెంట్ ఆదేశించింది. ఆ ‘ప్రమాణ పత్రం’ మకుటం కూడా ‘సత్యభక్త, భార తీయ సామ్యవాది దళ్’ (ది ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ) అనీ, ‘సత్యవాది’ అనీ! 1924 నాటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని సమ స్యల్ని ఎంతగా మనసు విప్పి బాహాటంగా ప్రకటించిందో చూడండి: ‘సమాజంలో నాయకులకు, రాజకీయవేత్తలకు, మత ప్రవక్తలకు, సంఘ సంస్కర్తలకు కొదువ లేదు వీరంతా ప్రజలకు చేసే మార్గ నిర్దేశానికి కొదవ లేదు. కానీ వీరు చూపే అనేక మార్గాలు ఉన్న ‘జబ్బు’ను పెంచేవే కానీ తుంచేవి కావు. పైగా చాలామంది మార్గదర్శ కులు తమ పొట్టలు నింపుకోవడం కోసం ప్రజల్ని బుద్ధి పూర్వకంగానే అగాథంలోకి నెట్టేస్తారు. కానీ, ఇలా అగాథంలోకి నెట్టే వాళ్లనుంచి ప్రజల్ని రక్షించడానికే భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టింది. ప్రజలు ఎదుర్కొనే అన్ని సమస్యల నుంచీ వారిని తామే రక్షిస్తామన్న హామీ ఏ పార్టీ ఇవ్వదు. ఎందుకంటే, ఏ పార్టీ వ్యవస్థా అలా ఉండదు కనుక. ప్రజలంతా ఏకమై తమ కాళ్లమీద నిలబడి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి. ధనికులకు, పేదలకు మధ్య దారుణంగా పేరుకు పోయిన సమస్యల్ని తగ్గించడం పార్టీ లక్ష్యంగా ఉండాలి. సమాన త్వాన్ని ప్రేమించేవారికి పార్టీలో నిస్సందేహంగా స్థానం ఉంటుంది. అంతేగాని తాము మాత్రమే అన్ని సౌకర్యాలు అనుభవించాలనుకొనే వారికి పార్టీలో స్థానం ఉండదు. ఎవరైతే ప్రజల్ని మోసం చేస్తూ, ఇతరులను దోచుకుంటూ అనుభవించగోరతారో... వారికి పార్టీలో స్థానం ఉండదు. తమ చెమటోడ్చి సంపాదించుకుంటూ, తప్పుడు మార్గాల ద్వారా సంపాదనకు ఒడిగట్టని పేద రైతులు, కార్మికులు, నిరుపేద గుమస్తాలు, చిన్నచిన్న ప్రభుత్వోద్యోగులు, రైల్వే సిబ్బంది, స్కూలు మాస్టర్లు, చిన్నచిన్న వ్యాపారులు, చిన్నస్థాయి పోలీస్ కానిస్టేబుల్స్, ప్రెస్ ఉద్యోగులు – వంటి వారు మాత్రమే మా పార్టీలో సభ్యత్వానికి అర్హులు’ అని పార్టీ ఈ పత్రం ద్వారా చాటింది. అయితే పెట్టుబడిదారీ (కాపిటలిస్ట్) వర్గానికి, వారి ప్రయోజ నాల కోసం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పనిచేసే సంస్థలను పార్టీ సహించదని చెప్పింది. అందుకనే శ్రమ జీవులంతా ఏకైక భారత కమ్యూనిస్టు పార్టీ పతాకం కింద సమకూడి, తుది శ్వాస వరకూ నిలబడాలని ప్రమాణ పత్రం నిర్దేశించింది. అంతేగాదు, రంగంలో ఉన్న పెక్కు రాజకీయ పార్టీలు వర్గ ప్రయోజనాలను ప్రతిబింబించేవి కాబట్టి... వీటన్నింటిలో ఏకైక పెద్ద కార్మికవర్గ శక్తి కమ్యూనిస్టు పార్టీ కాబట్టి అందరూ ఐక్య శక్తిగా సమీకృతం కావాలని ఆ మానిఫెస్టో ప్రకటించింది. బహుశా అందుకనే సుభాష్ చంద్రబోస్ రానున్న రోజుల్లో భారతదేశ భవిష్యత్తు మౌలికంగా వామపక్ష శక్తుల పోరాటం, త్యాగాల మీదనే ఆధారపడి ఉంటుందని జోస్యం చెప్పారు. ఎందుకంటే, విప్లవోద్యమం అనేది అరాచక ఉద్యమం కాదు, టెర్రరిస్టుల ఉద్యమమూ కాదు. భారత స్వాతంత్య్రోద్యమంలో దేశ భక్తులైన అనేకమంది మేధావులను, నాయకులను, యువకులను, రచయిత లను ‘దేశద్రోహులు’గా వలస పాలకులు ముద్రవేసి జైళ్లలో పెట్టారు. అందులో వామపక్ష భావాలు ఉన్నవారు అనేకమంది ఉన్నారు. ‘మనల్ని దేన్ని చదవకూడదని బ్రిటిష్ పాలకులు కోరుకున్నారు’ (బ్యాన్డ్ అండ్ సెన్సార్డ్: వాట్ ది బ్రిటిష్ రాజ్ డిడిన్ట్ వాంట్ అజ్ టు రీడ్’) అనే గొప్ప చారిత్రిక విశ్లేషణా గ్రంథాన్ని తాజాగా అందించిన చరిత్రకారిణి దేవికా సేథి... అప్పటి వలస భారతంలోని ‘సెన్సార్షిప్’ నిబంధనల మాలోకం గురించీ వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 75 ఏళ్ల తర్వాత రాసిన ఆ గ్రంథం ఎన్నో మరుగున పడిన విషయాలను తెలియచేస్తోంది. ఇంతకూ ‘దేశద్రోహి’ అంటే ఎవరు, అన్న ప్రశ్నకు టర్కీ ప్రసిద్ధ ప్రజా మహాకవి హిక్మెట్ను అడిగితే చెబుతాడు: ‘‘ఔను, నేను దేశద్రోహినే – మీరు దేశభక్తులైతే మీరే మన మాతృభూమి పరిరక్షకులైతే నేను నా మాతృభూమికి దేశద్రోహినే దేశభక్తి అంటే మీ విశ్వాసాల వ్యవసాయ క్షేత్రాలే అయితే దేశభక్తి అంటే మీ బొక్కసాల్లో సంపదలే అయితే దేశభక్తి అంటే మీ బ్యాంకు ఖాతాల్లో నిధులే అయితే దేశభక్తి అంటే దారి పక్క దిక్కులేని ఆకలి చావులే అయితే దేశభక్తి అంటే జనాలు కుక్కపిల్లల్లా చలికి వణికిపోవడమే అయితే ఎండా కాలంలో మలేరియాతో కునారిల్లడమే అయితే మతగ్రంథాలను వల్లించడమే దేశభక్తి అయితే పోలీసు చేతి లాఠీయే దేశభక్తి అయితే మీ కేటాయింపులూ, మీ జీతభత్యాలు మాత్రమే దేశభక్తి అయితే మూఢ విశ్వాసాల అజ్ఞానపుటంధకారపు మురికి గుంట నుంచి విముక్తి లేకపోవడమే దేశభక్తి అయితే – నేను దేశద్రోహినే!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కలి‘విడి’గానే! చర్చనీయాంశంగా కారు – కామ్రేడ్ల స్నేహబంధం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికల కార్యాచరణను అమలు చేస్తున్నాయి. కానీ ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. అయినప్పటికీ అధికార బీఆర్ఎస్ – వామపక్షాల పొత్తు అంశం మాత్రం గత కొన్నాళ్లుగా చర్చనీయాంశమవుతోంది. ఆ పార్టీల నేతలు పోటీలు పడుతూ దీన్ని తెరపైకి తెస్తున్నారు. తాజాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేస్తాయని, ఈ అవగాహనలో భాగంగా తాము అడిగే మొదటి స్థానం పాలేరేనని, ఇక్కడ తాము పోటీ చేస్తే మంచోళ్లంతా తమకే ఓట్లు వేయాలని ఆయన కోరారు. పొత్తు చర్చలు ప్రారంభం కాకుండానే ఆయన సీపీఎం పోటీ చేసే స్థానాలపై మాట్లాడటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ఓ సభలో కూడా ఇక్కడి నుంచి సీపీఎం కచ్చితంగా పోటీ చేస్తుందంటూ తమ్మినేని చెప్పుకొచ్చారు. తమ్మినేని మాత్రమే కాదు.. తాము కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్న అసెంబ్లీ స్థానాల పరిధిలోని సీపీఎం, సీపీఐ నేతలు కూడా ఆయా సందర్భాల్లో బీఆర్ఎస్తో పొత్తు, తాము పోటీ చేసే నియోజకవర్గాలను ప్రస్తావిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని, కొత్తగూడెం నుంచి తాను తప్పనిసరిగా పోటీ చేస్తానని పార్టీ కేడర్కు చెపుతున్నారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ ఆలోచన ఏ విధంగా ఉందన్నది బయటపడక పోవడంతో.. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ పార్టీల మధ్య ఏర్పడిన స్నేహ బంధం ఎంత దూరం కొనసాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. గౌరవప్రదమైన స్థాయిలో అంగీకారం! వామపక్ష పార్టీల్లో జరుగుతున్న చర్చల ప్రకారం.. బీఆర్ఎస్తో పొత్తు కుదిరితే మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు అడగాలని సీపీఎం, సీపీఐలు నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. పాలేరు, వైరా, మధిర, భద్రాచలం, ఖమ్మం, నకిరేకల్, మిర్యాలగూడ, నల్లగొండ, ఇబ్రహీంపట్నం స్థానాలు కావాలని సీపీఎం అడిగే అవకాశం ఉండగా కొత్తగూడెం, దేవరకొండ, హుస్నాబాద్, బెల్లంపల్లి, వైరా, ఇల్లందు, మునుగోడు నియోజకవర్గాలను సీపీఐ కోరే అవకాశముంది. అయితే కోరినన్ని స్థానాలు ఇవ్వకపోయినా గౌరవప్రదమైన స్థాయిలో పొత్తును అంగీకరించే యోచనలో రెండు పార్టీలూ ఉన్నట్టు సమాచారం. కనీసం మూడు అసెంబ్లీ సీట్లు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యత్వం కోసం బీఆర్ఎస్ను కోరే విషయమై సీపీఎం నేతలు అంతర్గతంగా చర్చించికుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సీపీఐ కూడా కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు కావాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ, ఇతర పదవుల గురించి కూడా చర్చించాలనే యోచనలో సీపీఐ పెద్దలున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా పొత్తు విషయంలో తగ్గేదేలేదని ఆ పార్టీలు చెబుతున్నాయి. తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రెండు నియోజకవర్గాల తర్వాతే ఏ స్థానం గురించైనా చర్చ జరుగుతుందని వామపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పెద్దల మదిలో ఏముందో? కామ్రేడ్ల ఆలోచనలు ఎలా ఉన్నా.. వారితో తమ అనుబంధంపై బీఆర్ఎస్ పెద్దల మదిలో ఏముందన్నది అంతు పట్టడం లేదు. పలు సందర్భాల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం తెరపైకి వస్తున్నప్పటికీ ఆ పార్టీ కీలక నేతలెవరూ ఎక్కడా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం లేదు. సీఎం కేసీఆర్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశాన్ని కనీస మాత్రంగా కూడా ప్రస్తావించడంలేదు. అయితే వామపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇప్పిస్తామని, ఆయా స్థానాల్లో తామే పోటీ చేస్తామని స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వామపక్ష పార్టీల నేతలకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అంశం కూడా ఎక్కడా చర్చకు రావడం లేదు. ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం! వామపక్ష పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతాయి కానీ, అధికారికంగా పొత్తు కుదిరే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తుండటం సందిగ్ధతకు తావిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోలేదని, ఆ రెండు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, 2023లో లెఫ్ట్తో కలిసి వెళితే తాము గతం కంటే బలహీనపడ్డామని తామే అంగీకరించినట్టు అవుతుందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ నాయకుల్లో ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారని, వారు కోరుతున్న స్థానాలను వదులుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధంగా లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ స్థానాల్లో కేడర్ను నిలబెట్టుకునేదెట్టా? లెఫ్ట్తో పొత్తు అంశం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వామపక్షాలు ఖచ్చితంగా అడుగుతాయని భావిస్తున్న స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కందాల ఉపేందర్రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రవీంద్రనాయక్, వనమా వెంకటేశ్వరరావు తదితరులకు తమ నియోజకవర్గాల్లో కేడర్ను నిలబెట్టుకోవడం కత్తిమీద సాములా మారుతోంది. ఆయా స్థానాలు లెఫ్ట్ పార్టీలకు వదిలివేస్తారనే సంకేతాల నేపథ్యంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎక్కడ జారిపోతుందోననే ఆందోళన స్థానిక బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. పలువురు కమ్యూనిస్టు నాయకులకు ఏకంగా సీఎం కేసీఆర్ స్థాయిలో హామీ లభించిందన్న ప్రచారం కూడా వారికి మింగుడు పడడం లేదు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద ప్రకటనలకు కూడా సిద్ధమవుతున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా కొద్దిరోజుల క్రితం.. అక్కడ జూలకంటి రంగారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పినా, ఆ తర్వాత సీపీఎం నేతలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగూడెంలో అయితే వనమాతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు తదితరులు తమకంటే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తంమీద లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కోరే విషయమై సీపీఎం నేతలు అంతర్గతంగా చర్చించికుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సీపీఐ కూడా కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు కావాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ, ఇతర పదవుల గురించి కూడా చర్చించాలనే యోచనలో సీపీఐ పెద్దలున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా పొత్తు విషయంలో తగ్గేదేలేదని ఆ పార్టీలు చెబుతున్నాయి. తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రెండు నియోజకవర్గాల తర్వాతే ఏ స్థానం గురించైనా చర్చ జరుగుతుందని వామపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం! వామపక్ష పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతాయి కానీ, అధికారికంగా పొత్తు కుదిరే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తుండటం సందిగ్ధతకు తావిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోలేదని, ఆ రెండు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, 2023లో లెఫ్ట్తో కలిసి వెళితే తాము గతం కంటే బలహీనపడ్డామని తామే అంగీకరించినట్టు అవుతుందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ నాయకుల్లో ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారని, వారు కోరుతున్న స్థానాలను వదులుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధంగా లేదని, స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ స్థానాల్లో కేడర్ను నిలబెట్టుకునేదెట్టా? లెఫ్ట్తో పొత్తు అంశం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వామపక్షాలు ఖచ్చితంగా అడుగుతాయని భావిస్తున్న స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కందాల ఉపేందర్రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రవీంద్రనాయక్, వనమా వెంకటేశ్వరరావు తదితరులకు తమ నియోజకవర్గాల్లో కేడర్ను నిలబెట్టుకోవడం కత్తిమీద సాములా మారుతోంది. ఒకవేళ ఆయా స్థానాలు లెఫ్ట్ పార్టీలకు వదిలివేస్తే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎక్కడ జారిపోతుందోననే ఆందోళన స్థానిక బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద ప్రకటనలకు కూడా సిద్ధమవుతున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మిర్యా లగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా కొద్దిరోజుల క్రితం.. అక్కడ జూలకంటి రంగారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పినా, ఆ తర్వాత సీపీఎం నేతలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగూడెంలో అయితే వనమాతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు తమకంటే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తంమీద లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. -
కామ్రేడ్.. కథ అడ్డం తిరిగిందా?
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొన్ని ప్రశ్నలు తెర మీదికి వచ్చాయి. లక్ష్యం ఒక్కటే. చీకటి ఒప్పందాలతో అయినా పచ్చ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. తాము బలపరిచిన అభ్యర్థి గెలవకపోయినా ఫర్వాలేదు.. 1. టీడీపీ గెలిస్తే చాలనుకున్న ఆ పార్టీలు ఏవి? 2. పచ్చ పార్టీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ నాయకులు ఎవరు? 3. సొంత పార్టీని ఫణంగా పెట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి సహకరించింది ఎవరు? ఎందుకిలా జరిగింది? 4. నెల్లూరు జిల్లాలో ఆ రెండు పార్టీల మద్య కుదిరిన రహస్య ఒప్పందమేంటి..? సైద్దాంతిక నిబద్ధతను కామ్రేడులు గాలికి వదిలేశారా? 5. భవిష్యత్ ఇస్తామని పచ్చ పార్టీ చూపిన ఆశలకు లొంగిపోయారా? 6. చంద్రబాబు ప్రలోభాలకు సరెండర్ అయి వారి బలాన్ని టీడీపీకీ ట్రాన్స్ఫర్ చేశారా..? లేక డబ్బు కోసం చేతులు కలిపారా ? 7. పట్టభద్రుల ఎన్నికలో టీడీపీ చేసిన జిమ్మిక్కులేంటి..? ఇప్పుడు ఇదే చర్చ ప్రస్తుతం వామపక్ష అభిమానుల్లో నడుస్తోంది.. గెలిచే బలమున్నప్పటికీ.. ఎందుకు టీడీపీ అభ్యర్దికి సహకరించారని అందరూ చర్చించుకుంటున్నారు. తమను తాకట్టు పెట్టుకుని బాబుకు జై కొట్టారా? తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలంటే పీడీఎఫ్ అభ్యర్దుల గెలుపు ఖాయమనే భావన ఉండేది. గత పదిహేను సంవత్సరాలుగా ఈ రెండు స్థానాల్లో వామపక్షాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్దులే గెలుస్తూ వచ్చారు. కానీ ఈ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ బరిలోకి దిగడంతో పీడీఎఫ్ అభ్యర్దులకు ముచ్చెమటలు పట్టాయి. గెలుపు అంత ఈజీ కాదని అర్దమైంది.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ది చంద్రశేఖర్ రెడ్డిని, పట్టభద్రుల అభ్యర్ది శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఓడించేందుకు పావులు కదిపింది. డిపాజిట్లు అయినా సంపాదించుకోవాలనుకుంటున్న టీడీపీ వారితో జతకట్టింది.. ఇరు వర్గాల మధ్య తెరవెనుక ఒప్పందం కుదిరింది. రెండుసార్లు గెలిచిన పట్టభద్రుల పీడీఎఫ్ అభ్యర్థులు ఓడి, టీడీపీ అభ్యర్థిని గెలిపించారు. రాజకీయం ఎన్ని మలుపులు తిరిగింది? కామ్రేడ్స్ సైద్దాంతిక విలువలను గాలికొదిలేశారనే విమర్శలు నెల్లూరు జిల్లాలో వినిపిస్తున్నాయి. గత పదిహేనేళ్ళ నుంచి ఇక్కడి స్థానాల్లో విజయం సాదిస్తున్న పీడీఎఫ్ అభ్యర్దులకు సాంప్రదాయ ఓటు బ్యాంకు వుంది. కానీ వారు తమ బలాన్ని ఈసారి టీడీపీకి ట్రాన్స్ఫర్ చేయించారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి నారాయణ విద్యాసంస్థల అధినేత, అప్పటి మంత్రి పొంగురు నారాయణ అనుచరుడు పట్టాభి బరిలోకి దిగాడు. నారాయణ విద్యాసంస్థలతో కోట్లు ఖర్చుచేయగల సత్తా ఉన్నప్పటికీ.. పీడీఎఫ్ అభ్యర్థులను టీడీపీ టచ్ చెయ్యలేకపోయింది.. పట్టాభిని పీడీఎఫ్ అభ్యర్దులు కామెడీగా పక్కకి నెట్టేశారు. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలిచింది.. గత ఎన్నికల్లో నారాయణ విద్యాసంస్థలనే ఢీకొట్టిన వామపక్షాలు... ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోవడం వెనుక కుల సమీకరణాలు బాగా పనిచేశాయనే టాక్ నడుస్తోంది. వామపక్ష పార్టీలను లీడ్ చేసేది కూడా చంద్రబాబునాయుడి సామాజికవర్గమే కావడంతో జగన్ ను ఎదుర్కొనేందుకు వారంతా ఒక్కటయ్యారనే చర్చ కమ్యూనిస్టు పార్టీల్లోనే జరుగుతోంది. మన వాళ్లు కక్కుర్తి పడ్డారు కమ్యూనిస్టులు తెరచాటు రాజకీయం చెయ్యడం వల్లనే టీడీపీ అభ్యర్ది శ్రీకాంత్ విజయం సాధ్యమైంది. అనామకుడుగా ఎమ్మెల్సీ బరిలోకి దిగిన శ్రీకాంత్ కు కామ్రేడ్స్ సాయం చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ సాయం వెనుక భవిష్యత్ లో ఏమైనా పదవులు రావొచ్చు.. లేదంటే భారీగా లబ్ది అయినా చేకూరి ఉండొచ్చని నెల్లూరులో గాసిప్స్ వినిపిస్తున్నాయి. పచ్చ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి తాము బలపరిచిన అభ్యర్థినే త్యాగం చేసిన కమ్యూనిస్టుల పార్టీల వ్యవహార సరళిని వామపక్ష అభిమానులే చీదరించుకుంటున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
కాంగ్రెస్ వైపు కామ్రేడ్లు.. ప్రణాళికలు సిద్ధం..!
అసెంబ్లీ ఎన్నిక లకు ఏడాది సమయం కూడా లేదు. ముందస్తు ఎన్నికలపైనా ఊహాగా నాలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ ఎన్నికలు లక్ష్యంగానే వ్యూహాలు రూపొందించి అమ లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తులు తెరపైకి వస్తుండగా.. వామ పక్షాలు తాజాగా కాంగ్రెస్తో కలిసి వెళ్లాలనే ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికలో లెఫ్ట్ పార్టీలు బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించాయి. ప్రచారం సైతం నిర్వ హించాయి. భవిష్యత్తులోనూ సీపీఎం, సీపీఐ తో కలిసే వెళ్తామని ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు చెప్పారు. సీఎం కేసీఆర్ కూడా కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిన్న, మొన్నటివరకు ఇదే విధమైన వాతావరణం కన్పించింది. కానీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, కేవలం అవగాహన మాత్రమే ఉంటుందని ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేయడం, బీఆర్ఎస్ అధిష్టానం దీనిపై మౌనం వహించడం ఉభయ కమ్యూనిస్టు పార్టీలను అయోమయంలో పడేసింది. ఈ నేపథ్యంలోనే.. బీఆర్ఎస్ కలిసిరాని పక్షంలో కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ ఓటమే లక్ష్యం.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా లెఫ్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి. బీజేపీతో విభేదించే పార్టీలు ఏవైనా సరే వాటితో కలిసి ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల్లో పొత్తులు కూడా పెట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీపీఐ, సీపీఎం పార్టీలు బీఆర్ఎస్తో జత కట్టాయి. ఆ పార్టీ విజయంలో తమ వంతుపాత్ర పోషించాయి. బీఆర్ఎస్ ఆవిర్భావం నేపథ్యంలో ఇటీవల ఖమ్మంలో ఆ పార్టీ నిర్వహించిన సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం పాల్గొని ఐక్యత చాటారు. కానీ ఇటీవల కాలంలో వామపక్షాలతో పొత్తుపై బీఆర్ఎస్ నాయకులు స్వరం మార్చారు. అసెంబ్లీ స్థానాలు ఇచ్చేది లేదని, అవసరమైతే పెద్దల సభకు నామినేట్ చేస్తామంటూ తలోమాట మాట్లాడుతుండటంతో లెఫ్ట్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీపీఐ, సీపీఎంలు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాయని, ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగిందని, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కొందరు లెఫ్ట్ పార్టీల నేతలతో మంతనాలు జరిపారని తెలిసింది. అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన కాంగ్రెస్ పెద్దలు.. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే అధికారం ఖాయం. కాబట్టి మీరు మా వైపు రండి..’ అంటూ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు ఎన్నికలకు సంబంధించి మూడు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కమ్యూనిస్టుల ముందు 3 ప్లాన్లు... లెఫ్ట్ పార్టీలు ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ.. ఇలా మూడు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ప్లాన్ ఏ.. బీఆర్ఎస్తో పొత్తు ఉండేలా కృషి చేయడం. చెరో పది సీట్లు అడగాలి. మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ, నకిరేకల్, పాలేరు, వైరా, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, ఇబ్రహీంపట్నం, హుస్నాబాద్ స్థానాల కోసం పట్టుబట్టాలి. ఒకవేళ కొన్ని కాదని ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామంటే ఆలోచించాలి. ప్లాన్ బీ.. బీఆర్ఎస్ తర్వాత బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్, వైఎస్సార్టీపీ, తెలంగాణ జన సమితి వంటి పార్టీలతో జత కట్టడం. కాంగ్రెస్ పార్టీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి సాను కూలంగా ఉండటం కీలకాంశం. ప్లాన్ సీ కాంగ్రెస్ గౌరవప్రదమైన సీట్లకు అంగీకరించని పక్షంలో, ఏదైనా కారణంతో ఆ పార్టీతోనూ పొత్తు కుదరని పక్షంలో ఒంటరి పోరాటం చేయడం. చెరో 25 స్థానాల్లో పోటీ చేసి ఎన్నికల పోరాటంలో బీజేపీ సహా ఇతర పార్టీల వైఖరులను, విధానాలను ఎండగట్టడం. -
Tripura Assembly Elections 2023: మోత మోగేనా?
2018 అసెంబ్లీ ఎన్నికలు. లెఫ్ట్ కూటమి పాతికేళ్ల పాలనతో విసిగిపోయిన త్రిపుర ప్రజలను బీజేపీ అభివృద్ధి మంత్రం ఆకట్టుకుంది. దాని భాగస్వామ్య పార్టీ ఐపీఎఫ్టీకి గిరిజనుల్లో ఉన్న ఆదరణ తోడైంది. దాంతో 60 సీట్లకు గాను కాషాయ పార్టీ ఏకంగా 36 స్థానాల్లో నెగ్గింది. ముఖ్యంగా 20 ఎస్టీ స్థానాల్లో ఏకంగా 17 సీట్లను కొల్లగొట్టింది! ఐదేళ్ల తర్వాత పరిస్థితులు తారుమారవుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర నినాదంతో రాజకీయ పార్టీ అవతారమెత్తిన ఉద్యమ సంస్థ టిప్రా మోతా ఈసారి అధికార పార్టీ పుట్టి ముంచేలా కన్పిస్తోంది... ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుతోంది. పోలింగ్ (ఫిబ్రవరి 16) తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీలన్నీ అమ్ములపొదుల్లోంచి అన్ని అస్త్రాలూ బయటికి తీస్తున్నాయి. రాష్ట్రంలో పాతికేళ్ల లెఫ్ట్ పాలనకు 2018 ఎన్నికల్లో బీజేపీ తెర దించింది. గిరిజనుల్లో బాగా పట్టున్న ఐపీఎఫ్టీ పార్టీతో జట్టు కట్టి ఘనవిజయం సాధించింది. సీపీఎం 16 సీట్లకు పరిమితం కాగా కాంగ్రెస్ సోదిలోకూడా లేకుండా పోయింది. ఈసారి మాత్రం టిప్రా మోతా రూపంలో కొత్త పార్టీ తెరపైకి రావడంతో సమీకరణాలన్నీ మారిపోయాయి. పరిస్థితి తారుమారు... త్రిపుర మాజీ రాజ కుటుంబానికి చెందిన ప్రద్యోత్ బిక్రం మాణిక్యదేబ్ బర్మన్ సారథ్యంలో కొంతకాలంగా ప్రత్యేక గిరిజన రాష్ట్రం కోసం పోరాడుతున్న తిప్రా (త్రిపుర ఇండిజినస్ ప్రోగ్రెసివ్ రీజనల్ అలయన్స్) మోతా ఈసారి పార్టీగా రూపాంతరం చెందింది. బీజేపీతో పొత్తు ప్రయత్నాలు విఫలం కావడంతో ఒంటరిగానే రంగంలోకి దిగి పోటీని ముక్కోణంగా మార్చేసింది. అధికార బీజేపీ కూటమికి గట్టి సవాలు విసురుతోంది. మూలవాసులైన గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రంగా గ్రేటర్ తిప్రాలాండ్ను సాధిస్తామన్న మోతా హామీ ఎస్టీలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఐపీఎఫ్టీతో పొత్తు ద్వారా బీజేపీ కొల్లగొట్టిన గిరిజన ఓట్లు ఈసారి చాలావరకు మోతావైపు మళ్లే సూచనలు కన్పిస్తున్నాయి. గిరిజనుల్లోని లెఫ్ట్ ఓటు బ్యాంకుకూ మోతా గండి కొట్టేలా ఉంది. త్రిపురలో గిరిజన ప్రాబల్యం ఎక్కువ. మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో 20 వారికి రిజర్వయ్యాయి. అంతేగాక మరో 23 గిరిజనేత స్థానాల్లోనూ 10 శాతానికి పైగా ఉన్న ఎస్టీలు అక్కడా నిర్ణయాత్మకంగానే ఉన్నారు. 2018లో బీజేపీ కూటమి 20 ఎస్టీ సీట్లలో ఏకంగా 17 స్థానాలను దక్కించుకుంది! అలా బీజేపీ కూటమికి అధికారంలోకి రావడంలో కీలకంగా మారిన గిరిజన ఓట్లరు ఈసారి టిప్రా మోతాకే ఓటేస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ సీట్లలో ముఖ్యంగా గిరిజనులు 60 శాతానికి పైగా ఉన్న 12 చోట్ల మోతాకు విజయావకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి. 50–60 శాతం మధ్య ఉన్న 5 స్థానాల్లో మోతా గట్టి పోటీ ఇవ్వనుండగా 50 శాతాం కంటే తక్కువగా ఉన్న మిగతా మూడు చోట్ల ముక్కోణ పోరు జరిగేలా కన్పిస్తోంది. ఎలా చూసినా బీజేపీ కూటమికి ఈ 20 సీట్లలో ఈసారి రెండు మూడు సీట్లకు మించి దక్కకపోవచ్చని అంచనా. దీనికి తోడు గిరిజన ప్రాబల్యమున్న 23 గిరిజనేతర అసెంబ్లీ స్థానాల్లో కూడా మోతా ఏకంగా 22 చోట్ల పోటీకి దిగడం బీజేపీకి నిద్ర లేకుండా చేస్తోంది. బీజేపీ కూటమి 12 నుంచి 15 సీట్లు కోల్పోయి హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని అంచనా. 10 నుంచి 15 సీట్లు గెలిచేలా కన్పిస్తున్న మోతా కింగ్మేకర్ అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు. ఓట్ల చీలికపైనే లెఫ్ట్ ఆశలు గత ఎన్నికలఓల 42 శాతానికి పైగా ఓట్లు సాధించినా సీట్ల లెక్కలో వెనకబడ్డ సీపీఎం, ఈసారి ఓట్ల చీలికపై బాగా ఆశలు పెట్టుకుంది. బీజేపీ–ఐపీఎఫ్టీ కూటమిని ఓడించేందుకు శత్రుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్తో జట్టు కట్టింది. 20 గిరిజన సీట్లతో పాటు 22 గిరిజనేతర స్థానాల్లో బీజేపీ ఓటు బ్యాంకుకు మోతా గండికొట్టనుండటం సీపీఎం–కాంగ్రెస్ కూటమికి కలిసొచ్చేలా కన్పిస్తోంది. దీనికి తోడు 2.5 లక్షల ఉద్యోగాలు తదితర హామీలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాకపోతే కాంగ్రెస్ ఓటర్లలో చాలామంది పొత్తును గౌరవించి సీపీఎం అభ్యర్థులకు ఓటేసేందుకు సిద్ధంగా లేరు. ఏడు దశాబ్దాల వైరాన్ని, అధికారంలో ఉండగా తమపట్ల సీపీఎం అనుసరించిన అణచివేత ధోరణిని మర్చిపోలేమని స్పష్టంగా చెబుతున్నారు. అయితే ముస్లింల్లో అత్యధికులు లెఫ్ట్ వైపే మొగ్గుతున్నారు. బీజేపీ.. అభివృద్ధి మంత్రం 2018లో బీజేపీ అభివృద్ధి నినాదాన్ని జనం నమ్మడంతో ఆ పార్టీ ఏకంగా 43 శాతం ఓట్లు సాధించింది! ఆశించిన అభివృద్ధి కనిపించలేదన్న అసంతృప్తి జనాల్లో ఉంది. శాంతిభద్రతలు క్షీణించాయన్నది మరో పెద్ద ఆరోపణ.అయితే మరోసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూస్తామంటున్న వారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. పీఎం ఆవాస్ యోజన మొదలుకుని కిసాన్ సమ్మాన్ నిధి దాకా పలు కేంద్ర పథకాల లబ్ధిదారులు ఎక్కువగానే ఉన్నారు. వీరిలోనూ మహిళల సంఖ్య ఎక్కువ. వారు మళ్లీ బీజేపీకే ఓటేస్తామంటున్నారు. పైగా సీఎం మాణిక్ సాహాకు ప్రజల్లో మంచి పేరుంది. కానీ 9 నెలల క్రితం దాకా సీఎంగా ఉన్న బిప్లబ్ దేబ్ పట్ల జనంలో ఉన్న వ్యతిరేకత బీజేపీకి నష్టం చేసేలా కన్పిస్తోంది. పైగా 2018లో గిరిజనుల్లో మంచి ఆదరణతో 8 సీట్లు సాధించిన భాగస్వామ్య పార్టీ ఐపీఎఫ్టీ ఆ తర్వాత అధ్యక్షుడు ఎన్.సి.దేబ్బర్మ మృతితో బాగా బలహీనపడింది. దాంతో బీజేపీ ఈసారి ప్రభుత్వ పథకాలనే నమ్ముకుని వాటిపై భారీ ప్రచారంతో హోరెత్తిస్తోంది. రాష్ట్రమంతటా కాషాయ జెండాలే ఎగురుతున్నాయి! ఎక్కడికక్కడ పోలింగ్ బూత్ కార్యాలయాలు తెరిచి తమ నేతలు, కార్యకర్తలను ఓటర్లతో నిత్యం టచ్తో ఉంచుతూ అధికార పార్టీ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు పోతోంది. హిందువుల్లో అత్యధికులైన బెంగాలీలు, ఎస్టీల్లో ఎగువ కులాల వారు బీజేపీ వైపే మొగ్గుతున్నారు. ఇక గిరిజన స్థానాల్లోని బెంగాలీలు బీజేపీకి, ముస్లింలు సీపీఎంకు జై కొడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిగ్ క్వశ్చన్: పేరుకు కమ్యూనిజం లోపలంతా ఎల్లో ఇజం
-
పేదోడికి ఇల్లు ఇస్తుంటే వద్దనే వారు కమ్యూనిస్టులా?
తాడేపల్లి: నిజమైన కమ్యూనిస్టులు పేదల బాగుకోసం పోరాడతారని, మరి అటువంటిది అమరావతి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కమ్యూనిస్టులు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. నిజమైన కమ్యూనిస్టులు సింగపూర్ కోరుకోరని, పేదల బాగుకోసం మాత్రమే ఆలోచిస్తారని అన్నారు పేర్ని నాని. తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మాట్లాడిన పేర్ని నాని.. చంద్రబాబుకు కమ్యూనిస్టు నేతలు రామకృష్ణ, నారాయణ అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. ‘సీపీఐ రామకృష్ణ కమ్యూనిస్ట్ సిద్ధాంతం పాటిస్తున్నారా?, అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకున్నారు. నిజమైన కమ్యూనిస్టులు సింగపూర్ కావాలని కోరుకోరు.పేదోడికి ఇల్లు ఇస్తుంటే వద్దనే వారు కమ్యూనిస్టులా?, చంద్రబాబుకు రామకృష్ణ, నారాయణ అమ్ముడు పోయారు. చంద్రబాబును సీఎం చేయడమే వారి లక్ష్యం. చంద్రబాబు ఏం చెబితే అది చేస్తున్నారు. అసత్యాలను నిజమని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. కమ్యూనిస్టుల్లో నిజమైన కమ్యూనిజం ఉందా? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ప్రజలు తేలుస్తారు. విడివిడిగా పోటీ చేయడానికి మీకెందుకు అంత భయం’ అని పేర్ని నాని నిలదీశారు. -
ఓటేయకుంటే ఈడీ దాడులు చేస్తామని బెదిరించరుగా!
కొంపదీసి వాళ్లను ఓటేయకుంటే ఈడీ దాడులు చేస్తామని బెదిరించరుగా! -
మనం చెప్పుకోలేకపోతున్నాం.. వాళ్లు ధైర్యంగా చెప్పుకుంటున్నారు!
మన పాత్ర ఉన్నా చెప్పుకోలేక పోతున్నాం.. వాళ్లది లేకపోయినా ధైర్యంగా చెప్పుకుంటున్నారు! -
Munugode: సీఎం కేసీఆర్ కారులో సీపీఐ చాడ వెంకట్రెడ్డి!
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: మునుగోడు సమరం తెలంగాణలో మరో ఆసక్తికర పరిణామానికి తెర తీసింది. ఉప ఎన్నిక కోసం.. బీజేపీని బలంగా ఢీకొట్టే టీఆర్ఎస్ మద్దతు ప్రకటించాలని వామపక్షాలు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందే పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలోకి దిగాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలో ఇవాళ(శనివారం) బహిరంగ సభ నిర్వహించనుంది అధికార టీఆర్ఎస్. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే ఈ బహిరంగ సభ నుంచే మద్దతు ప్రకటించాలని, కార్యక్రమానికి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ వాహనంలోనే చాడ.. మనుగోడుకు చేరుకోనున్నట్లు సమాచారం. ఇక మునుగోడు సభ కోసం టీఆర్ఎస్ భారీ ఎత్తున్న కసరత్తులు చేస్తోంది. రెండు వేల మందితో హైదరాబాద్ నుంచి ర్యాలీ తీయాలని చూస్తోంది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నాం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు-ఐదు గంటల వరకు విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదన్న ఆలోచనలో సీపీఐ-సీపీఎంలు ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. కాబట్టి, కాంగ్రెస్ ఓట్లు రెండుగా చీలడం ఖాయమని, ఒకవేళ కాంగ్రెస్కు వామపక్షాలు మద్దతిచ్చినా బీజేపీనే లాభపడుతుందని విశ్లేషిస్తున్నాయి. ఈ తరుణంలో.. బీజేపీని ఎదుర్కొనే టీఆర్ఎస్కు ఇవ్వడం కొంత మంచిదని నిర్ణయించుకున్నాయి. రెండు పార్టీలకు కలిపి మునుగోడు నియోజకవర్గంలో 25 వేలకుపైగానే ఓటింగ్ ఉండగా.. విజయవకాశాలను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదీ చదవండి: కారు వైపే కామ్రేడ్లు! -
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు అభ్యర్థులు కరువు
సాక్షి, యాదాద్రి: రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ బొమ్మతో ఎన్నికలకు వెళ్తే నిండా మునిగిపోతామనే భయం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు పట్టుకుందన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన యాదాద్రి భువ నగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకిలో బుధవారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిలో బీజేపీలో చేరే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య చాలా ఎక్కువగానే ఉందన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందనను చూశాక ఆయా ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపారు. ఇటీవల 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వస్తారని నేను చెబితే ఆ జాబితాలో నా పేరు కూడా ఉందా? లేదా? అని ఆయా ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ కోసం పని చేసే నిజమైన కార్యకర్తలంతా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విసిగిపోయారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే హైదరాబాద్లోని కంపెనీల వద్ద నెల కిందటే ఎన్నికల కోసం డబ్బులు వసూలు చేసుకున్నా రని సంజయ్ ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీలకు దమ్ముంటే మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయాలని సవాల్ చేశారు. కమ్యూనిస్టు, మజ్లిస్ పార్టీల నాయకులు కేసీఆర్ కోవర్టుల్లా మారారని మండిపడ్డారు. మిషన్ భగీరథ కోసం జిల్లాలో రూ.800 కోట్లు ఖర్చుతో అందిస్తున్న నీళ్లను ప్రజలు తాగడం లేదన్నారు. కాగా,ఈనెల 21న మునుగోడు లో జరిగే భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని సంజయ్ వెల్లడించారు. 8వ రోజు బండి సంజయ్ పాదయాత్ర 14కి.మీ మేర కొనసాగింది. చదవండి: మునుగోడుపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ -
బీహార్ రాజకీయాల్లో ఊహించని మలుపు.. బీజేపీకి నితీశ్ షాక్!
పట్నా: ఎన్డీఏతో మిత్రపక్షం జేడీయూ తెగదెంపులు చేసుకోనుందా? ఆగస్టు 11కు ముందే బిహార్లో జేడీయూ-బీజేపీ సర్కార్ కూలిపోనుందా? నితీశ్ కుమార్ మళ్లీ ఆర్జేడీతో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తోంది. బిహార్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మిత్రపక్షం బీజేపీతో సీఎం నితీశ్ కుమార్ చాలా కాలంగా అంటీమున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశం సహా జులై 17 తర్వాత కేంద్రం నిర్వహించిన నాలుగు సమావేశాలకు నితీశ్ డుమ్మా కొట్టారు. దీంతో ఎన్డీఏ నుంచి ఆయన విడిపోనున్నారనే వాదనలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు నితీశ్ మళ్లీ ఆర్జేడీతో జట్టుకట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలను కూడా కలుపుకొని బిహార్లో బీజేపీకి షాక్ ఇస్తూ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన ఆయా పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వంలో భాగమైన బీజేపీతో విడిపోయి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని నితీశ్ భావించినా.. అందుకు జేడీయూ ఎమ్మెల్యేలు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆర్జేడీ మద్దతు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నాలుగుసార్లు డుమ్మా జులై 17న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్షా నిర్వహించిన సమావేశానికి నితీశ్ హాజరుకాలేదు. రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోతున్న సందర్భంగా రామ్నాథ్ కోవింద్కు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి కూడా వెళ్లలేదు. ఆ తర్వాత జులై 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకరానికి కూడా నితీశ్ డుమ్మా కొట్టారు. తాజాగా ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా హాజరుకాలేదు. దీంతో ఆయన ఎన్డీఏకు రాంరాం చెప్పడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆర్సీపీ సింగ్పై అసంతృప్తి.. జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ పార్టీకి శనివారమే రాజీనామా చేశారు. ఆయన కుమార్తెల అక్రమాస్థులకు సంబంధించి సీఎం వివరణ కోరడంతో పార్టీని వీడారు. అయితే ఆర్సీపీ సింగ్పై నితీశ్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉండటమే ఇందుకు కారణం. గతేడాది మోదీ కేబినెట్ను విస్తరించినప్పుడు ఆర్సీపీ సింగ్ను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా జరగడంపై నితీశ్ తీవ్ర అసహనంతో ఉన్నారు. అలాగే మోదీ కేబినెట్లో రెండు బెర్తులు కావాలని నితీశ్ అడిగితే కేంద్రం అందుకు ఒప్పుకోలేదు. అమిత్ షాపై నమ్మకం లేదా? ఇటీవలే పట్నాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ సీఎం అభ్యర్థి నితీశ్ కుమారే అని అమిత్ షా ప్రకటించారు. అయినా నితీశ్ బీజేపీపై నమ్మకంగా లేరని తెలుస్తోంది. బిహార్లో పట్టు సాధించాలని అమిత్షా భావించడం, ఆర్సీపీ సింగ్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం, రాష్ట్రంలో బలపడాలని బీజేపీ చూస్తుండటం వంటి అంశాలు నితీశ్ను కాస్త కలవరపాటుకు గురి చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు రాష్ట్ర బీజేపీ నాయకులు తనపై బహిరంగంగా విమర్శలు కురిపిస్తుండటం అస్సలు నచ్చడం లేదట. అందుకే బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే మంచిదని నితీశ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 11లోగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన ఆర్జేడీతో చేతులు కలిపితే బీజేపీకి గట్టి షాక్ ఇచ్చినట్లే అవుతుంది. చదవండి: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్కు హోంశాఖ? -
మనమంతా ఏకమవుదాం..విపక్ష నేతలకు మమతా బెనర్జీ పిలుపు..!!
-
బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ వైఖరిని వ్యతిరేకించే కాంగ్రెస్, వామపక్ష, ప్రాంతీయ పార్టీలన్నీ సమైక్యఫ్రంట్గా ఏర్పడాలని డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రాజకీయ స్వార్థాలను విడిచిపెట్టి దేశాన్ని రక్షించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో డీఎంకేతో మైత్రి మాదిరిగానే దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా సూత్రప్రాయమైన మైత్రిని ఏర్పర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఎంకే స్టాలిన్ పీటీఐకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భారతదేశం భిన్నత్వాన్ని, సమాఖ్య విధానం, లౌకికత, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం, రాష్ట్రాల హక్కులు, విద్యారంగ హక్కులను పరిరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రాజకీయ స్వార్థాన్ని పక్కనబెట్టి ఏకం కావాలి. ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి దేశాన్ని కాపాడుకోవాలి’అని ఆయన అన్నారు. బీజేపీ పట్ల తమది వ్యక్తిగత ద్వేషం కాదన్నారు. అంశాల ప్రాతిపదికగానే బీజేపీ విధానాలను తాము విమర్శిస్తున్నామని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో డీఎంకే ఎప్పుడూ కీలకభూమిక పోషిస్తూనే ఉందన్నారు. పార్లమెంట్లో డీఎంకే మూడో అతిపెద్ద పార్టీ అని చెప్పారు. ‘రాష్ట్రాల రాజకీయాలన్నీ కలిస్తేనే జాతీయ రాజకీయాలు. అంతే తప్ప, జాతీయ, రాష్ట్ర రాజకీయం అంటూ వేర్వేరుగా ఉండవు’అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలహీనంగా మారినందున బీజేపీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉండా లంటూ వస్తున్న వాదనపై ఆయన స్పందిస్తూ.. ఈ విధానం కొన్ని రాష్ట్రాల్లో సరైంది కావచ్చు. కానీ, చాలా రాష్ట్రాల విషయంలో ఈ వైఖరి సరిపోదు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకం కావాలి. మా రాష్ట్రంలో బీజేపీతో విభేదించే పార్టీలతో కూటమిగా ఏర్పడి, లౌకిక శక్తులను ఏకం చేశాం. కాంగ్రెస్ పార్టీ కూడా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇదే మైత్రితో వ్యవహరించాలని స్టాలిన్ అన్నారు -
సాక్షి కార్టూన్ 09-02-2022
ప్రతిపక్షాలున్నన్ని రోజులు మాకు అభివృద్ధి చేయడం సాధ్యపడదు! -
సద్దుమణిగితే సహించలేరా?
సాక్షి, అమరావతి: ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వం సకాలంలో సమస్యలు పరిష్కరించడాన్ని టీడీపీ, వామపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఉద్యోగులు సమ్మె చేయకపోవడం వల్ల రాజకీయంగా పేలాలు ఏరుకోలేకపోయామనే దుగ్ధతో విపక్షాలు నిస్పృహలో కూరుకుపోయాయన్నారు. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి సంతకాలు చేసి సమ్మెను స్వచ్ఛందంగా విరమించుకుంటున్నట్లు పీఆర్సీ సాధన సమితి ప్రకటించిందని గుర్తు చేశారు. వామపక్షాలకు అనుబంధంగా వ్యవహరించే ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆ ప్రతిపాదనలకు తాము అంగీకరించడం లేదని, దశలవారీగా సమ్మె చేస్తామని చెప్పడం సబబు కాదన్నారు. చర్చలకు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఉపాధ్యాయ సంఘాల నేతలకు సూచించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అధికారం నుంచి దించి చంద్రబాబును పీఠంపై కూర్చోబెట్టేందుకు తాపత్రయపడుతున్న ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ 5 లాంటి టీడీపీ అనుకూల మీడియా లేని సమస్యను ఉన్నట్లు చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి వల్లే.. రాష్ట్ర సొంత ఆదాయం రూ.85 వేల కోట్లకు బదులు కోవిడ్తో రూ.62 వేల కోట్లకు తగ్గిపోయింది. మరోవైపు ఉద్యోగుల వేతనాల వ్యయమే రూ.70 వేల కోట్లు (111 శాతం) దాటిపోయింది. అందువల్ల ఇంతకంటే చేయలేని నిస్సహాయత. పేదల సంక్షేమానికి నేరుగా నగదు బదిలీతో మేలు చేకూరుస్తున్నాం. సంక్షేమ పథకాలకు వ్యయం చేయడం తప్పా? దుబారానా? ధైర్యం ఉంటే చెప్పండి? ఫిట్మెంట్ 30 శాతానికిపైగా ఇవ్వాలనుకున్నా కానీ ప్రస్తుతం పరిస్థితులు అందుకు తగ్గట్టుగా లేవు. సమంజసమేనా? అన్ని సంఘాలు సమ్మె విరమించుకుంటున్నామని ప్రకటించాక వామపక్షాలకు అనుబంధంగా ఉండే ఉపాధ్యాయ సంఘాలు 27 శాతం ఫిట్మెంట్, 12 శాతం హెచ్ఆర్ఏ కావాలని కోరడం సమంజసమేనా? ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. 3.10 లక్షల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి గత సర్కారు ఏటా రూ.1,198 కోట్లు వెచ్చిస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.3,187 కోట్లకు పెరిగింది. కేరళలో హెచ్ఆర్ఏ ఎంత? కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి మినిమమ్ టైమ్ స్కేల్ను ఇప్పటికే అమలు చేస్తున్నాం. సీపీఎస్ రద్దుకు రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పాక కూడా కొందరు ఉద్యమం చేస్తామనడంలో అర్ధ రహితం. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో హెచ్ఆర్ఏ ఎంత శాతం ఉంది? కేరళలో ఇస్తున్న హెచ్ఆర్ఏ కేవలం 4–6–8 శాతం మాత్రమే. తెలుగు రాష్ట్రాలే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఎక్కువ ఇస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. బెదిరింపులు.. బాబు లక్షణమే ఉద్యోగులను ఎందుకు బెదిరిస్తాం? మాకెందుకు అంత అవసరం? బెదిరించింది ఎవరు? బెదిరేవాళ్లు ఎవరు? అవన్నీ చంద్రబాబు లక్షణాలే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నçప్పుడు ఉద్యోగులను ఏవిధంగా బెదిరించారో అందరికి తెలిసిందే. బాలిక చనిపోతే స్పందనేది పవన్? ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో వ్యవహరించిందంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం విడ్డూరం. విజయవాడలో టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులకు తాళలేక ఓ బాలిక చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? సమ్మె జరగలేదనే బాధ, దుగ్ధ, టీడీపీకి ఉపయోగపడలేదనే ఆక్రోశంతో ఆయన అలా మాట్లాడుతున్నట్లున్నారు. అభివృద్ధికే వెచ్చిస్తాం అమరావతి భూములను చంద్రబాబు సర్కారు ఏకంగా విక్రయించాలనే చూసింది. మేం అవసరం కోసం వినియోగిస్తూ వచ్చిన నిధులతో అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఏది మేలు అనేది వాళ్లే ఆలోచించుకోవాలి. గుడివాడలో జరిగిన సంక్రాంతి కార్యక్రమాలను టీడీపీ ఎంపీలు పార్లమెంట్ వరకూ తీసుకెళ్లడం హాస్యాస్పదం. -
లెఫ్ట్ పార్టీల నేతలను కలిసిన సీఎం కేసీఆర్
-
తెలుగు రాష్ట్రాల్లో వామపక్షాలు బలపడే పరిస్థితి వస్తుందా ??
-
పెట్రో ధరలపై 14న అమిత్ షాకు నిరసన
సాక్షి, అమరావతి: ఈ నెల 14న తిరుపతి వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాకు పెట్రో ధరల పెంపుపై నిరసనలు తెలపాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. త్వరలో జరుగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ఇలా కంటి తుడుపుగా రూ.5 తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నిరసన తెలపాలని నిర్ణయించినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుత క్రూడ్ ఆయిల్ ధరలను ప్రామాణికంగా తీసుకుంటే లీటర్ పెట్రోల్ను రూ.70–75కు, డీజిల్ను రూ.55–60కు అందించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని, పెరిగితేనే.. పెరుగుతాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని ధ్వజమెత్తారు. మోదీ ప్రధాని అయిన 2014లో లీటర్ పెట్రోల్ సగటు ధర రూ.72 కాగా, ఆనాడు అంతర్జాతీయ మార్కెట్లో బేరల్ క్రూడ్ ఆయిల్ సగటు ధర 93 డాలర్లుగా ఉందని తెలిపారు. ఇప్పుడు 82 డాలర్లు మాత్రమేనని.. అయినా 2021 నవంబర్ 1 నాటికి లీటర్ పెట్రోల్ రూ.116కు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రూడ్ ఆయిల్ ధర 11 డాలర్లు తగ్గినా పెట్రోల్ ధరను రూ.44 పెంచారని మండిపడ్డారు. అలాగే, లీటర్ డీజిల్ ధర రూ.47గా ఉన్నదాన్ని రూ.109కి పెంచారని తెలిపారు. మోదీ ప్రభుత్వం పెట్రోల్పై రూ.44 పెంచి రూ.5 తగ్గించిందని, డీజిల్పై రూ.61 పెంచి రూ.10 తగ్గించిందంటూ ఎద్దేవా చేశారు. దుర్మార్గమైన ఆర్థిక నీతిని మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని, దీన్ని నిరసించాలని వామపక్ష పార్టీలు తమ శ్రేణులకు పిలుపునిచ్చినట్టు రామకృష్ణ పేర్కొన్నారు. -
పెట్రో ధరల బాదుడుపై వామపక్షాల నిరసన
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): కేంద్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన పెట్రో భారాలతో పేదల బతుకులు దుర్భరంగా మారాయని పలువురు వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా పెరిగిపోతున్న పెట్రో ధరలకు నిరసనగా సీపీఎం, సీపీఐ, ఇతర పది వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. మరో నెల రోజుల్లో పెట్రోల్ ధర లీటరు రూ.130కి చేరే ప్రమాదముందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. పెట్రో ధరలతో పాటు, గ్యాస్, నిత్యావసరాల ధరలు అదుపు చేయటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నిరసనలో భాగంగా పి.మధు, కె.రామకృష్ణల నాయకత్వంలో వామపక్షాల నాయకులు ఒక్కసారిగా రాస్తారోకోలకు దిగారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఫలితంగా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనాల్లో పోలీసుస్టేషన్లకు తరలించారు. నిరసనల్లో ప్రత్యేక హోదా సాధాన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం, సీపీఐ నేతలు సీహెచ్ బాబారావు, దోనేపూడి కాశీనాథ్, దోనేపూడి శంకర్, జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
Huzurabad Bypoll 2021: వామపక్షాల దారెటు?
సాక్షి, హైదరాబాద్: మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పారీ్టల వైఖరి ఇంకా స్పష్టం కావడం లేదు. నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ముగిసి బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిన నేపథ్యంలో మిగిలిన రాజకీయ పక్షాలు ఎవరికి మద్దతుగా నిలుస్తాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రధాన వామపక్షాలుగా గుర్తింపు పొందిన సీపీఎం, సీపీఐతో పాటు తెలంగాణ జనసమితి (టీజేఎస్) సహకారం ఏ అభ్యర్థికి లభిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆయా పార్టీలకు నియోజకవర్గంలో ఎంత బలం ఉంది.. ఎన్ని ఓట్లు ఉన్నాయన్న దాంతో సంబంధం లేకున్నా ఇతర పారీ్టల మద్దతు పోటీలో ఉన్న అభ్యర్థికి నైతికంగా బలం చేకూర్చనుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు పారీ్టలు ఎవరికి మద్దతు ప్రకటిస్తాయో అని రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కుల సంఘాల మద్దతు కోసం.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే సీపీఐ, టీజేఎస్.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పక్షాన వచ్చిన అభ్యర్థనను ఆయా పార్టీలు పరిశీలిస్తున్నాయి. కాంగ్రెస్కు మద్దతివ్వాలా.. లేదా.. అన్న దానిపై పారీ్టలో చర్చించి వెల్లడిస్తామని సీపీఐ, టీజేఎస్ నేతలు చాడా వెంకట్రెడ్డి, కోదండరాం గతంలో వెల్లడించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు, రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరవుతున్న ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించవచ్చనే చర్చ సాగుతోంది. అయితే, సీపీఎం కూడా ప్రతిపక్ష ఆందోళనలు, సమావేశాలకు వస్తున్నా బహిరంగంగా కాంగ్రెస్కు మద్దతిస్తుందా.. లేదా.. అన్న సందేహం వ్యక్తమవుతోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన సీపీఎం ఇప్పుడు మాత్రం బీజేపీని ఓడించాలని చెబుతోంది. ఇటీవల జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాల్లో కూడా ఇదే తీర్మానం చేశారు. కానీ, అధికారికంగా ఏ పార్టీకీ మద్దతు ప్రకటించలేదు. బీజేపీని ఓడించాలని ఇచ్చే పిలుపును ఆ పార్టీ శ్రేణులు ఎలా అర్థం చేసుకుంటాయి.. టీఆర్ఎస్, కాంగ్రెస్లో ఏ అభ్యర్థి పక్షాన నిలుస్తారన్నది కామ్రేడ్లకే తెలియాలని రాజకీయ వర్గాలంటున్నాయి. మరోవైపు ప్రధాన కుల సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల మద్దతు కూడగట్టేందుకు కూడా ప్రధాన రాజకీయ పక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వీలున్నంత ఎక్కువ సంఘాల మద్దతు తీసుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు శతవిధాలా ప్రయతి్నస్తుండడం గమనార్హం. -
Bharat Bandh: బెంగళూరు డీసీపీ కాలిపై నుంచి దూసుకెళ్లిన కారు
Bharat Bandh Highlights: బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో భారత్ బంద్ ర్యాలీలో భాగంగా కారులో వెళుతున్న నిరసనకారుడు.. తన కారును డీసీపీ ధర్మేందర్ కుమార్ మీనా పాదాల మీదుగా తీసుకెళ్లాడు. బెంగళూరు సిటీ నార్త్ డివిజన్ డీసీపీ మీనా.. గోరగుంటెపాళ్య వద్ద వాహనాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత నిరసనకారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రమాదంలో డీసీపీ కాలుకి గాయలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఉత్తర ప్రదేశ్లో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం విఫలమైందని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికైత్ మండిపడ్డారు. పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించడం లేదని విమర్శించారు. యోగి ఆదిత్యనాథ్ తన మ్యానిఫెస్టోలో చెరకు ధరను రూ. 375-రూ. 450 కి పెంచుతానని హామీ ఇచ్చాడని అయితే అతను దానిని రూ. 25 మాత్రమే పెంచారని అన్నారు. పోలీసుల బారికేడ్లను పగలగొట్టిన రైతులు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ నేపధ్యంలో తమిళనాడు నిర్మానుష్యంగా మారింది. చెన్నైలోని అన్నాసలై ప్రాంతంలో పోలీసులతో ఘర్షణ పడిన రైతులు పోలీసుల బారికేడ్లను పగలగొట్టారు. దీంతో పరిస్థితి చెయ్యి దాటింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. #WATCH | Tamil Nadu: Protesters agitating against the three farm laws break police barricade in Anna Salai area of Chennai, in support of Bharat Bandh called by farmer organisations today; protesters detained by police pic.twitter.com/iuhSkOeGFV — ANI (@ANI) September 27, 2021 గురుగ్రామ్-ఢిల్లీ సరిహద్దు: రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ నేపథ్యంలో దేశ రాజధానిలో ప్రవేశించే వాహనాలను ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది తనిఖీ చేస్తుండగా గురుగ్రామ్-ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కేరళ: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కేరళలో భారత్ బంద్ కొనసాగుతోంది. రాష్ట్రంలో పలు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రైతుల నిరసనకు మద్దతుగా.. తిరువనంతపురంలో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు భారత్ బంద్లో పాల్గొన్నాయి. ఢిల్లీ- అమృత్సర్: ఢిల్లీ- అమృత్సర్ జాతీయ రహదారిపై రైతులు నిరసన తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్ కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు భారత్ బంద్ను విజయవంతం చేసేందుకు బీజేపీయేతర ప్రతిపక్షాలు నడుంబిగించాయి. పంజాబ్- హర్యానా: భారత్ బంద్లో భాగంగా పంజాబ్-హర్యానా సరిహద్దులను మూసివేసి రైతులు నిరసన తెలుపుతున్నారు. ఉదయం 4 గంటల నుంచే సరిహద్దులను వేసివేసినట్లు ఓ రైతు మీడియాతో పేర్కొన్నాడు. ఉత్తరప్రదేశ్: ఘజిపూర్ సరిహద్దులో రైతుల నిరసన కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కొనసాగుతోంది. రైతుల నిరసనలతో ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఘజిపూర్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ను కొనసాగుతోంది. భారత్ బంద్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏపీలోని విజయవాడ బస్టాండ్ ఎదుట వామపక్ష, కాంగ్రెస్ పార్టీల ఆందోళన చేపట్టాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వాహానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వామపక్ష పార్టీల బంద్కు వ్యాపార వాణిజ్య, విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వర్షం సైతం లెక్క చేయకుండా విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద రైతులకు మద్దతుగా వామపక్ష, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆందోళన చేస్తున్నారు. -
ఏపీ బీజేపీపై వామపక్ష పార్టీల ఆగ్రహం
-
ఏపీ బీజేపీపై వామపక్ష పార్టీల ఆగ్రహం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో సామరస్య, శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ నాయకులు వినాయక చవితిని ఒక వివాదంగా మారుస్తున్నారని వామపక్ష పార్టీలు ఏపీ బీజేపీపై మండిపడ్డాయి. కాషాయ పార్టీ కుటిల యత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో సోమవారం వామపక్ష పార్టీలు ఓ లేఖను విడుదల చేశాయి. ‘‘ప్రస్తుతం కోవిడ్ మూడవ దశ ప్రమాదం పొంచి ఉంది. ఈ తరుణంలో ప్రజలంతా కోవిడ్ నియమ నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తూ వినాయక చవితి జరుపుకోవాలి’’ అని లేఖలో కోరాయి. (చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి) ‘‘రాష్ట్రంలో కోవిడ్ విజృంభించినప్పుడూ కేంద్ర బీజేపీ రాష్ట్రానికి ఏ సహాయమూ చేయలేదు. రాష్ట్రం కోరిన మేరకు వ్యాక్సిన్లనూ ఇవ్వకుండా వివక్షను చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం పండగ సీజన్లో తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలను సైతం విస్మరించి రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రజల విశ్వాసాలతో రాజకీయ కుతంత్రం నడుపుతోంది’’ అంటూ వామపక్ష పార్టీలు మండిపడ్డాయి. -
Petrol Diesel: ధరలపై వామపక్షాలు భగ్గు
గన్ఫౌండ్రీ: కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలపై కనికరం లేకుండా మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతోందని వామపక్ష పార్టీల నేతలు విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం సీపీఐ, సీపీఐ(ఎం), ఎస్యూసీఐ (సీ) తదితర వామపక్ష పార్టీల నాయకులు బషీర్బాగ్ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం మోసాల ప్రభుత్వమని, కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. కేరళ ప్రభుత్వం 12 శాతం పన్ను తగ్గించి ప్రజలపై భారం పడకుండా చేసిందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సైతం నాడు పన్నులను తగ్గించారని తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎస్యూసీఐ (సీ) పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మురహరి మాట్లాడుతూ.. 70 శాతం వరకు పన్నులను పెంచే అధికారం మోదీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని, కోవిడ్ సంక్షోభంలోనూ ప్రధాని కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ సామాన్య ప్రజల పొట్టగొడుతున్నారని ధ్వజమెత్తారు. వామపక్ష, విప్లవకారులపై మోదీ ప్రభుత్వం నిర్భంద చట్టాలను ప్రయోగిస్తోందని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, నగర కార్యదర్శి ఈటీ నర్సింహ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రమ, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయగ్, ఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు స్టాలిన్, ఎస్యూసీఐ (సీ) పార్టీతో పాటు పలు వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మీ మద్దతు మాకివ్వండి: ఉత్తమ్
హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో మద్దతివ్వాలంటూ వామపక్షాలను కాంగ్రెస్ కోరింది. తమ పార్టీ అభ్యర్థి కె.జానారెడ్డి గెలుపునకు సహకరించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం సీపీఐ, సీపీఎంలకు లేఖలు రాశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతి, అప్రజాస్వామ్య పాలన, బీజేపీ మత రాజకీయాలను ఓడించేందుకు తెలంగాణలోని అన్ని లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు తమతో కలసి రావాలని ఇరు పార్టీల రాష్ట్ర కార్యదర్శులను కోరారు. తమ అభ్యర్థి జానారెడ్డి.. సమితి అధ్యక్షుడిగా, 7 సార్లు ఎమ్మెల్యేగా, 17 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా, 5 సంవత్సరాలు సీఎల్పీ నేతగా పనిచేశారని, ప్రజాజీవితంలో గౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. ఆయన గెలుపు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు అవుతుందని, ఈ నేపథ్యంలో తమకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పార్టీల నేతలకు లేఖలు రాయడంతో పాటు ఆ పార్టీ నేతలతో ఫోన్లో కూడా మాట్లాడారని, తమ పార్టీల్లో చర్చించిన అనంతరం నిర్ణయం వెల్లడిస్తామని కామ్రేడ్లు చెప్పారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ విషయమై ఒకట్రెండు రోజుల్లో ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
లెఫ్ట్ భవిష్యత్ కాంగ్రెస్ చేతిలో
ఒక రాష్ట్రంలో కాంగ్రెస్తో కరచాలనం చేస్తూ మరో రాష్ట్రంలో అదే పార్టీపై కత్తులు దూస్తూ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిన లెఫ్ట్ పార్టీలకు అంతా అగమ్యగోచరంగా ఉంది. ఒక చోట నిలబెట్టుకోవాలి, మరో చోట పునర్వైభవం సాధించాలి వామపక్ష పార్టీలను తేల్చడమైనా, ముంచడమైనా ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది. కేరళలో అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలి, పశ్చిమ బెంగాల్లో తిరిగి పట్టు సాధించాలంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ వైచిత్రిని ఎదుర్కోవడమే ఇప్పుడు వామపక్ష పార్టీల ముందున్న అసలు సిసలు సవాల్గా మారింది. అసోం, తమిళనాడు, పాండిచ్చేరితో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠను పెంచుతున్న పశ్చిమ బెంగాల్, కేరళలో ఎన్నికల వేడి రాజుకుంది. 2016లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విఫలప్రయోగంగా నిలిచినప్పటికీ ఈ సారి ఎన్నికల్లోనూ కాంగ్రెస్తోనే కలిసి వామపక్షాలు ఎన్నికల బరిలో దిగాయి. బెంగాల్లో ఆదివారం జరిగిన కాంగ్రెస్–లెఫ్ట్ కూటమి నిర్వహించిన మెగా ర్యాలీకి జనం వెల్లువెత్తినప్పటికీ కాంగ్రెస్ అగ్రనేతలెవరూ హాజరుకాలేదు. కేరళలో యూడీఎఫ్ కూటమి విజయానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, బెంగాల్లో వామపక్ష నాయకులతో కలిసి ఒకే వేదికను పంచుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో స్థానిక కాంగ్రెస్ నేతలే ర్యాలీకి హాజరయ్యారు. మరోవైపు కేరళలో వామపక్షాల నేతృత్వంలోని అధికారి ఎల్డీఎఫ్కు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కి మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. కేరళలో వామపక్ష పార్టీలను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీతో తెరవెనుక అవగాహనతో పని చేస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. బీజేపీ ఓటమి కోసం పని చేయాల్సిన కాంగ్రెస్ ఇలా చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. లెఫ్ట్ దారి వివాదాస్పదం భారతీయ జనతా పార్టీని ఓడించడానికి కాషాయ వ్యతిరేక శక్తులన్నీ పిలుపునిస్తున్న వామపక్ష పార్టీలు ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)తో చేతులు కలపడానికి సిద్ధపడడం వివాదానికి దారి తీస్తోంది. 30 శాతం ముస్లిం జనాభా ఉన్న బెంగాల్లో 100–110 సీట్లలో వారి ప్రభావం ఉంటుంది. ముస్లిం ఓట్లను కొల్లగొట్టడానికి పరిషద్ అబ్బాస్ సిద్దికి నేతృత్వంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)లను తమ కూటమిలో చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. కోల్కతాలో జరిగిన మెగా ర్యాలీకి సిద్దికి హాజరై ప్రసంగించారు. ‘‘మేమే ప్రత్యామ్నాయం, మేమే లౌకికవాదులం, మేమే మీ భవిష్యత్’’ అన్న నినాదంతో బెంగాల్ బరిలోకి దిగిన వామపక్ష నాయకులు తమ వేదికపై ముస్లిం మత పెద్ద సిద్దికిని కూర్చోబెట్టడం పలు విమర్శలకు దారి తీస్తోంది. కరడుగట్టిన మతవాదితో కలుస్తూ లౌకిక రాగాలాపన ఎలా సాధ్యమంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు హోరెత్తిపోతున్నాయి. వామపక్షాలు వేసే అడుగులు బీజేపీకి లబ్ధి చేకూరుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పదేళ్లుగా మమతా దీదీ అణచివేత చర్యల్ని ఎదుర్కొంటూనే ప్రజా ఉద్యమాల ద్వారా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలైతే వామపక్ష పార్టీలు చేస్తూనే ఉన్నాయి. – న్యూఢిల్లీ ఓటు బ్యాంకు 2016లో లెఫ్ట్, కాంగ్రెస్ కూటమికి 38% ఓట్లువచ్చాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్కు పోలయిన ఓట్ల కంటే ఇది కేవలం 7శాతం మాత్రమే తక్కువ. అందులో వామపక్ష పార్టీలే 26శాతం ఓటు బ్యాంకుని సాధిం చాయి. అయితే గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల ఓటు బ్యాంకు ఏకంగా 7.52 శాతానికి తగ్గిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్తో మిత్రలాభం, మిత్రభేదాన్ని ఏకకాలంలోనే ఎదుర్కొంటూ వామపక్షాలు ఎలా ముందుకు సాగుతాయో చేచి చూడాల్సిందే. -
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా 29 నుంచి దీక్షలు
సాక్షి, అమరావతి/సూర్యారావుపేట(విజయవాడ సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో రిలే నిరాహార దీక్షలు చేయాలని పది వామపక్ష పార్టీలు రైతులకు పిలుపునిచ్చాయి. ప్రస్తుత కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి కొనసాగింపుగా ఈ నిరశన దీక్షలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశాయి. వ్యవసాయ బిల్లులపై రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఉధృతం చేసే విషయాన్ని చర్చించేందుకు శనివారం పది వామపక్ష పార్టీలు విజయవాడలోని సీపీఎం కార్యాలయంలో భేటీ అయ్యాయి. సమావేశం అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మీడియాతో మాట్లాడుతూ రైతులకు మద్దతుగా జరిగే దీక్షల్లో వామపక్షపార్టీలతో పాటు రైతు శ్రేయోభిలాషులందరూ పాల్గొనేలా చూస్తామన్నారు. దీక్షల నిర్వహణపై ఆది, సోమవారాలలో అవగాహన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కార్పొరేట్ అజెండాను అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు దోచిపెట్టాలని మోదీ ప్రభుత్వం చూస్తోందన్నారు. వ్యవసాయ బిల్లులు మూడింటిని కేంద్ర ఉపసంహరించే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. సమావేశంలో వామపక్ష నేతలు జల్లి విల్సన్, వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
దీపంతో మహమ్మారిని ఎలా ఆపుతారు?
సాక్షి, హైదరాబాద్: కరోనా నివారణకు అవసరమైన వస్తు సామగ్రిని అందించే బదులు ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పి కొవ్వొత్తులు పట్టుకోవాలని ప్రధాని చెప్పడం విడ్డూరంగా ఉందని వామపక్ష పార్టీలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశ ప్రజ లు, విపక్షాలు రాజకీయాల కు అతీతంగా కేంద్రానికి అం డగా నిలిచాయని, అయితే దీప నినాదం ఈ మహమ్మా రి నిరోధానికి ఎలా దోహదపడుతుందని ప్రశ్నించాయి. ప్రస్తుత ఆపత్కాల సమయంలో రాజకీయాలకు తావివ్వవద్దని చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), సాదినేని వెంకటేశ్వరరావు, పోటు రంగారా వు (సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు) శనివారం ఒక సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆకస్మిక లాక్డౌన్తో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా వలస కార్మికులు, దినసరి కూలీల బతుకులు ఛిద్రం అయ్యాయని వారు ఆ ప్రకటనలో విమర్శించారు. -
అసెంబ్లీ ముట్టడి విఫలం
సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు/తుళ్లూరు/తుళ్లూరు రూరల్: అసెంబ్లీ ముట్టడికి టీడీపీ శ్రేణులు చేసిన యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. సోమవారం శాసనసభ సమావేశాల నేపథ్యంలో టీడీపీ, వామపక్షాలు, అమరావతి జేఏసీ చేపట్టిన ఛలో అసెంబ్లీ, అసెంబ్లీ ముట్టడికి పోలీసులు అనుమతించకపోవడంతో నిరసనకారులు రాళ్లతో దాడికి దిగారు. రాళ్ల దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులు, పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం పొలాల్లో నుంచి సచివాలయం వైపు చొచ్చుకుని వచ్చేందుకు చేసిన యత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా విధుల్లో ఉన్న పోలీసులను మహిళలు తీవ్ర దుర్భాషలాడారు. ఎర్రబాలెంలో స్పృహ కోల్పోయిన మల్లీశ్వరి అనే మహిళకు మంచినీరు అందించి పోలీసులు సేవలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టేలా టీడీపీ మెసేజ్లు అసెంబ్లీ ముట్టడికి ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో టీడీపీ నేతలు వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ ద్వారా ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ‘కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు ఏమైపోయారు? 5 లక్షల మందితో అసెంబ్లీని ముట్టడించాలి. లేదంటే రాష్ట్రంలో బతకడమే దండగ’ అంటూ టీడీపీ నేతలు రెచ్చగొడుతూ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టారు. గుంటూరులో హోంమంత్రి మేకతోటి సుచరిత ఇంటి ముందు నిరసనకు దిగిన టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. రాళ్లు తగిలి కింద పడిపోతున్న పోలీసు సహనంతో పోలీస్ వ్యూహం బయటి ప్రాంతాల నుంచి అమరావతి చేరుకున్న వ్యక్తులు అవాంఛనీయ ఘటనలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆదివారం రాత్రి ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో చెక్పోస్టులు, మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాలను బాంబ్స్క్వాడ్ బృందాలతో జల్లెడ పట్టారు. పోలీసు బలగాలు శాంతి, సహనంతో వ్యవహరించి అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా జరగడానికి కృషి చేశాయి. గల్లా జయదేవ్పై కేసు రాజధాని ప్రాంతంలో 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగి రైతులు, ఆందోళనకారుల ముసుగులో పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. అసెంబ్లీ పరిసరాల్లో ముట్టడికి యత్నించిన ఎంపీ గల్లా జయదేవ్పై 143, 332, 188, 353, 323, 324, రెడ్/149 సెక్షన్ల కింద తుళ్లూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జయదేవ్ను పోలీసులు అరెస్టు చేయడంతో టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఐజీ బ్రిజ్లాల్ను కాపాడే యత్నంలో ఆక్టోపస్ ఎస్సై ఒకరు గాయపడ్డారు. పలు చోట్ల రాళ్ల దాడుల్లో గాయపడ్డ పోలీస్ సిబ్బంది వి.నగేష్, గొట్టె లింగా, హరీశ్, పి.వేణుగోపాలరావు, బి.చక్రధర్, పి.ఏసురాజును ఆస్పత్రికి తరలించారు. అసెంబ్లీ వెనుక పొలాల్లో నుంచి సుమారు 600 మంది ఆందోళనకారులు పోలీసులపై ఒక్కసారిగా రాళ్లతో దాడిచేశారని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు తుళ్లూరులో మీడియాతో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై 353, 324 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. -
పవన్.. చెంగువీరా
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి అన్నివిధాలా ద్రోహం చేసిన బీజేపీతో చేతులు కలుపుతావా? అంటూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జనసేన అధినేత పవన్కల్యాణ్పై మండిపడ్డాయి. రాజకీయాల్లో ఎత్తులు పొత్తులు ఉంటాయే తప్ప బాకీలు ఉండవని గురువారం వేర్వేరు ప్రకటనల్లో ఆ పార్టీల నేతలు ఎద్దేవా చేశారు. ‘‘విప్లవ వీరుడు చేగువేరా బొమ్మ పెట్టుకుని చిలకపలుకులు పలికిన పవన్ ఇప్పుడు ‘చెంగువీరుడు’ అయ్యాడు. ఢిల్లీలో బీజేపీ నాయకుడు నడ్డాను కలిశాక పవన్కు పాచిపోయిన లడ్డూలు బందరు లడ్లు అయ్యాయి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ‘‘కమ్యూనిస్టులకు బాకీ పడ్డానా? అంటున్నాడు పవన్.. రాజకీయాల్లో అప్పులుంటాయా?’’ అని ప్రశ్నించారు. దమ్మున్నవాడే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడగలరని, ఆ దమ్ము మాకుందని, నీకు లేకనే బీజేపీతో కలుస్తున్నావా? అని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనకు కారణమై, ప్రత్యేక హోదాను నిరాకరించి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీతో ఎలా చేతులు కలుపుతావని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆక్షేపించారు. రాష్ట్రానికి ‘పాచిపోయిన లడ్లు’ ఇచ్చారంటూ బీజేపీని విమర్శించిన పవన్కు ఇప్పుడవే తాజాగా కనిపించడం విడ్డూరమన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయమనడం జనాన్ని మోసం చేయడమేనని, ఆత్మవంచన కూడా అని అన్నారు. పవన్ బీజేపీతో కలవడమంటే నిస్సందేహంగా అవకాశవాదమేనన్నారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన ద్రోహానికి ప్రజలు గత ఎన్నికల్లో ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారని, రాబోయే రోజుల్లోనూ మీకూ(పవన్), బీజేపీకీ అదే గతి తప్పదని అన్నారు. కాగా, జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ) అమలును నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా మిగతా రాష్ట్రాల మాదిరిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మధు వేరొక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
డర్టీ పాలిటిక్స్.. విపక్షాల భేటీకి మమత దూరం
కోల్కత్తా : ఢిల్లీలో జనవరి 13న జరగనున్న విపక్షాల భేటీకి తను దూరంగా ఉండనున్నట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. సీఏఏపై ఒంటరిగానే పోరు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం జరిగిన భారత్ బంద్లో భాగంగా కాంగ్రెస్తోపాటు లెఫ్ట్ పార్టీలు బెంగాల్లో తమ ప్రభుత్వంపై దాడి చేయడంపై మమత ఆగ్రహంగా ఉన్నారు. బంద్ సందర్భంగా బెంగాల్లో జరిగిన హింసపై మమత తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ద్వంద వైఖరిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మమత గురువారం మాట్లాడుతూ.. ‘జనవరి 13న సోనియా గాంధీ పిలుపు మేరకు జరిగే విపక్షాల భేటీని బాయ్కాట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే బుధవారం బెంగాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పాల్పడిన హింసకు నేను మద్దతు తెలుపలేను’ అని పేర్కొన్నారు. మరోవైపు లెఫ్ట్ పార్టీలతోపాటు ప్రతిపక్షాలు మాత్రం తమ పార్టీలకు చెందిన నాయకులను ఇబ్బంది పెట్టేందుకే టీఎంసీ హింసను ప్రోత్సహించిందని ఆరోపించారు. ఒకవేళ మమత కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి జాతీయ స్థాయిలో విపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తే.. బెంగాల్కు వచ్చేసరికి ఆ పార్టీలే ఆమెకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇది చాలా కాలంగా మమతను ఇబ్బంది పెడుతున్న విషయం. కాగా, యూనివర్సిటీలలో జరుగుతన్న హింసతోపాటు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆందోళనలపై చర్చించడానికి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్షాల భేటీకి పిలుపునిచ్చారు. సోనియా అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశాన్ని విజయవంతరం చేయడానికి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఈ భేటీకి సంబంధించి సోనియా ఇటీవల సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో మాట్లాడారు. చదవండి : భారత్ బంద్.. లెఫ్ట్ పార్టీలపై మమత ఫైర్ -
భారత్ బంద్.. లెఫ్ట్ పార్టీలపై మమత ఫైర్
కోల్కతా : వామపక్ష పార్టీలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లెఫ్ట్ పార్టీలు భారత్ బంద్కు పిలుపునివ్వడంపై విమర్శలు గుప్పించారు. చీప్ పబ్లిసిటీ కోసమే ఆ పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయని ధ్వజమెత్తారు. బుధవారం మమత మాట్లాడుతూ.. బంద్కు పిలుపునిచ్చిన లెఫ్ట్ పార్టీలు బస్సులపై బాంబులు వేసి చీప్ పబ్లిసిటీ పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం కన్నా.. రాజకీయంగా సమాధి కావడం ఉత్తమమని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ ఉనికి లేనివారు.. బెంగాల్ ఆర్థిక పరిస్థితిని దిగజార్చడానికి సమ్మెల పేరిట నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మమత మండిపడ్డారు. బెంగాల్లో ఎటువంటి సమ్మెలను అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీపీఎంకు ఎటువంటి భావజలం లేదన్న మమత.. రైల్వే ట్రాక్లపై బాంబులను విసరడం, ఉద్యమం పేరుతో ప్రయాణికులపై దాడికి పాల్పడటం గుండాగిరికి నిదర్శనమన్నారు. ఈ చర్యలను తను ఖండిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు, సీఏఏకు, ఎన్నార్సీకి వ్యతిరేకంగా జరుగుతుందని మమత గుర్తుచేశారు. అయితే బంద్ వెనక ఉన్న ఉద్దేశానికి తన మద్దతు ఉంటుందన్న ఆమె.. తమ పార్టీ గానీ, ప్రభుత్వం గానీ బంద్కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో ఆ పార్టీలు ఎక్కడ కనిపించలేదన్నారు. కానీ ఇప్పుడు ఆ పేరుతో బంద్కు పిలుపునివ్వడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు. కాగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తమ ఉద్యోగులు బుధవారం రోజున సాధారణ సెలువు పొందడంపై నిషేధం విధించింది. మరోవైపు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. బెంగాల్లో పలు చోట్ల కార్మిక సంఘాల నాయకులు రోడ్లపై, రైల్వే ట్రాక్ల బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఇచ్చిన బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. -
ర్యాలీని భగ్నం చేసిన పోలీసులు
-
సీఏఏను వెంటనే ఉపసంహరించుకోవాలి!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం, పలు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు వామపక్షాలు, ముస్లిం సంఘాల నేతృత్వంలో పలువురు ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. వామపక్షాల నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద పెదసంఖ్యలో మోహరించిన పోలీసులు ఎక్కడిక్కడ నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు ముందస్తుగా చర్యలో భాగంగా చార్మినార్ వద్ద 50 మందిని దక్షిణ మండలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ర్యాలీ లో పాల్గొనేందుకు వచ్చిన సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ ర్యాలీ నేపథ్యంలో నాంపల్లి- మొజంజాహి మార్కెట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. బీజేపీ కార్యాలయం ముట్టడి సీఏఏను వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు వామపక్ష విద్యార్థి నేతలు, శ్రేణులు ప్రయత్నించారు. బీజేపీ కార్యాలయం వద్ద చేరుకున్న వామపక్ష శ్రేణులు.. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు గురువారం ధర్నా నిర్వహించారు. మోదీ సర్కార్ సీఏఏను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. -
19న ర్యాలీ: లెఫ్ట్ పార్టీలు
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివిధ వామపక్షాలు (లెఫ్ట్ పార్టీలు) ప్రకటించాయి. హైదరాబాద్లో చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు, అదేరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇతర పార్టీలు, సామాజిక సంస్థలతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపాయి. సోమవారం మఖ్దూంభవన్లో సీపీఎం కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాడ వెంకట్రెడ్డి, గుండ మల్లేశ్ తదితరులు ఈ మేరకు నిర్ణయించారు. -
ఆర్టీసీని నాకివ్వండి.. లాభాల్లో నడిపిస్తా!
సాక్షి, హైదరాబాద్ : ‘ఆర్టీసీని నడపడం మీకు చేతకాకుంటే నాకివ్వండి. వేల కోట్ల లాభాల్లో నడిపిస్తాను’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. ప్రభుత్వం తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద వామపక్షాలు చేపట్టిన సామూహిక దీక్షను ఆయన ప్రారంభించి సమ్మెకు తన మద్దతును తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడతూ.. తమిళనాడు తరహాలో డీజిల్ ధరలను ప్రభుత్వం భరిస్తే ఆర్టీసీకి నష్టాలు రావని వెల్లడించారు. ప్రభుత్వం ఆర్టీసీకి నయాపైసా ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఆదాయం తీసుకోకుండా ఉంటే చాలన్నారు. ఆర్టీసీ ఏటా డీజిల్పై 1300 కోట్లు ఖర్చు చేస్తే 300 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తుందని పేర్కొన్నారు. నష్టాలొచ్చినా ఆర్టీసీపై పన్నులు వసూలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని విమర్శించారు. ప్రైవేటు బస్సులను అరికడితే ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తుందని సూచించారు. ప్రభుత్వం అబద్దపు ప్రచారాలను మానుకోవాలని నాగేశ్వర్ కోరారు. అంతకు ముందు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. సమ్మె విషయంలో ప్రస్తుతం సీఎం వర్సెస్ తెలంగాణ సమాజం అనే విధంగా మారిందన్నారు. తెలంగాణ సమాజం బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా సమ్మె న్యాయమైందే అంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎం మొండి వైఖరి వల్ల చీకటి రోజులు వస్తున్నాయని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అభిప్రాయపడ్డారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తనకు ఎదురులేదని విర్రవీగుతున్నాడని విమర్శించారు. ఐదుగురు కార్మికులు మరణించిన తర్వాత కూడా మానవత్వం లేదా? అని ప్రశ్నించారు. కార్మికులపై కక్ష కట్టిన కేసీఆర్ సమ్మెను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. -
ఆచితూచి మాట్లాడండి కామ్రేడ్స్!
సీపీఎం నేత బృందా కారత్ ఏపీలో ఒక సభలో మాట్లాడుతూ మోదీని ఏమాత్రం విమర్శించలేదంటూ సీఎం జగన్పై ఆరోపించారు. కానీ హుజూర్నగర్లో ఉపఎన్నికలతో సహా పాలకవర్గ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంపై వామపక్షాలు ప్రతి సందర్భంలోనూ వేస్తున్న తప్పటడుగులను, వామపక్షాల అనైక్యతను సరిదిద్దడంలో బృందా కారత్ తన వంతు కృషి చేస్తే బాగుంటుంది. పైగా, ఎన్నడూ లేనివిధంగా ఏపీలో గిరిజనులు, దళితులు, మైనారిటీలు, బీసీలు తదితరుల అభ్యున్నతికి వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ చర్యల గురించి బృందా తెలుసుకుని ఉంటే బాగుండేది. సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న శక్తులతో శ్రామిక వర్గ పార్టీలు కలిసి పనిచేయడం ఇప్పటి అవసరం. ఇటీవల సీపీఎం నేత బృందా కారత్ విశాఖ పట్నంలో అనుకుంటాను.. ఒక సభలో మాట్లాడుతూ, ‘జగన్ ఏమన్నా ఫెవికాల్తో పెదాలు అంటించుకున్నారా? మోదీని ఏమీ విమర్శించలేదు’ అన్నారు. నాకు తెలిసినంతవరకు బృందాకారత్ నిబద్ధత గల నాయకురాలు. పైగా సీపీఎం పార్టీ తరపున ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికై ఏర్పాటు చేసుకున్న ఒక కమిటీ నేత కూడా. గిరిజనుల అభివృద్ధి కోసం గత పాలకులు ఎన్నడూ చేయని విధంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వాన ఎలా కృషి చేస్తున్నదో ఆమెకు సరైన సమాచారం లభించినట్లు లేదు. ఒక గిరిజన మహిళను ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఘనత జగన్కే దక్కింది. తన మంత్రివర్గంలో 60 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ గిరిజన మైనారిటీ మహిళా ప్రతినిధులకు స్థానం కల్పించారు జగన్. ఇంతవరకు ఈ విధంగా సామాజిక న్యాయాన్ని ఆచరించిన రాజకీయపార్టీ గానీ, ముఖ్యమంత్రి గానీ మరెవరైనా ఉన్నారా? అలాగే ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా వెళ్లినప్పుడు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ప్రత్యేకించి ఆదివాసీ గిరిజనుల కోసం వైద్య కళాశాల, విద్యాసంస్థలు, వైద్య సదుపాయం అలాగే ఆ ప్రాంతంలో ఉన్న కిడ్నీ బాధితుల కోసం ప్రత్యేక డయాలసిస్ కేంద్రాలు, రక్తశుద్ధి అవసరమైన వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల ఆర్థిక సదుపాయం ఇవన్నీ కల్పించే కృషి ప్రస్తుత రాష్ట్ర పాలనలో నిజాయితీగా జరుగుతున్నది కదా. ఆ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేసింది జగన్ ప్రభుత్వమే కదా! అమలు క్రమంలో ఏవైనా లోపాలుంటే సహజంగా ప్రజానుకూల ప్రభుత్వానికి బాధ్యతగల ప్రతిపక్షం తగు సూచనలిచ్చి, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. పైగా ప్రతి 50 ఇళ్లకు వలంటీర్లను ఏర్పాటు చేసి, ప్రజల గడపవద్దకు ప్రభుత్వాన్ని తీసుకువెళ్లి, వాళ్లలో అర్హులకు ప్రభుత్వ రేషన్ అందించడం, ఇతరత్రా రేషన్ కార్డులు, పెన్షన్ సదుపాయాలు, కులధృవీకరణ పత్రాలు, మొదలగు సమస్యలు తీర్చే వలంటీర్ వ్యవస్థకు జగన్ ఏర్పాటు చేయడం అపూర్వం కాదా! దానిని కూడా గోనెసంచులు మోసినందుకు అయిదువేల జీతం అంటూ అపహాస్యం చేయడం, ఆ గ్రామ వాలంటీర్లను అవమానించడమే కదా! చంద్రబాబు కృష్ణా జిల్లాలో ఆ గ్రామ వలంటీర్ల నియామక పత్రాలనందించే సంఖ్యను చూసి ఉండరు. వారి స్పందన గమనించారా? ఆ సభలో జగన్ ప్రసంగం విన్నారా? ఆ వలంటీర్లలో అత్యధికులు యువతీయువకులు. ఇలా మా గ్రామంలో మా ప్రజలకు జగనన్న కుటుంబంలో పెద్దకొడుకు వలే ఏర్పాటు చేయడం, ఈ వలంటీర్ వ్యవస్థ, దాని ద్వారా మాకు, మా వారికి, మా ఊరికి ప్రజాసేవ చేసే అవకాశం రావడం మా అదృష్టం అని ఆ యువతీయువకులు స్పందించడం.. ఎంత హృద్యమైన దృశ్యమో అనిపించింది. బాబుగారు ప్రతి సభను ఒక ఈవెంటుగా మార్చి, తాను ఆ ఈవెంట్ మేనేజర్గా వ్యవహరించడం ఎంత అహంకార ఆడంబర ప్రదర్శనగా ఉండేదో కదా. తద్భిన్నంగా ఏదో పెద్దన్న, చెల్లెళ్లు, తమ్ముళ్లు కలిసి తమ కుటుంబం కోసం ఏం చెయ్యాలి అని చర్చించుకున్నట్లు సాగింది జగన్ సభ. అందుకే బాబు ఉక్రోషం పట్టలేకపోతున్నారు. ఈ వ్యాసం మొదట్లో బృందాకారత్ జగన్ను విమర్శించిన ప్రస్తావన తేవడం ఎందుకంటే, ప్రస్తుతం చంద్రబాబు వ్యవహార శైలి వంటిది కమ్యూనిస్టులకు తగనిదని, తెలియజేసేందుకే! ఇటీవల సీపీఐ నేత నారాయణ కూడా గత స్పీకర్ కోడెల శివప్రసాద్ భౌతిక కాయాన్ని చూడటానికి వెళ్లి జగన్ అక్రమ వేధింపుల వల్లనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు సమక్షంలోనే అన్నారు. ఆ ప్రకటన చూసిన మిత్రుడొకరు సీపీఐ వారు చంద్రబాబుకు దగ్గరవనున్నారా? అని అడిగాడు. 2009లో చంద్రబాబుతో మహాకూటమి కట్టిన తర్వాత, ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనుభవం తర్వాత, చంద్రబాబు గారితో కమ్యూనిస్టులు ఎవరూ చేతులు కలపరనే అనుకుంటున్నానని అన్నాను. కమ్యూనిస్టు పార్టీలకు ప్రజాభ్యుదయం, పురోగామి తత్వం, లౌకిక విధానాలు వంటి శాశ్వత విలువలు ఉంటాయి. బాబు లాంటి వారికి అధికారంలోకి రావడమే ముఖ్యం కాబట్టి వారు కమ్యూనిస్టులతోనైనా ఎన్నికల్లో జతకట్టగలరు. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక సంస్థ అయిన ఆరెస్సెస్, బీజేపీ వంటి వారితో సైతం పొత్తుకు వెనుకాడరు. కానీ కమ్యూనిస్టులకు మాత్రం బాబులాంటి వారితో పొత్తు ధృతరాష్ట్ర కౌగిలే. ఈ సందర్భంగా జగన్ ఆచరణను కమ్యూనిస్టులు మర్చిపోకూడదు. పైగా బీజేపీ హిందూ మతతత్వ ఎజెండాను కాదని, మన రాష్ట్రంలో జగన్ పాలన సర్వ మతసమానత్వాన్ని పాటిస్తూ నడుస్తున్న విషయం వాస్తవం కాదా? దాన్ని గుర్తించకుండా, ఇంతకు ముందు బాబు పాలనలో ప్రజలు స్వర్గధామంలో ఉన్నట్లు జగన్పై విమర్శలు గుప్పించడం కమ్యూనిస్టులకు కూడని పని.ప్రధాని మోదీ కార్పొరేట్ సంస్థలకు అత్యధిక లాభాలు లభించే విధంగా ఆర్థిక విధానాలు అవలంభించి, మన దేశ మౌలిక ఆర్థిక పరిస్థితిని క్షీణింప చేస్తున్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను పెంచి వారి కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా దృఢనిశ్చ యంతో పయనిస్తున్నారు. అదే రైతు భరోసా, గ్రామ స్వరాజ్ వివిధ కార్పొరేషన్ల ప్రధాన ఉద్దేశం. ఈ పాలన అందిస్తున్న ప్రత్యామ్నాయ విధానాలను సరిగా బేరీజు చేసుకోకుండా, ప్రతిపక్షపాత్ర పోషిం చడం అంటే కాళ్లల్లో కట్టె పెట్టడమేనని కమ్యూనిస్టులు భావించడం సరికాదు. ఈ సందర్భంగానే తప్పులెన్నువారు తమతప్పులెరగరు అన్నట్లు త్వరితగతిని మన ప్రజాభిమాన గ్రాఫ్ పడిపోతున్నప్పుడు తీవ్ర ఆత్మవిమర్శను నిజాయితీగా చేసుకోవాలని కమ్యూనిస్టులతో నాకున్న పేగు సంబంధంతో కోరుతున్నాను. సీపీఎం జాతీయ కార్యదర్శి ఏచూరి, హైదరాబాద్లో నిర్వహించిన సీపీఎం తెలంగాణ కార్యదర్సి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర ముగింపు సభలో లాల్ నీల్ నినాదం ఇచ్చారు. దాని అర్థం. వర్గపోరాట శక్తులు అలాగే సామాజిక అణచివేతకు గురవుతున్న వర్ణ(కుల) వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు, ఇతర వెనుక బడిన కులాలతో ఐక్యపోరాటం అవసరం అని భావించాము. దానికి ఆచరణ రూపం ఇస్తూ బహుజన, వామపక్ష సంఘటన (బీఎల్ఎఫ్)పై తెలం గాణ రాష్ట్రకమిటీ తత్సంబంధిత నేతలందరితో సంప్రదించి ఒక సృజనాత్మక మార్గాన్ని చేపట్టింది. అయితే వర్ణ (కుల) వ్యవస్థ నిర్మూలనా పోరాటం అనేది వర్గపోరాటాలకు, వర్గఐక్యతకు భంగం అని భయపడి, భయపెట్టే కామ్రేడ్లు ఆ పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీల్లో మెజారిటీగా ఉన్నారు. వారు ఈ బీఎల్ఎఫ్ ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ మెజారిటీకి మైనారిటీ లోబడి ఉండాలనే పార్టీ నిబంధన ఆధారంగా దాన్ని వదిలిపెట్టాలని బలవంతం చేశారు. ఫలితంగా పార్లమెంటు ఎన్నికలో బీఎల్ఎఫ్ను విడిచి సీపీఐతో కలిసి ఎన్నికలలో తెలంగాణ సీపీఎం అయిష్టంగా జతకట్టింది. ఇప్పుడు హుజూర్నగర్లో శాసనసభకు ఉపఎన్నిక వచ్చింది. పై కమిటీ కామ్రేడ్లు తెలంగాణ సీపీఎం పార్టీకి ఒంటరిగానే పోరాడమని తాఖీదు పంపారు. అక్కడ సీపీఐ టీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తోంది. గతంలో సీపీఎం నిర్మించిన బీఎల్ఎఫ్లోనే బాధ్యతలు నిర్వహించిన, మరో కమ్యూనిస్టు పార్టీ ఎంసీపీఐ (యూ), కంచ ఐలయ్య, కాకి మాధవరావు, తదితర సామాజిక న్యాయపోరాట సంస్థల నేతలు కొందరు కలిసి బీఎల్ఎఫ్ పేరుతో ఒక అభ్యర్థిని పెట్టింది. ఈ స్థితిలో సీపీఎం అభ్యర్థి నామినేషన్ సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైంది. ఇప్పుడైనా తమ అభ్యర్థి రంగంలో లేడు గనుక తామే నిర్మిం చిన బీఎల్ఎఫ్ అభ్యర్థిని బలపరచడం సీపీఎం కర్తవ్యం. తెలంగాణ సీపీఎం విషయంలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట కేంద్రీకృత నియంతృత్వాన్ని అమలు జరిపి, ఆ పార్టీ పైకమిటీ ఏం ఆదేశిస్తుందో చూడాలి. ఒకవేళ సీపీఎం, తాను బీఎల్ఎఫ్ని బలపర్చడం లేదని ప్రకటిస్తే, తెలంగాణలో ప్రత్యేకించి, దేశవ్యాప్తంగాను సీపీఎం ప్రతిష్ట దిగజారుతుంది. విస్తృత ప్రజా సమీకరణ చేయాల్సిన మౌలిక లక్ష్యానికి సీపీఎం దూరమవుతుంది. కానీ ఆ తప్పు నిర్ణయాన్ని సీపీఎం చేయదని ఆశిద్దాం. అణగారిన ప్రజల, కష్టజీవుల విస్తృత ఐక్య పోరాటమే మార్క్సిజాన్ని మన దేశ ప్రత్యేకతకు అన్వయించడం! - డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
‘ఏపీకి మరోసారి బీజేపీ ద్రోహం’
సాక్షి, విజయవాడ: ఆంధ్రా బ్యాంక్ను యూనియన్ బ్యాంక్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక వన్టౌన్ ఆంధ్రా బ్యాంక్ జోనల్ కార్యాలయం ఎదుట వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేసు మాట్లాడుతూ.. 90 వేల శాఖలు కలిగిన ఆంధ్రాబ్యాంక్ను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. దేశ ఆర్థిక వృద్ధి కోసమే విలీనం చేస్తున్నామంటూ.. బీజేపీ ప్రభుత్వం ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఆంధ్రా బ్యాంక్ విలీనానికి కమ్యూనిస్టు పార్టీలు పూర్తి వ్యతిరేకమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఏపీకి బీజేపీ ద్రోహం.. బీజేపీ ప్రభుత్వం మరోసారి ఏపీకి ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా బ్యాంక్ విలీనాన్ని సీపీఎం, సీపీఐలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. నిరంకుశ విధానాలు మానుకోవాలి.. వైఎస్సార్ జిల్లా: ఆంధ్రా బ్యాంక్ను యూనియన్ బ్యాంక్లో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. మంగళవారం కడప నగరంలోని ఏడు రోడ్లు సర్కిల్లో ఆంధ్రా బ్యాంక్ ఎదుట సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. తెలుగు ప్రజల పట్ల ప్రధాని నరేంద్రమోదీ నిరంకుశ విధానాలు మానుకోవాలని హితవు పలికారు. -
విద్యార్థులారా... ఆత్మహత్యలకు పాల్పడవద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో గందరగోళంపై సోమవారం (29న) ఇంటర్బోర్డు ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, టీడీపీ ప్రకటించాయి. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఇతర రాజకీయపార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర వర్గాలవారు కలసి రావాలని పిలుపునిచ్చాయి. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, వారికి తాము అండగా ఉంటామని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశాయి. శనివారం ఇక్కడి మఖ్దూంభవన్లో భేటీ అనంతరం ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. 23 మంది మరణం హృదయవిదారకం ఇంటర్ బోర్డు తప్పులకు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం హృదయ విదారకరమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ఎదిగిన పిల్లలు రాలిపోయి, ఎద నిండా ఆవేదనతో తల్లిదండ్రులున్నారని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ సమాజం మొత్తం మేల్కొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. ఒక కంపెనీ ప్రయోజనాల పరిరక్షణకే ప్రభుత్వం, అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఈ సంస్థ మొదటి నుంచి తప్పులు చేస్తున్నా వెనకేసుకు వచ్చారని విమర్శించారు. తప్పులపై కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు మొదటి నుంచి హెచ్చరిస్తున్నా బోర్డు అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇంటర్ కార్యదర్శికి సమస్యలన్నీ తెలుసని, విద్యార్థులు ఫెయిలైతే డ్రైవర్లు కావచ్చని, దుకాణాల్లో పని చేసుకోవచ్చని ఉచిత సలహాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కూడా ఉచితంగా విద్యార్థులకు వాల్యూయేషన్ చేస్తామన్నారే తప్ప ఈ సమస్యపై సమగ్ర సమీక్ష నిర్వహించలేదన్నారు. తమకు ఎమ్మెల్యేల సంఖ్య లేకపోయినా సమాజం పట్ల నిబద్ధత ఉందని, ఏదిఏమైనా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామన్నారు. నిద్ర నటించే సర్కార్ను తట్టి లేపేందుకే ఈ వ్యవహారంపై నిద్ర నటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు ధర్నా నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిఫారసుతోనే పరీక్షల నిర్వహణలో అనుభవంలేని గ్లోబరీనా సంస్థకు టెండర్ కట్టబెట్టారని ఆరోపించారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే ఈ సంస్థకు పరీక్షా ఫలితాల బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. ప్రతి అంశంపై ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ ఇంటర్ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిం చారు. విద్యార్థులు రోడ్డున పడితే టీఆర్ఎస్ మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ ఫ్యూడల్ మైండ్సెట్తో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేబినెట్ బాధ్యత వహించాలి: రమణ ఇంటర్ బోర్డు తప్పులకు సీఎం కేసీఆర్, కేబినెట్ బాధ్యత వహించాలని, మంత్రి జగదీశ్రెడ్డిని బర్తరఫ్ చేయాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంపై విపక్షపార్టీలుగా గవర్నర్ను కలిస్తే నామమాత్రంగా స్పందించారన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేటీఆర్ మాత్రం ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిర్బంధాన్ని ఛేదిస్తాం: చాడ సీఎం కేసీఆర్ ప్రయోగించే నిర్బంధాన్ని, పోలీస్ వ్యవస్థను ఛేదించి 29న ధర్నా నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. తొంభై మార్కులు వచ్చిన అమ్మాయికి ఇంటర్బోర్డు సున్నా మార్కులు వేసినందుకు సిగ్గుపడాల్సింది పోయి... ఇలాగే జరుగుతాయి అని చెప్తారా? అని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఉంటామని, జోలె పట్టి ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. -
ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించిన వామపక్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం వామపక్ష నేతలు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అయితే వామపక్ష నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు. ప్రశ్నించిన వాళ్లను ప్రభుత్వం అణిచివేస్తోందని మండిపడ్డారు. చనిపోయిన ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
లెఫ్ట్ పార్టీలకే ఓటేయండి.. కేరళ చర్చి పిలుపు!
సాక్షి, తిరువనంతపురం: పినరయి విజయన్ సారథ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులకే ఓటేయండని కేరళలోని ప్రముఖ చర్చి అక్కడి క్రైస్తవులకు పిలుపునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘రానున్న లోక్సభ ఎన్నికల్లో మనకు సహాయం చేసిన లెఫ్ట్ కూటమి అభ్యర్థులకే ఓటేయాల’ని ఓ చర్చి మతబోధకుడు క్రైస్తవులకు సూచించారు. దీనిపై కేరళ సీపీఎం నాయకుడు సునీత్ చోప్రా మాట్లాడుతూ.. ‘హిందువుల మీద దాడులపై, హిందూ ధార్మిక సంస్థలు మాట్లాడగా లేనిది, బీజేపీకి ఓటేయొద్దని క్రైస్తవ చర్చిలు చెప్పడంలో తప్పేంట’ని ప్రశ్నించారు. అయితే, ఇది ముమ్మాటికీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమేనని ఈ మధ్యే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నాయకుడు టామ్ వడక్కన్ అభిప్రాయపడ్డారు. ఈ వివాదం నేపథ్యంలో ఓటర్లును ప్రభావితం చేసే ఎటువంటి ప్రసంగాలను నిర్వహించొద్దని ఇదుక్కి జిల్లా చర్చి బిషప్ మార్ మ్యాథ్యూ.. చర్చి మతబోధకులకు హెచ్చరించినట్టు సమాచారం. ‘దీనివల్ల భవిష్యత్తులో చర్చి కార్యకలాపాలకు నష్టం వాటిల్లే అవకాశముంది. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో చాలా తెలివిగా, స్పృహతో ఉన్నారు. చర్చి మతబోధకులు ఇటువంటి విషయాల్లో ఏ పక్షానికీ తలొగ్గకుండా ఉండటమే మంచిద’ని బిషప్ మార్ మ్యాథ్యూ హితవు పలికారు. ఇకపోతే 2014 లోక్సభ ఎన్నికల్లో ఇదుక్కి బిషప్ మార్ మ్యాథ్యూ మద్దతుతో లెఫ్ట్ అభ్యర్థి జాయ్స్ జార్జ్ దాదాపు 50 వేల మెజార్టీతో గెలుపొందారు. అనేక చోట్ల చర్చి బిషప్లు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉండటంతో, పార్టీలు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. -
కర్తవ్యాన్ని గుర్తించండి కామ్రేడ్స్!
నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ప్రత్యక్ష, తక్షణ ప్రమాదం.. ప్రజలలో విశ్వసనీయత పూర్తిగా కోల్పోయిన చంద్రబాబు ప్రభుత్వం నుంచే ఉంది. అవినీతిలో, ఆశ్రిత పక్షపాతంలో, ప్రజలను మాటల్తో వంచించడంలో ఆత్మస్తుతి, పరనిందలో బాబు ఆకాశమే హద్దుగా వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయిన ప్రజలు ఆయనకు చరమగీతం పాడాలని ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని, ప్రజాస్వామిక పాలనను ఖూనీ చేసిన చంద్రబాబు పాలనను, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించటమే ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టులు పరిష్కరించాల్సిన కీలక వైరుధ్యం. ఈ కర్తవ్య నిర్వహణ పక్కదారి పట్టకుండా పోరాటంలో కమ్యూనిస్టులు ముందుండాలి. ఇది మన నవ్యాంధ్రప్రదేశ్కు, దేశ లోక్సభకు ఎన్నికల వాతావరణం! ఎన్నికల ప్రాధాన్యత గురించి మార్క్స్ మహనీయుడు ఒక సందర్భంలో ‘సంఖ్యరీత్యా అధికసంఖ్యలో ఉండే ఎన్నో పోరాటాలలో రాటుదేలి చైతన్యవంతమైన శ్రామికవర్గం ఉన్న ఇంగ్లండ్ వంటి దేశాల్లో వయోజన ఓటింగ్ ద్వారా సమాజంలో సోషలిజం దిశగా మార్పు రావచ్చు’ అని ఆశించారు. ఆయన సహచరుడు ఎంగెల్స్ మాత్రం ఎన్నికలు ప్రజాచైతన్యానికి గీటురాళ్లు మాత్రమే అన్నారు. అందుకే సీపీఎం పార్టీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, ఆదర్శ కమ్యూనిస్టు నేత కీ.శే. పుచ్చలపల్లి సుందరయ్య కొటేషన్ల (ఉటంకింపులు) దేముందయ్యా, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ రచనల నుంచి ఎన్నయినా ఇవ్వవచ్చు కానీ, కావలసింది వాటిని మన పరిస్థితికి అన్వయించుకోవడమే అనేవారు. ఆ విధంగా ప్రస్తుత సమాజాన్ని విశ్లేషించుకుంటే ఇక్కడ నిన్నటి భూస్వాములే నేటి పెద్ద పెట్టుబడిదారులు–ఆ రెండు వ్యవస్థల దుర్లక్షణాలన్నీ నేటి మన దేశ వ్యవస్థలో ఉన్నాయి. ఒకవైపు బడా పెట్టుబడిదారులు, విదేశాలకు పెట్టుబడిని ఎగుమతి చేసే స్థాయికి పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి చెందినా, బ్యాంకులను, ప్రజాధనాన్నీ కొల్లగొట్టిన, కొల్లగొడుతున్న మాల్యాలు, నీరవ్ మోదీలు, సుజనా చౌదరిలు, సీఎం రమేష్లతోపాటు పాత సంస్కృతి అవశేషంగా సామాజిక అణచివేతకు ఆలవాలమైన కులవ్యవస్థ కూడా బలంగా ఉంది. ఇఎంఎస్ అన్నట్లు మనదేశంలో బానిసవ్యవస్థ కులవ్యవస్థ రూపంలో ఘనీభవించింది. అందుకే పైపై మార్పులు ఎన్ని జరిగినా, దాని ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దీనికి ఉదాహరణ. సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే ‘ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా?’ అంటూ వారి జన్మ అప్రతిష్టకరమైనదని చెప్పకనే చెప్పారు. ‘మీకు రాజకీయాలెందుకురా, అవి మాకు.. పిచ్చి ముం..ల్లారా’ అంటూ చంద్రబాబు కులానికి చెందిన మరో నేత అంటాడు. పైగా ఆయన ఒక మహిళా అధికారి జుట్టు పట్టుకుని ఈడ్చిన ఘనుడు కూడా. ఇక ప్రతిపక్షంలో ఉండి గోడదూకి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మరోనేత అయితే ‘ఈ దళితులు శుభ్రంగా ఉండరు. స్నానాలు చేయరు’ అని ఏవగించుకుంటాడు. ‘ఈ మాదిగ... లకు చదువుపై శ్రద్ధ ఉండదు. వారికి చదువు అబ్బదు’ అని పాలకపార్టీలోని దళితనేత ఒకరు ఎగతాళి చేస్తాడు. గతంలో ఎన్నడూ లేనట్లు దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారి టీలు, బాగా వెనుకబడిన కులవృత్తుల వారి పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. వారి అస్తిత్వమే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పాలనకు సంబంధించి అన్ని రంగాల్లోనూ చంద్రబాబుకు చెందిన సామాజిక వర్గానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నది నిర్వివాదాంశం. ఆ పార్టీని వీడి ఇతర పార్టీలవైపు ముఖ్యంగా వైఎస్సార్సీపీ వైపు వలస వస్తున్న చంద్రబాబు అనుయాయులే ఈ విషయం స్పష్టంగా ప్రజల ముందు చెప్పడమూ మనం చూస్తున్నాం. ఈ కమ్మ కులం నేతల్లో కూడా కులకంపుతో ఊపిరాడని కొందరు ప్రజాప్రతి నిధులు సైతం ఈ నిజం చెప్పేందుకు సిద్ధపడుతున్నారు. దురదృష్టమేమిటంటే, ఈ కులవ్యవస్థ అణచివేత, భారతదేశ ప్రత్యేకతలో ఒక ప్రధాన వైరుధ్యంగా భావించి అందుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన కమ్యూనిస్టులు తెలిసో తెలియకో ఆ అంశాన్ని కొన్ని సందర్భాల్లో అసలు భౌతిక వాస్తవికతగా గుర్తించడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఈ వర్ణవ్యవస్థపై పోరాడితే మౌలికమైన వర్గ ఐక్యతే చెదిరిపోతుందని బెదిరిపోతున్నారు. ప్రతి మహాసభలోనూ శ్రామిక వర్గం నుండి వచ్చిన ప్రతినిధులు ఎంతమంది ఉన్నారనేది ఆయా కమిటీల లెక్కల ద్వారా తేల్చుకుం టారు. కానీ పార్టీ ఉన్నత కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, బీసీ, మహిళలు, మైనారిటీలు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్నే ఉండదు. ఇది గమనించే బీటీ రణదివే విజయవాడలో అప్పట్లో జరిగిన మహాసభలో మనపార్టీ ఏమైనా ఎస్సీ, ఎస్టీయేతర పార్టీనా అని ప్రశ్నించాల్సి వచ్చింది. దీనిపై ఆమధ్య సీపీఎం ఆత్మవిమర్శా పత్రంలో ప్రస్తావించి, ఈ పరిస్థితి ఉమ్మడి ఏపీలో అధికంగా ఉందని చెప్పింది. ఇటీవలి కాలంలో పార్టీలో ఈ అంశంపై తక్కువస్థాయిలోనైనా కాస్త మార్పు వస్తోందనిపిస్తోంది. ఈ అంశంపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ చేస్తున్న కృషి ఒక ఆశాజనకమైన ఉదాహరణ. ఇతర కమ్యూనిస్టు పార్టీలతో పోలిస్తే ఇది సృజనాత్మకమైన సానుకూల ప్రయోగం. వారు బహుజన వామపక్ష సంఘటనను.. సామాజిక అణచివేతకు గురవుతున్నవారు శ్రామికవర్గ దృక్పథం గలవారు, ఇతర మధ్యతరగతి మేధావులతో ఏర్పాటు చేశారు. ఆ సంఘటన ఒంటరిగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ అది ఆశించిన స్థాయిలో ఓట్లు సాధించలేక పోయింది. అది సాకుగా చూపి వర్గపోరాటమే ఏకైక పోరాటరూపం అన్న నినాదం మాటున తెలంగాణ సీపీఎం ఏర్పర్చిన బీఎల్ఎఫ్పై విమర్శలు, అవహేళనలు మంద్రస్థాయిలో సాగాయి. కానీ మన దేశంలో భౌతిక వాస్తవికతగా నిలిచి ఉన్న సామాజిక అణచివేతకు ఆలంబనగా ఉండిన వర్ణవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడకుండా కమ్యూనిస్టులు తమ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యం! విభిన్న భాషలు, నాగరికతలు, జీవన పరిస్థితులు, వివిధ జాతులు, విభిన్న వైవిధ్యాలు, వైరుధ్యాలు గల మన దేశంలో దాదాపు దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల స్వల్పమార్పులు తప్ప సాధారణంగా ఉన్న సామాన్య అంశం ఈ వర్ణ వ్యవస్థే. కాబట్టి కమ్యూనిస్టుల పోరాటంలో ఈ సామాజిక అణచివేత అంశం కూడా ప్రధానమైందే. అందుకే తెలంగాణ సీపీఎం రాష్ట్ర కమిటీ దీనిపై తీసుకున్న నిర్ణయం, దాని ఆచరణ క్రమం సామాజిక పురోగమనంలో మరో ముందుడుగుగా చెప్పాలి. వారి ప్రయత్నం ఈ రోజు చిన్నదే కావచ్చు కానీ అది పెరిగిపెరిగి దేశ ప్రజానీకానికి ఆశావహంగా రూపొందుతుందని నమ్ముతున్నాను. ఇక రెండో ప్రధాన అంశం మనదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ. పార్లమెంటరీ మార్గమే మౌలికంగా ప్రజాజీవనాన్ని మార్చేస్తుందని చెప్పలేం. కానీ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో, వారు తమ అనుభవం ద్వారా తమకు ఎలాంటి పాలన కావాలో గ్రహింపు కలిగించడంలో ఎన్నికల పాత్రను కాదనలేం. అలాగని చెప్పి ఎక్కువ స్థానాలు, తద్వారా రాష్ట్ర స్థానిక స్థాయిలోనైనా అధికారం పొందడమే కమ్యూనిస్టుల లక్ష్యం కాకూడదు. దేశ ప్రజల జీవన పరిస్థితులు, రాజకీయ చైతన్యం, భౌతిక పరిస్థితులు నిశితంగా పరిశీలించుకుని అవి మరింత మెరుగుపడేందుకో, కాకుంటే మరింత అధ్వానమైనా కాకుండా ఉంచేందుకే కమ్యూనిస్టుల పార్లమెంటరీయేతర పోరాటాలు ఉండాలి కదా! ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో, అలాగే కేంద్రంలో ఉన్న పాలన దాని మంచిచెడ్డలు వాటిని ప్రభావితం చేయగల మనశక్తి సామర్థ్యాలు, అన్నీ ఊహాలోక విహారాలు కాకుండా వాస్తవికంగా నిర్దేశించుకోగలగాలి. నేడు ఏపీలో ప్రజలకు ప్రత్యక్ష, తక్షణ ప్రమాదం ప్రజలలో విశ్వసనీయత పూర్తిగా కోల్పోయిన బాబు ప్రభుత్వం నుంచే ఉంది. అవినీతిలో, ఆశ్రిత పక్షపాతంలో, ప్రజలను మాటలతో వంచించడంలో ఆత్మస్తుతి, పరనిందలో బాబు ఆకాశమే హద్దుగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు ఆయనకు చరమగీతం పాడాలని ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. పైగా చంద్రబాబు స్పీకర్ పదవిని కూడా భ్రష్టుపట్టించి కోడెల శివప్రసాద్ ద్వారా శాసనసభ సత్సంప్రదాయాలను ఉల్లంఘించి, అసెంబ్లీనే ‘కురుసభ’గా మార్చిన వ్యవహారం కూడా ప్రజలు గమనించిందే. ఇక ఎన్నికల ప్రక్రియనే తల్లకిందులు చేసే రీతిలో ప్రతిపక్షాల ఓట్లను, ఓటర్లను తొలగించి తన అనుకూలుర దొంగ ఓట్లను చేర్పించడం వంటి అక్రమ చర్యలకు సిద్ధపడ్డారు. నిన్నటిదాకా తన ‘షేవ్ ఆంధ్రప్రదేశ్ మిషన్’ని సాధ్యమైనంతగా పూర్తి చేసుకుని, అందుకు మోదీ సహాయాన్ని స్వీకరించి తీరా ఏపీ ప్రజలు తననూ, మోదీని కూడా రాజకీయ సమాధి చేయడానికి సిద్ధమైనారని గ్రహించి ఏదో విధంగా తన మిషన్ సాగించేందుకు బాబు పెనుగెంతువేసి రాహుల్గాంధీ సరసన చేరారు. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో గెలవాలనే ఏకైక లక్ష్యంతో ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు, ముందస్తు గృహనిర్బంధాలు, చీటికీమాటికీ పోలీసు దాడులు వంటివి మున్నెన్నడూ ఎరుగని స్థాయిలో బాబు జరిపిస్తుండటం చూస్తున్నాం. ఎన్నికల కమిషన్కు ప్రత్యేక యంత్రాంగం ఏదీలేని నేపథ్యంలో అశోక్బాబు వంటి చెంచాగిరి చేసే అధికార బృందం, కోరి తెచ్చుకున్న పోలీసు ఉన్నతాధికారులు వీరి సాయంతో నిస్సిగ్గుగా, ప్రజాస్వామ్య విలువలను పాతరేసే ప్రయత్నాలు జరగవచ్చు కనుక ఈ నామమాత్రపు ప్రజాస్వామ్యం కూడా కృష్ణార్పణం కాకుండా అందరికంటే కమ్యూనిస్టులు తమ అనుభవంతో ఎదుర్కోవడంలో ముందుండాలని వాంఛించడం సహజం. ఇటు రాష్ట్రంలో బాబు టీడీపీ అధికారంలోకి రాకుండా చేయడం అందుకు ప్రజాసమీకరణ, ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో కమ్యూనిస్టు పార్టీల పోరాట పటిమ, ప్రజానుకూల ధోరణిని ప్రజానీకం గుర్తించగలుగుతారు కూడా. అలాగే ప్రత్యేక హోదాకు మంగళం పాడిన ఎన్డీయే పాలనను ఓడిం చడం కూడా కమ్యూనిస్టుల లక్ష్యం కావాలి. వీటికి దూరంగా ప్రస్తుత పరిస్థితిలో ఆచరణీయ కర్తవ్యం కాని కూటములతో మరోసారి కమ్యూనిస్టులు అప్రతిష్ట కొనితెచ్చుకోరాదు. పై రెండు ప్రధాన కర్తవ్యాల నిర్వహణ పక్కదారి పట్టకుండా పోరాటంలో కమ్యూనిస్టులు ముందుండాలి. ఈ ప్రధాన పాత్ర నిర్వహణకు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ అగ్రగామిగా ఉంది. ఆ పార్టీతో కమ్యూనిస్టులకు ఎన్ని వైరుధ్యాలైనా సరే రాజకీయ రంగంలో ఉండవచ్చు, ఉంటాయి కూడా. కానీ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని, ప్రజాస్వామిక పాలనను ఖూనీ చేసిన చంద్రబాబు పాలనను, కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఓడించటమే ప్రస్తుతం వామపక్షాలు పరిష్కరించాల్సిన కీలక వైరుధ్యం. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
మోదీ పర్యటన నిరసిస్తూ వామపక్షాల ర్యాలీ
-
మోదీ పర్యటనను అడ్డుకుంటాం
-
సీట్ల సర్దుబాటుపై ఫిబ్రవరిలో నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం/నగరంపాలెం (గుంటూరు): జనసేన, వామపక్షాల పొత్తు నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంటామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ తెలిపారు. వచ్చే నెలలో మరోసారి సమావేశమవుతామన్నారు. విశాఖ రుషికొండలోని ఓ రిసార్ట్స్లో జనసేన, సీపీఐ, సీపీఎం ముఖ్య నాయకులు రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులుతో పవన్కల్యాణ్ మూడు గంటలపాటు చర్చించారు. అనంతరం వారితో కలిసి పవన్ విలేకరులతో మాట్లాడారు. వామపక్షాలు, జనసేన పార్టీల భావజాలం ఒకేలా ఉండడంతో వాటితో కలిసి పనిచేయాలన్న నిర్ణయానికొచ్చామని పవన్ చెప్పారు. పర్యావరణ కాలుష్యం, మైనింగ్ పాలసీ, 2013 భూసేకరణ చట్టం అమలు, జాయింట్ ఫ్యాక్టస్ ఫైండింగ్ కమిటీ నివేదికను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై చర్చించామని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఎలా కలిసి వెళ్లాలన్న దానిపై చర్చించామన్నారు. ఈవీఎంలలో లోపాలపై తమకు అభ్యంతరాలున్నాయని, త్వరలో వాటిపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. నిపుణుల కమిటీ వేయాలి ఈవీఎంలపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్పై ఉందని సురవరం సుధాకరరెడ్డి చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు వ్యత్యాసం ఉండడం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యాయన్నారు. ఇలాంటి అనుమానాల నివృత్తికి నిపుణుల కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీవీ రాఘవులు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు, ఆ ప్రక్రియలో మూడు పార్టీల పాత్ర గురించి చర్చించామని తెలిపారు. ప్రత్యేక హోదా, వాగ్దానాల అమలులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. సమావేశంలో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, మాదాసు గంగాధరం, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు పాల్గొన్నారు. 27న జనసేన శంఖారావం సభ 27న గుంటూరు లాడ్జి సెంటరులోని ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్లో జనసేన శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకుడు, మాజీ మంత్రి రావెల కిశోర్బాబు తెలిపారు. శుక్రవారం ఆయన సభ ఏర్పాట్లను పరిశీలించారు. పవన్కల్యాణ్ ఈ సభలో పాల్గొంటారన్నారు. -
లాఠీఛార్జ్ని ఖండించిన వైఎస్ జగన్
-
లాఠీఛార్జ్ని ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు, విభజన హామీలు నెరవేర్చాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. వామపక్ష పార్టీల నాయకులతో పాటు, పలు విద్యార్థి సంఘాల నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో ధర్నా చేసిన ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జ్, అరెస్టులను ఆయన ఖండించారు. ఢిల్లీలో ఉన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఉద్యమ కారులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ తెలిపారు. -
వామపక్షాలతో తప్ప ఎవరితోనూ కలిసి వెళ్లం
-
కడపలో వామపక్షాల బంద్
-
సర్కారు తీరుకు నిరసనగా వామపక్షాల బంద్
-
విజయవాడలో తొమ్మిది లెఫ్ట్ పార్టీల సమావేశం
-
అవకాశం కోల్పోయాం...‘అధ్యక్షా’!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ చవిచూడని పరిస్థితి ఈ మారు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు చవిచూశాయి. గత 66 ఏళ్ల చరిత్రలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క సభ్యుడినైనా చట్టసభకు పంపుకోలేని దుస్థితిలో అవి పడ్డాయి.దీంతో తొలిసారిగా వామపక్షపార్టీల గళం వినిపించని కొత్త శాసనసభ ఏర్పడబోతోంది. 2014లో జరిగిన ఏపీ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టుపార్టీలు ఖాతా తెరవకపోవడంతో ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల శాసనసభల్లో ఈ పార్టీలకు ఉనికి లేకుండా పోయింది. పొత్తుల ఎత్తుల్లో ఏదోలా లబ్ధి... వామ పక్షాలు మారిన రాజకీయ ఎత్తుగడలకు అనుగుణంగా వివిధ పార్టీలతో పొత్తులు కుదుర్చుకొని ఎన్నికలకు దిగినప్పుడు కాస్తా లాభపడ్డాయి. ఒకసారి టీడీపీతో మరోసారి కాంగ్రెస్తో, ఇంకోమారు టీడీపీ, టీఆర్ఎస్లతో ఇలా రాష్ట్రంలో ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీతో ఉభయ కమ్యూనిస్టుపార్టీలు గతంలో పొత్తులు కుదుర్చుకున్నాయి. అందుకు భిన్నంగా ఈ సారి తెలంగాణలో సీపీఐ ఏకంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్లతో సీట్ల సర్దుబాటు చేసుకుంది. సీపీఎం మాత్రం విడిగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్తో కలిసి పోటీచేయడం ద్వారా రాష్ట్రంలో కొత్త ప్రయోగానికి తెరతీయాలని ప్రయత్నించింది. 1983 నుంచి మారిన పరిస్థితి... 1983 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టుపార్టీలతో టీడీపీ సీట్ల సర్దుబాటు ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో 28చోట్ల పోటీచేసిన సీపీఎం ఐదుచోట్ల, 48 స్థానాల్లో పోటీచేసిన సీపీఐ నాలుగుస్థానాల్లో గెలిచాయి. 1985 మధ్యంతర ఎన్నికల్లో సీపీఐ,సీపీఎం, మరోవైపు జనతాపార్టీ, బీజేపీలతో టీడీపీ పొత్తు కుదుర్చుకుంది. ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు చెరో 11 స్థానాలు దక్కించుకున్నాయి. 1989లో టీడీపీ పొత్తుతో సీపీఎం ఆరు, సీపీఐ ఐదు సీట్లలో గెలుపొందాయి. 1994లో టీడీపీతో పొత్తులో సీపీఐ 19, సీపీఎం 15 సీట్లు గెలిచాయి. 1999లో ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీచేసినపుడు సీపీఎంకు రెండుసీట్లు దక్కగా సీపీఐకి ఒక్కసీటుకూడా రాలేదు. మళ్లీ 2004లో కాంగ్రెస్తో పొత్తులో సీపీఎం 9, సీపీఐ 6 స్థానాల్లో గెలిచాయి. మళ్లీ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు కుదుర్చుకున్నపుడు సీపీఐ 4 స్థానాలు, సీపీఎం ఒక సీటు గెలిచాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో వామపక్షాలు చెరోస్థానానికే పరిమితమయ్యాయి. -
వామపక్షాల ఐక్యతతోనే మతోన్మాద అంతం
సాక్షి, హైదరాబాద్: వామపక్షాల ఐక్యతతోనే మతోన్మాదాన్ని అంతం చేయగలమని ఎంసీపీఐ(యు) అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఎం.డి.గౌస్ అన్నారు. ఎంసీపీఐ–ఆర్ఎంపీఐ పార్టీల ఐక్యత సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ‘వర్తమాన రాజకీయాలు– వామపక్షపార్టీల ఐక్యత అవకాశాలు’పై సదస్సు జరిగింది. సదస్సులో ఆర్ఎంపీఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మంగత్రాం పాస్లా, చైర్మన్ గంగాధరన్ తదితరులు పాల్గొని మాట్లాడారు. గౌస్ మాట్లాడుతూ.. మత స్వేచ్ఛను హరించివేయడం, పౌరహక్కులను అణచివేయడం, ప్రజల ఆహార అలవాట్లు, ఆచార వ్యవహారాలపైనా ఆంక్షలు విధించడం వంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలనే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోందని ఈ 2 పార్టీలనుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం వామపక్షపార్టీలపై ఉందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన బహుజన లెఫ్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) కారుచీకటిలో కాంతిరేఖ వంటిదన్నారు. కాంగ్రెస్, బీజేపీ,టీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా వామపక్షా లు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఎంసీపీఐ–ఆర్ఎమ్పీఐ ముఖ్యనేతలు కిరణ్జిత్, నారాయణన్, మద్దికాయల అశోక్, అనుభవదాస్ శాస్త్రి, కాటం నాగభూషణం, వనం సుధాకర్, హర్కమల్లు పాల్గొన్నారు. -
వామపక్షాలపై నమ్మకం పోయింది: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ప్రధాన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంతో కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడిందని దీంతో వామపక్షాలపై ప్రజలకు నమ్మకం పోయిం దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్ విధానాలు ఒకటేనని అందుకే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)గా ప్రజల ముందుకు సీపీఎం వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో సీపీఎం 20 నుంచి 25 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. మిగతా స్థానాల్లో బీఎల్ఎఫ్ అభ్య ర్థులు పోటీలో ఉంటారన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో 14 కులదురహంకార హత్యలు జరిగాయని, ఈ హత్యలను టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ కులదురహం కార హత్యలపై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, నాయిని ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఈ హత్యలకు నిరసనగా ఈ నెల 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ప్రణయ్ హత్య లో ఆరోపణలెదుర్కొంటున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇతర రాజకీయనేతల పాత్రపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న 20నుంచి 25 మందితో బీఎల్ఎఫ్ మొదటి జాబితాను ప్రకటిస్తామన్నారు. -
రైతుల పోరుపై ఉక్కుపాదం
తుళ్లూరు రూరల్/సాక్షి, అమరావతి: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం రాజధాని ప్రాంత రైతులు సోమవారం తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ చెక్పాయింట్లు ఏర్పాటుచేసి.. భారీఎత్తున మొహరించిన పోలీసులు రైతులను, నాయకులను అదుపులోకి తీసుకుని ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. అంతకుముందు.. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు రైతులు, లంక భూముల సొసైటీల అధ్యక్షులకు నోటీసులు ఇచ్చి నిర్బంధకాండ కొనసాగించారు. తుళ్లూరు మండలాన్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆందోళనకు తరలివచ్చే అవకాశం ఉన్న రైతులందరినీ రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు. చలో అసెంబ్లీకి రావద్దని.. అలాగే పెద్ద నాయకులందరూ ఇంటికే పరిమితం కావాలని హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు.. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సచివాలయం చుట్టూ ఆరు చెక్ పాయింట్లు పెట్టారు. మల్కాపురం మలుపు వద్ద మందడం జెడ్పీ ఉన్నత పాఠశాల వెనుక నుంచి సచివాలయానికి చేరుకునే ప్రధాన రహదారిపై ఒకేచోట మూడు చెక్ పాయింట్లు ఏర్పాటుచేశారు. వేర్వేరుచోట్ల నేతలు అదుపులోకి.. ఇదిలా ఉంటే.. ‘చలో అసెంబ్లీ’కి రైతులందరూ తరలివస్తున్నారని భావించిన వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన, కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. వీరందరినీ వేర్వేరు చోట్ల పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11గంటలకు సీపీఐకి చెందిన మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, సీఆర్డీయే ఏఐటీయూసీ కార్యదర్శి జీవీ రాజు, సీపీఎం సీఆర్డీయే కార్యదర్శి ఎం. రవి, జిల్లా రైతు విభాగం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్లను మందడంలో అదుపులోకి తీసుకున్నారు. ఐనవోలు వద్ద లింగాయపాలేనికి చెందిన రైతు నాయకుడు అనుమోలు గాంధీతోపాటు మరో న్యాయవాదిని 11.30గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో బాపట్ల వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్తోపాటు పార్టీ తుళ్లూరు మండల నేత చలివేంద్రం సురేష్ను మందడంలో అరెస్టుచేసి పెదకూరపాడు పోలీసుస్టేషన్కు తరలించారు. అలాగే, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు శృంగారపాటి సందీప్, లంక రైతు పులి ప్రకాష్లను తెల్లవారుజామున 6 గంటలకు అదుపులోకి తీసుకుని తుళ్లూరు స్టేషన్కు తరలించారు. తాడికొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చిలకా విజయ్ను ఉ.6గంటలకు గృహనిర్బంధం చేశారు. వెంకటపాలెంలో జనసేన నేతలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరందరినీ సాయంత్రం అయిదు గంటలకు విడుదల చేశారు. తుళ్లూరు పోలీసుస్టేషన్లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, రాజధాని రైతులను తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టీనా పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. రైతుల డిమాండ్లు ఇవీ.. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో ఎక్కువ శాతం భూములు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ అసైన్డ్, లంక భూములను సాగుచేసుకుంటున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని రైతుల ప్రధాన ఆరోపణ. లింగాయపాలెం, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో లంక భూములు దాదాపు 1600 ఎకరాల వరకు ఉంటాయి. ఈ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు చట్ట ప్రకారం ప్యాకేజ్ ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా అధికారులకు, మంత్రులకు తమ సమస్యలను విన్నవించినా ఫలితం లేకపోవడంతో చివరి అస్త్రంగా రైతులు సోమవారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జరీబు ప్యాకేజీ ఇవ్వాలి : వైఎస్సార్సీపీ ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత నందిగం సురేశ్ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో దళితులకు అన్యాయం జరుగుతోందని, ప్యాకేజీ విషయంలో వివక్ష ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. రాజధానిలో 29 గ్రామాల్లో సాగు చేసుకునే ఐదు వేల ఎకరాల భూములను జీవో నంబర్ 259 ప్రకారం మాత్రమే తీసుకోవాలని, అందరికీ జరీబు ప్యాకేజ్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోతున్న వారికి తగిన పరిహారాన్ని అందజేయాలన్నారు. అక్రమ అరెస్టులపై వామపక్షాల ఖండన రాజధాని ప్రాంతంలో శాంతియుతంగా ఆందోళన చేయడానికి ప్రయత్నించిన వారిని అక్రమంగా అదుపులోకి.. అరెస్టులు చేయడాన్ని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి. మధు, కె. రామకృష్ణ సోమవారం ఖండించారు. అసైన్డ్ రైతులను, వారికి సంఘీభావంగా వెళ్లిన వివిధ పార్టీల నాయకులను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టించారని పేర్కొన్నారు. అసైన్డ్, లంక భూముల రైతులకు ఇతర రైతులతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు సామాజిక పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. -
‘మహా కూటమి’కి ఓకే
సాక్షి, హైదరాబాద్: ‘మహాకూటమి’ఏర్పాటుకు లైన్క్లియర్ అయింది. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి, కేసీఆర్ను గద్దెదింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా మరో అడుగు పడింది. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా కలసి పనిచేయాలని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నిర్ణయించాయి. ఈ మేరకు మంగళవారం పార్క్ హయత్ హోటల్లో జరిగిన మూడు పార్టీల సమావేశంలో అంగీకారం కుదిరింది. కాంగ్రెస్ నుంచి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, గూడూరు నారాయణరెడ్డి, టీడీపీ నుంచి ఎల్.రమణ, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు ఈ సమావేశానికి హాజరై ఎన్నికల పొత్తుల గురించి చర్చించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని కేసీఆర్ సాగిస్తున్న అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలంటే భావసారూప్యం ఉన్న పార్టీలూ కలసి పనిచేయాల్సిందేనని నేతలు అభిప్రాయపడ్డారు. సబ్బండ వర్ణాల ఆకాంక్షలను ఫణంగా పెట్టి కేసీఆర్ సాగించిన పాలన అన్ని వర్గాల్లో అసంతృప్తిని మిగిల్చిందని, ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా అబద్ధాలతో అరాచక పాలన సాగించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ను గద్దెదింపాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడిగా ముందుకెళ్లాలని, కలసి వచ్చే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో చర్చలు జరిపి కూటమిలో చేర్చుకోవాలని నిర్ణయించారు. పొత్తు ప్రాతిపదికలపై చర్చ... మూడు పార్టీల నేతల సమావేశంలో భాగంగా మహాకూటమిలోకి వచ్చే పార్టీల మధ్య పొత్తు కుదుర్చుకోవాల్సిన ప్రాతిపదికలపై చర్చించారు. ఎక్కడా భేషజాలకు పోకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది ముఖ్యం కాదని, గెలిచే స్థానాల్లో పోటీచే యడంపైనే దృష్టి పెట్టి కసరత్తు చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. అన్ని పార్టీలు, ప్రజాసంఘాలతో చర్చలు పూర్తయి విశాల వేదిక ఏర్పాటయిన తర్వాతే సీట్ల పంపకాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. కూటమి ఏర్పాటు చేసిన అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని, ఆ సభ నుంచే ఎన్నికల శంఖారావం పూరించాలని నేతలు అభిప్రాయపడ్డారు. యూపీఏ తరహాలో.. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయి ఫార్ములాతో మహాకూటమి ముందుకెళ్లనుంది. 2004 సార్వత్రిక ఎన్నికల అనంతరం యూపీఏ భాగస్వామ్య పక్షాల తరఫున ‘కనీస ఉమ్మడి ప్రణాళిక’ తయారు చేయగా, ఈసారి ఎన్నికలకు ముందే రాష్ట్రంలోని మహాకూటమి పక్షాన ఈ కనీస ఉమ్మడి ప్రణాళికను ప్రజల ముందుపెట్టాలని నిర్ణయించారు. కూటమిలోని అన్ని పక్షాలు తమ తమ పార్టీల మేనిఫెస్టోలను ప్రజల ముందు పెట్టాలని, వాటిల్లోని ప్రధాన అంశాలతో కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపొందించాలని నిర్ణయించారు. ఈ కనీస ఉమ్మడి ప్రణాళిక ద్వారా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై ప్రజల్లో భరోసా కల్పించాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఉద్యమ సందర్భంలో కేసీఆర్ చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చాక ఎలా ఉల్లంఘించారో ఎత్తిచూపాలని నిర్ణయించారు. టీజేఎస్, సీపీఎంలతోనూ చర్చలు... కూటమిలోకి ఈ మూడు పార్టీలతో పాటు తెలంగాణ జన సమితి, సీపీఎంను కూడా ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మూడు పార్టీలతో కలసి మాట్లాడేందుకు సమయమివ్వాలని కోరుతూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో నేడు టీజేఎస్తో మూడు పార్టీల నేతలు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీపీఎం కూడా కూటమిలో భాగస్వామి కావాలని అభిప్రాయపడ్డ నేతలు ఆ పార్టీ కేంద్ర కమిటీతో కూడా సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. కేసీఆర్ను గద్దె దింపడమే లక్ష్యం: ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ‘రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గపు పాలన చేస్తున్నారు. కేసీఆర్ను గద్దె దింపడం కోసం అన్ని ప్రతిపక్షాలను కలుపుకుని ఎన్నికలకు వెళ్తాం. ఇది మొదటి సమావేశం మాత్రమే. భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ, నిరుద్యోగ, మహిళ సంఘాలతో కలసి చర్చిస్తాం. వారిని కూడా కలుపుకుని ఎన్నికలకు వెళ్తాం.’ ప్రజల కోసమే ప్రతిపక్షలన్నీ కలుస్తున్నాయి: ఎల్.రమణ ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ ఆదరబాదరగా రద్దు చేశారు. దేశంలో ఆదర్శంగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో చర్చలు జరపకుండా నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, లెఫ్ట్ పార్టీలు కలసి మహా కూటమిగా ముందుకెళతాం. రాష్ట్ర ప్రజల కోసమే ప్రతిపక్షాలన్నీ కలుస్తున్నాం.’ అందరం కలిసే ముందుకు..: చాడ వెంకటరెడ్డి ‘కేసీఆర్ ప్రజాస్వామ్య విలువలను మట్టిలో కలిపారు. పార్టీ పిరాయింపులను ప్రోత్సహించి విలువలను తుంగలో తొక్కారు. ప్రతిపక్ష పార్టీలందరం కలసి ఎన్నికలకు వెళ్తాం. కేసీఆర్ని గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తాం.’ -
గెర్దావ్ ఫ్యాక్టరీ ఘటనకు జేసీ నైతిక బాధ్యత వహించాలి
-
అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం : జిల్లాలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. తాడిపత్రి గెర్దావ్ ఫ్యాక్టరీ ఘటనకు జేసీ నైతిక బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు రూ. 25లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితులు చేయిదాటిపోయే అవకాశం ఉండటంతో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో వామపక్షాలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. -
చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి
-
పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి
సాక్షి, విజయవాడ : భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ వామపక్ష పార్టీలు శనివారం ఆంధ్రప్రదేశ్ అంతటా ఆందోళనలు నిర్వహించాయి. విజయవాడలో సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధు ఈ ఆందోళనలకు నేతృత్వం వహించారు. నగరంలోని పాతబస్టాండ్లో వామపక్ష శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి.. సామాన్యులకు ఉపశమనం కల్పించాలని ఈ సందర్భంగా వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని నేతలు మధు, రామకృష్ణలతోపాటు పార్టీ శ్రేణులు బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆందోళన.. గుంటూరు : పెట్రోలు ధరలు తగ్గించాలంటూ కమ్యూనిస్టులు గుంటూరులో ఆందోళన నిర్వహించారు. శంకర్ విలాస్ సెంటర్లో సీపీఐ, సీపీఎం కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. అనంతపురం : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద వామపక్షాల నేతలు రాస్తారోకో నిర్వహించారు. నెల్లూరు : పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రకాశం జిల్ లా: మార్కాపురం కోర్టు సెంటర్ వద్ద వామపక్షాలు, ఇతర పార్టీల రాస్తారోకో, ఒంగోలు పట్టణంలో వామపక్షాల ఆందోళన కర్నూలు : పట్టణంలోని కలెక్టరేట్ వద్ద వామపక్షాలు ఆందోళన. పశ్చిమ గోదావరి : వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో తణుకు నరేంద్ర సెంటర్ వద్ద రాస్తారాకో.. పాల్గొన్న వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు. విజయనగరం : పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలంటూ పట్టణంలోని మయూరి జంక్షన్లో వామపక్షాల రాస్తారోకో -
‘లెఫ్ట్’రైట్!
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఒకప్పుడు ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టుల ఖిల్లా..అనే స్థాయి నుంచి నేడు ఆయా పార్టీలు రాజకీయంగా తమ ఉనికిని చాటుకోవాల్సిన కష్టకాలంలో కొనసాగుతున్నాయి. ఉద్యమాల గుమ్మంగా పేరొందిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అనుసరించే వ్యూహంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఖమ్మంజిల్లా కమ్యూనిస్టు పార్టీలకు పెట్టని కోటగా ఒకప్పుడు ఉన్నా.. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో సంభవించిన పరిణామాల నేపథ్యంలో జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు ఏటికి ఎదురీదాల్సిన గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో ఉభయ కమ్యూనిస్టుల సహకారం లేకుండా ఏ రాజకీయ పార్టీ గెలిచే పరిస్థితి లేదన్న నానుడి ఉండేది. గత కొద్ది సంవత్సరాలుగా జరిగిన ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలు విడివిడిగా పోటీ చేయడం, గత ఎన్నికల సమయంలో రెండు పార్టీ్టలు వేర్వేరు రాజకీయ పక్షాలకు మద్దతుగా నిలవడంతో ఈసారి అనుసరించనున్న వ్యూహం ఏమిటన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సీపీఐ, సీపీఎంలు గతంలో బలంగా ఉండడమే గాక.. రెండు, మూడు నియోజకవర్గాల్లో తమ పట్టును నిరూపించుకోవడంతో పాటు రాజకీయంగా మైత్రి కొనసాగించిన టీడీపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు వెన్నుదన్నుగా నిలిచాయి. ఆయా నియోజకవర్గాల్లో గెలుపొందేందుకు కీలకంగా వ్యవహరించాయన్న గుర్తింపు, పేరు ఉండేది. ప్రాబల్యం ఇలా పడిపోయే.. 2009, 2014లో జరిగిన లోక్సభ, శాసనసభ ఎన్నికల నుంచి కమ్యూనిస్టుల ప్రాబల్యం క్రమేణా తగ్గుతూ వచ్చింది. 2009 శాసనసభ ఎన్నికల్లో ఖమ్మంజిల్లాలోని పది నియోజకవర్గాల్లో టీడీపీ, టీఆర్ఎస్లతో కలిసి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల మైత్రి కొనసాగించాయి. జిల్లాలో సీపీఎం ఒక్క స్థానం కూడా గెలుపొందకపోగా, సీపీఐ కొత్తగూడెం, వైరా నియోజకవర్గాల్లో, ఇల్లెందు, ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాలతోపాటు ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల్లో ఉభయ కమ్యూనిస్టుల మద్దతుతో టీడీపీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ భద్రాచలం, మధిర, పాలేరు, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2009లో టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేసినా, ఆ తర్వాత టీడీపీ, టీఆర్ఎస్లకు దూరంగా ఉంటూ, 2014 ఎన్నికల నాటికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఖమ్మం జిల్లాలో విడివిడిగా పోటీ చేశాయి.సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో 2014 ఎన్నికల్లో జత కట్టగా, సీపీఐ కాంగ్రెస్పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకుం ది. దీంతో ఈ ఎన్నికల్లో సీపీఐ కొత్తగూడెం, పినపాక, వైరా నియోజకవర్గాల్లో పోటీ చేయగా, కాంగ్రెస్ మధిర, పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేటలో పోటీ చేసింది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సీపీఎం ఎన్నికల పొత్తు పెట్టుకుని మధిర, పాలేరు, భద్రాచలం నియోజకవర్గాల్లో పోటీ చేయగా, మిగిలిన నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరచింది. పినపాక, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాలతోపాటు ఖమ్మం లోక్సభ నియోజకవర్గాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీపీఎం మద్దతుతో గెలుచుకుంది. సీపీఎం మాత్రం గత శాసనసభ ఎన్నికల్లో కేవలం భద్రాచలం శాసనసభ నియోజకవర్గంలో మాత్రమే విజయం సా ధించింది. సీపీఐ..కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన వైరా, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఓటమి పొందడంతో గత శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆపార్టీకి ప్రాతిని«ధ్యం లేకుండా పోయింది. 2009 ఎన్నికల్లో జిల్లాలో సీపీఎంకు స్థానం లేకపోగా..2014 ఎన్నికల్లో సీపీఐ జిల్లాలో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. మారని రాజకీయ పంథా.. 2014 ఎన్నికల అనంతరం జిల్లాలో సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సమస్యల ప్రా తిపదికన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఐక్య పోరా టాలు చేస్తున్నప్పటికీ రాజకీయ పం«థా మాత్రం ఎవరికి వారు అనుసరిస్తున్నారు. సీపీఎం రాష్ట్రవ్యాప్తంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో ప్రజాసంఘాలు, కొన్ని పార్టీలతో కలిసి ఫ్రంట్గా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం అవుతోంది. సీపీఎం వచ్చే ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వదని, స్వతంత్రంగానే ఫ్రంట్ పేరుతో పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నా..ఎన్నికల నాటికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఇప్పుడే చెప్పలేమంటూ మరికొందరు సీపీఎం నాయకులు అభిప్రాయపడుతున్నారు. సీపీఐ జిల్లాలో 2009 లో గెలిచిన రెండు స్థానాలతోపాటు 2014లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేసిన పినపాక నియోజకవర్గంలో తమ ప్రాబల్యాన్ని చాటేందుకు వ్యూహప్రతివ్యూహాలను రూపొందిస్తోంది. సీపీ ఎం 2014లో గెలుచుకున్న భద్రాచలంతోపాటు గతంలో గెలుపొందిన మధిర, పాలేరు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి విజయం కోసం వ్యూహాలను రచిస్తోంది. పొత్తులపై ఏం జరిగేనో..? సీపీఐ..కాంగ్రెస్ పార్టీతో మళ్లీ ఎన్నికల పొత్తు ఉంటుందా..? ఒంటరిగానే పోటీ చేస్తుందా..? అన్న అంశం కాంగ్రెస్, సీపీఐ వర్గాల్లో ఉత్కంఠతను రేపుతోంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత వైరా నియోజకవర్గంలో ఒకసారి సీపీఐ, మరోసారి వైఎస్సార్సీపీ విజయం సాధించాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు గత ఎన్నికల్లో చెరొక రాజకీయ పార్టీకి మద్దతునివ్వడం, ఈసారి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల పొత్తు పెట్టుకుంటాయా..? తమతో కలిసి వచ్చే రాజకీయ పక్షాలకు వేర్వేరుగా మద్దతునిస్తాయా..? అన్న అంశం చర్చనీయాంశంగా మారి ంది. జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్పార్టీలు బలం గా ఉండగా..ఆయా పార్టీలకు దీటుగా కమ్యూనిస్టు పార్టీలు సైతం ప్రజా సమస్యల పరిష్కారం పేరుతో నిరంతరం వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కమ్యూనిస్టులు ఐక్యంగా ఉన్నప్పుడు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకోగా, ఇప్పుడు విడివిడిగా పోటీ చేస్తే ఆయా పార్టీలకు పునర్వైభవం లభించడం ఎంతమేరకు సాధ్యమవుతుందన్న అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు సమయం ఉన్నందున ప్రజా ఉద్యమాలు నిర్వహించడం తప్ప ఎన్నికల పొత్తుపై ఇప్పటినుంచే ఊహాగానాలు చేయడం సమంజసం కాదని అంటున్నాయి. -
మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి ఆయన!
విజయవాడ: మార్పు మార్పు అంటూ కేవలం వాఖ్యలు చేయడమే కాకుండా మార్పు కోసం కృషి చేసిన వ్యక్తి కారల్ మార్క్స్ అని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. ఏళ్లు గడిచే కొద్ది మార్క్స్ సిద్ధాంతాలపై ఆదరణ పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ..ఇటీవల మార్క్సిజంపై యువత ఆసక్తి చూపిస్తున్నారన్నారు. మనుషుల మధ్య అసమానతలు తొలగించడానికి మార్క్స్ కృషి చేశారన్నారు. అందుకే మార్క్స్ని ప్రపంచం గుర్తుపెట్టుకుందని పేర్కొన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరగడంతో యువతలో ఆగ్రహం పెరిగిందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించేందుకు మార్క్సిజంలో దారులు వెతుకుతున్నారని అభిప్రాయపడ్డారు. మార్క్స్ చెప్పినట్టు పెట్టుబడిదారీ వ్యవస్థలో వైవిధ్యం వచ్చిందని, ఇదే కొనసాగితే సంక్షోభం తప్పదని హెచ్చరించారు. సోషలిజం వల్లే రాజ్యం అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. భారతదేశం సూపర్ పవర్ కావాలంటే కుల వ్యవస్థ పోవాలని రాఘవులు పేర్కొన్నారు. వామపక్షాలకు మంచి రోజులొస్తాయి: మధు మన రాష్ట్రంలో బలంగా ఉన్న కమ్యూనిస్టు ఉద్యమాల పరిస్థితి ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని అందరూ అంటున్నారు. రానున్న రోజుల్లో తమకు మంచి రోజులు వస్తాయని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను యువత వ్యతిరేకిస్తుందని వ్యాఖ్యానించారు. ఓట్లు, సీట్లు లేవన్న చోటే వామపక్షాల ఉద్యమాలు బలపడుతున్నాయని మధు పేర్కొన్నారు. -
ఏపీ బంద్ సంపూర్ణం
సాక్షి, నెట్వర్క్/అమరావతి: టీడీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించినా.. నోటీసులిచ్చి బెదిరించినా.. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసినా కూడా ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా సోమవారం చేపట్టిన రాష్ట్ర బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. రాష్ట్ర సర్కార్ బెదిరింపులను సైతం ధిక్కరించి ఒక్కటైన జనం ప్రత్యేక హోదా కోసం దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, జనసేనతో పాటు ప్రజా, విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా హోదా కోసం కదంతొక్కాయి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ప్రజా సంకల్ప యాత్రకు విరామం ఇచ్చి బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, బైక్ ర్యాలీలతో రాష్ట్రం దద్దరిల్లింది. హోదా నినాదంతో హోరెత్తింది. ఆందోళనకారులు ధర్నాలకు దిగడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు బ్యాంకులు, సినిమా హాళ్లు కూడా మూతబడ్డాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఆందోళనకు దిగడంతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. హోదా సాధించే వరకూ విశ్రమించబోమని ఆందోళనకారులు ప్రతినబూనారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. స్వల్ప ఘటనలు మినహా అన్ని జిల్లాల్లోనూ బంద్ ప్రశాంతంగా జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు తదితర జిల్లాల్లో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో ఆందోళన నిర్వహిస్తున్న ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ, వైఎస్సార్సీపీ నేతలు వంగవీటి, యలమంచిలి రవి తదితరులు ఉనికి కోసం టీడీపీ నాటకాలు.. బంద్కు మద్దతివ్వని టీడీపీ.. మరోవైపు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో మాత్రం పోటీ ర్యాలీ నిర్వహించింది. బస్టాండ్ సెంటర్లో ఇరుపక్షాలు ఎదురవ్వడంతో ఉద్రిక్తత తలెత్తింది. వివిధ సంఘాలు, పక్షాలు చేస్తున్న ఆందోళనలో కలవకుండా.. కేవలం ఉనికి కోసమే టీడీపీ ఈ విధంగా నాటకాలు ఆడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టే ప్రత్యేక హోదాపై చంద్రబాబుకున్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమౌతోందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. వేకువజాము నుంచి తాము బంద్ నిర్వహిస్తుంటే.. అధికార పార్టీ నాయకులు ఈ విధంగా అడ్డు తగలడం ఎంతవరకు సబబు అని విపక్ష నాయకులు ప్రశ్నించారు. ఒకవైపు హోదా కోసం రాజీ లేని పోరాటం చేస్తానంటూనే.. మరోవైపు ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆంక్షలు విధించడం, నిరసనకారులను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. హోదా కోసం రోడ్డెక్కిన జనం.. ప్రత్యేక హోదా కోసం కృష్ణా జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన గళం వినిపించారు. ప్రత్యేక హోదా సాధన సమితితో పాటు వైఎస్సార్సీపీ, వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన, ప్రజా, పాత్రికేయ సంఘాలు, న్యాయవాదులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకే విజయవాడ ప్రధాన బస్టాండ్ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నేతలు పార్థసారథి, మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పి.మధు, రామకృష్ణ ధర్నాకు దిగి బస్సులను అడ్డుకున్నారు. నగరంలోని బెంజ్సర్కిల్ వద్ద లారీ ఓనర్స్ అసోసియేషన్ ర్యాలీ చేపట్టింది. జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను రిక్షా తొక్కి నిరసన తెలిపారు. మచిలీపట్నంలో ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ నేత పేర్ని నానిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీయూడబ్ల్యూజే బంద్కు మద్దతు ప్రకటించడంతో పలువురు జర్నలిస్టులు నిరసనల్లో పాల్గొన్నారు. ఇక ప్రత్యేక హోదా నినాదాలతో గుంటూరు జిల్లా మార్మోగింది. తాడికొండలో వైఎస్సార్సీపీ నేతలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. సత్తెనపల్లిలో రోడ్డుపైనే వంటావార్పు చేశారు. ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు నేతలు మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున తదితరుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. సంక్షేమ శాఖల కార్యాలయాలు మూతపడ్డాయి. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు తలకిందులుగా నిరసన వ్యక్తం చేయగా.. ఏఐఎస్ఎఫ్ నేతలు మోదీ కేడీ పేరుతో కబడ్డీ ఆడారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు దీక్షలో కూర్చున్నారు. సంతనూతలపాడులో రోడ్డుపైనే వంటావార్పు చేపట్టి అన్నదానం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి, నేతలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, మేరిగ మురళీధర్, ద్వారకానాథ్ తదితరులు ర్యాలీలు, ధర్నాలు చేపట్టి నిరసన తెలియజేశారు. ప్రత్యేక హోదా మా హక్కు అని నినదిస్తూ నెల్లూరు నగరంలో భారీ ౖబైక్ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీసులతో అణిచివేసేందుకు యత్నం.. తూర్పు గోదావరి జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోగా.. విద్యా, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. బంద్ కారణంగా నన్నయ, జేఎన్టీయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. కాకినాడలో కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఎమ్మెల్సీ పిల్లి సుభాశ్ చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మీ, పినిపే విశ్వరూప్, మోషేన్ రాజు, కందుల దుర్గేష్ నేతృత్వంలో నిరసనలు మిన్నంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆందోళనకారులు కదంతొక్కారు. ఏలూరులో ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. నరసాపురంలోని జాతీయ రహదారిపై ముదునూరి ప్రసాదరాజు తదితరులు రాస్తారోకో చేపట్టి హోదా గళాన్ని వినిపించారు. గోపాలపురంలో హైవేపై బైఠాయించిన ఆందోళనకారులు వాహన రాకపోకలను అడ్డుకున్నారు. పాలకొల్లులో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. నేతలు తెల్లం బాలరాజు, మేకా శేషుబాబు తదితరులు ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో ప్రజలు పాల్గొని సంఘీభావం తెలిపారు. విశాఖ జిల్లాలోని ఏయూ పరిధిలో జరగాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేశారు. మద్దిలపాలెం జంక్షన్లో వామపక్షాల నాయకులతో కలిసి వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. నక్కపల్లి జాతీయ రహదారిపై అఖిలపక్ష నాయకులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. చోడవరంలో వందలాది మంది విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో రాస్తారోకో నిర్వహించిన వైఎస్సార్సీపీ, వామపక్ష, జనసేన పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళంలో ఆదివారం రాత్రి పలువురిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి బైండోవర్ కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో నిరసనకారులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయించి హోదా నినాదాలు చేశారు. చిలకపాలెంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యేలు కళావతి, కంబాలో జోగులు, నేతలు ధర్మాన కృష్ణదాస్ తదితరులు రోడ్లపై ధర్నాలకు దిగారు. విజయనగరం జిల్లాలో పోలీసులు వైఎస్సార్సీపీ, సీపీఎం నేతలు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనల్లో ఎమ్మెల్సీ వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్ప శ్రీ వాణి తదితరులు పాల్గొన్నారు. విశాఖలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వివిధ పార్టీలు, సంఘాల నేతలు రాస్తారోకోలు.. పిండప్రదానాలు చిత్తూరు జిల్లా తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తిలో పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1,400 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తిరుపతిలో బంద్ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు ఓ బైక్కు నిప్పు పెట్టగా.. దీన్ని సాకుగా తీసుకొని నలుగురు వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట వామపక్షాలు మోదీ శవయాత్ర చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రగిరిలో ఆందోళనకారులను పోలీసులు స్టేషన్కు తరలించారు. నిరసనల్లో వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి, సీపీఐ, సీపీఎం నేతలు రామానాయుడు, కుమార్రెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం క్లాక్ టవర్ వద్ద పది తలల మోదీ దిష్టిబొమ్మను బాణాలతో కాల్చారు. పార్లమెంట్ మెట్ల మీద ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని నేతలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి దుయ్యబట్టారు. వైఎస్సార్ జిల్లా కడపలో వైఎస్సార్సీపీ నేత కె.సురేష్బాబు ఆధ్వర్యంలో శ్రేణులు ఆర్టీసీ బస్టాండుకు చేరుకుని ధర్నాకు దిగాయి. బస్టాండ్ ఆవరణలో క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే అంజద్బాష బైక్పై కడప నగరంలో తిరుగుతూ బంద్ను పర్యవేక్షించారు. కృష్ణాపురం, రాయచోటి రింగ్రోడ్డు వద్ద ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. దీంతో చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రధాని మోదీకి పిండ ప్రదానం చేశారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. బద్వేలులోని నాలుగు రోడ్ల కూడలిలో వంటావార్పుతో పాటు కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. ఆందోళనల్లో నేతలు ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, సుధీర్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన నిరసనలతో ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బస్సులు నిలిచిపోయాయి. ప్రజలు బంద్కు పూర్తి స్థాయిలో సహకరించడంతో ఆటోలు కూడా తిరగలేదు. రాయలసీమ వర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఎమ్మిగనూరులో భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని మంత్రాలయ రాఘవేంద్ర స్వామి విగ్రహానికి నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, జయరాం, ఐజయ్య, నేతలు బీవై రామయ్య, హఫీజ్ఖాన్, కంగాటి శ్రీదేవి, శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డి, గంగుల బిజేంద్ర, వామపక్షాల నేతలు ఎంఏ గఫూర్, కె.ప్రభాకర్, గిడ్డయ్య తదితరులు ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి హోదా ఆవశ్యకతను తెలియజేశారు. శిబిరం నుంచే బంద్ను పర్యవేక్షించిన వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా సాధన కోసం చేస్తున్న ఆందోళనలో భాగంగా సోమవారం జరిగిన రాష్ట్ర బంద్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన శిబిరం నుంచే పర్యవేక్షించారు. ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ బంద్ సందర్భంగా తన పాదయాత్రకు విరామం ప్రకటించి కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం ముత్యాలంపాడు క్రాస్ వద్ద బస చేశారు. వైఎస్సార్సీపీ, ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు, జనసేన, లోక్సత్తా, ఇతర ప్రజా సంఘాలు ఈ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంద్ జరిగిన తీరును జగన్ గంట గంటకూ స్వయంగా పర్యవేక్షించారు. ఆయా జిల్లాల పార్టీ నాయకులతో ఫోన్లో మాట్లాడి బంద్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా బంద్ జరిగేలా పలు సూచనలు చేశారు. పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బంద్లో ప్రత్యక్షంగా పాల్గొని జయప్రదం చేసేలా చూడాలని కోరారు. అనంతరం బంద్ను జయప్రదం చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, వ్యాపార, వాణిజ్య వర్గాలకు వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
వామపక్షాలు బలపడితేనే పేదరికం అంతం
సాక్షి, హైదరాబాద్ : వామపక్షాలు దేశవ్యాప్తంగా బలోపేతమైతేనే పేదరికం అంతమవుతుందని, నిరుద్యోగం పోతుందని సీపీఐ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. ఆ పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ కల్యాణమండపంలో సోమవారం రెండోరోజు జరిగిన సమావేశాలను సీపీఐ సీనియర్ నాయకుడు జి.యాదగిరిరెడ్డి పార్టీ జెండా ఎగురవేసి ప్రారంభించారు. అమరవీరుల స్మారకస్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ మహాసభలకు సౌహార్ద ప్రతినిధులుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆర్ఎస్పీ నేత సురేందర్రెడ్డి హాజరయ్యారు. సురవరం మాట్లాడుతూ దేశంలో 71 శాతం సంపద కేవలం ఒక శాతం మంది సంపన్నుల వద్దే కేంద్రీకృతమైందన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ, అంబానీల ఆస్తులు 80 శాతం పెరిగాయన్నారు. ఈ నాలుగేళ్లలో నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బ ణం పెరిగాయన్నారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, రైతులకు గిట్టుబాటుధర లేక దళారుల దోపిడీతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతోన్మాదం, గోరక్ష పేరిట దాడులు, దళితులు, మైనారిటీలపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ, వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నారు. మతోన్మాదులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్ష, దళిత, లౌకిక శక్తులతో కలిసి ఐక్య పోరాటాలు నిర్వహించాలన్నారు. హైదరాబాద్లో జరిగే సీపీఎం జాతీయ మహాసభల్లో సీపీఐ సహా అన్ని వామపక్షాలు పాల్గొంటాయని వెల్లడించారు. సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఏపీలో బీజేపీ నామరూపాల్లేకుండా పోయిందన్నారు. ఏపీలో వామపక్షాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. వామపక్ష ఐక్యత కోసం ఉత్సాహంగా ఉన్నాం: తమ్మినేని మతోన్మాదానికి, దళితులు, మైనారిటీపై దాడులకు వ్యతిరేకంగా వామపక్షాలు ఐక్యంగా పోరాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. వామపక్షాల ఐక్యత కోసం సీపీఎం ఉత్సాహంగా ఉందని చెప్పారు. మతోన్మాదం రాజకీయ రంగు పులుముకుందన్నారు. అట్టడుగు కులాలు రాజ్యాధికారం చేజిక్కించుకున్నప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. సమావేశాల్లో సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, అతుల్కుమార్ ప్రసంగించారు. సంతాప తీర్మానాలను మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఫొటో ఎగ్జిబిషన్ను అతుల్కుమార్ ప్రారంభించారు. వడగండ్ల బాధితులను ఆదుకోవాలి: చాడ రాష్ట్రంలో అకాల వర్షాలు, వడ గండ్లతో నష్టపోయిన అన్ని పంటలకు ప్రభుత్వం వెంటనే నష్ఠపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఎండిపోయిన, అకాలవర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న, వరి పంటలకు ఎకరానికి 40 వేలు, మామిడి పంటకు 50 వేలను పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. పంటలకు నష్టపరిహారం చెల్లించాలని చాడ వెంకటరెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి మహాసభ ఆమోదం తెలిపింది. -
అమిత్ షా లేఖ.. అవమానం ఎలా అవుతుంది?
సాక్షి, అమరావతి : బీజేపీ జాతీయాధ్యక్షుడి హోదాలో అమిత్షా లేఖ రాస్తే అది అవమానమేలా అవుతుందని బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీతోపాటు వామపక్ష పార్టీలపై మండిపడ్డారు. ‘అమిత్ షా.. సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తే టీడీపీ నేతలు దాన్నేదో తప్పులా చూస్తున్నారు. ఏపీ అసెంబ్లీ పూర్తిగా తెలుగు దేశం కార్యకర్తల సమన్వయ సమావేశంగా మారింది. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా.. పార్టీ వ్యవహారాలను.. అమిత్ షా లేఖ గుర్చించి ఎలా చర్చిస్తారు?.బీజేపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు మాట్లాడకుండా టీడీపీ ఏం మాట్లాడుతుంది? కుర్చీలు వేస్తే మేము కూడా మాట్లాడుతాం. అమరావతిలో అన్ని కార్యాలయాలు కట్టినప్పుడు రాజధాని పూర్తయినట్లే కదా. మరి అలాంటప్పుడు అనవసరమైన ప్రకటనలు ఎందుకు?. సెంటిమెంట్.. అయింట్మెంట్.. అంటూ పాలన సాగిస్తున్నారు. నిధుల్లో ఒక్క రూపాయి లెక్క చూపలేదు. ఏపీకి ఇప్పటిదాకా ఇచ్చిన నిధులు వెనక పడిన ప్రాంతాలకు ఇచ్చినవి కాదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి టీడీపీ ఎన్నికలకు వెళ్లటం ఖాయం’ అని విష్ణువర్ధన్రెడ్డి పేర్కొన్నారు. ‘ఆధారాలుంటే మీడియాకు ఇవ్వండి’ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. ఆయన తనయుడు జైషాలపై అవినీతి ఆరోపణలు చేస్తూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అమిత్ షా అవినీతికి పాల్పడినట్లు మీ దగ్గర ఆధారాలు ఉంటే జాతీయ మీడియాకు ఇవొచ్చు కదా అని చంద్రబాబుకు ఆయన సూచించారు. ‘ఈ దేశంలో 11 మంది ముఖ్యమంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణ చేసినంత మాత్రాన వారు అవినీతి పరులు అయిపోరు. నిరూపణ కావాలి. మీ పార్టీ కి చెందిన వ్యక్తి స్టాంపుల కుంభకోణం కేసులో దోషిగా తేలిన వ్యక్తి.. ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. అది తెలుసు కదా!’ అని చంద్రబాబుకు చురకలు అంటించారు. ‘పవన్.. గౌరవం పొగొట్టుకోకండి’ వామపక్ష పార్టీలతో కలిసి పని చేస్తే ఏపీలో ఉన్న అంతో.. ఇంతో గౌరవాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్కు విష్ణువర్ధన్ సూచించారు. ఎమ్మెల్యేగా పని చేసిన రామకృష్ణ లాంటి వ్యక్తి ప్రధాని మోదీపై వ్యక్తిగత దూషణలు చేయడం సరైందేనా? పవన్ చెప్పాలన్నారు. ఇక లెఫ్ట్ పార్టీలు టెంట్ల కింద పార్టీలని.. ఓట్లు సీట్లు రావని విష్ణువర్దన్ ఎద్దేవా చేశారు. -
టీడీపీ తీరుతో ఏపీకి తీరని నష్టం వాటిల్లింది
-
మార్చ్కు వేలాదిగా తరలి రండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ, వామపక్షాలు ఉమ్మడిగా నిర్వహించ తలపెట్టిన మిలియన్ మార్చ్ స్ఫూర్తి యాత్రకు వేలాదిగా తరలి రావాలని జేఏసీ, వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఎన్ని అవరోధాలు, అడ్డంకులు సృష్టించినా స్ఫూర్తి యాత్ర నిర్వహించి తీరుతామని ప్రకటించాయి. తెలంగాణ జేఏసీ, వామపక్షాల ప్రతినిధులు హైదరాబాద్లోని మఖ్దూం భవన్లో శుక్రవారం సమావేశమయ్యారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, జేఏసీ కో కన్వీనర్ వెంకటరెడ్డి, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోవర్థన్, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేత రవిచంద్ర తదితరులు సమావేశమై మిలియన్ మార్చ్ను ఎలా నిర్వహించాలనే దానిపై చర్చించారు. యాత్ర నిర్వహించి తీరుతాం.. సమావేశం అనంతరం జేఏసీ నేత వెంకటరెడ్డి మాట్లాడుతూ.. శాంతియుతంగా నిర్వహించనున్న స్ఫూర్తి యాత్రకు అనుమతి ఇవ్వకపోగా, అక్రమంగా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు ఎన్ని ఆటంకాలు కల్పించినా శాంతియాత్రను నిర్వహిస్తామని వెంకటరెడ్డి చెప్పారు. పోలీసుల బెదిరింపులకు, ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. శాంతియుతంగా నిర్వహించాలనుకున్న స్ఫూర్తి యాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించి ఇంకా పెద్దదిగా చేసిందన్నారు. సీఎం జోక్యం చేసుకోవాలి: చాడ మిలియన్ మార్చ్ స్ఫూర్తి యాత్రను శాంతియుతంగా నిర్వహించుకోవడానికి సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని అనుమతిని ఇప్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. మిలియన్ మార్చ్ అనేది తెలంగాణ ఉద్యమంలో చారిత్రక ఘట్టమని, దీనిని ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పారు. -
ఏపీ బంద్లో పాల్గొన్న వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు : కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో గురువారం బంద్ కొనసాగుతోంది. ఏపీ బంద్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. బంద్కు సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు ప్రజాసంకల్పయాత్ర నిలిపివేశారు. ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండలం దుండిగం క్రాస్ జోలగుంటపల్లి శివారు వద్ద బంద్లో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి వైఎస్ జగన్ ప్లకార్డులు పట్టుకుని బంద్కు సంఘీభావం తెలిపారు. కాగా ఏపీలోని పదమూడు జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు ఆంధ్రప్రదేశ్ బంద్..
-
నేడు ఆంధ్రప్రదేశ్ బంద్..
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్ర బంద్కు సర్వం సిద్ధమైంది. బంద్కు అన్ని సన్నాహాలు చేసినట్టు వామపక్ష పార్టీలు ప్రకటించాయి. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ సందర్భంగా స్వచ్ఛందంగా మూసివేయనున్నట్లు తెలిపాయి. ప్రభుత్వ సంస్థలు యధావిధిగా నడుస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నా వాటినీ అడ్డుకుంటామని బంద్కు మద్దతు ఇస్తున్న ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక హోదా, రాష్ట్ర రాజధాని నిర్మాణం మొదలు పోలవరం నిర్మాణం, ప్రత్యేక రైల్వేజోన్ వంటి అంశాల ప్రస్తావన ఏదీ లేకపోవడాన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఆక్షేపించాయి. రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరును గర్హిస్తూ వామపక్షాలు బంద్కు పిలుపునివ్వగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, లోక్సత్తాతో పాటు కేంద్ర కార్మిక, ఇతర ప్రజా సంఘాలతో పాటు ప్రత్యేక హోదా సాధన సమితి వంటివి మద్దతు పలికాయి. ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించి బంద్కు మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రజలంతా ఒక్కటిగా నిలబడి బంద్ను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ కోరింది. బంద్కు మద్దతు ప్రకటించాలంటూ సీఎంకు సీపీఐ బుధవారం బహిరంగ లేఖ రాసింది. బంద్ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని బాబు వ్యాఖ్యానించడాన్ని ప్రజాసంఘాలు తప్పుబట్టాయి. -
రేపు ప్రజాసంకల్పయాత్ర నిలుపుదల
సాక్షి, అమరావతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు రేపు (గురువారం) నిలుపుదల చేయనున్నట్లు ఆ పార్టీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు మద్దతుగా రేపు వామపక్షాల బంద్కు వైఎస్ఆర్ సీపీ తన విధానంలో భాగంగా సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బంద్కు మద్దతుగా వైఎస్ జగన్.. రేపు ప్రజాసంకల్పయాత్ర నిలిపివేయనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలంతా ఒకటిగా నిలబడాలని, రేపటి బంద్ను విజయవంతం చేయాలని వైఎస్ఆర్ సీపీ విజ్ఞప్తి చేసింది. -
8న జిల్లా బంద్
కాకినాడ రూరల్: కేంద్ర బడ్జెట్లో నవ్యాంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేశారని, దీనికి నిరసనగా ఈనెల 8న రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని జిల్లాలోని పది వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఆదివారం సాయంత్రం కాకినాడలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వామపక్షాల సమావేశంలో పలువురు నాయకులు బడ్జెట్పై చర్చించి రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం, విశాఖ రైల్వేజోన్ను ప్రకటించకపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వకపోవడాన్ని వామపక్ష నాయకులు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా పది వామపక్షాలు రాష్ట్ర బంద్కు పిలుపు నిచ్చాయన్నారు. అందులో భాగంగా జిల్లాలో కూడా బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంతి చంద్రబాబునాయుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో లాలూచీ పడి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని, ఇప్పుడు కేంద్రబడ్జెట్పై మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే 8వ తేదీన రాష్ట్ర బంద్లో పాల్గొనేలా తమ శ్రేణులకు పిలుపు నివ్వాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. సమాశానికి సీపీఎం (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జె వెంకటేశ్వరరావు, వామపక్షాల నాయకులు ఎం రాజశేఖర్, తోకల ప్రసాద్, నక్కా కిషోర్, అంజి, జె కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వామపక్షాల ‘పొలిటికల్ ఫోరం’!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో నామ మాత్రంగా కూడా ప్రభావం చూపలేక పోయిన వామపక్షాలు ఈసారి తమ ఉనికి చాటుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎం భద్రాచలం, సీపీఐ దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. ఇల్లందులో వరుసగా గెలుస్తూ వచ్చిన న్యూడెమొక్రసీ ఓటమిపాలుకాగా.. నర్సం పేట నియోజకవర్గంలో మూలాలున్న ఎంసీపీఐ కూడా ప్రాభవాన్ని కోల్పోయింది. ఎన్నికల్లో పోటీ పడి ఒంటరిగా గెలి చేంత శక్తి లేక ప్రజాపోరాటాలు, ఆందోళనలతో ఉనికి కాపాడుకుంటున్న వామపక్ష పార్టీలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాను న్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ పార్టీలన్నింటినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలను సీపీఎం తన భుజాలపై వేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లను మినహాయించి ఇతర అన్ని పార్టీలను కలుపుకుని ఒక రాజకీయవేదికను ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సీపీఎం వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు ఈ నెల 25న పొలిటికల్ ఫోరం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధిని డిమాండ్ చేస్తూ సాగింది. అనంతరం వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు అన్ని సంఘాలను ఏకం చేయడానికి తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక(టి–మాస్)కు రూపం ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టి–మాస్ ఫోరాలు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల రాజకీయాలకు వెళ్లాలనుకునే వారిని కూడగట్టడం ద్వారా రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఈ వేదికలో చేరడానికి సీపీఐ, న్యూడెమోక్రసీ ఇంకా అంగీకారం తెలపలేదు. ఎంసీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్, సూసీ, ఆర్ఎస్పీ, బీఎస్పీ, ఎంబీటీ, లోక్సత్తా తదితర 32 పార్టీలు, ప్రజాసంఘాలు ఈ ప్రత్యామ్నా య రాజకీయ వేదికలో చేరడానికి ఇప్పటికే అంగీకారం తెలిపాయని చెబుతున్నారు. ఏప్రిల్లో జరిగే తమ జాతీయ మహాసభల్లో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని సీపీఐ చెప్పిందని, ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్గా వ్యవహరిస్తున్న టీజేఏసీనీ కలసి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు సీపీఎం వర్గాలు చెపుతున్నాయి. ఈ ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు బహుజన వామపక్ష ప్రజాతంత్ర వేదిక (బీఎల్డీఎఫ్), బహుజన వామపక్ష వేదిక(బీఎల్ఎఫ్) పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వివిధ వరా ్గలు, పార్టీలతో జరిపిన సమావేశాల అనంతరం ఈ నెల 25న ఫోరంను లాంఛనం గా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీపీఎం వర్గాలు చెపుతున్నాయి. ఈ వేదిక తరఫున రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని, ఉమ్మడి ప్రణాళికలను ప్రకటించాలని నిర్ణయించారు. జనా భా దామాషా పద్ధతిన టికెట్లను కేటాయించాలనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలు స్తోంది. ఫోరం ఆవిర్భావ సందర్భంలో దీనికి సంబంధించి ప్రకటనలు చేసే అవకాశం ఉంది. -
వామపక్షాల పంథా ఎందుకు మారింది?
సాక్షి, న్యూఢిల్లీ : ఎప్పుడూ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను బలంగా సమర్థిస్తూ వచ్చే సీపీఐ, సీపీఎం పార్టీలు ఎందుకు హఠాత్తుగా అగ్రవర్ణాల వారిలో కూడా ఆర్థికంగా వెనకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి? రాజస్థాన్లో జాట్లు, గుజరాత్లో పాటిదార్లు రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు లేవదీయడం, వారికి సంఘ్ పరివార్ అండగా నిలబడడం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం పాటిదార్లకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో కేంద్రంలోని పాలకపక్ష బీజేపీని ఇరుకున పెట్టేందుకు వామపక్షాలు కొత్తగా ఈ నినాదం అందుకున్నాయి. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకరావాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఇటీవల భారీ ర్యాలీ కూడా నిర్వహించింది. వాస్తవానికి అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనక బడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి సీపీఐ, సీపీఎం పార్టీలు మొదటి నుంచి వ్యతిరేకం ఏమీ కావు. 1930 నుంచి ఈ డిమాండ్కు సీపీఐ అనుకూలమే. బహిరంగంగా ఎప్పుడూ ఈ డిమాండ్ గురించి గట్టిగా మాట్లాడలేదు. సీపీఎం మాత్రం 1990లో తన పాత పద్ధతిని మార్చుకొని అగ్రవర్గాల్లో ఆర్థిక రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించింది. అయితే ఈ రెండు పార్టీలు కూడా తాము అధికారంలో ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్లు కల్పించలేం. కేరళలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నవంబర్ 15వ తేదీన ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన దేవసం బోర్డులైన ట్రావన్కోర్, కోచి, గురువాయూర్, మలబార్, కూడల్ మానిక్యంలో ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వారికి రిజర్వేషన్లు కల్పించింది. ఈ బోర్డుల్లో కేవలం హిందువులకే ప్రవేశం కనుక ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు ఉండే కోటాను వీటిల్లో అగ్రవర్ణాలకు కల్పించారు. ట్రావన్కోర్ దేవసం బోర్డుల్లో 6,120 పోస్టులకు గాను 96 శాతం మంది అంటే 5,870 మంది అగ్రవర్ణాలైన నాయర్లు, నంబూద్రీలే ఉన్నారు. వెనకబడిన ఎజవాలు 270 మంది ఉండగా, దళితులు 20 మంది ఉన్నారు. అలాగే దేవసం బోర్డుల ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో నడిచే విద్యా సంస్థల్లో 79 శాతం మంది అగ్రవర్ణాల టీచర్లే ఉన్నారు. అంటే 180 మంది టీచర్లకుగాను 135 మంది నాయర్లు, ఆరుగురు నంబూద్రీలే ఉన్నారు. సామాజిక ఆర్థిక పురోగతి, ముఖ్యంగా పెట్టుబడిదారి వ్యవస్థ పురోభివద్ధి కారణంగా అగ్రకులాల్లో కూడా ధనవంతులు, పేదలు అంటూ రెండు వర్గాలు ఏర్పడ్డాయని, ఈ కారణంగా వారిలో కూడా పేదలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని 1990 దశకంలో సీపీఎం తన పంథా మార్చుకుంది. అయితే ఈ వాదన తప్పని, బలహీన వర్గాల ఆర్థికాభివద్ధి కోసం బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల విధానం రాలేదని, సామాజిక అంతరాలను తెంచడం కోసమే ఈ రిజర్వేషన్లు వచ్చాయని, ఇప్పటికీ కులాల మధ్య సామాజిక అంతరాలు అలాగే ఉన్నందున రిజర్వేషన్లను అదే ప్రాతిపదికన కొనసాగించాలని ఎంతో మంది సామాజిక శాస్త్రవేత్తలు నేటికి వాదిస్తున్నారు. -
వామపక్షాల నిరసన ప్రదర్శన భగ్నం
సాక్షి, హైదరాబాద్: వామపక్ష పార్టీల నిరసన ప్రదర్శనను పోలీసులు భగ్నం చేశారు. నోట్ల రద్దు దుష్ప్రభావాన్ని చాటిచెప్పేందుకు హైదరాబాద్లో బుధవారం తలపెట్టిన ర్యాలీని అడ్డుకున్నారు. ఆయాపార్టీల నేతలను అరెస్టు చేశారు. జనజీవితాన్ని అతలాకుతలం చేసిన ‘పెద్దనోట్ల రద్దు’కు ఏడాది పూర్తయిన సందర్భంగా సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్(న్యూడెమోక్రసీ), ఎస్యూసీఐ తదితర పది వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. బషీర్బాగ్లో గల బాబూ జగ్జీవన్రాం విగ్రహం నుంచి జనరల్ పోస్టాఫీస్ వరకు వామపక్షాల నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా బయలుదేరారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ నేత కె.నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, న్యూడెమోక్రసీ నాయకులు గోవర్ధన్, చలపతిరావు, ఎంసీపీఐ నేత బాబు తదితరులను అరెస్టు చేసి బేగంపేట పోలీస్స్టేషన్కు తరలించారు. నోట్ల రద్దుతో సాధించిందేమీలేదు: నారాయణ నల్లధనాన్ని వెలికితీస్తానని కబుర్లు చెప్పిన మోదీ ప్రభుత్వం నోట్ల రద్దుతో సాధించిందేమీ లేదనే విషయం ఏడాదిలో రుజువైందని నారాయణ అన్నారు. నోట్ల రద్దు వల్ల ఏవో లాభాలు ఒరిగాయని చెప్పేందుకు బీజేపీ వారు ఉత్సవాలు చేసుకుంటుంటే, దాని వల్ల సామాన్యులకు జరిగిన నష్టాన్ని వివరించేందుకు తాము నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చామని చెప్పారు. ముందు అనుమతి ఇచ్చి తర్వాత పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకోవడం తగదని మండిపడ్డారు. వీరభద్రం మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ ‘పిచ్చోడి చేతిలో రాయి’లా మారిందని అన్నారు. పార్లమెంటుకు, క్యాబినెట్కు తెలియకుండానే అనేక నిర్ణయాలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజానుకూల ఆర్థిక విధానాల కోసం వామపక్ష శక్తులు బలోపేతం కావాలని, దానికి త్వరలోనే తెలంగాణలో బీజం పడబోతున్నదని తమ్మినేని వెల్లడించారు. -
10న ‘ఛలో వంశధార’ ఆందోళన
సాక్షి, అమరావతి: వంశధార ప్రాజెక్టు నిర్వాసితులపై రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు నిరసనగా అక్టోబర్ 10వతేదీన ‘ఛలో వంశధార’ ఆందోళన కార్యక్రమం చేపట్టాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విజ్ఞప్తి మేరకు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ సహా పది వామపక్ష పార్టీలు ఈ ఆందోళనకు మద్దతు తెలిపాయి. ప్రభుత్వం అరెస్ట్లకు దిగితే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. మంగళవారం విజయవాడలో మధు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్ సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రావుల వెంకయ్య, ఇతర నాయకులు బి.వెంకటరెడ్డి, వై.కేశవరావు, కె.రామారావు, కిషోర్, డి.హరినాథ్, పి.వి.సుందరరాజు, దడాల సుబ్బారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ భూ నిర్వాసితులపై ఇంత నిర్భంధం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రభుత్వాలు చట్టపరిధిలో వ్యవహరించాలని సూచించారు. ఆందోళనను వంశధార, పోలవరం ప్రాజెక్టులకే పరిమితం చేయవద్దన్నారు. రాష్ట్రంలో భూ సేకరణ చట్టప్రకారం జరగడం లేదని, వంశధార ప్రాజెక్టు సమస్య ప్రారంభమై దశాబ్దాలు గడుస్తున్నా ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు. విపరీతమైన జాప్యం వల్ల రూ.933 కోట్ల ప్యాకేజీ ఇప్పుడు రు.1,616 కోట్లకు చేరిందని చెప్పారు. కాంట్రాక్టర్లకు పెంచినట్లుగా నిర్వాసితులకు పరిహారం ఎందుకు పెంచడం లేదని ఆయన ప్రశ్నించారు. 16, 17న విజయవాడలో 30 గంటల ధర్నా 2013 భూ సేకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని కె.రామకృష్ణ పేర్కొన్నారు. మరో 7,200 మంది నిర్వాసితుల పునరావాసానికి స్థలాలు ఇవ్వాల్సి ఉందని వంశధార నిర్వాసితుల సంఘం ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు. నిర్వాసితుల సమస్యలపై వచ్చే నెల 16, 17వ తేదీల్లో విజయవాడలో 30 గంటలపాటు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మధు ప్రకటించారు. నిర్వాసితులకు 36 రకాల పునరావాస సేవలు కల్పించాకే గ్రామాలను ఖాళీ చేయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
బషీర్బాగ్ నెత్తుటి గాయానికి 16 ఏళ్లు
-
నంద్యాల ఓటర్లకు లెఫ్ట్ పిలుపు
నంద్యాల: ఉప ఎన్నికలో అధికార టీడీపీని ఓడించాలని నంద్యాల ఓటర్లకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలుచేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వామపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చంద్రబాబు ద్రోహం చేశారని మండిపడ్డాయి. ప్రజలను మోసగిస్తున్న టీడీపీ సర్కారుకు, సీఎం చంద్రబాబుకు బుద్ధిచెప్పాలని లెఫ్ట్ పార్టీలు ప్రజలకు సూచించాయి. -
బెంగాల్లో బీజేపీ దూకుడు
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు, కాంగ్రెస్ల స్థానంలో బీజేపీ కీలక శక్తిగా అవతరించనుందా అనే చర్చకు తెర లేచింది. ఇటీవల వెల్లడైన ఏడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇదే అంశాన్ని ముందుకుతెచ్చాయి. 2012లో ధూప్గురి మున్సిపాల్టీలో కేవలం 8.6 శాతం ఓట్లు తెచ్చుకున్న ఆ పార్టీ తాజాగా వెల్లడైన స్దానిక ఎన్నికల ఫలితాల్లో ఏకంగా 41.7 శాతం ఓట్లు సాధించింది. దళితులు అధికంగా ఉన్న ధూప్గిరిలో బీజేపీకి ఈ స్ధాయిలో ఓట్లు పోలవడం విశ్లేషకులను సైతం నివ్వెరపరిచింది. హల్దియా, ధూప్గురి, పన్సుకురా మున్సిపాల్టీల్లో వామపక్షాలు, కాంగ్రెస్లు కలిసి సాధించిన ఓట్ల కన్నా బీజేపీ ఓటింగ్ శాతం అధికం కావడం గమనార్హం. దుర్గాపూర్, నల్హాటి మున్సిపాల్టీల్లో బీజేపీ రెండో స్ధానంలో నిలవగా, కూపర్స్ క్యాంప్లో వామపక్షాలకు దీటుగా ఓట్లు సాధించింది. పశ్చిమ బెంగాల్లో ఓటర్లను ఆకట్టుకునే నేత, పటిష్టమైన క్యాడర్ లేకున్నా 2014 లోక్సభ ఎన్నికల అనంతరం బీజేపీ ప్రజల్లో పట్టు పెంచుకుంటున్నది. -
భీమవరంలో ఉద్రిక్తత
భీమవరం టౌన్ : గరగపర్రు ఘటనలో దళితులకు న్యాయం చేయాలంటూ సీపీఎం, సీపీఐ, కేవీపీఎస్తోపాటు వివిధ ప్రజా సంఘాలు చేపట్టిన చలో భీమవరం కార్యక్రమం బుధవారం భీమవరంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ ముందుగానే పోలీసులు ప్రకటించినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమం నిర్వహించి తీరుతామని ఉద్యమకారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్యమం వేదిక భీమవరం పాతబస్టాండ్ను పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఏలూరు నుంచి ప్రత్యేక పోలీసు బలగాలను దింపారు. గరగపర్రు నుంచి దళితులు, చుట్టు పక్కల నుంచి ఉద్యమకారులు పాతబస్టాండ్కు చేరుకోకుండా ఉద్యమ వేదికకు నాలుగు దిక్కులా పోలీసులు మోహరించారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి మెంటేవారితోట నుంచి శ్మశానం మీదుగా యనమదుర్రు డ్రెయిన్ గట్టువెంబడి ఆందోళనకారులు ఒక్క ఉదుటున అంబేడ్కర్ సెంటర్కు చేరుకుని అక్కడ పోలీసులను తోసుకుని పరుగుపరుగున డప్పులు వాయిస్తూ పాతబస్టాండ్ వద్దకు చేరుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారాం, నాయకులు బి.బలరాం, జేఎన్వీ గోపాలన్, బీవీ వర్మ మరో 30 మందికిపైగా ఉద్యమకారులు అక్కడికి చేరుకుని గరగపర్రు దళితులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ముందుకు కదలనివ్వకుండా పోలీసులు వలయంగా చుట్టుముట్టారు. దీంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు రోడ్డుపైన పడుకుని నిరసన తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎన్ .మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వారందరినీ బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వ్యాన్లలో ఎక్కించారు. అందరినీ వ్యాన్లలో ఎక్కించి కాళ్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. తరువాత సీపీఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్, పట్టణ కార్యదర్శి ఎం.సీతారాం ప్రసాద్ ఆధ్వర్యంలో మరికొందరు అక్కడికి చేరుకున్నారు. భీమవరం పట్టణాన్ని పోలీసులు పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకుని ఎటువంటి అశాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సీమ బంద్ సక్సెస్
-
సీమ బంద్ సక్సెస్
– డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు – స్వచ్ఛందంగా వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాల మూసివేత – శాంతియుతంగా ధర్నా చేస్తున్న సీపీఎం, సీపీఐ నాయకుల అరెస్టు – రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే సీఎంకు గుణపాఠం తప్పదని హెచ్చరిక కల్లూరు (రూరల్)/కర్నూలు(కొండారెడ్డిఫోర్టు): రాయలసీమలో కరువు నివారణ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందంటూ సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఉదయం ఆరు గంటల నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలతో నిరసనకారులు కదం తొక్కారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా ఆటోలు మధ్యాహ్నం వరకు రోడ్డుపైకెక్కలేదు. దీంతో ప్రయాణికులకు కాలినడక తప్పలేదు. వాణిజ్య సమూదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. చిరువ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బస్టాండ్ కేంద్రంగా నిరసనలు హోరు... ఉదయం ఆరు గంటల నుంచి బస్టాండ్ పరిసరాలు సీపీఎం, సీపీఐ నాయకులు నినాదాలతో హోరెత్తాయి. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్రప్రధాన కార్యదర్శి మనోహర్ మాణిక్యం, సీపీఐ నగర కమిటీ కార్యదర్శి రసూల్ ఆధ్వర్యంలో నిరసన కారులు బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలను కదలనివ్వలేదు. దుకాణాలను బంద్ చేయించి బస్టాండ్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీలు నిర్వహించారు. పుర్రెలతో నిరసన... కర్నూలు చౌరస్తాలో సీపీఎం, సీపీఐ నాయకులు వినూత్నంగా పుర్రెలతో నిరసన తెలిపారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో రైతులకు చివరికి పుర్రెలే మిగిలాయని చెప్పారు. మరోవైపు చౌరస్తా నుంచి బస్టాండ్, రాజ్విహార్, పాతబస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరిగి అక్కడి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. మరోవైపు ఉభయ కమ్యూనిస్టులు గుంపులు గుంపులుగా విడిపోయి నగరంలో బైక్ ర్యాలీలను నిర్వహించారు. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయించి సర్కారుపై తమ నిరసన తెలిపారు. ఆందోళనకారుల అరెస్టు... ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో బస్టాండ్ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ ఆధ్వర్యంలో రాజ్విహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ శాంతి యుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకొని బలవంతంగా అరెస్టు చేసి రెండో పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు. రామకృష్ణ, గఫూర్తోపాటు మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. బాబు రాజధాని జపం చేస్తున్నారు .. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడేళ్ల పరిపాలన కాలంలో రాజధాని అమరావతి జపం చేస్తూ రాయలసీమను తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం కేంద్ర కమిటీసభ్యుడు ఎంఏగఫూర్ విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోయారని ధ్వజమెత్తారు. వరుస కరువుల నుంచి జిల్లాను గట్టెక్కించడంలో విఫలమయ్యారని విమర్శించారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక రైతులు, కూలీలు వలస బాట పటా్టరని చెప్పారు. పట్టిసీమను ఏడాదిలోపు పూర్తి చేసిన ప్రభుత్వం జిల్లాలో ఏళ్ల తరబడి సాగుతున్న పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. సీమలో శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టకపోతే ఆందోళన కార్యక్రమాలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
కొనసాగుతున్న రాయలసీమ బంద్
అనంతపురం: కరవు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా వామపక్ష పార్టీలు పిలుపుమేరకు బుధవారం రాయలసీమలో బంద్ కొనసాగుతోంది . నాలుగు జిల్లాల్లో ఆ పార్టీల కార్యకర్తలు, అనుబంధ సంఘాల కార్యకర్తలు పలు ఆర్టీసీ డిపోల వద్ద ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురంలో ఆర్టీసీ బస్టాండు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. బస్సులపై ఏఐవైఎఫ్ కార్యకర్తలు రాళ్లు రువ్వగా వీరిని పోలీసులు అరెస్టు చేశారు. గుంతకల్లులో ఆర్టీసీ డిపో వద్ద సీపీఎం నేతలు బస్సులను అడ్డుకున్న వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. తడకలేరులో జాతీయ రహదారిని దిగ్బంధించడంతో హైదరాబాద్-బెంగళూరు మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కడపలో బద్వేలు సర్కిల్లో వామపక్ష నేతలు బైఠాయించడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. కరవు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. తిరుపతిలో బస్టాండు వద్ద ఆందోళన చేస్తున్న సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు, ఎమ్మిగనూరుల్లో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. -
అనంతలో వామపక్షాల ధర్నా
అనంతపురం: రాయలసీమను పీడిస్తున్న కరువు, రైతు సమస్యలపై వామపక్షాలు పోరుబాట పట్టాయి. మంగళవారం ఉదయం అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట 48 గంటల ఆందోళనను ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాయలసీమ బైఠాయింపు పేరిట జరుగుతున్న ఆందోళనకు భారీ సంఖ్యలో రైతులు, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధు మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీలో రైతు సమస్యలపై వైఎస్సార్సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించటం దుర్మార్గమని మండిపడ్డారు. అసెంబ్లీలో చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రైతు సమస్యలపై చర్చించకుండా పారిపోతున్నారని ధ్వజమెత్తారు. -
ఆదివాసీ వీరుల అమరత్వం
36 ఏళ్ల కింద ఏప్రిల్ 20, 1981 నాడు జరిగిన ఇంద్రవెల్లి సంఘటన ఇంకా మనని వెంటాడుతున్నది. వామపక్ష విప్లవోద్యమం చరిత్రలో అది ఒక విషాద ఘట్టం. బ్రిటిష్ పాలకుల కర్కశత్వానికి జలియన్ వాలాబాగ్ ఒక కొండగుర్తు అయితే స్వాతంత్య్రానంతరం ఇంద్రవెల్లి ఘటన అలాంటిదే. సంఖ్యలో కాదు. ఆ రెండు ఘటనల స్వభావంలో సారూప్యత భయపెడుతున్నది. ఇంద్రవెల్లి సంతకు తరలి రావడం గోండులకు అవసరం. వారానికి సరిపడా సరుకులు కొనుక్కోవడం అలవాటు. అక్కడ ఏదో మీటింగ్ జరుగుతుందని, ఆ మీటింగులో మాట్లాడేవారి మాటలు కూడా వినవచ్చని అక్కడికి చేరారు. సరుకులు కొనుక్కున్నవాళ్లు అంతా కలసి ఓ చోట పిచ్చాపాటిగా మాట్లాడుతూ కూర్చున్నారు. గూడేల నుండి ఈసారి సంతకు అనుకున్న దానికన్నా ఎక్కువమందే చేరుకోసాగారు. సంతని లూటీ చేస్తారని పుకారు పుట్టించి వాళ్లని అడ్డగించాలనుకున్నారు పోలీసులు. వారి కదలికలను ఏ మాత్రం గుర్తించకుండా పదుగురు కలసి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో చెట్లమీదకెక్కి తుపాకులతో కాల్చారు. ప్రభుత్వం 13 మంది చనిపోయారన్నది. ఆ ఒక్కరోజే కూలిపోయిన వాళ్లు 60 మంది అని అంటారు. కాదు 400 మంది అని గోండు పెద్దలు చెబుతారు. వీరిలో తూటాలవల్ల గాయాలపాలైనవారి సంఖ్య ఎంతో ఎక్కడా అంచనా లేదు. ఒక సామూహిక హననం జరిగింది. అమాయకులైన గోండు ఆదివాసీలపై, వారి మంచితనంపై దాడి చేశారు. భూమి, భుక్తి కోసం, పీడన నుండి విముక్తి కోసం నాలుగు ఆలోచనలు చేస్తే నాలుగు తరాల వేధింపులు మిగిలాయి. ‘ఇంద్రవెల్లి అమర వీరుల స్మారక స్థూపం పరిరక్షణ కమిటీ’ సభ్యులు మొన్న ఇంద్రవెల్లి పరిసర గ్రామాలలో తిరిగి పర్యటించారు. అప్పుడు గాయపడిన కొందరు బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా భయపడ్డారు. ఇంట్లో ఉండికూడా లేరని చెప్పడం విచారకరం. మరణించిన కుటుంబాలవారు, గాయపడినవారి హృదయాలు భయంతో ఇప్పటికీ వణికి పోతుం డటం మన సమాజానికి అంత మంచిది కాదు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఎందరో మహనీ యుల జయంతులు, వర్ధం తులు జరుపుకుంటున్నాం. అలాగే ఆదివాసీ మృతవీరులను స్మరించుకోవటం సంప్రదాయం. మరణించిన కుటుంబీకులే రహస్యంగా వారి ఆత్మలకు శాంతి చేకూర్చడం, కర్మకాండలకే పరి మితం చేయడం బాధాకరం. మరణించిన వారిని తలచుకోవడం మానవ ధర్మం. అదీ వీరోచిత పోరాటంలో అసువులు బాసిన వారి స్మరణ కోసం ప్రజలు తపించిపోతారు. ఈ మానవ ధర్మాన్ని విజ్ఞతతో అర్థం చేసుకుంటేనే సమాజంలో సౌహార్ద్రత పెరుగుతుంది. కొత్త రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితిని నెలకొల్పడం అవసరం. కాంగ్రెస్ హయాంలో ఇంద్రవెల్లి సంఘటన జరిగింది. కానీ అక్కడ మూడు దశాబ్దాలకుపైగా కుంటి సాకుపెట్టి నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. తెలంగాణ ఏర్పడి రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీ ఆధ్వర్యంలో స్వపరిపాలన ఏర్పడింది. అయినా గత రెండే ళ్లలో ఈ నిషేధాజ్ఞలు కొనసాగాయి. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని అమరవీరుల స్థూపాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దాలనే ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకుంటారని ఆశ. ముఖ్యంగా ఆనాడు తూటాల దెబ్బలు తిని గాయాలపాలై, అంగవైకల్యంతో బాధపడేవారికి ఏదో ఒక రూపంలో సహకారం అందించే యోచన చేయాలి. ఇంతకాలం గోండులమీద జరుగుతున్న ఒకరకమైన అణచివేత వారి మానసిక, ఆర్థిక, సామాజిక అభివృద్ధిని తప్పక కుంటుపరుస్తుంది. రాష్ట్రంలోని ఒక అతిపెద్ద ఆదివాసీ సమాజం నెత్తిపై ఆంక్షల బరువుని తరతరాలుగా మోపడం సరికాదు. ఇంతకాలం వారు కనబడని చెరసాలలో మగ్గిపోయారు. వారి సంస్కృతిని గుర్తించి గౌరవించడం, ఇటీవల లభించిన గుంజాల గోండీ లిపిని పాలసీగా గుర్తించి అభివృద్ధి పరచడం కూడా అత్యవసరం. ఆనాడు రాజ్యాలు ఏలిన గోండు జాతి ప్రజలకు కనీస గౌరవం ఇవ్వడం సంస్కారం. 20 ఏప్రిల్ నాడు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా అక్కడ అమరవీరులకు నివాళి అర్పించే అవకాశం కల్పిస్తే ప్రభుత్వ ప్రజాస్వామిక ధోరణికి అది అద్దం పడుతుంది. స్థానికులు, బయటివారు అనే కొత్త వివాదం.. అటు పోలీసులు, కొందరు స్వార్థపరులు ఈ సందర్భంగా తీసుకొస్తున్నారు. అది ఏమాత్రం మంచిది కాదు. అమర వీరుల త్యాగాలను కుదించే ప్రయత్నం చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. శాంతి భద్రతల పేరుతో కల్పిత కట్టు కథలను నమ్మకుండా గాయాలను మాన్పడం ప్రభుత్వం పని. ఆ దిశగా ఆలోచించడం ద్వారానే గోండుల నమ్మకాన్ని పొందగలం. స్వేచ్ఛా తెలంగాణకి అది అనివార్య సంకేతం కావాలి. (20 ఏప్రిల్ 1981నాడు జరిగిన ఇంద్రవెల్లి కాల్పుల్లో మరణించిన అమర వీరుల జ్ఞాపకాలతో) – చుక్కా రామయ్య ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ -
ధర్నా చౌక్ను పునరుద్ధరించాలి
వామపక్షాలు, ప్రజాసంఘాల డిమాండ్ ► రిలే దీక్షలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు ధర్నా చౌక్ను పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంట నే నిర్ణయం తీసుకోవాలని వామపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఎట్టి పరి స్థితుల్లోనూ ధర్నా చౌక్ను పరిరక్షించుకుంటా మని, ఇందుకోసం దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించాయి. ప్రజాస్వా మ్య హక్కుల పరిరక్షణ, నిరసన తెలిపే హక్కు కోసం కలిసొచ్చే శక్తులు, ప్రజాసంఘాలు, మేధావులను కలుపుకుని వివిధ రూపాల్లో ఆందోళనలను తీవ్రం చేస్తామని హెచ్చరించా యి. నెల రోజులు రిలే దీక్షలను నిర్వ హించి, మే 15న ఇందిరాపార్కు ఆక్రమణ, రాష్ట్రవ్యాప్త చలో ధర్నాచౌక్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపాయి. ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా శనివారం మగ్దూంభవన్ లో చాడ వెంకటరెడ్డి, గుండా మల్లేశ్, ఆదిరెడ్డి, ఈర్ల నర్సింహా(సీపీఐ), తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు (సీపీఎం), సాదినేని వెంకటేశ్వరరావు, గోవర్ధన్(న్యూడెమోక్రసీ–చంద్రన్న), వెంకట రామయ్య, పోటు రంగారావు (న్యూ డెమోక్రసీ–రాయల),తాండ్రకుమార్ (ఎంసీపీ ఐ–యూ), మురహరి (ఎస్యూసీఐ–సీ), జానకిరాములు (ఆర్ఎస్పీ), ప్రకాశ్ (ఆప్), రాజేశ్(న్యూ లిబరేషన్), వెంకటరెడ్డి (టీజేఏసీ),రవిచంద్ర(టీడీఎఫ్), కె.సజయతో కలిపి మొత్తం 50 మందితో తొలిరోజు రిలే దీక్షలను విద్యావేత్త చుక్కా రామయ్య ప్రారం భించారు. దీక్షలో ఉన్న వారికి సాయంత్రం నిమ్మ రసం ఇచ్చి టీజేఏసీ చైర్మన్ కోదండరాం విరమింపజేశారు. ప్రజాస్వామ్యం కోసం కలసిరావాలి ప్రజాస్వామ్య హక్కుల కోసం ధర్నాచౌక్ పరిర క్షణ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కోదండరాం పిలుపునిచ్చారు. నెల రోజులపాటు సాగే ఈ దీక్షలో పాల్గొని, సంఘీభావం తెలపవచ్చన్నారు. ప్రజాస్వా మ్యాన్ని బతికించుకోవాల్సి ఉందని, ధర్నా చౌక్ వంటిది ఉనికిలో లేకపోతే ప్రజాస్వా మ్యానికి ఉరి వేసినట్లేనన్నారు. గద్దెను ఎక్కగానే సీఎం కేసీఆర్ ధర్నా చౌక్ను మరిచి పోవడం భావ్యం కాదని చుక్కా రామయ్య విమర్శించారు. నిన్నటివరకు ప్రజాస్వామ్య యుతంగా పార్టీలో పనిచేసిన కేసీఆర్కు ప్రశ్నించే దీపాన్ని ఆర్పివేసే హక్కు లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించుకుని ధర్నా చౌక్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గొంతుకను నులిమే శక్తి ఏ ప్రభు త్వానికి, ఏ పార్టీకి లేదని ప్రొ.రమా మేల్కొటె అన్నారు. ప్రధాని మోదీకి రెండు కళ్లు మాదిరిగా చంద్రబాబు, కేసీఆర్ వ్యవహరిస్తు న్నారని విరసం నేత వరవరరావు ధ్వజమెత్తారు. ఏపీలో నిషేధిత సంస్థ అయిన రెవెల్యూ షనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించా రు. నిరసన తెలపడమనేది ప్రకృతి సిద్ధమైన, నైసర్గిక హక్కుని, రాచరికంలో, ఫ్యూడల్ వ్యవస్థలోనూ ధర్మగంట పెట్టి ఆపదలో ఉన్న వారు రాజు తలుపుతట్టే వీలుంటుందని చె ప్పారు. నిరసనలు లేకుండా, ప్రతిపక్షాలు లేకుండా చేయాలని సామ, దాన, భేద, దండోపాయాలను పాలకులు ప్రయో గిస్తున్నారని తమ్మినేని వీరభద్రం ధ్వజమె త్తారు. కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కావడం లేదని, ప్రశ్నించే గొంతులను, హక్కులను హరిస్తారా అని చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. -
ధర్నాచౌక్ను పునరుద్ధరించాలి
- వామపక్షాలు, ప్రజాసంఘాల డిమాండ్ - ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 15 నుంచి రిలే దీక్షలు - మే 10న ధర్నాచౌక్ ఆక్రమణ సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు ధర్నాచౌక్ను టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని వివిధ వామపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఈ నెల 15 నుంచి సమాజంలోని వివిధ వర్గాలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో వచ్చేనెల 9 వరకు రిలే నిరాహారదీక్షలను చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా మే 10న ఇందిరాపార్కు ఆక్రమణ పేరిట రాష్ట్రవ్యాప్త ‘చలో ధర్నాచౌక్’ను నిర్వహించనున్నట్లు తెలిపాయి. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ వర్కింగ్గ్రూప్ సభ్యులు మల్లేపల్లి ఆదిరెడ్డి (సీపీఐ), చెరుపల్లి సీతారాములు (సీపీఎం), కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ–చంద్రన్న), పోటురంగారావు (న్యూడెమోక్రసీ–రాయల), పీఎల్ విశ్వేశ్వరరావు (ఆప్), రవిచందర్ (తెలంగాణ ప్రజాస్వామిక వేదిక), కె.సజయ (సామాజిక పరిశోధకురాలు), పంజుగుల శ్రీశైల్రెడ్డి (ప్రజాతెలంగాణ) విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 20 వరకు అన్ని జిల్లాల్లో ధర్నాచౌక్ పరిరక్షణపై రౌండ్టేబుల్ సమావేశాలు, ఇతరత్రా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి సీపీఐ కార్యాలయం మగ్దూంభవన్ ఆవరణలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే దీక్షలు ఉంటాయన్నారు. 15న మొదట వామపక్షాల నేతలు, 16న కార్మికసంఘాలు, 17న వ్యవసాయకార్మిక సంఘాలు, 18న విద్యార్థి సంఘాలు, 19న యువజన సంఘాలు, ఇంకా మే 2న ట్రాన్స్జెండర్స్, మే 8న బీడి కార్మిక సంఘాలు, మే 9న ట్రాన్స్పోర్టు (బస్సు,ఆటో) సంఘాల ప్రతినిధులు ఈ దీక్షల్లో పాల్గొంటారని చెప్పారు. అంతకుముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ప్రజాసంఘాల రాష్ట్ర సదస్సులో 50కి పైగా సంఘాల ప్రతినిధులు పాల్గొని ధర్నాచౌక్ పరిరక్షణ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారని వారు తెలియజేశారు. -
వామపక్షాలు ఏకం కావాలి...
సురవరం పిలుపు సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణకు, బీజేపీ మతోన్మాద విధానాలను అడ్డుకునేం దుకు సెక్యులర్ పార్టీలు, వామపక్షాలు ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరంసుధాకరరెడ్డి అన్నారు. శనివారం మగ్దూంభవన్లో ఆయన విలేకరులతో మా ట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలస్థాయిలో బీజేపీతీసుకున్న నిర్ణయాలు, గవర్నర్పదవిని తీవ్రంగా దుర్వినియోగం చేయడం అత్యంత అప్రజాస్వామికమన్నారు. గోవా, మణిపూ ర్లలో ఫిరాయింపులను ప్రోత్సహించడం రాజకీయంగా, నైతికంగా ప్రమాదకరమైన ధోరణన్నారు. యూపీ ఎన్నికల్లో బీసీల్లో, దళితుల్లో చీలిక తీసుకొచ్చి, మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలిగించి బీజేపీ గెలు పొందిందన్నారు. భౌతిక సుఖాలకు దూరంగా, సాధువుగా జీవించాల్సిన యోగి ఆదిత్యా నాథ్ను సీఎంగా తీసుకొచ్చి మతోన్మా దం తమ విధానం అని బీజేపీ స్పష్టం చేసిందన్నారు.హిందూ, బ్రాహ్మణ సమాజం, శాకాహారమనే ప్రమాదకరమైన ధోరణిని బీజేపీ ప్రచారంలోకి తెస్తోందన్నారు. జేఎన్యూలో సంఘ్ పరివార్ శక్తుల ఆటలు సాగకపోవడంతో ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశాలను తగ్గించి దళితులు, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత చదవులకు అడ్డంకులు సృష్టిస్తున్నార న్నారు. గుజరాత్లో పశువధకు పాల్పడితే జీవితఖై దు, పశుమాంసం దొరికితే మూడేళ్ల పైబడి ఖైదు చట్టాన్ని ఉపసంహరించుకొనేలా చూ డాలని రాష్ట్రపతికి సురవరం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలు: చాడ అధికార టీఆర్ఎస్ వైఫల్యాలనే ప్రచారా స్త్రాలుగా ప్రజల్లోకి వెళతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. మళ్లీ వందకుపైగా సీట్లు గెలుస్తామంటున్న కేసీఆర్ గతంలో చంద్రబాబు విజన్ 2020 అని ప్రకటించి బొక్కబోర్లా పడిన వైనాన్ని గుర్తుంచుకుంటే మంచిదన్నారు. -
జాతీయస్థాయిలోనూ లాల్–నీల్?
కార్యాచరణ దిశగా సీపీఎం అడుగులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేస్తున్న లాల్–నీల్ ప్రయోగాన్ని సీపీఎం దేశవ్యాప్తంగా అమలుచేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక శక్తుల సమస్యలను వామపక్షాలు నిర్లక్ష్యం చేశాయన్న విమర్శలను దూరం చేసుకునేందుకు జాతీయస్థాయిలో ఉమ్మడి కార్యాచరణను ఆ పార్టీ చేపట్టనుంది. పార్టీ పటిష్టత, విస్తరణకోసం సీపీఎంతో కలసి వచ్చే ప్రజాతంత్ర శక్తులు, సామాజిక శక్తులు, సంస్థలతో కలసి పని చేయనుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి నినాదంతో ఆ పార్టీ చేపట్టిన పాదయాత్ర అనుభవాలు, భవిష్యత్తు కార్యాచరణపై మార్చి 31 నుంచి ఏప్రిల్1 వరకు రెండు రోజులపాటు ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సైతం హాజరుకానుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. -
బడ్జెట్పై వామపక్షాలు గరంగరం
-
సోనియాకు రాహుల్ వారసుడవుతారా?
న్యూఢిల్లీ: రాజకీయాల్లో జయాపజయాలు సహజమే అయినప్పటికీ పాలకపక్షం వేసే తప్పడడుగులను ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోవడం, చేసుకోకపోవడమేపైనే పార్టీల జయాపజయాలు ప్రధానంగా ఆధారపడి ఉంటాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రతిపక్షాలను ఏకం చేయడంలో విజయం సాధించడం వల్లనే నాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయింది. ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ)ని ఏర్పాటు చేయడం వెనక సోనియా గాంధీ చేసిన కృషి ఎంతో ఉంది. రాజకీయ పరిణతి అంతగా లేదని, వాజపేయి లాంటి ప్రత్యర్థుల ముందు తాను సరితూగరని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధానులు వీపీ సింగ్, చంద్రశేఖర్ లాంటివారు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ లాంటి వారు చేసిన వ్యాఖ్యలను కూడా సోనియా గాంధీ తప్పని నిరూపించారు. పశ్చిమ బెంగాల్, కేరళలో కాంగ్రెస్ పార్టీతో తీవ్రంగా ఢీకొంటున్న వామపక్షాలను కూడా యూపీఏలోకి తీసుకరావడంలో ఆమె విజయం సాధించారు. అలాగే ఉత్తరప్రదేశ్లో ప్రత్యర్థులైన సమాజ్వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలను కూడా కూటమిలోకి లాక్కు రాగలిగారు. వాజపేయి సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగుతున్న డీఎంకీ పార్టీని కూడా బయటకు రప్పించగలిగారు. విదేశీ వనిత అంటూ సంఘ్ పరివార్ విస్తృత ప్రచారం చేసిన నేపథ్యంలో తనకు ప్రధాన మంత్రి పదవి వద్దనడం ద్వారా సోనియా గాంధీ తన ప్రతిష్టను మరింత పెంచుకోగలిగారు. 2004లోనే కాకుండా 2009లో కూడా యూపీఏ కూటమిని అధికారంలోకి తీసుకరాగలిగారు. తదనంతర పరిణామాల్లో 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వాన బీజేపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రాగలిగింది. సరైన ముందస్తు ఏర్పాట్లు లేకుండా ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా ఓ తప్పడడుగు వేశారు. ఆయన చెప్పిన 50 రోజులు ముగిసినప్పటికీ ప్రజలకు నోట్ల కష్టాలు తీరులేదు. సమీప భవిష్యత్తులో తీరుతాయన్న సూచనలు లేవు. ప్రతిపక్షాలన్నీ ఏకమై వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇదే సరైన అవకాశం. ప్రతిపక్షాలను ఏకం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. యూపీఏ ఏర్పాటుకు ప్రయత్నించినప్పుడు సోనియాపై ఎలాంటి అభిప్రాయం ఉండేదో ఇప్పుడు రాహుల్పై కూడా రాజకీయ వర్గాల్లో అదే అభిప్రాయం ఉంది. రాజకీయ పరిణతి లేదని, మోదీ లాంటి వ్యక్తిని ఢీకొనగల తెలివితేటలు లేవన్నది ఆ అభిప్రాయం. పైగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఆఖరి రోజైన డిసెంబర్ 16వ తేదీన మోదీని కలసుకోవడం ద్వారా తప్పటడుగు వేశారు. ఫలితంగా వామపక్షాల ఆగ్రహానికి గురయ్యారు. తప్పును సరిదిద్దుకోవడంలో భాగంగా మంగళవారం మరోసారి ప్రతిపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, జేడీయూ లాంటి పార్టీలను లాక్కు రాలేకపోయారు. అయినా ఇప్పటికీ మించి పోయినదేమీ లేదు. అన్ని పార్టీలను కలుపుకుపోయేందుకు ఇప్పటికీ అవకాశం ఉంది. నోట్ల కష్టాలు ఇప్పట్లో తీరేది కాదు. మోదీ మరిన్ని తప్పటడుగులు వేయరని కాదు. రాహుల్ గాంధీ తప్పటడుగులు వేయరాదు. అవసరమైతే ప్రధాని పదవికి దూరంగా ఉంటాననే త్యాగనిరతిని కూడా చాటాల్సి ఉంటుంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ విజయం సాధిస్తారా, అంటే ఇప్పటికి సందేహాస్పదమే. కానీ ‘జరిగే ప్రతి సంఘటనకు దానికంటూ ఓ ప్రత్యేక కదలిక ఉంటుంది’ అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఓ సందర్భంలో అన్నారు. అలా సంఘటన వెనక సంఘటన జరుగుతూ వెళితే కదలికలు పెరిగి ప్రతిపక్షాలు సంఘటితం కావచ్చు. ––ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
అచ్ఛేదిన్ కాదు.. ఇవి బురే దిన్
- పెద్దనోట్ల రద్దుతో దేశంలో తీవ్ర గందరగోళం - సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో ఆ పార్టీ అగ్రనేత సురవరం సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ హయాంలో ప్రజలకు అచ్ఛేదిన్ బదులు బురే దిన్ వచ్చాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అధ్యక్షతన బుధవారం ఇక్కడ పార్టీ జాతీయ సమితి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సంద ర్భంగా సురవరం మాట్లాడుతూ మోదీని, కేంద్ర ప్రభుత్వతీరును ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల పై దేశ వ్యతిరేకశక్తులుగా ముద్ర వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజలకు మంచిరోజులు తీసుకొస్తామని అధికా రంలోకి వచ్చిన మోదీ హయాంలో కనీవినీ ఎరగని రీతిలో నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం పెరిగిపోయిందని, ప్రజల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. తదనంతర పరిణామాలను అంచనా వేయకుండా తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజల జీవనం అతలాకు తలమైందని విచారం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర గందరగోళంలోకి నెట్టివేశారని విమర్శించారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో విఫలమైన కేంద్రం జాతీయ బ్యాంకుల పైకి నెపం నెట్టి చేతులుదులుపుకునే ప్ర యత్నం చేస్తోందని, మరోవైపు ప్రైవేట్ బ్యాంకులను ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. కొన్ని సందర్భాల్లో న్యాయవ్యవస్థ సైతం మోదీపై వచ్చిన అవినీతి ఆరోపణలను పట్టించుకోనట్లుగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న ప్పుడు ఆయనకు రూ.70 కోట్లు చెల్లించి నట్లుగా సహారా పేపర్స్, బిర్లా అకౌంట్లలో వెల్లడి అయినా దానిని ఖండించలేదని అన్నారు. దీనిపై స్పందించేందుకు కోర్టులు కూడా నిరాకరించాయని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం... వామపక్షాలు, ప్రజాస్వామ్యశక్తులు కలసి ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలని సురవరం అన్నారు. వామపక్షాలు, ప్రజాస్వామ్యశక్తులు మరింత మెరుగైన అవగాహనను సాధించి మోదీ ప్రభుత్వ తప్పుడు విధానాలను తిప్పికొట్టాలని, మతతత్వ బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. కీలకమైన యూపీలో బీజేపీ అధికారంలోకి రాకుండా నిరోధించాలని అన్నారు. గోరక్ష దళాలు, ఇతర స్వయం ప్రకటిత సంస్థల ద్వారా యూపీ, తదితర రాష్ట్రాల్లో దళితులు, మైనారిటీలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తు న్నారని, వీటి వెనుక ఎవరున్నారనేది బహి రంగ రహస్యమేనని పేర్కొన్నారు. వీటికి వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం, ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని ఆర్పీఐతో కలసి ఢిల్లీలో పెద్ద ప్రదర్శనను నిర్వహించాయని, ఈ నిరసనలను దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. క్యూబా కమ్యూనిస్టు యోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో, ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి, తమిళ నాడు సీఎం జయలలిత, ప్రముఖ జర్నలిస్టు వి.హనుమంతరావు, పార్టీ సీనియర్ నాయ కులు సత్యపాల్రెడ్డి, సంగప్ప, వేమూరి నాగే శ్వరరావు, జీవీ కృష్ణారావుల మృతికి సీపీఐ జాతీయ సమితి నివాళులు అర్పించింది. -
వైఎస్సార్సీపీ, లెఫ్ట్ ఉమ్మడి పోరుబాట!
సాక్షి, అమరావతి బ్యూరో: బందరుపోర్టు నిర్మాణం ముసుగులో ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల కడుపు కొట్టి సాగు భూములు లాగేసుకుంటున్న సీఎం చంద్రబాబు వైఖరికి నిరసనగా ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటానికి వామపక్ష పార్టీలనేతలు జతకలిశారు. కృష్ణా జిల్లాలోని మచిలిపట్నం మండలం బుద్దాలపాలెం, కోన గ్రామాల్లో గురువారం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జరిగిన కార్యక్రమాలలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు మోదుమోడి రామారావు, సీపీఎం మచిలీపట్నం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మలు పాల్గొన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వైఎస్సార్సీపీ, వామపక్షాలు జెండాలు పక్కన పెట్టి సమైక్యంగా పోరాటాలకు కలసిరావడంపై ప్రజల్లోనూ, పోర్టు బాధిత రైతాంగంలోనూ హర్షం వ్యక్తమౌతోంది. -
హర్తాళ్ విజయవంతం
ప్రజల మద్దతు సంపూర్ణం - విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేత - ఏపీలో ఆందోళనకారుల అణచివేత - అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు - ప్రతిఘటించిన వైఎస్సార్సీపీ, కమ్యూనిస్టు శ్రేణులు సాక్షి, అమరావతి : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న అగచాట్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించే చర్యల కోసం ఒత్తిడి పెంచే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా పిలుపు నిచ్చిన హర్తాళ్కు సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై అణచివేతకు పాల్పడింది. ఎక్కడికక్కడ నేతలను అదుపులోకి తీసుకుంది. పోలీసు బలగాలను భారీగా మోహరించి, మునుపెన్నడూ లేని రీతిలో డ్రోన్లను సైతం ఉపయోగించి ఆందోళన కారులపై నిఘా వేసింది. అయినా రాజకీయ పార్టీల నేతలు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనలు వ్యక్తం చేయడంలో కృతకృత్యులయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పకడ్బందీగా హర్తాళ్లో పాల్గొన్నాయి. ఆ పార్టీ నేతలను పలు చోట్ల గృహ నిర్బంధం చేసినా, రోడ్ల మీదకు వచ్చిన వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా ప్రతిఘటిస్తూ వారంతా నిరసన ల్లో పాల్గొన్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం అందుకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఘోరంగా విఫలం కావడంతో సామాన్యుడి జీవితం అతలాకుతలం అరుుందనే ఆగ్రహంతో జాతీయ స్థారుులో ప్రతిపక్షాలు, వామపక్షాలు ఇచ్చిన హర్తాళ్ పిలుపునకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతును ప్రకటించి, స్వచ్ఛందంగా ఈ ఆందోళనలో పాల్గొని నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చింది. పేదలు పడుతున్న ఇక్కట్లను పరిష్కరించడంతో పాటు, పాత నోట్ల చలామణిని డిసెంబర్ 30 వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ కొనసాగించిన ఈ హర్తాళ్లో వైఎస్సార్ సీపీ, వామపక్షాల నేతలు, కార్యకర్తలు నిరసన తెలుపుతూ అరెస్టు అయ్యారు. రాజధాని కేంద్రమైన విజయవాడ నగరంలో అరెస్టరుున వామపక్షాల నేతలను వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. రాష్ట్రంలో హర్తాళ్ విజయంతమైనందుకు వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హర్తాళ్లో పాల్గొనే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తల కదలికలను పసి గట్టే పేరిట పోలీసులు మొదటిసారి కృష్ణా జిల్లాలో డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ముఖ్యమంత్రి స్వయంగా భద్రతా చర్యలను పర్యవేక్షించడం చర్చనీయాంశమైంది. -
హర్తాళ్పై సర్కారు దౌర్జన్యం
- వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజం - గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులెందుకు? - నోట్ల రద్దుపై టీడీపీ విధానమేమిటి? సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తిన ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యాలు, అరెస్టులు చేరుుంచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేరుుంచడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విలేకరులతో బొత్స మాట్లాడుతూ.. హర్తాళ్పై బలప్రయోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఇంతకీ నోట్ల రద్దుపై టీడీపీ విధానమేమిటని నిలదీశారు. నల్లధనాన్ని వెలికితీయటానికి కేంద్రం తీసుకునే ఎలాంటి చర్యనైనా వైఎస్ఆర్సీపీ సమర్థిస్తుందని, వాటి వల్ల సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు కలగకూడదన్నదే తమ అభిమతమని స్పష్టం చేశారు. బ్యాంకర్ల అసోసియేషన్ ఆర్బీఐ గవర్నర్ రాజీనామా కోరిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చన్నారు. దేశ చరిత్రలో రిజర్వ్ బ్యాంకు గవర్నర్ను రాజీనామా చేయమన్న డిమాండ్ ఎప్పుడూ లేదని బొత్స తెలిపారు. ఫ్యూచర్ గ్రూప్కు నగదు లావాదేవీలా..? సహకార సొసైటీల్లో రాజకీయాల పేరుతో నగదు మార్పిడికి అనుమతించని ప్రభుత్వం చంద్రబాబుతో భాగస్వామ్యం ఉన్న ఫ్యూచర్ గ్రూప్ స్టోర్లలో 200 ఏటీఎం సెంటర్లు ప్రారంభించాలని ఎలా నిర్ణయం తీసుకుంటుందని బొత్స దుయ్యబట్టారు. దేశంలో ప్యూచర్ గ్రూప్ తప్ప ఇంకే రిటైల్ స్టోర్లు లేవా? అని ప్రశ్నించారు. ప్రజలంతా సంక్షోభంలో ఉంటే దాంట్లో కూడా బాబు వ్యాపార కోణం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఊహించినట్లే చంద్రబాబుతో ఆర్థిక సంబంధాలు ఉన్న సంస్థలకు మినహారుుంపులు ఇస్తున్నారని, రూ.14 వేల కోట్ల బకారుుల్ని రద్దు ద్వారా కేంద్రం ఎలాంటి సంకేతాలిస్తోందని ప్రశ్నించారు. ఈ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ అంటూ చంద్రబాబు ప్రజల్ని మభ్య పెడుతున్నారని ధ్వజమెత్తారు. మారుమూల గ్రామాలకు ఎంత మేర ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందో ఆయనే చెప్పాలన్నారు. ఇంకో రెండు రోజుల్లో జీతాలు ఇవ్వాలని, అప్పుడూ ఇలాంటి పరిస్థితే ఉంటే ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. నోట్ల రద్దుపై ఉపసంఘాన్ని వేస్తున్నారని, దీనికి చంద్రబాబు అధ్యక్షుడుగా ఉండాలని అరణ్ జైట్లీ అడిగారని విలేకరులు ప్రశ్నించగా.. అరుణ్జైట్లీ అడిగారా? లేక ఈయనే సొంత మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. -
నోట్ల రద్దుపై దేశవ్యాప్త నిరసన
ఢిల్లీ/తిరువనంతపురం: కేంద్రం ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాన విపక్షాలు సోమవారం దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు చేపట్టాయి. వామపక్షాలు 12 గంటల బంద్కు పిలుపునివ్వగా.. కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) ఆందోళనలు చేపట్టాలని నిర్ణరుుంచాయి. జేడీయూ, బీజేడీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనబోమన్నాయి. ఈ నేపథ్యంలో కేరళ, త్రిపురల్లో బంద్ విజయవంతమైంది. కమ్యూనిస్టులకు పట్టున్న పశ్చిమ బెంగాల్లో మాత్రం బంద్ విఫలమైంది. కాంగ్రెస్, తృణమూల్ కార్యకర్తలు పలు రాష్ట్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తమిళనాడులో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలు ఆయా పార్టీల కార్యకర్తలతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల ఎదుట ఆందోళనలు చేసి అరెస్టయ్యారు. ఢిల్లీలో సీపీఎం, సీపీఐతో సహా ఏడు వామపక్షాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారుు. కాంగ్రెస్ సోమవారం ‘ఆక్రోశ్ దివస్’గా పాటించింది. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ రైసినా రోడ్ నుంచి పార్లమెంటు వరకు నిరసన ప్రదర్శన జరపాలనుకున్నప్పటికీ పోలీసులు బారికేడ్లను అడ్డంపెట్టి వారి ప్రయత్నాన్ని వమ్ము చేశారు. నిరసన ప్రదర్శనలతో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డారుు. కేరళలో అధికార పార్టీ సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ చేపట్టిన 12 గంటల బంద్ విజయవంతమైంది. పశ్చిమ బెంగాల్లో బంద్ విఫలం.. పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ పార్టీలు చేపట్టిన 12 గంటల బంద్ విఫలమైంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకించడంతో బంద్ ప్రభావం రాష్ట్రంలో కనిపించలేదు. మరోవైపు కొత్త నోట్లు దొరకక, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆగ్రహంగా ఉన్న ప్రజలు మణిపూర్ రాష్ట్రంలోని రెండు ఎస్బీఐ శాఖలను ధ్వంసం చేశారు. రాజస్తాన్ నాగౌర్ జిల్లాలో ప్రహ్లాద్ సింగ్ అనే 70 ఏళ్ల వృద్ధుడు బ్యాంకు వద్ద వరుసలో నిలబడి ఉండగా మరణించాడు. -
ప్రజలు చేసిన తప్పేంటి?
ప్రధాని మోదీ తీరుపై వామపక్షాల ఆగ్రహం సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు పేదలకు కష్టాలు తెచ్చిపెట్టిందే తప్ప డబ్బున్న పెద్దోళ్లను కాదని లెఫ్ట్ పార్టీలు ధ్వజమెత్తాయి. ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన 55 వేల మంది నల్లధన కుబేరులు హాయిగా ఉన్నారని పేర్కొన్నాయి. 48 గంటల తర్వాత నగదు లావాదేవీలన్నీ సాధారణ స్థితికి వస్తాయని ఈనెల 8న ప్రకటించిన ప్రధాని మోదీ.. ఇపుడు మాటమార్చి మరో 50 రోజులు కష్టాలుంటాయని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించాయి. మోదీ తీరును నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిర్ణరుుంచాయి. ఈమేరకు ఆదివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. -
ఆర్కేను వెంటనే కోర్టులో హాజరుపరచాలి
లెఫ్ట్ పార్టీల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: మావోయిస్ట్ నేత రామకృష్ణను వెంటనే కోర్టులో హజరుపరచాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. గత నెల 24న జరిగిన ఎన్కౌంటర్, ఆ తర్వాత జరిగిన కాల్పులపై న్యాయవిచారణకు ఆదేశించాలని మంగళవారం జరిగిన ఎనిమిది వామపక్ష పార్టీల సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్, ఆ తర్వాతి ఘటనలపై పోలీసు అధికారుల విరుద్ధ ప్రకటనల వల్ల ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమ వుతున్నందున వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఆర్కేను పట్టుకుని పోలీస్ కస్టడీలో ఉంచుకోవడంతో ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆర్కే బంధువులు ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. ఈ మేరకు చాడ వెంకటరెడ్డి (సీపీఐ), చెరుపల్లి సీతారాములు (సీపీఎం), సాధినేని వెంకటేశ్వరరావు (న్యూడెమోక్రసీ-చంద్రన్న), జె.జానకిరాములు (ఆర్ఎస్పీ), తాండ్రకుమార్ (ఎంసీపీఐ-యూ), మురహరి (ఎస్యూసీఐ-సీ), బండా సురేందర్రెడ్డి (ఫార్వర్డ్బ్లాక్), భూతం వీరన్న (సీపీఐ-ఎంఎల్) సంయుక్త ప్రకటన విడుదల చేశారు. -
వాస్తవాలను తేల్చాలి: సురవరం
ఏఓబీ ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలి - పట్టుకుని కాల్చి చంపడం దారుణం - ఎన్కౌంటర్పై ఎన్నో సందేహాలు వస్తున్నాయి - దీనిపై ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఏఓబీ ఎన్కౌంటర్ ఘటనపై న్యాయ విచారణ జరిపించి, నిజాలను నిగ్గుతేల్చాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. 34 మంది మావోయిస్టులు మరణించడాన్ని బట్టి అది ఎన్కౌంటర్ కాదని స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. మావోయిస్టులను ముందుగానే పట్టుకుని, రోజుకు కొందరిని హతమార్చుతూ ఎన్కౌంటర్లుగా ప్రకటిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. శుక్రవారం హైదరాబాద్లో పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి, అజీజ్పాషా, గుండా మల్లేశ్, ఈర్ల నర్సింహలతో కలసి సురవరం విలేకరులతో మాట్లాడారు. ఎన్కౌంటర్ ఘటన ఏపీ పరిధిలో జరిగినా మృతదేహాలను ఒడిశాకు తీసుకెళ్లడం అనుమానాలకు తావిస్తోందని.. పౌర హక్కుల సంఘాలూ ఇదే విషయాన్ని చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టకుండా కాల్చి చంపడం దారుణమన్నారు. వారికి విషం, మత్తు మందు పెట్టారనే ఆరోపణలూ వస్తున్నాయని చెప్పారు. ఈ ఎన్కౌంటర్లో ఏపీ పోలీసులు పాల్గొన్నందున ఏపీ ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. లేఖపై విచారణ జరపాలి మావోయిస్టుల విధానాలు, అనుసరించే పద్ధతులను తమ పార్టీ అంగీకరించదని... అయితే ఏకపక్షంగా చంపే హక్కు పోలీసులకు లేదని సురవరం పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్కౌంటర్పై ప్రభుత్వం ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిదని చెప్పారు. ఇక చంద్రబాబు కుటుంబంపై భౌతిక దాడులకు పాల్పడతామంటూ మావోయిస్టుల పేరిట వచ్చిన లేఖ నకిలీదని పోలీసులు, పౌర హక్కుల నేతలు కూడా చెబుతున్నారని... అది నకిలీదే అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలన్నారు. ఆ లేఖ నిజమైనదైతే చంద్రబాటు కుటుంబాన్ని టార్గెట్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్కు జెడ్ ప్లస్ రక్షణ కోసమే ఈ లేఖను సృష్టించారనే ఆరోపణలూ వస్తున్నాయని చెప్పారు. ఈ అంశాలపైనా విచారణ జరిపించాలన్నారు. ఘర్షణల సృష్టికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు దేశంలోని అనేక చోట్ల ఘర్షణలను సృష్టించేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని సురవరం ఆరోపించారు. దీని పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన సంఘ్ కేంద్ర కమిటీ సమావేశాల్లో కేరళ, పశ్చిమబెంగాల్లలో హిందువులపై దాడులు జరుగుతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. వామపక్షాలు హిందువులకు వ్యతిరేకమనే ఆర్ఎస్ఎస్ అవాస్తవమని స్పష్టం చేశారు. వామపక్షాలు ఏ మతానికి వ్యతిరేకం కాదని, అనుకూలమూ కాదని చెప్పారు. అన్ని మతాల పట్ల సమానమైన గౌరవాన్ని కలిగి ఉన్నాయని సురవరం పేర్కొన్నారు. -
బాబుకు భూమి పిచ్చి పట్టింది..
పది వామపక్ష పార్టీల ధ్వజం సాక్షి, అమరావతి: ‘‘సీఎం చంద్రబాబుకు భూమి పిచ్చి పట్టింది.. అవసరానికి మించి భూములు లాక్కొని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు’’ అంటూ పది వామపక్ష పార్టీలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. రైతులు, పేదల పొట్టకొట్టి కాలుష్యకారక పరిశ్రమలు పెడతామంటే కచ్చితంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశాయి. పోలీసు ఆంక్షలు పెట్టినా లెక్క చేయబోమని, బాధిత గ్రామాల్లో పర్యటించి దశలవారీ ఆందోళనలు చేపడతామని, అనంతరం అసెంబ్లీని ముట్టడిస్తామని పేర్కొన్నాయి. విజయవాడ సీపీఎం కార్యాలయంలో శనివారం జరిగిన పది కమ్యూనిస్టుపార్టీల నేతల సమావేశం ఈమేరకు పలు తీర్మానాలు చేసింది. వివరాల్ని నేతలు మీడియాకు వెల్లడించారు. -
ఆ వేడిలో.. ‘హోదా’ అన్నా
-
ఆ వేడిలో.. ‘హోదా’ అన్నా
విజయవాడ సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి రూ. 4 వేల కోట్ల ప్రయోజనం మాత్రమే ఉంటుందని, ప్యాకేజీతో రూ. 2.25 లక్షల కోట్ల నిధులు వస్తాయని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీకి మించి మరో మార్గం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించి, ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పానన్నారు. శనివారం విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్యాకేజీ అవగాహన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్యాకేజీ ప్రకటనకు చొరవ చూపిన వెంకయ్యను రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రులు, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ‘‘విభజన బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందే సమయంలో అప్పటికి ఉన్న రాజకీయ వేడిలో తెలంగాణలో గొడవలు జరుగుతున్నాయి. బిల్లుపై చర్చించడానికి ఒక రోజు ఆలస్యం జరిగితేనే తెలంగాణలో పలుచోట్ల నా దిష్టిబొమ్మ తగలబెట్టారు. దీంతో ఏపీకి న్యాయం చేసేందుకు రాజ్యసభలో హోదా గురించి డిమాండ్ చే శాను’’ అని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.. హోదా వస్తే రాత్రికి రాత్రే హైదరాబాద్లా మారిపోతుందని కొందరు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. చంద్రబాబు విశాఖపట్నంలో ఒక సదస్సు పెడితే రూ. 4.25 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని, వాళ్ల్లు ఎవరూ ప్రతే ్యక హోదా కోసం రాలేదని చెప్పారు. లోపాయికారీ ఏంటీ.. అది బహిరంగమే! తాను చెప్పిన వెంటనే ప్యాకేజీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోగానే మా ఇద్దరి మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగినట్టు విమర్శలు చేస్తున్నారని వెంకయ్య తప్పుపట్టారు. అదేమీ లోపాయికారీ కాదని, బహిరంగమేనని చెప్పారు. మండిపడిన వామపక్షాలు విజయవాడ(రామవరప్పాడు): ప్రత్యేక హోదా అంశంలో ఆంధ్రులను నమ్మించి నట్టేట ముంచిన వెంకయ్య నాయుడుకు రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని వామపక్షాలు మండిపడ్డాయి. శనివారం విజయవాడవచ్చిన వెంకయ్యకు వామపక్షాలనుంచి గట్టి నిరసన ఎదురైంది. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఆయన వస్తున్నారని తెలుసుకున్న సీపీఎం, సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున రామవరప్పాడు రింగ్ సెంటర్కు చేరుకున్నాయి. దీంతో పోలీసులు పలువురిని అరెస్టుచేశారు. -
'ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు'
► ‘హోదా’ కోసం తిరుపతిలో వామపక్షాల ఆందోళనలు ► తీవ్ర వ్యతిరేకతల మధ్య అరెస్ట్లు తిరుపతి అర్బన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీలు తిరుపతిలో ఆందోళనలు నిర్వహించాయి. సీపీఐ, సీపీఎం, సీఐటీయూ నాయకులు గురువారం తిరుపతిలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాధరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి కుమార్రెడ్డిల ఆధ్వర్యంలో ముందుగా ప్రధాన తపాలా కార్యాలయాన్ని, ఆ తర్వాత బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్లను ముట్టడించారు. తపాలా డివిజన్ కార్యాలయం, విక్రయాల విభాగం, ఉత్తరాల స్క్రుటినీ(బట్వాడా సిబ్బంది) విభాగాల తో పాటు బీఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న ఉద్యోగులను బయటకు వెళ్లాలని నినాదాలు చేశారు. కొంతసేపు ఉద్యోగులు ససేమిరా అనడంతో ఆందోళనకారులు కొంత తీవ్రతను ప్రదర్శించారు. దాంతో ఇరువర్గాల మధ్య వాదనలు చోటు చేసుకున్నాయి. తిరుపతి ఈస్ట్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో నిరసనకారులకు, పోలీసులకు వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పోలీసులు అందరినీ బలవంతంగా లాక్కెళ్లి మినీ లారీ ఎక్కించి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం న్యాయం చేసేంత వరకు కొనసాగిస్తామని పేర్కొన్నారు. -
హోదా ఎలా తెస్తావో చెప్పు బాబూ!
–సీపీఐ, సీపీఎం నేతలు శంకర్, కాశీనాథ్ ధ్వజం గాంధీనగర్ : స్వచ్ఛభారత్ నినాదాలతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని, పోరాడితేనే కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందని సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, కాశీనాథ్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ,టీడీపీ అనుసరిస్తున్న మోసపూరిత విధానాలకు నిరసనగా లెనిన్సెంటర్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక దీక్షలు చేపట్టారు. సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె రామకృష్ణ, పి మధు పాల్గొని దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్, కాశీనాథ్లు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదాపై మాటతప్పాయన్నారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే బంద్ను విఫలం చేసేందుకు యత్నించేవారు కాదన్నారు. హోదా కోసం ఉద్యమిస్తుంటే అరెస్ట్లు చేసిన చంద్రబాబు తాను ఏ విధంగా హోదా సాధిస్తారో ప్రజలకు వివరించాలన్నారు. ప్రతిపక్షాల బంద్ విఫలమైందని మంత్రులు, ఆర్టీసీకి రూ. 4కోట్ల నష్టం వచ్చిందంటూ ముఖ్యమంత్రి పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారన్నారు. బంద్ విఫలమైతే ఆర్టీసీకీ నష్టం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఈ దీక్ష శిబిరంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, బిబిఎ అధ్యక్షులు సీహెచ్ మన్మధరావు, మాజీ అధ్యక్షులు సంపర శ్రీనివాసరావు, పిళ్లా రవి, సీపీఐ రాష్ట్ర నాయకులు ఆర్ రవీంద్రనాథ్, జి కోటేశ్వరరావు, పల్లా సూర్యారావు, మహిళా సంఘం నాయకులు దుర్గాంబ, సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, యువి రామారాజు, ఆర్ కోటేశ్వరరావు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రాజకీయ పార్టీలకు స్థలాల కేటాయింపు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ పార్టీలకు స్థలాలు కేటాయిస్తూ గురువారం జీవో జారీ చేసింది. జాతీయ, ప్రాంతీయ గుర్తింపు పార్టీలకు స్థలాల కేటాయింపు పాలసీని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. శాసనసభలో 50 శాతం కంటే సీట్లు ఎక్కువగా ఉన్న పార్టీలకు సీఆర్డీఏ పరిధిలో 4 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. 25 నుంచి 50 శాతం మధ్య సీట్లు ఉంటే అర ఎకరం మాత్రమే కేటాయింపులు జరిగాయి. కనీసం ఒక్క సభ్యుడైనా ఉంటే వెయ్యి గజాలు, జిల్లా కేంద్రాల్లో కూడా పార్టీ కార్యాలయాలకు స్థలాలు, 50 శాతం కంటే ఎక్కువ సీట్లున్న పార్టీకి రెండెకరాలు,25 నుంచి 50 శాతం మధ్య సీట్లున్న పార్టీలకు వెయ్యి గజాలు, 25 శాతం లోపు, కనీసం ఒక సభ్యుడుంటే 300 గజాల కేటాయింపు కేటాయించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలకు స్థలాలు దక్కనట్లే. కాగా శాసనసభలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంకు ఒక్క సభ్యుడి ప్రాతినిధ్యం కూడా లేని విషయం తెలిసిందే. మరోవైపు భారతీయ జనతా పార్టీకి కేవలం వెయ్యి గజాలు మాత్రమే దక్కే అవకాశం ఉంది. -
తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత
-
ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
‘బందరు పోర్టుకు భూసమీకరణ’పై వామపక్షాల డిమాండ్ సాక్షి, విజయవాడ బ్యూరో : బందరు పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్కోసం లక్ష ఎకరాలకుపైగా భూమిని సమీకరించాలన్న రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని పది వామపక్ష పార్టీలు తప్పుపట్టాయి. భూసమీకరణకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్ జారీ చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ(ఎంఎల్) రాష్ర్ట నాయకుడు విజయ్కుమార్ అధ్యక్షతన పది కమ్యూనిస్టు పార్టీల నాయకుల సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ పది వామపక్షపార్టీల నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. బందరు పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో తీరప్రాంతంలోని మత్స్యకారులు, రైతులు, ప్రజల జీవనాన్ని దెబ్బతీసే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని ప్రకటించారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. భూమిని కాపాడుకునేందుకు బందరు ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు బాసటగా నిలవాలని నిర్ణయించినట్టు తెలిపారు. సీపీఎం నాయకుల అరెస్ట్లకు ఖండన: శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణం వల్ల రాష్ర్ట ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ ఈ నెల 17వ తేదీన విశాఖలో నిర్వహించనున్న జాతీయ సెమినార్పై ప్రచారం నిర్వహిస్తున్న సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని పది లెఫ్ట్ పార్టీల నాయకులు ఖండించారు. రాష్ట్రప్రభుత్వ చర్యలను ప్రజాస్వామిక వాదులంతా నిరసించాలని వారు విజ్ఞప్తి చేశారు. -
27న మమత ప్రమాణం
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా మమతా బెనర్జీ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మమత పేరును పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పార్థ ఛటర్జీ ప్రతిపాదించగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సమర్ధించారు. అనంతరం ఆమె గవర్నర్ త్రిపాఠిని కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. మే 20 చాలా ప్రాముఖ్యమైందని, 2011న ఇదే రోజు తృణమూల్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిందని ఆమె విలేకర్లతో చెప్పారు. ఈ నెల 27న సీఎంగా మమత ప్రమాణస్వీకారం చేయనున్నారు. తృణమూల్ విజయానికి పంచమంత్రం కోల్కతా: బెంగాల్లో తృణమూల్కు అఖండ విజయం సులువుగా దక్కలేదు. 2011లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచి మమతా బెనర్జీ బెంగాల్ ముఖచిత్రాన్ని మార్చేందుకు శ్రమించారు. కేంద్రంతో పోట్లాడినా, ఆవేశంగా మాట్లాడినా సంక్షేమాన్ని మరవలేదు. కులసమీకరణాల్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు. ఆదాయాన్ని రెట్టింపు చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించారు. 1. అభివృద్ధి.. గత ఐదేళ్లలో బెంగాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరిగింది.ఉపాధి హామీ పథకంలో పూర్తి స్థాయిలో అమలైంది. బెంగాల్లో గ్రామీణ ప్రజలు ఈ పథకంలో ఎక్కువ లబ్ది పొందారు. ఈ పథకంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాల్లో బెంగాల్ గత నాలుగేళ్లుగా దేశంలో మొదటి స్థానాల్లో నిలిచింది.గత నాలుగేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన రాష్ట్రాల్లో బెంగాల్ రెండో స్థానంలో నిలిచింది. చిన్న గ్రామాలు సైతం తారురోడ్లతో మెరిసిపోయాయి. విద్యపై కూడా మమత అధికంగా దృష్టిపెట్టారు. సబుజ్ సతి పథకంలో 9 నుంచి 12 తరగ తి విద్యార్థినులకు సైకిళ్లు అందచేశారు. ఆర్థికంగా వెనబడ్డ అమ్మాయిలకు కన్యశ్రీ పథకంలో ఏడాదికి రూ. 750 నుంచి రూ.25 వేల వరకూ ఉపకార వేతనాలు అందచేశారు. 2. సామాజిక సమీకరణాలు.. ఈ సారి బెంగాల్లో కుల సమీకరణాలకు మమత తెరలేపారు. అతిపెద్ద దళిత కులం మతువాతో పాటు నమశుద్రలు, బెంగాల్ ముస్లింల మద్దతును మమత అభ్యర్థించారు. సీపీఎం ఓటు బ్యాంకైన గ్రామీణ బెంగాలీ ముస్లింల్ని మమత తనవైపుకు తిప్పుకున్నారు. 3. లెఫ్ట్ భావజాలం (పేదల పక్షపాతి) లెఫ్ట్ పార్టీలు అనుసరించిన పేదల సంక్షేమ మంత్రాన్నే మమత అనుసరించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమించి లెఫ్ట్ను మట్టికరిపించి మమత అధికారంలోకి వచ్చాక ఆ విధానాన్నే అనుసరించారు. 2012లో ప్రత్యేక ఆర్థిక మండలి పాలసీని రద్దు చేశారు. 4. సంక్షేమం ఖర్చు మూడింతలు పెంపు మమత అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ఆదాయాన్ని రెట్టింపు చేశాయి. అప్పులు తగ్గి రాష్ట్రం ఆర్థికంగా మెరుగుపడింది. దీంతో పేదల కోసం మమత మరింత ఖర్చుపెట్టారు. సంక్షేమ ఖర్చును మూడింతలు పెంచారు. సీపీఎంకు పట్టున్న పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించారు. 5. నామమాత్రంగా కూటమి ప్రభావం సీపీఎం, కాంగ్రెస్ల్లో హైకమాండ్ సంస్కృతి ఆ కూటమిని దారుణంగా దెబ్బతీసింది. క్షేత్రస్థాయి పరిస్థితులపై సరైన అవగాహన లేని నేతలు కూడా నిర్ణయాలు తీసుకోవడం కూటమి ప్రభావాన్ని నామమాత్రం చేసింది. దీంతో ఓటర్లను ఈ కూటమి ప్రభావితం చేయలేకపోయింది. -
అనంతలో ప్రత్యేక హోదా కోసం దీక్ష
అనంతపురం: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ప్రత్యేకహోదా సాధన సమితి నేతృత్వంలో నిరవధిక దీక్షలు చేపట్టారు. ఆదివారం ఉదయం అనంతపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద లెఫ్ట్ నేతలు సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు, సినీనటుడు శివాజీ, చలసాని శ్రీనివాస్తో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు పోరాడాలని...లేకపోతే ప్రజలు తగినా విధంగా బుద్ధి చెప్పుతారని నేతలు సూచించారు. -
కరువుపై వామపక్షాల ఉద్యమం
* నేటితో ముగియనున్న సీపీఎం పాదయాత్రలు * సోమ, మంగళవారాల్లో జిల్లాల్లో నిరసనలు * 16 నుంచి 18 తేదీల్లో సీపీఐ కరువు పరిశీలన * ఆ తర్వాత కలెక్టరేట్ల ముట్టడి, చలో సెక్రటేరియట్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టేలా ఒత్తిడి తెచ్చేందుకు వామపక్షాలు ఉద్యమించనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన కరువు తాండవిస్తున్న దృష్ట్యా ప్రజలను ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకునేలా కార్యాచరణను చేపట్టాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయించాయి. ఇప్పటికే సీపీఎం ఈ నెల 4 నుంచి 10 వరకు జిల్లాల్లో పాదయాత్రలు, ఇతరత్రా రూపాల్లో కరువు పరిశీలనను చేపట్టింది. సోమ, మంగళవారాల్లో మండల, జిల్లా స్థాయిల్లో ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. సీపీఐ జిల్లా పర్యటనలు.. రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని కరువు పరిస్థితులను పార్టీపరంగా స్వయంగా పరిశీలించేందుకు సీపీఐ నాయకత్వం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులతో మూడు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో రోజుకో జిల్లా చొప్పున ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, అజీజ్పాషా, గుండా మల్లేశ్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, మెదక్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఈర్ల నర్సింహా, పశ్య పద్మ పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలు ముగిశాక ఈ నెల 20, 21 తేదీల్లో మండల కేంద్రాల్లో... ఈనెల 22న లేదా 25న జిల్లా కలెక్టర్ల ఎదుట ఆందోళన నిర్వహించాలని సీపీఐ నిర్ణయించింది. ఆ తర్వాత చలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపట్టాలని భావిస్తోంది. జలవిధానంపై పార్టీ కమిటీ... రాష్ట్రంలోని ప్రాజెక్టులపై అధ్యయనం చేసి పార్టీపరంగా జలవిధానాన్ని రూపొందించేందుకు కూనంనేని సాంబశివరావు, పశ్య పద్మ, ఈర్ల నర్సింహాతో సీపీఐ ఒక కమిటీని నియమించింది. ఇదివరకే పార్టీ ఆధ్వర్యంలో కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల సందర్శనను పూర్తి చేసిన నేపథ్యంలో ఈ అధ్యయనానికి ఆయా అంశాలను జోడించి పది రోజుల్లో జలవిధానంపై ఒక పుస్తకాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించింది. -
‘తమ్మిడిహెట్టి’తోనే గరిష్ట ప్రయోజనం
♦ ఇక్కడి బ్యారేజీ వద్ద తక్కువ ఖర్చుతో వీలైనంత ఎక్కువ నీటిని తీసుకోవచ్చు ♦ ‘ప్రాణహిత’పై రిటైర్డ్ ఈఎన్సీ హనుమంతరావు ‘ప్రజెంటేషన్’ ♦ హాజరైన కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీలు, జేఏసీ చైర్మన్ కోదండరాం సాక్షి, హైదరాబాద్: ప్రాణిహిత-చేవెళ్ల ప్రాజెక్టు మొదటి డిజైన్లో ఉన్న తమ్మిడిహెట్టి బ్యారేజీ వద్ద నీటి మళ్లింపుతోనే రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలున్నాయని నీటి పారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు స్పష్టం చేశారు. ప్రాణహిత ద్వారా లభించే నీటిని తమ్మడిహెట్టి వద్ద గరిష్టంగా వినియోగిస్తేనే ప్రాజెక్టుపై ఆర్థిక, విద్యుత్ భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఇక్కడ తీసుకున్నా, ఇంకా మనకు దక్కాల్సిన నీటిని మేడిగడ్డ నుంచి తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఆయన ‘ప్రాణహిత-చేవెళ్ల పునరాకృతి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి’ అన్న అంశమై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ శాసనాసభా పక్ష ఉపనేత టి.జీవన్రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావు, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ రైతు విభాగపు అధ్యక్షుడు వంటేరు ప్రతాప్రెడ్డి, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, జలసాధన సమితి నేత నైనాల గోవర్ధన్తోపాటు లోక్సత్తా, ఆప్, న్యూడెమోక్రసీ నేతలు పాల్గొన్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు హాజరుకాలేదు. తమ్మిడిహెట్టి వద్ద 120 టీఎంసీలు తీసుకోవాలి తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై ఇప్పటి వరకు శాస్త్రీయంగా అధ్యయనం జరగలేదని హనుమంతరావు తెలిపారు. శాస్త్రీయంగా నీటి లభ్యత తేలాలంటే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, రూర్కీ వారిచే అధ్యయనం చేయించాలన్నారు. కేంద్ర జల సంఘం లెక్కల మేరకు తమ్మిడిహెట్టి వద్ద 120 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉందని అన్నారు. మేడిగడ్డతో పోలిస్తే తమ్మిడిహెట్టి 50 మీటర్ల ఎత్తులో ఉన్నందున, పంపింగ్కు అయ్యే చార్జీలు మిగులుతాయన్నారు. తమ్మడిహెట్టి ఎత్తు 148 మీటర్లు లేక 152 మీటర్లు అన్న చర్చ అనవసరమని, ఏ ఎత్తులో నిర్మించినా నిర్ణీత నీటిని మళ్లించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎత్తు తగ్గింపుతో బ్యారేజీ సామర్థ్యం తగ్గితే ఆ నీటిని ప్రస్తుతం 180 టీఎంసీల సామర్థ్యంతో కడుతున్న రిజర్వాయర్లలో ఎక్కడైనా సర్దుబాటు చేయవచ్చన్నారు. ఇక 71 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల నిర్మాణం మెదక్ జిల్లాలో చేస్తున్నారని, ఇక్కడ తాగు, సాగు అవసరాల కోసం ఏడాది పొడవునా నీరుంచాలంటే ఈ నీటిలో 20 శాతం ఆవిరి నష్టాలు, సీపేజ్ నష్టాలుంటాయన్నారు. అదీగాక రిజర్వాయర్లను నింపేందుకు 148 మీటర్ల ఎల్లంపల్లి నుంచి 600 మీటర్ల ఎత్తున్న మల్లన్నసాగర్కు పంపింగ్ చేయాలంటే విద్యుత్ అవసరం చాలా ఎక్కువని, ఈ దృష్ట్యా ఈ రెండు బ్యారేజీలను అదే సామర్థ్యంతో తమ్మిడిహెట్టి, ఎల్లంపల్లిల మధ్య ఏర్పాటు చేస్తే గ్రావిటీ ద్వారా నీరొస్తుందన్నారు. దీంతో పంపింగ్కు అయ్యే విద్యుత్ నష్టాలు తగ్గి, వ్యయం కూడా తగ్గుతుందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిషా లేవనెత్తిన అభ్యంతరాల దృష్ట్యా కరకట్టలు కట్టుకోవాలని కేంద్ర జల సంఘం ఆంధ్రప్రదేశ్కు సూచించిందని, అదే మాదిరి తమ్మిడిహెట్టి వద్ద కరకట్ట కట్టే అవకాశం పరిశీలించాలని అన్నారు. కరకట్టల వల్ల మహారాష్ట్రలో ముంపు నివారణ చేయవచ్చని, 148 మీటర్ల ఎత్తులోనే దీన్ని నిర్మించవచ్చని అన్నారు. ఈయన అభిప్రాయంతో హనుమంతరావు సైతం ఏకీభవించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీడిజైన్ వల్ల ప్రాజెక్టు వ్యయం రూ.38 వేల కోట్ల నుంచి 83 వేల కోట్లకు పెరుగుతుందన్నారు. తాను సూచించిన ప్రకారం చేస్తే సుమారు రూ.20 వేల కోట్లు ఆదా అయ్యే అవకాశముందన్నారు. -
కన్హయ్య అంటే అంత భయమెందుకు?
- సిద్దార్థ కళాశాల వేదిక రద్దుపై మండిపడ్డ వామపక్షాలు - ఐవీ ప్యాలెస్ వద్ద నిర్వహించేందుకు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ జేఎన్యూ విద్యార్థిసంఘ నాయకుడు కన్హయ్య కుమార్ పర్యటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) లోనికి అనుమతి నిరాకరించిన పాలకవర్గం యూనివర్శిటీ ప్రాంగణాన్ని పోలీసు మయంగా మార్చి వేసింది. బుధవారం సాయంత్రం ఆయన్ను లోపలికి వెళ్లకుండా అడ్డుకుంది. ఈ తరహాలోనే విజయవాడ సభకూ పాలకులు ఆటంకాలు కల్పించారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ సిద్దార్థ ఆడిటోరియంలో సభకు స్థానిక పోలీసు యంత్రాంగం అనుమతి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేయించింది. రాజకీయ వత్తిళ్లే ఈ అనుమతి రద్దుకు కారణమని విద్యార్థి, యువజన, మేథావుల విశాల వేదిక ఆరోపించింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మీటింగ్కు అనుమతి నిరాకరించడం ఏమి ప్రజాస్వామికమని ప్రశ్నించింది. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా కన్హయ్య మీటింగ్ జరిపి తీరుతామని ప్రకటించింది. సభా వేదికను ఇండోర్లో నిర్వహించేకన్నా బహిరంగంగా జరపడమే ఉత్తమమని భావించి కన్హయ్య మీటింగ్ వేదికను ఆంధ్రా హాస్పిటల్స్కు సమీపంలోని ఐవీ ప్యాలెస్ సెంటర్కు మార్చింది. సాయంత్రం 5.30 గంటలకు అక్కడ సభను నిర్వహించాలని తలపెట్టింది. ఇదిలా ఉంటే, కన్హయ్య సభకు ఆటంకాలు కల్పించడాన్ని పది కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఓ విద్యార్ధి సంఘ నాయకుణ్ణి చూసి పాలకులు ఇంతగా బెంబేలు ఎత్తాలా? అని ప్రశ్నించాయి. ప్రజాస్వామ్యంలో మీటింగ్ జరుపుకునే స్వేచ్ఛ కూడా లేదా? అని ప్రశ్నించాయి. ఐవీ ప్యాలెస్ సెంటర్లో జరిగే సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయి పాలకులకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశాయి. కాగా, అనంతపురం ఎస్కే యూనివర్శిటీలో అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. -
'ప్రభుత్వం మెడలు వంచి స్థలాలు సాధిస్తాం'
విజయవాడ : పభుత్వం మెడలు వంచైనా పేదలకు ఇళ్ల స్థలాలు సాధిస్తామని, పేదలు, రైతుల భూములను కార్పొరేట్లకు కట్టబెడితే టీడీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోతాయని వామపక్ష నేతలు హెచ్చరించారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పది కమ్యూనిస్టు పార్టీలు మంగళవారం చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రదర్శన నిర్వహించి జింఖానా గ్రౌండ్స్లో బహిరంగ సభ జరిపారు. సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు టీడీపీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు అధికారం ఉంది కాబట్టి కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేరుతున్నారని, అది నిజమైన బలం అనుకుని భ్రమపడొద్దని అన్నారు. కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు 10 లక్షల ఎకరాల భూ బ్యాంకును సిద్ధంచేస్తున్న ప్రభుత్వం కనీసం ఒక లక్ష ఎకరాలను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఎందుకు కేటాయించలేకపోతోందని ప్రశ్నించారు. ఈ ఆందోళన ఆరంభం మాత్రమేనని, ప్రభుత్వం స్పందించకుంటే రానున్న కాలంలో రెండు, మూడు రోజులపాటు రాజధానిని దిగ్బంధం చేస్తామని హెచ్చరిచారు. తెలంగాణలో 125గజాలు భూమి వరకు పేదలకు రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పందించడం లేదని విమర్శించారు. పేదల భూముల కోసం సభ పెట్టుకునేందుకు కూడా పోలీసులు అనుమతికి ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. కనీసం పేదలు, కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు తమ సమస్యలపై వినతిపత్రం ఇస్తామంటే తీసుకునే తీరిక మంత్రులు, అధికారులకు లేదని, ఇంత నిరంకుశ, నిర్లక్ష్య ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని అన్నారు. తాము నక్సలైట్లం కాదని, పేదల పొట్టగొట్టే ప్రభుత్వ నిరంకుశ వైఖరిని సాగినిచ్చేదిలేదని మధు హెచ్చరించారు. సభకు అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, ప్రతీ పేదవానికి ఇంటిజాగా, ఇళ్లు కట్టించి ఇస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ 33లో ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచాలని డిమాండ్చేశారు. జన్మభూమిలో ఇళ్ల స్థలాల కోసం ఏకంగా 2,73,324 మంది దరఖాస్తులు చేసుకుంటే కేవలం 3,662 మంది మాత్రమే అర్హులుగా తేల్చిన ప్రభుత్వ తీరు దుర్మార్గంగా ఉందని మండిపడ్డారు. కార్పొరేట్లకు భూములు కట్టబెట్టేందుకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు కలిసివచ్చే పనులు చక్కబెట్టేందుకు పనిచేసే చంద్రబాబు కంప్యూటర్ పేదల భూముల విషయంలో పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే ఇళ్లు, ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రామకృష్ణ హెచ్చరించారు. సభలో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు ప్రసాద్ (సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ), అమర్నాథ్ (ఎస్యూసీఐ), గొడుగు సత్యనారాయణ(సీపీఐ ఎంఎల్ లిబరేషన్), గొల్లపూడి ప్రసాద్ (ఎంసీపీఐ), ముప్పాళ్ల నాగేశ్వరరావు (సీపీఐ), సీహెచ్ బాబూరావు (సీపీఎం), వై.వెంకటేశ్వర్లు(సీపీఎం) మాట్లాడారు. ఎరుపెక్కిన బెజవాడ.. కనీసం మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్పై ఎర్ర జెండాలతో పేదలు నిర్వహించిన భారీ ర్యాలీతో బెజవాడ ఎరుపెక్కింది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన వామపక్ష నేతలు, పేదలు మండే ఎండను సైతం లెక్కచేయక తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఏలూరు రోడ్డు మీదుగా జింఖానా గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రదర్శనకు వస్తున్న పలువురిని పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం గమనార్హం! -
దాడులతో బలపడేందుకు సంఘ్ శక్తుల కుట్ర
వామపక్షాల ఆరోపణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితులు, గిరిజ నులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించడం ద్వారా బలపడాలని సంఘ్పరివార్ శక్తులు కుట్రపన్నుతున్నాయని 10 వామపక్షాలు ఆరోపించాయి. దీనిలో భాగంగానే నల్లగొండలో దళిత క్రిస్టియన్లపై దాడి జరిగిందన్నాయి. ఆదివారం రాత్రి నల్లగొండలోని దళితకాలనీలో క్రిస్టియన్లు, చర్చి పాస్టర్లపై ఆరెస్సెస్ శక్తులు దాడిచేయడా న్ని ఖండిస్తున్నట్లు ప్రకటించాయి. దాడులకు పాల్పడ్డ దుండగులను కఠినంగా శిక్షించాలని, మైనారిటీల హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వానికి తమ్మినేని వీరభద్రం(సీపీఎం), చాడ వెంకటరెడ్డి(సీపీఐ), వేములపల్లి వెంకటరామయ్య(న్యూడెమోక్రసీ-రాయల), సాధినేని వెంకటేశ్వరరావు(న్యూడెమోక్రసీ-చంద్రన్న), ఎండీ గౌస్(ఎంసీపీఐ-యూ), జానకి రాము లు(ఆర్ఎస్పీ), భూతం వీరన్న (సీపీఐ- ఎంఎల్), సీహెచ్ మురహరి(ఎస్యూసీఐ-సీ), బి.సురేందర్రెడ్డి(ఫార్వర్ట్బ్లాక్), రాజేశ్ (లిబరేషన్) విజ్ఞప్తి చేశారు. మతోన్మాద శక్తుల దాడులను అదుపునకు చర్యలు తీసుకోకపోతే ఆ శక్తులు పేట్రేగిపోయే ప్రమాదముందని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
సీమ సమస్యలపై రేపు చలో అసెంబ్లీ
నీళ్లు, నిధులు కావాలని వామపక్షాల డిమాండ్ సాక్షి, హైదరాబాద్/విజయవాడ బ్యూరో: రాయలసీమ అభివృద్ధికి నిధులు, నీళ్లు కావాలనే డిమాండ్తో పది వామపక్ష పార్టీలు మంగళవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఈ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాయి. డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువచ్చినా ఫలితం లేకపోవడంతో చలో అసెంబ్లీ చేపట్టాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాయలసీమ పరిస్థితిని చర్చించాలని డిమాండ్ చేశాయి. చలో అసెంబ్లీ సందర్భంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. ప్రభుత్వం అనుమతిచ్చినా ఇవ్వకపోయినా చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని పేర్కొన్నాయి. రాయలసీమ సమస్యలను ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రస్తావించి చర్చ జరిగేలా చూడాలని సీపీఐ, సీపీఎంలు విజ్ఞప్తి చేశాయి. పెట్టుబడి రాయితీ, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం, నీటి ప్రాజెక్టులకు కేటాయింపులు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరాయి. 22న చలో విజయవాడ: గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తానని, ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందరికీ ఇస్తానని వాగ్దానం చేసి 21 నెలలు గడిచినా పట్టించుకోని టీడీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 22న ‘చలో విజయవాడ’ నిర్వహిస్తున్నట్లు పది వామపక్ష పార్టీలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి. -
ప్రధాని బూట్ల దుమ్ము తుడుస్తున్న బాబు
వామపక్షాల మండిపాటు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఇటు సీఎం చంద్రబాబు విఫలమయ్యారని ఉభయకమ్యూనిస్టు పార్టీలు మండిపడ్డాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విభజన చట్టంలోని అన్ని హామీలు అమలవుతాయని పొత్తు పెట్టుకున్నామన్న చంద్రబాబు.. ఇప్పుడు ఆ హామీ లు అమలవకపోతున్నా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని మండిపడ్డాయి. ఇప్పుడు ప్రధాని బూట్ల మీద దుమ్ము తుడిచే పనిలో చంద్రబాబు ఉన్నారని ఘాటుగా విమర్శించాయి. తిరుపతిలో ప్రారంభమైన వామపక్షాల బస్సు యాత్ర కర్నూలులో శనివారం ముగిసింది. తమ పోరాటం కర్నూలు నుంచే ప్రారంభం అవుతుందని సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. బహిరంగసభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ప్రసంగించారు. -
దేశానికి ప్రత్యామ్నాయం వామపక్షాలే
-
జన్మభూమి పై వామపక్షాల నిరసన
-
వామపక్షాల ఆధ్వర్యంలో రైతుల అందోళన
-
బాక్సైట్ తవ్వకాల పై వామపక్షాల ఆందోళన
-
కొత్త ఉషోదయాల కోసం ఎదురుచూపులు
సంపద పంపిణీ అనేది పెద్ద ఆధునిక విప్లవం. ఈ ఉద్యమ స్వరూపం ఎలా ఉండాలి అనే అంశంతోపాటు, పాత ఉద్యమరీతులు ఏ మేరకు ఉపకరిస్తాయో యోచించాలి. వీటిని పునఃసమీక్షించుకుంటూనే ఆధునిక ప్రజా పోరాట పంథాలను నిర్ణయించుకోవడం అవసరం. రెండో ప్రపంచయుద్ధం తరువాత (1939-1945) చాలా దేశాలలో స్వాతంత్య్రోద్యమాలు బలపడ్డాయి. శతాబ్దాలుగా బానిసత్వంలో మగ్గిన ప్రజలు తమ ఆగ్రహానికి మరింత పదును పెట్టి, స్వేచ్ఛను సాధించు కునే దిశగా కదిలారు. అమెరికా సం యుక్త రాష్ట్రాలలోని నల్లవారితో పాటు; లాటిన్ అమెరికా, దక్షిణాఫ్రి కా ప్రాంతాల ఉద్యమశక్తులు సైతం అలజడులను తీవ్రం చేశాయి. అయితే ఈ పరిణామాలే పెట్టుబడిదారీ వర్గాలలో ఐక్యతకు కారణమైనాయన్నది మరొక సత్యం. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం అవి ఒక పథకం తయారుచేసుకున్నాయి. తనను తాను కొనసాగించుకోవడానికి పెట్టుబడిదారీ వ్యవస్థ అనేక వ్యూహాలను రచించుకుంటూనే ఉంటుంది. ప్రచ్ఛన్నయుద్ధం, సోవియెట్ రష్యా పతనానంతర ఏక ధ్రువ ప్రపంచంలో కూడా ఆ వ్యవస్థ తనదైన ఉనికిని చాటుకోవడానికి అడ్డూ అదుపు లేని రీతిలో వ్యూహ రచన చేస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నేడు కనిపిస్తున్న అనేకానేక సంక్షోభాలు ఆ వ్యూహాల ఫలితమే. ఆఖరికి ఉద్యమాల నుంచి జనించిన ప్రసార సాధనాలు, అణగారిన వర్గాలకు గొంతును ఇచ్చిన అక్షరాలు ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ చేతిలో ఆయు ధాలుగా మారినాయి. ఈ నేపథ్యంలో వామపక్ష, ప్రగతిశీల శక్తులు వహించవలసిన పాత్ర ఏమిటి? అసలు ఉద్యమం ఎలా ఉండాలి? ఇవే అందరి ముందు ఉన్న కొత్త ప్రశ్నలు. సంపద అంతా ఒకేచోట పోగుపడడమనే పరిణామం కూడా రెండో ప్రపంచ యుద్ధానంతరమే విపరీతంగా కనిపిస్తుంది. కోటీ శ్వరుల సంఖ్య పెరిగింది. కొన్ని దేశాల బడ్జెట్ కన్నా, కొద్దిమంది సంపదే ఎక్కువ. ప్రపంచ సంపద 15 శాతం పెట్టుబడిదారుల దగ్గర కేంద్రీకృతమై ఉంది. దీనికి తోడు నాలెడ్జ్ ఎకానమీ తయారయింది. ఇప్పటి వరకు జరగని ఆవిష్కరణలను అడ్డం పెట్టుకుని, వాటితో కొత్త ఆదాయ వనరులను సృష్టిస్తున్నారు. ఉదాహరణకు సెల్ ఇంజనీరింగ్. మూత్రపిండాలతో పాటు, ఇతర అవయవాల మార్పిడి కూడా దీని ఫలితమే. ఇది వైద్యరంగంలో కొత్త లాభాలకు దారులు వేసింది. పైగా ఆ లాభాలన్నీ భారీగా ఉండడంతో పెట్టుబడిదారీ వర్గం వైద్యరంగం మీద ప్రత్యేక దృష్టిని సారించింది. దీనితో పాటు విశ్వవిద్యాలయాలను కూడా ఆ వర్గం తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇందుకు కారణాలను ఊహించడం కష్టం కాదు. 20వ శతాబ్దం వరకు ఉద్యమాలకు, ఆందోళనలకు విశ్వవిద్యాలయాలే ఆలవాలంగా ఉన్నాయి. విప్లవాలకు బీజాలు వేసినా, ప్రజాస్వామిక భావాలకు ప్రాచుర్యం లభించినా అదంతా విశ్వవిద్యాలయాల తరగతి గదుల దగ్గరే ఆరంభమైంది. ఇది గుర్తించే పెట్టుబడిదారీ వర్గం విశ్వవిద్యాలయాలను తమ గుప్పెట్లో పెట్టుకునే పని మొదలుపెట్టింది. విద్య, వైద్యం అనే రెండు మహోన్నత రంగాలు పెట్టుబడిదారీ వ్యవస్థ చేతిలోకి వెళ్లడానికి ప్రధాన కారణం ఇదే. రాజ్యాధికారం మీద మరింత పట్టు సాధిం చడానికి సంక్షేమ కార్యక్రమాలను ఉపసంహరించుకోవాలని ప్రభు త్వం మీద పెట్టుబడిదారీ వ్యవస్థ ఒత్తిడి పెంచే పని కూడా ఆరం భించింది. ఈ మొత్తం పరిణామం ప్రపంచ వ్యాప్తంగా కొత్త రాజకీయ వాతావరణానికి దోహదం చేసింది. దీనినే ప్రైవేటైజేషన్, గ్లోబలై జేషన్, లిబరలైజేషన్ అంటున్నారు. వారి వ్యూహంలో భాగంగా ప్రతి దేశంలోను పెట్టుబడిదారుల వికేంద్రీకరణ ప్రక్రియ కూడా జరిగింది. పెట్టుబడిదారులు ఆయా దేశాలలోని రాజకీయాల మీద ఆధిపత్యం సాధించారు. ఏ దేశంలో అయినా ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల రేటు కంటే, పెట్టుబడిదారుల ఎదుగుదల రేటు హెచ్చుగా ఉంటే అసమానతలు పెచ్చరిల్లుతాయి. 21వ శతాబ్దం లో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పెరిగింది. సంపద కూడా అపా రంగా పెరిగింది. వాటితో పాటు దారిద్య్రం కూడా పెరిగిందన్న మాట వాస్తవం. ఈ పరిణామాన్నే ఆర్థికవేత్తలు ’R' is greater than ’G’ అన్నారు. ఆర్ అనేది రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ప్రైవేట్ క్యాపిటల్, జి అనేది రేట్ ఆఫ్ నేషనల్ గ్రోత్. ప్రైవేటు పెట్టుబడి జాతీయ పెట్టుబడిని మించిపోతే వ్యవస్థ సమతౌల్యం దెబ్బతింటుంది. అందుకే, ‘సంపద పంపిణీనీ, ఆదాయాన్నీ క్రమబద్ధీకరించనంత కాలం ప్రపంచంలో దారిద్య్ర నిర్మూలన జరగదు’ అంటాడు ప్రముఖ ఆర్థికవేత్త, ట్వెంటీఫస్ట్ సెంచరీ రచ యిత థామస్ పికెటీ. విజ్ఞానం ఇచ్చిన ఫలితాలను, ఆ రంగంలో జరిగిన పరిశోధనలను పెట్టుబడిదారీ శక్తులు ఉపయోగించు కున్నంతగా శ్రామిక శక్తులు వినియోగించుకోలేక పోయాయి. అందుకే నేటి ఉద్యమాలన్నింటికీ సంపద పంపిణీ అనే అంశమే కేంద్రబిందువు కావాలి. ఈ నేపథ్యంలో మార్పును కోరే వారంతా కొన్ని అంశాల మీద దృష్టి పెట్టాలి. సంపదను సమంగా పంచడానికీ, లేదా సకల వర్ణాలు దానిని సమంగా అందుకోవడానికీ ఏం చేయాలి? పెట్టుబడి దారీ శక్తులు కాలాన్ని బట్టి తమ స్వరూపాన్ని మార్చుకుంటూ రాజకీయ శక్తిగా, రాజ్యాధికారాన్ని శాసించే శక్తిగా, ఆర్థిక శక్తుల ను నిర్దేశించే వ్యవస్థగా అవతరించి విద్య వైద్యం వంటి కీలక రంగాలను హస్తగతం చేసుకున్నాయి. ఈ వాస్తవాన్ని గమనం లోకి తీసుకుని ఉద్యమంలో ఏ అంశాలను ముందు వరసలో ఉంచాలి; ఏ వర్గాలను కదిలించాలి? అనే విషయాలను నిర్ణ యించడం ముఖ్యం. ఈ ఉద్యమ స్వరూపం ఎలా ఉండాలి అనే అంశంతో పాటు, పాత ఉద్యమ రీతులు ఏ మేరకు ఉపకరిస్తాయో యోచించాలి. వీటిని పునః సమీక్షించుకుంటూనే ఆధునిక ప్రజా పోరాట పంథాలను నిర్ణయించుకోవడం అవసరం. భూ స్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా దున్నేవానిదే భూమి, సమ సమాజ స్థాపన వంటి నినాదాలు ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చా యి. కానీ కంప్యూటర్ యుగంలో ఉద్యమాల తాత్వికత ఎలా ఉండాలన్నది కూడా చర్చనీయాంశమే. సంపద పంపిణీ అనేది పెద్ద ఆధునిక విప్లవం. అసలు మార్కెట్ శక్తుల నుంచి సంప దను విడదీయడానికి అవసరమైన ఉద్యమాలు ఎలా ఉండాలి? వీటి మీద లోతైన చర్చ అవసరం. ఆధునిక ఉద్యమాల రూప కల్పనే ఇప్పుడు అత్యంత ప్రధానమైన అంశం. - వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు - చుక్కా రామయ్య -
చంద్రబాబు మొద్దు నిద్ర పోతున్నారు
-
వామపక్షాల ఛలో అసెంబ్లీకి నో పర్మిషన్
హైదరాబాద్ : వామపక్షాలు తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. వరంగల్ ఎన్కౌంటర్కు నిరసనగా వామపక్షాలు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అసెంబ్లీ భద్రతా దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. -
లెఫ్ట్లో ‘గాలి’ దుమారం
వరంగల్ అభ్యర్థి విషయంలో వామపక్షాల మధ్య విభేదాలు సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా ఐక్యతారాగం విన్పిస్తున్న లెఫ్ట్ పార్టీల మధ్య మళ్లీ అభిప్రాయభేదాలు పొడసూపుతున్నాయి. తాజాగా వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల అభ్యర్థి అంశం సీపీఐ, సీపీఎంల మధ్య స్పర్ధలకు కారణమవుతోంది. వరంగల్ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్ను ఒప్పించేందుకు వామపక్షాల ముఖ్యనేతలు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు సాగుతుండగానే.. ఓయూ లా కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ను పది వామపక్షాల తరఫున అభ్యర్థిగా నిలపాలని సీపీఎం విడిగా ప్రయత్నించడంపై సీపీఐ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వామపక్షాల అభ్యర్థనపై గద్దర్ తన నిర్ణయాన్ని ప్రకటించకముందే, ఎంబీభవన్లో సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరితో గాలి వినోద్ను సమావేశపరచడం ఏమిటని సీపీఐ నేతలు ప్రశ్నిస్తున్నారు. శనివారం జరిగిన సీపీఐ రాష్ట్ర కమిటీ భేటీలో గాలి వినోద్కుమార్కు అనుకూలంగా సీపీఎం నేతలు పావులు కదపడాన్ని తప్పుపట్టినట్టు తెలిసింది. గతంలో జరిగిన తొమ్మిది వామపక్షాల భేటీలో వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారు బాధ్యతను సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. తమ పక్షాన ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ఎంఎఫ్ గోపీనాథ్ను తెరమీదకు తీసుకురావాలని సీపీఐ నేతలు యోచిస్తున్నట్టు తెలిసింది. -
ఘనంగా హైదరాబాద్ విలీన దినోత్సవం
* సెప్టెంబర్ 17 తెలంగాణకు చారిత్రక దినోత్సవం: ఉత్తమ్ * ద్వంద్వ వైఖరి అవ లంబిస్తున్న కేసీఆర్: చాడ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు తమ తమ పద్ధతుల్లో నివాళులర్పించాయి. గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు భట్టి విక్రమార్క, కె.జానారెడ్డి, మహ్మద్ అలీ షబ్బీర్, పొన్నాల లక్ష్మయ్య, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ భారత్లో విలీనమైన రోజైనందున తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 అన్నది చారిత్రక దినోత్సవమని అన్నారు. ఇది కొన్ని శక్తులకు వ్యతిరేకమనే భావన సరైంది కాదన్నారు. మఖ్దూంభవన్లో సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి జాతీయజెండాను ఎగురవేసిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సాయుధపోరాటాన్ని సీఎం కేసీఆర్ నోటితో పొగుడుతూ, హైదరాబాద్ విమోచనను అధికారికంగా నిర్వహించకుండా నొసటితో వెక్కిరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించి, ప్రభుత్వపరంగా అధికార కార్యక్రమంగా చేయకుండా వ్యతిరేకిస్తూ కేసీఆర్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. వచ్చే ఏడాది అయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. మజ్లిస్కు భయపడి ఒక వర్గం ఓట్ల కోసమే దీనిని ప్రభుత్వం నిర్వహించడం లేదన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్రాజ్ గంగారాం, ఆహిర్, బీజేఎల్పీ నేత డా.కె.లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సారథ్య బృందం ఆధ్వర్యంలో హైదరాబాద్: తెలంగాణ సారథ్య బృందం ఆధ్వర్యంలో గురువారం కోఠిలోని అశోక స్తూపం వద్ద తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు బాబురావువర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ విమోచనం నిజాం వ్యతిరేక పోరాటం వల్లే జరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. సీఎం ఇప్పటికైనా విజ్ఞతను ప్రదర్శించి తెలంగాణ విమోచన దినోత్సవం రోజు జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ విమోచనంలో కాంగ్రెస్పార్టీ కీలకపాత్ర వహించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాపోలు ఆనంద్భాస్కర్, పీసీసీ మాజీ అధ్యక్షులు నర్సారెడ్డి, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సుధాకర్ పాల్గొన్నారు. -
రాష్ట్ర బంద్కు వామపక్షాల మద్దతు
-
బషీర్బాగ్ నెత్తుటి గాయానికి 15 ఏళ్లు
-
పోటీ చేస్తారా? చేయరా?
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నది, లేనిది వీలైనంత తొందరగా తేల్చాలని వామపక్షాలు ప్రజాగాయకుడు గద్దర్ను కోరుతున్నాయి. దీనిపై త్వరలోనే పది వామపక్షాల నాయకులు గద్దర్ను స్వయంగా కలుసుకుని ఆయన మనసులోని మాటను తెలుసుకోవాలని భావిస్తున్నారు. వచ్చేనెల 5లోగా ఒక నిర్ణయానికి రావాలని ఈ పార్టీలు నిర్ణయించాయి. గద్దర్ పోటీకి సుముఖంగా ఉంటే కొంత ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా పర్వాలేదని, అయితే ఆ విషయాన్ని ముందుగా తెలియజేయాలని ఈ పార్టీలు కోరుకుంటున్నాయి. పోటీకి విముఖంగా ఉన్నా ఆ విషయాన్ని స్పష్టంచేస్తే ప్రత్నామ్నాయ అభ్యర్థిని సిద్ధం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. మరోవైపు గద్దర్తో, ఆయన సన్నిహితులతో సంప్రదింపుల ప్రక్రియ సాగుతోందని వామపక్ష ముఖ్యనాయకుడొకరు ‘సాక్షి’కి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్రను పోషించడంతో పాటు విప్లవ రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగడం, ప్రజాగాయకుడిగా ఆయనకున్న గుర్తింపు తప్పకుండా ఉపయోగపడుతుందని వామపక్షాలు అంచ నావేస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న అంచనాకు వస్తున్న ఈ పార్టీలు ఈ ఉప ఎన్నికను అందుకు అనుకూలంగా వాడుకోవాలని భావిస్తున్నాయి. మరోవైపు గద్దర్ వామపక్షాల అభ్యర్థి లేదా ఈ పార్టీలు బలపరిచిన అభ్యర్థి అయితే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కూడా మద్దతునిస్తాయనే అంచనా వేస్తున్నారు. ఒకవేళ గద్దర్ పోటీ చేస్తే టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా చీలిక వస్తుందని, క్రియాశీలంగా ఉంటే యువత కూడా కీలకభూమిక పోషిస్తుందని భావిస్తున్నారు. పోటీకి ఆయన ఒప్పుకుంటే అందరినీ కలుపుకొని రావాలని వామపక్షాలు భావిస్తుండగా, అన్నిపార్టీల నాయకులు కలసి కోరితే బాగుంటుందనే అభిప్రాయంతో గద్దర్ ఉన్నారని వీరంటున్నారు. ఏచూరితో గాలి వినోద్కుమార్ భేటీ వామపక్షాలు బలపరిచిన అభ్యర్థిగా లేదా పది వామపక్షాల అభ్యర్థిగా పోటీచేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరిని అంబేద్కరిస్టు, లా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ.గాలి వినోద్కుమార్ కోరారు. గురువారం ఎంబీ భవన్లో ఏచూరిని ఆయన కలిశారు. తాను వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిని కావడంతో పాటు, ప్రజలతో సంబంధాలు, ఇక్కడ అధికసంఖ్యలో మాదిగ సామాజికవర్గానికి చెందిన వాడిని కావడం కలిసొచ్చే అంశాలుగా ఆయన వివరించినట్లు తెలిసింది. అయితే వినోద్కుమార్ అభ్యర్థిత్వం పట్ల ఈ పార్టీలన్నింటిలో పూర్తి సానుకూలత వ్యక్తం కావడం లేదు. వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేయడాన్నే సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ-చంద్రన్న) వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ ఎన్నికల్లో తాము ఎవరికీ మద్దతు తెలిపేది లేదని స్పష్టంచేసింది. వామపక్షాల అభ్యర్థి అని చెప్పి ఇండిపెండెంట్గా ఎవరినైనా నిలబెడితే మాత్రం తాము మద్దతు తెలపమని ఆర్ఎస్పీ, ఫార్వర్డ్బ్లాక్ పార్టీలు స్పష్టంచేస్తున్నాయి. -
బషీర్బాగ్ నెత్తుటి గాయానికి 15 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్: అది బాబు జమానా.. కరువు కరాళ నృత్యం చేస్తున్న రోజులు.. వర్షాల్లేక భూములు నైచ్చాయి.. పంటల్లేక రైతులు అల్లాడుతున్నారు.. గొడ్డూగోదా కబేళాకు తరలాయి.. ఇంతటి దారుణ పరిస్థితుల్లో కరెంటు చార్జీలు పెంచడమేమిటని ప్రభుత్వాన్ని నిలదీసిన పాపానికి ఉద్యమకారులపై లాఠీలు విరిగాయి.. తూటాలు పేలాయి.. కాల్పుల్లో ముగ్గురు అసువులుబాశారు! 2000లో నాటి సీఎం చంద్రబాబు హయాంలో అసెంబ్లీకి కూతవేటు దూరంలో సాగిన ఈ నెత్తుటి క్రీడకు నేటితో సరిగ్గా 15 ఏళ్లు!! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్పుల్లో ఉద్యమకారులు విష్ణువర్ధన్రెడ్డి, బాలస్వామి అక్కడికక్కడే మరణించగా.. రామకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ర్యాలీలు, ధర్నాలు, చివరకు ఆమరణ నిరాహారదీక్షలు చేపట్టినా నాటి బాబు సర్కారులో మార్పు రాకపోవడంతో.. 2000 ఆగస్టు 28న వామపక్షాలు, ప్రజాసంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతును ప్రకటించింది. ఆందోళనలో భాగంగా ఉద్యమకారులు అసెంబ్లీ భవన సముదాయం వరకు వెళ్లేందుకు యత్నించారు. అయితే బాబు ఆదేశాలతో పోలీసులు ఒక్కసారిగా కాల్పు లు జరిపారు. ఫలితంగా బషీర్బాగ్ ఫ్లైఓవర్ ప్రాంతం రక్తసిక్తమైంది. ఈ నెత్తుటి గాయానికి గుర్తుగా బషీర్బాగ్ చౌరస్తాలో షహీద్చౌక్ను ఏర్పాటు చేశారు. నేడు లెఫ్ట్, కాంగ్రెస్ నివాళి శుక్రవారం ఉదయం 11 గంటలకు పది వామపక్ష పార్టీలు షహీద్ చౌక్ వద్ద విద్యుత్ ఉద్యమ అమర వీరులకు నివాళి అర్పించనున్నాయి. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్, తదితర సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోనున్నాయి. అమరవీరుల స్తూపం వద్ద చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), సాదినేని వెంకటేశ్వరరావు(న్యూడెమోక్రసీ-చంద్రన్న), వేములపల్లి వెంకట రామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ). జానకిరాములు (ఆర్ఎస్పీ), బండ సురేందర్రెడ్డి (ఫార్వర్డ్బ్లాక్), మురహరి (ఎస్యూసీఐ-సీ), భూతం వీరన్న (సీపీఐ ఎంల్), రాజేశ్ (లిబరేషన్) తదితరులు నివాళులు అర్పించనున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎల్పీ కార్యాలయం నుంచి షహీద్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అమరవీరులకు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, ఇతర నాయకులు నివాళి అర్పిస్తారు. -
వెంకయ్యా.. దబాయింపు ఆపు
వామపక్షాలు సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజల్ని, పార్టీల్ని దబాయింపుతో నోరు మూయించాలని చూడొద్దని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు వామపక్షాలు హితవు పలికాయి. వెంకయ్యనాయుడును ఈ రాష్ట్రం నుంచి పోటీ చేయమని తాము కోరడంలేదని.. గతంలో ఆయన పోటీకి దిగితే ఏం జరిగిందో ప్రజలకు గుర్తుందని మండిపడ్డాయి. ఈ మేరకు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు గురువారం వేర్వేరు ప్రకటనలు చేశాయి. ‘ప్రత్యేక హోదా తెస్తామని, ఇస్తామని ఊరూరా సన్మానాలు చేయించుకున్న వెంకయ్య.. ఇప్పుడు దిష్టిబొమ్మలు దహనం చేస్తామంటే ఆక్రోశం వెల్లగక్కడం సమంజసమేనా’ అని ప్రశ్నించాయి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్న ఆగ్రహంతోనే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారని, అదే జాబితాలో చేరాలనుకుంటే బీజేపీ కూడా ఇచ్చిన మాటను విస్మరించవచ్చని హెచ్చరించాయి.