Left parties
-
విజయవాడ: ‘గో బ్యాక్ అమిత్ షా’
విజయవాడ, సాక్షి: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ పర్యటనలో నిరసన సెగ తగిలింది. అంబేద్కర్పై షా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ‘‘ గో బ్యాక్ అమిత్ షా’’ నినాదాలతో నగరంలో ఆదివారం వామపక్షాలు నిరసన చేపట్టాయి. అంబేద్కర్ని అవమాన పరిచిన అమిత్ షా రాజీనామా చేయాలని, ఆయన వెంటనే వెనక్కి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు వాళ్లు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రధాని మోది అమిత్ షాకు మద్దతు ఇవ్వడం సిగ్గుమాలిన చర్య. రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడికి మీరు ఇచ్చిన గౌరవం ఇదేనా. అంబేద్కర్ ను అవమానించిన షా.. తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘పార్లమెంట్ వేదికగా నిండు సభలో అవమానించారు. పైగా ఆయన తన వ్యాఖ్యల్ని సమర్ధించుకుంటున్నారు. అమిత్ షా ఆ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలి’’ అని సీపీఎం నేత ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఇతర వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. కేంద్ర సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి: అమిత్ షానగరంలోని నోవాటెల్ హోటల్లో ఏపీ బీజేపీ (BJP) నేతలతో ఆ పార్టీ అగ్రనేత అమిత్షా (Amit shah) సమావేశం ముగిసింది. సుమారు గంటన్నరపాటు ఈ భేటీ కొనసాగింది. కీలక అంశాలపై రాష్ట్ర భాజపా నేతలకు అమిత్షా దిశానిర్దేశం చేశారు.ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో భాజపా బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ‘హైందవ శంఖారావం’ సభ విజయం పట్ల పార్టీ, వీహెచ్పీ నేతలకు అమిత్షా అభినందనలు తెలిపారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై కేంద్రహోంశాఖ దృష్టిపెట్టిందని అమిత్షా చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేతలు ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో షా.. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) 20వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని 10వ NDRF బెటాలియన్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (NIDM) సౌత్ క్యాంపస్ను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ముగ్గురు మొక్కలు నాటారు. అంతకు ముందు.. నగరంలోని నోవాటెల్లో అమిత్ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పది నిమిషాలపాటు భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి కొండపావులూరు చేరుకున్నారు. అంతకంటే ముందే పవన్ అక్కడికి చేరుకున్నారు. -
సీపీఐ,సీపీఎం ఆందోళన..అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
సాక్షి,అనంతపురం: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్సిక్స్ హామీలను అమలు చేయాలని సీపీఐ,సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు,కార్మికులు అనంతపురం జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ వినోద్కుమార్ వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళకారులు కలెక్టర్ వాహనాన్ని అరగంట సేపు దిగ్భందించారు.ఈ సందర్భంగా పోలీసులు,ఆందోళకారులకు మధ్య వాగ్వాదం,తోపులాటజరిగింది. హామీల అమలులో టీడీపీ,బీజేపీ, జనసేన విఫలమయ్యాయని సీపీఎం నేతలు మండిపడ్డారు. చంద్రబాబు కు రైతుల ఆత్మహత్యలు పట్టవా అని వారు ప్రశ్నించారు.రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం ఎందుకివ్వలేదో చెప్పాలని నిలదీశారు.వైఎస్సార్ వాహనమిత్ర ఇవ్వకపోవడం వల్ల ఆటో,ట్యాక్సీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: Andhra Pradesh: ఆందోళనలతో అట్టుడికిన రాష్ట్రం -
హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తే ఉపేక్షించం..మిత్రపక్షం మిత్రపక్షమే.. పోరాటం పోరాటమే!
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ చేసిందేమీలేదు. ఏడాది పాలనలో సీఎం రేవంత్రెడ్డి ఉచిత బస్సు సౌకర్యం తప్ప వేటినీ అమలు చేయలేదు. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విదేశీ పెట్టుబడిదారులకు మూసీ భూములు, ఫార్మా భూముల్ని కట్టబెట్టేందుకు మూసీ సుందరీకరణ జపం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల కోసం పని చేస్తున్న వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు రాబోయే కాలంలో ఐక్య పోరాటాల్ని నిర్వహించేలా ఊరూరా ఎర్రజెండా ను తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి స్నేహపూర్వకంగా చెప్పాం.ఇక నుండి రోడ్ల పైకి వస్తాం. మాకు గెలవడం రాకపోయినా, ఓడించడం వచ్చు..’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవలచేసిన తీవ్రమైన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రాజేశాయి. మొన్నటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యమేంటన్న చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్ తమకిచ్చిన హామీ నెరవేర్చక పోవడం, రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా, మూసీ సుందరీకరణ తదితర అంశాలకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు.. రైతులు, ఇతర వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని సీపీఎం భావిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇటీవల గ్రూప్–1 అభ్యర్థులపై లాఠీచార్జి వంటి మరికొన్ని అంశాలను కూడా ఆ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వంపై ఒకపక్క సీపీఎం విరుచుకు పడుతుంటే, మరోపక్క సీపీఐ కూడా వివిధ సమస్యలపై తన నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రజలకు దూరమవుతామన్న భావన.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకొని ఒక సీటు గెలవగా, సీపీఎం పార్టీ పొత్తు కుదరక ఒంటరిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్లమెంటు ఎన్నికల నాటికి కాంగ్రెస్కు రెండు కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. సీపీఐకి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని అసెంబ్లీ పొత్తుల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇవ్వగా, పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు ప్రకటించినందుకు సీపీఎంకు కూడా ఎమ్మెల్సీ లేదా స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించాలన్న అవగాహన కుదిరినట్లు ప్రచారం జరిగింది.అయితే ఏడాది కావొస్తున్నా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్న అసంతృప్తి కామ్రేడ్లలో ఉందని అంటున్నారు. అలాగే పలు సందర్భాల్లో సమస్యలపై సీఎంకు వినతిపత్రాలు ఇచ్చినా లెక్క చేయడంలేదని వామపక్షాలు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీలు దూకుడుగా ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే.. ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే తాము మిన్నకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, వారికి దూరం అయ్యేందుకు అవకాశం ఉందనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. దీని ఫలితమే సీపీఎం, సీపీఐల ప్రతిస్పందనలని అంటున్నారు. ఇటీవలి పరిణామాలేంటి..?బెటాలియన్ కానిస్టేబుళ్ల పనిభారాన్ని పెంచే జీవోను రద్దుచేసి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను పడగొట్టి ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని, ఒకవైపు ప్రజాపాలన అంటూనే ప్రజలపై నిర్బంధాన్ని కొనసాగిస్తోందని సీపీఎం విమర్శించింది. ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోలీసులను, అధికారులను ప్రయోగిస్తోంది. ఇళ్ల కూలి్చవేతకు ఏర్పాట్లు చేస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఇంత హడావుడిగా నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదంటూ సీఎం రేవంత్రెడ్డికి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. ‘రైతులకు ప్రకటించిన రు.2 లక్షల రుణమాఫీని అర్హులైనవారందరికీ అమలు చేయాలి. అలాగే పంటకాలం పూర్తవుతున్నప్పటికీ వానాకాలం రైతుభరోసా ఇవ్వలేదు. తక్షణమే రైతు భరోసా చెల్లించాలి..’అని సీపీఎం కోరింది. గ్రూప్–1 అభ్యర్థులపై లాఠీచార్జీని తీవ్రంగా ఖండించింది. వారికి న్యాయం చేసేవిధంగా ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని, అభ్యర్ధులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. వానాకాలం, యాసంగికి రైతుభరోసా, రుణమాఫీలను వెంటనే అమలు చేయాలని సీపీఐకి చెందిన రైతుసంఘం డిమాండ్ చేసింది. ఈ విషయమై జిల్లాల్లో ధర్నాలు చేపట్టింది. హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, మిత్రపక్షం మిత్రపక్షమే.. పోరాటం పోరాటమేనంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
భారత్, చైనాల మధ్య నలిగిపోము: శ్రీలంక అధ్యక్షుడు
కొలంబో: భారత్, చైనా దేశాలతో విదేశాంగ విధానంలో శ్రీలంక సమానమైన వైఖరిని పాటిస్తుందని ఆ దేశ కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే అన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భారత్, చైనా విదేశాంగ విధానంపై స్పందించారు. భారత్, చైనాల మధ్య నలిగిపోయే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యులో పొరుగుదేశాలతో విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మా నాయకత్వంలో దేశం భౌగోళిక, రాజకీయ ప్రత్యర్థుల జోలికి వెళ్లకుండా చూస్తాం. నేషనల్ పీపుల్స్ పవర్( ఎన్పీపీ) ప్రభుత్వం ఏ దేశంతోను జతకట్టదని, పొరుగు దేశాలైన భారత్, చైనా రెండు దేశాలతో సమతుల్య సంబంధాలను పెంపొందించుకోవాలని భావిస్తోంది.మేము భౌగోళిక, రాజకీయ పోరాటంలో ఎవరితో పోటీదారులం కాదు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య నలిగిపోవాలనే ఉద్దేశం మాకు లేదు. రెండు దేశాలు విలువైన స్నేహితులుగా మా ప్రభుత్వ సన్నిహిత భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాం. యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో కూడా సంబంధాలను కొనసాగించుతాం” అని అన్నారు.పొరుగు దేశాల ఆధిపత్య పోరులో శ్రీలంక నలిగిపోవద్దని ఇరుదేశాలతో పరస్పర ప్రయోజనకరమైన దౌత్య భాగస్వామ్యం నిర్మించడంపై దృష్టి సారిస్తోందని అన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తటస్థ విదేశాంగ విధాన విధానమే కీలకమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: సంక్షోభ లంకపై నెలవంక! -
ప్రపంచవ్యాప్తంగా రైట్వింగ్ నేతలపైనే టార్గెట్: అస్సొం సీఎం
ఢిల్లీ: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పులను ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. తాజాగా ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటనపై అస్సొం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా రైట్ వింగ్ నేతలను లెఫ్ట్ వింగ్ పార్టీలు టార్గెట్ చేస్తున్నాయని అన్నారు. దేశమే తొలి ప్రాధాన్యం అనే జాతీయవాదాన్ని కలిగి ఉన్న నేతలను ఎవరు ఓడించలేరని తెలిపారు.‘‘భౌతికంగా, మరోరకంగా ప్రపంచవ్యాప్తంగా రైట్ వింగ్ నేతలపై లెఫ్ట్ పార్టీ దాడులతో టార్గెట్ చేస్తోంది. ఈ దాడులు జాతీయవాదం కలిగి ఉండే నేతలను ఓడించలేవు. జాతీయవాదం అనేది పూర్తిగా ఆధ్యాత్మిక సనాతనతత్వం నుంచి ప్రేరణ పొందింది. డొనాల్డ్ ట్రంప్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.Physical or otherwise, right-wing leaders across the globe are now active targets of the radical left. However, these attacks will not be able to defeat the "nation first" ideology. This is rooted in deep spirituality and inspired by the Sanatan philosophy of "Janani Janmabhoomi…— Himanta Biswa Sarma (@himantabiswa) July 14, 2024 ఇక, శనివారం పెన్సిల్వేనియాలో చేపట్టిన ప్రచారంలో పాల్గొన్న ట్రంప్పై ఓ గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ పక్కనుంచి దూసుకుపోవటంతో గాయమైంది. వెంటనే అప్రత్తమై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదిక పైకి వచ్చి.. ట్రంప్ను అక్కడి కిందకు దించి ఆస్పత్రికి తరలించారు.ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) తాజాగా గుర్తించింది. అతణ్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్గా ధ్రువీకరించారు. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు క్రూక్స్ను షూట్ చేసినట్లు ఎఫ్బీఐ ఏజెన్సీ ప్రతినిధి ఆంథోనీ గుగ్లీల్మి వెల్లడించారు. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్తో సహా ప్రపంచ దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు. -
Lok sabha elections 2024: ఆర్జేడీకి 26.. కాంగ్రెస్కు 9
పట్నా: వచ్చే లోక్సభ ఎన్నికలకు గాను బిహార్లో ఆర్జేడీ సారథ్యంలోని మహాఘఠ్బంధన్లో సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు గాను దాదాపు మూడింట రెండొంతుల సీట్లలో లాలూ ప్రసాద్కు చెందిన ఆర్జేడీ పోటీ చేయనుంది. మిగతా వాటిని కాంగ్రెస్, మూడు వామపక్ష పార్టీలు పంచుకున్నాయి. 2019 ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క సీటూ దక్కించుకోలేకపోయినప్పటికీ ఈసారి 26 చోట్ల పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారీ 9 చోట్ల పోటీ చేయనుంది. ఆ తర్వాత సీపీఐ ఎంఎల్ లిబరేషన్ మూడు, సీపీఐ, సీపీఎంలు చెరో చోట బరిలోకి దిగనున్నాయి. బిహార్లో ఆర్జేడీ ఇప్పటికే నాలుగు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఒక సీటును కాంగ్రెస్ ఆశిస్తోంది. కాంగ్రెస్ పోటీ చేయాలని ఆశిస్తున్న పుర్నియా స్థానానికి లాలూ ప్రసాద్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేశారు. సీపీఐ, సీపీఐ(ఎంఎల్) కూడా బెగుసరాయ్, ఖరారియా సీట్లకు అభ్యర్థులను ప్రకటించుకున్నాయి. -
కూటమి కుదురుకునేనా?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ‘ఇండియాకూటమి’ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నా, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఇంకా అంతరం కొనసాగుతోంది. కూటమిలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కీలకంగా ఉన్నా, రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీల మధ్య సఖ్యత కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడినా..పొత్తులపై ఇప్పటికీ ఆ పార్టీల మధ్య అవగాహన కుదరలేదు. ఒకవైపు బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుందని కాంగ్రెస్, వామపక్షాలు చెబుతున్నా, ఐక్యత మాత్రం ప్రదర్శించలేకపోతున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి కూడా గణనీయమైన ఎంపీ స్థానాలు వస్తాయనే అంచనాలున్న నేపథ్యంలో ఎంతోకొంత ప్రభావం చూపగలిగే వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకోవడం లేదని, గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచీ కాంగ్రెస్ వైఖరి ఇలాగే ఉందని లెఫ్ట్ నేతలు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల వరకు నానబెట్టి చివరకు సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ సీపీఎం రెండూ రాజీకి రాలేకపోయాయి. ఎన్నికల వేళ మాటల యుద్ధం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. అభ్యర్థులను ప్రకటించుకుంటూపోతోంది. ఈ నేపథ్యంలో తమతో చర్చలు జరపకపోవడంపై వామపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు వివిధ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నా, సమయం ఇవ్వడం లేదని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేరళ వెళ్లి అక్కడి సీపీఎం సీఎం పినరయి విజయన్ను విమర్శించడాన్ని కూడా కామ్రేడ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బహిరంగంగానే విమర్శించారు. మరోవైపు సీపీఐ నేతలు కూడా కాంగ్రెస్ వైఖరిని తూర్పారబడుతున్నారు. పార్టీలు మారిన వారికి పెద్దపీట వేస్తూ, తమకు ఒక ఎంపీ సీటు ఇవ్వడానికి వెనుకాడుతున్నారని సీపీఐ విమర్శిస్తోంది. తమిళనాడు రాష్ట్రాన్ని చూసైనా నేర్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్కు సూచించారు. అభ్యర్థిని ప్రకటించిన సీపీఎం పొత్తులపై స్పష్టత రాకపోవడంతో సీపీఎం ఇటీవల భువనగిరి లోక్సభ సెగ్మెంట్కు జహంగీర్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇతర చోట్ల ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో కలిసి పనిచేసే విషయంలో బీఆర్ఎస్ నుంచి తమకు ప్రతిపాదన వస్తే ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య చెప్పడం గమనార్హం. ఇక సీపీఐ కూడా కాంగ్రెస్ తీరుపై గరంగరంగా ఉంది. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఒక స్థానంలో గెలవడంతో దూకుడుగా వెళ్లడానికి సీపీఐ కాస్తంతా వెనుకాముందు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో చర్చలుంటాయా? కాంగ్రెస్ పార్టీ నాలుగైదు రోజుల్లో తమతో చర్చలు జరుపుతుందని అంటున్నారని వామపక్ష నేత ఒకరు పేర్కొన్నారు. ఏదిఏమైనా ఈ చర్చల్లో చెరో సీటు అడగాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఒకవేళ ఎంపీ సీట్లు ఇవ్వకుండా మద్దతు కాంగ్రెస్ కోరితే కనీసం చెరో ఎమ్మెల్సీ అడిగే ఆలోచనలో వామపక్షాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు చెరో ఎంపీ స్థానంలో తమ అభ్యర్థిని స్నేహపూర్వకపోటీ పెట్టడం ద్వారా బరిలో నిలపాలని కూడా లెఫ్ట్ వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది. -
‘రాష్ట్రంలో శత్రువులు.. ఢిల్లీలో చెట్టాపట్టాలు!
తిరువనంతపురం: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో ఎప్పుడూ విడిపోని ప్రాణ స్నేహితులని కానీ కేరళ మాత్రం బద్దశత్రువులని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్టీ యాత్ర ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ‘కేరళలో కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు ఒకరికొకరు శత్రువులు. ఇతర రాష్ట్రాల్లో మాత్రం ప్రాణ స్నేహితులు. ఈ పార్టీలు తిరువనంతపురం భిన్నమైన భాష మాట్లాడి.. ఢిల్లీలో మాత్రం ఒకే భాష మాట్లాడుతాయి’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. మరోవైపు కేరళలో కాంగ్రెస్ పార్టీ సీపీఐ(ఎం) ప్రత్యర్థులు.. అదే పశ్చిమ బెంగాల్లో మాత్రం మళ్లీ మిత్రపక్షాలు. ఇటువంటి వైరుధ్యాలు కలిగిఉన్న కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఢిల్లీ, గుజరాత్, గోవాల్లో సీట్లు సర్దుబాటు చేసుకుందని దుయ్యబట్టారు. ‘కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అవినీతిపరుడు. కేరళలో గత కమ్యూనిస్ట్ పార్టీ పాలకులు కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ చార్జీలు చేశారు. కమ్యూనిస్ట్ నేత పలు కుంభకోణాలకు పాల్పడ్డారు. కానీ.. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లో మాత్రం ఇరుపార్టీ నేతలు ఢిల్లీలో కూర్చొని బిస్కెట్లు, సమోసాలు తింటూ చాయ్ తాగుతారు’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. కేరళలో ఒకటి చెప్పి.. ఢిల్లీలో మరోటి చెప్పి ద్రోహం చేసేవారికి (కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు) వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేరళ ప్రజలు తగినబుద్ధి చెప్పాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేరళలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు ఇవ్వాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. కేంద్ర పథకాలతో కేరళ లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. గత 2019 లోక్సభ ఎన్నికల్లో 20 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లను గెలుచుకోగా.. బీజేపీ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. -
కాంగ్రెస్ తో కామ్రేడ్లు కటీఫ్
-
పెండింగ్ 19పై నేడు భేటీ
సాక్షి, హైదరాబాద్: పెండింగ్లో ఉన్న 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్పార్టీ సోమ వారం తుది చర్చలు జరపనుంది. వామపక్షాలతో పొత్తుతో పాటు పోటీ తీవ్రంగా ఉన్న ఈ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై ఢిల్లీ వేదికగా నేతలు సమా వేశం కానున్నారు. ఈ భేటీ కోసం టీపీసీసీ నేతలు ఆదివారమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ కార్యాలయంలోని వార్ రూంలో పార్టీ అధిష్టానంతో జరిగే సమావేశానంతరం సోమవారం రాత్రి లేదంటే మంగళవారం తుది జాబితా వస్తుందని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. లెఫ్ట్తో ‘లెఫ్టా.. రైటా?’ లెఫ్ట్ పార్టీలతో పొత్తుల విషయంలోనూ సోమవారం జరిగే సమావేశాల్లో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా సీపీఎం పార్టీతో పీటముడి పడిన వైరా, మిర్యాలగూడ స్థానాల్లో ఏం చేయాలన్న దానిపై కాంగ్రెస్ నేతలు నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు సీపీఐకి ఇవ్వాలనుకుంటున్న కొత్తగూడెం, చెన్నూరు సీట్ల విషయంలోనూ తేడా వచ్చిందనే చర్చ జరుగుతోంది. వివేక్ కుమారుడికి చెన్నూరు సీటు? చెన్నూరు స్థానాన్ని మాజీ ఎంపీ వివేక్ కుమారుడికి కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని, ప్రస్తుతం బీజేపీలో ఉన్న వివేక్ను పార్టీలో చేర్చుకుని ఆయన్ను పార్లమెంటుకు పోటీ చేయించాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తోందని సమాచారం. ఈ మేరకు శనివారమే మొయినాబాద్లోని వివేక్ ఫాంహౌస్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, వివేక్లు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సీపీఐకి చెన్నూరు అసెంబ్లీ కేటాయించడం కష్టమేనని, సీపీఐ, సీపీఎంలకు చెరొక్క సీటును మాత్రమే కాంగ్రెస్ ఆఫర్ చేస్తుందని, ఇందుకు ఆ పార్టీలు అంగీకరిస్తే కలిసి ముందుకెళ్లవచ్చని, లేదంటే ఎవరి దారిలో వారు వెళ్లాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలంటుండడం గమనార్హం. -
‘పొత్తు’ పొడిచేనా!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, వామపక్షాల పొత్తుపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఆ పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? లేదా? అన్న సందిగ్ధత ఏర్పడుతోంది. సీపీఐ విషయంలో స్పష్టత వచ్చినా, సీపీఎంకిస్తామన్న రెండుస్థానాల్లో మిర్యాలగూడ ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ.. వైరా స్థానంపై ఎటూ తేల్చకపోవడంతో ఆదివారం సీన్ మారిపోయింది. వైరా ఇవ్వనిపక్షంలో కాంగ్రెస్తో పొత్తు ఉండదని సీపీఎం స్పష్టం చేసింది. కాంగ్రెస్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో అసలు వామపక్షాలు, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. సీపీఐ మౌనం.. సీపీఐ, సీపీఎంలకు రెండేసి చొప్పున అసెంబ్లీ స్థా నాలు కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. అయితే వామపక్షాలు కోరుకున్న విధంగా స్థానాలు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. సీపీఐ కొత్తగూడెం, మునుగోడు స్థానాలు కోరగా, కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు కేటాయించింది. సీపీఎం మిర్యాలగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు స్థానాలు ఇవ్వాలని కోరగా మిర్యాలగూడ మాత్రమే సాధ్యమవుతుందని, మిగిలిన రెండింటిలో ఏ సీటూ ఇవ్వలేమని కాంగ్రెస్ తేల్చిచెప్పింది. ఆ రెండు స్థానాలకు తమ అభ్యర్థులను కూడా ప్రకటించింది. దీంతో వైరా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్టు భావించినా ఒక్కరోజులో పరిస్థితి మారింది. తాజా పరిణామాలపై సీపీఐ మౌనంగా ఉంది. ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. కాగా ముందు ప్రకటించిన చెన్నూరు స్థానం కూడా సీపీఐకి కేటాయించే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. అదే నిజమైతే సీపీఐ వైఖరి కూడా మారే అవకాశముందని చెబుతున్నారు. ఒక వేళ చెన్నూరు ఖరారైతే కాంగ్రెస్తో ముందుకు వెళుతుందా? సీపీఎంతో ముడిపెడుతుందా? అనే చర్చ జరుగుతోంది. సహకారంపై సందేహాలు పొత్తు కుదిరినా కాంగ్రెస్ ఏమేరకు సహకరిస్తుందోనన్న చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే మిర్యాలగూడలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిని ఆ పార్టీ అనధికారికంగా ప్రోత్సహిస్తోందని సీపీఎం వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగూడెంలోనూ అలాంటి పరిస్థితే నెలకొందని సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇలాగైతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రెబల్ అభ్యర్థులను ప్రోత్సహించకూడదనే షరతును కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టాలని వామపక్షాలు భావిస్తున్నట్టు సమాచారం. -
లెఫ్ట్ పార్టీలకు ఏమైంది?
-
ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కారు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్డీఎఫ్) ఏర్పాటైంది. ఇందులో సీపీఐ, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ (యూ), ఆర్ఎస్పీ, బీఎల్ఎఫ్, భారత జాతీయ ఉద్యమ సంఘం తదితర అనేక లౌకిక ప్రజాసంఘాలు కలిసి టీఎస్డీ ఎఫ్ను ఏర్పాటు చేశాయి. ఈ వేదికకు చైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, కో కన్వీనర్లుగా పార్టీకొకరు చొప్పున ఉండాలని నిర్ణయించారు. రాష్ట్ర సమన్వయకర్తగా నైనాల గోవర్ధన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీఎస్డీఎఫ్ విధాన పత్రం, ఉమ్మడి కార్యాచరణను నాయకులు ప్రకటించారు. చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, నియంతృత్వ పాలనకు వ్యతిరే కంగా వామపక్ష పార్టీలు, లౌకిక ప్రజాస్వామిక సంస్థలు కలిసి ఈ వేదికను ఏర్పాటు చేశాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అదానీ, అంబానీ లాంటి కొద్దిమంది పెట్టు బడిదారులకు దోచిపెడుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ చేతిలో రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసమయ్యాయన్నారు. బీజేపీ మతోన్మాద విధా నాలు, బడా సంపన్న అనుకూల విధానాలు, పేదల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తామ న్నారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం అడ్డూ అదుపులేని అవినీతికి పాల్పడుతోందని దుయ్య బట్టారు. తెలంగాణలో అవినీతి ప్రపంచ రికార్డు లను కూడా బద్దలు కొట్టిందన్నారు. ఈ అవినీతి తెలంగాణ ప్రజల పురోభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా మారిందని, అందుకే అంతా కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జువ్వాడి చలపతిరావు, సీపీఐ రాష్ట్ర నాయకులు బాల మల్లేశ్, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకుడు హన్మేష్, ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తుకారాం, ఇతర నాయకులు గుర్రం విజయ్ కుమార్, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్డీఎఫ్ విధాన పత్రం ముఖ్యాంశాలు ఇవీ.. ప్రతి మండలంలో అవసరమైనన్ని నాణ్యమైన పాఠశాలలు స్థాపించాలి. నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఐదు వేల మంది జనాభాకు ఒక రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని నెలకొల్పాలి. స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగ హక్కును కల్పించాలి. లేకుంటే నిరుద్యోగులందరికీ జీవించే నిరుద్యోగ భృతిని ఇవ్వాలి. భూమిలేని పేదలకు భూములను పంపిణీ చేయాలి. దళితులకు 3ఎకరాల భూమి ఇవ్వాలి. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దుచేసి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. కుల ప్రాతిపదికగా జన గణన జరగాలి. చట్టసభల్లో బీసీలకు, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించాలి. కాళేశ్వరం, భగీరథ ప్రాజెక్టుల్లో జరిగిన భారీ అవినీతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. -
కాంగ్రెస్.. కామ్రేడ్స్ కలిసే..!
కాంగ్రెస్...కామ్రేడ్స్ కలిసే..! -
‘కొడవలి’తో కుదిరేనా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి విడిపోయిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలను వచ్చే ఎన్నికల్లో తమతో కలుపుకోవడంపై కాంగ్రెస్ పారీ్ట ఊగిసలాటలో ఉంది. సీపీఎం, సీపీఐలతో కలసి వెళ్లడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ నేతలు పొత్తులు వద్దనే అభిప్రాయంతో ఉండగా, పార్టీ హైకమాండ్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేస్తోంది. జాతీయ స్థాయిలో ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్, లెఫ్ట్ భాగస్వాములైన కారణంగా రాష్ట్ర స్థాయిలోనూ దోస్తీ కొనసాగించాలని రెండు పక్షాల హైకమాండ్లు భావిస్తున్నాయి. రాష్ట్రంలోని ఉభయ కమ్యూనిస్టు పారీ్టలు కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. కానీ మెజార్టీ కాంగ్రెస్ నేతలు మాత్రం గతంలోలా ఓట్ల బదిలీ జరిగే అవకాశం లేదని అందువల్ల ఒంటరి పోటీయే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారు. జాతీయ స్థాయిలోనే ప్రతిపాదనలు లెఫ్ట్, కాంగ్రెస్ల మధ్య పొత్తు వ్యవహారం ఇంకా కింది స్థాయికి రాలేదని, ఇప్పటిరకు ఏఐసీసీ, లెఫ్ట్ పారీ్టల జాతీయ నాయకత్వం స్థాయిలోనే ఈ ప్రతిపాదన ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే ఇరు కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నేతలతో ఫోన్లో మాట్లాడారని వివరిస్తున్నాయి. ‘వారు మాట్లాడుకున్న తర్వాత వ్యవహారం రాష్ట్ర పారీ్టల వరకు వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం.’ అని టీపీసీసీకి చెందిన ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు ఎన్ని స్థానాల్లో ఏ మేరకు ప్రభావితం చూపుతాయన్న దానిపై కూడా కాంగ్రెస్ నేతలు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో లెఫ్ట్ పారీ్టల ప్రభావం బాగా తగ్గిపోయిందని, 10–15 చోట్ల అంతోఇంతో ఓటుబ్యాంకు ఉందని, నాలుగైదు చోట్ల మాత్రం గెలుపోటములను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. ఆ ఆరూ.. అసాధ్యమే ఇతర పార్టీలతో పొత్తు కుదరితే ఏయే అసెంబ్లీ స్థానాలు అడగాలన్న దానిపై సీపీఎం, సీపీఐ నేతలు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీల్లో చర్చించిన అనంతరం ఈ సీట్లపై ఏకాభిప్రాయం కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, భద్రాచలం, మధిర, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, మిర్యాలగూడతో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలోనికి వచ్చే ఇబ్రహీంపట్నం స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనతో సీపీఎం ఉంది. అయితే ఈ ఆరు స్థానాల్లో ఒక్క స్థానం వదులుకోవడం కూడా సాధ్యం కాదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మధిర, భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుండగా, పాలేరులో గతంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు రఘువీర్రెడ్డి లాంటి బలమైన నేతలున్నారు. నకిరేకల్లో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. దీంతో సీపీఎం అడిగే ఈ ఆరుస్థానాల విషయంలోనూ చిక్కుముడి ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. అతికష్టంగా ఆ ఒక్కచోట..! సీపీఐ ఐదు సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా, నల్లగొండ జిల్లా మునుగోడు, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ స్థానాలపై ఆ పార్టీ దృష్టి ఉంది. కాంగ్రెస్తో చర్చల్లో ఈ స్థానాలను అడిగే అవకాశాలున్నాయి. అయితే కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకీ కాంగ్రెస్ ఇచ్చే అవకాశం లేదు. వైరాలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరోక్ష మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్లో చేరారు. దీంతో అక్కడ పోటీకి రాందాస్ నాయక్తో పాటు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వర్గానికి చెందిన విజయాబాయి పోటీ పడుతున్నారు. కాబట్టి ఈ స్థానాన్ని సీపీఐకి ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. బెల్లంపల్లిలో మాజీ మంత్రి గడ్డం వినోద్, హుస్నాబాద్లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లు బరిలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండు స్థానాలను వదులుకోవడం కూడా కాంగ్రెస్కు కష్టమే. ఇక మిగిలిన మునుగోడులోనే సీపీఐని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. మునుగోడులో 2018 ఎన్నికల్లో గెలిచినా, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఈసారి ఈ స్థానాన్ని పాల్వాయి స్రవంతి, పున్నా కైలాశ్నేత, చల్లమల్ల కృష్ణారెడ్డి ఆశిస్తున్నారు. అయితే అక్కడ బీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశముంది. దీంతో ఒకవేళ ఇస్తే మునుగోడునే సీపీఐకి ఇవ్వాల్సి వస్తుందని మెజారిటీ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే వామపక్షాలతో చర్చలకు వెళ్లి పొత్తు కుదుర్చుకోవాల్సి వస్తే మాత్రం కనీసం చెరో రెండు సీట్లను వదులుకోవాల్సి ఉంటుందని, దానివల్ల పారీ్టకి నష్టమే జరుగుతుంది తప్ప ఎలాంటి లాభం ఉండదనేది కొందరి అభిప్రాయంగా ఉంది. ఆ రెండు సీట్లు అసలు కుదరవు? ఉభయ కమ్యూనిస్టు పార్టీల సారథులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు పోటీ చేయాలని భావిస్తున్న పాలేరు, కొత్తగూడెం స్థానాలపై పీటముడి పడే అవకాశం ఉందని, ఆ రెండు సీట్లు వదులుకోవడం కాంగ్రెస్ పారీ్టకి సాధ్యం కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. పాలేరు, కొత్తగూడెంలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, స్థానిక ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్లినా ఆ రెండు చోట్లా 2018లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించిందని, అలాంటప్పుడు ఆ సీట్లను ఎలా వదులుకుంటామని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘పొత్తులపై చర్చలు జరిగితే సీపీఐ, సీపీఎంలు ఆ రెండు సీట్లపైనే పట్టుపట్టడం ఖాయం. కానీ మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు స్థానాలు ఇవ్వలేం. అందువల్ల చర్చలకు వెళ్లకపోవడమే మంచిదేమో..’ అని కాంగ్రెస్ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచే మేం మెజార్టీ సీట్లు గెలుస్తామని అనుకుంటున్నాం. అక్కడ నాయకత్వం బాగా కష్టపడి పార్టీని నిలబెట్టింది. అలాంటి చోట్ల సీట్లు కమ్యూనిస్టులకు ఇస్తామంటే స్థానిక నాయకత్వం ఎలా స్పందిస్తుందో తెలియదు. కాబట్టి ఆచితూచి ముందుకెళ్లాలని భావిస్తున్నాం.’ అని మరో ముఖ్యనేత చెప్పారు. -
‘బీఆర్ఎస్కు మద్దతు కొనసాగుతుంది.. త్వరలో కేసీఆర్తో చర్చలు’
సాక్షి, హైదరాబాద్: ‘వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలు విడివిడిగా పోటీ చేసి ఎంతో నష్టపోయాయి. ఇకపై వేరువేరుగా పోరాటం చేయకుండా ఐక్యంగా ముందుకు పోవాలని నిర్ణయించాం. అంతేకాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీకికి మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నాం. దేశంలో బీజేపీ వ్యతిరేక లౌకిక శక్తులను ఏకం చేయడం ద్వారా కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే మా లక్ష్యం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు కొనసాగిస్తూ మాకు బలం ఉన్న చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. అతి త్వరలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో చర్చిస్తాం..’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఎంబీ భవన్లో సీపీఎం, సీపీఐల ఉమ్మడి సమావేశం జరిగింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. అనంతరం తమ్మినేని, కూనంనేని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్తో జట్టు కట్టం: తమ్మినేని బీఆర్ఎస్తో కమ్యూనిస్టులు దూరంగా ఉన్నారని, కాంగ్రెస్ పారీ్టతో జత కడతారనే తప్పుడు వార్తలను తమ్మినేని ఖండించారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్కు ఉందని, అందుకే మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ తనకు తానుగా చొరవ చేసి మునుగోడులో కలిసి పని చేద్దామని కోరిందని, రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని చెప్పారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు సీట్ల అంశంపై మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. సీట్ల కేటాయింపులపై సీఎం కేసీఆర్తో ఇప్పటివరకు తాము చర్చించలేదన్నారు. కమ్యూనిస్టులు ఎన్నికలకు సమాయత్తం అవ్వడం లేదని కొందరు అనుకుంటున్నారని, కానీ తమకు బలం ఉన్న చోట సన్నాహాలు చేసుకుంటున్నామని తెలిపారు. ఓట్లు, సీట్ల కోసం దిగజారం: కూనంనేని మునుగోడులో ఏర్పడిన విపత్తును వామపక్షాలు అడ్డుకున్నాయని కూనంనేని అన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే ప్రభుత్వాన్ని అస్థిర పరిచేదని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఎల్ సంతోష్ ప్రయత్నం చేశారని ఆరోపించారు. కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ, పార్లమెంటులను ప్రజలు ఊహించుకోవడం లేదన్నారు. బీజేపీకి ప్రజల సమస్యలు పట్టవని, వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతుందని విమర్శించారు. జాతీయ స్థాయిలో లౌకిక శక్తులతో కేసీఆర్ కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు వివరించారు. గిరిజనేతరులకూ పోడు భూములు ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ అంశం త్వరలో సీఎంకు వివరిస్తామన్నారు. -
బీఆర్ఎస్ తీరుపై కామ్రేడ్ల కస్సుబుస్సు
సాక్షి, హైదరాబాద్: పొత్తుల విషయంలో బీఆర్ఎస్ తీరుపై వామపక్షాలు గరంగరంగా ఉన్నాయి. పొత్తులుంటాయా ఉండవా అనే అంశంపై సీపీఐ, సీపీఎం కేడర్లో గందరగోళం నెలకొంది. పొత్తులు, ప్రజాసమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ను అపాయింట్మెంట్ కోరినా ఇప్పటివరకు లభించకపోవడంపై కామ్రేడ్లు కస్సుబుస్సులాడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ తమను ఉపయోగించుకొని పొత్తులపై చర్చించాలనే సరికి మాత్రం పక్కనపెడుతోందని కొందరు నేతలు మండిపడుతున్నారు. ఖమ్మంలో నిర్వహించిన సభకు తమ జాతీయ నేతలైన కేరళ సీఎం పినరయి విజయన్, డి.రాజా వంటి వారిని వెంటపడి మరీ పిలిపించుకున్న సీఎం కేసీఆర్... ప్రస్తుతం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలు శుక్రవారం ఎంబీ భవన్లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ఆ పార్టీల ముఖ్య నేతలు హాజరుకానున్నారు. బీజేపీని వ్యతిరేకించే శక్తులతోనే ముందుకు... మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి అడ్డుకట్ట వేయగలిగేది బీఆర్ఎస్ మాత్రమేనని భావించి ఆ పార్టీకి వామపక్షాలు మద్దతిచ్చాయి. అనుకున్నట్లుగానే బీజేపీ గెలవకుండా అక్కడ వామపక్షాల ఓట్లు సహకరించాయి. రానున్న ఎన్నికల్లోనూ బీజేపీని ఓడించే సత్తాగల పార్టీకే మద్దతు ఇవ్వాలన్నది వామపక్షాల వైఖరి. ఇందులో భాగంగా సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్ను చెరో 10 అసెంబ్లీ స్థానాలు కోరాలనుకుంటున్నాయి. చర్చల్లో చివరకు చెరో ఐదు స్థానాలు తప్పనిసరిగా అడగాలన్నది వారి ఉద్దేశం. కానీ ఈ స్థానాలు ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదన్న వాదనలు వస్తున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్లున్న ఆయా స్థానాలను కామ్రేడ్లకు ఇవ్వడం వల్ల ప్రస్తుత ఎమ్మెల్యేలు అలిగి సహకరించకపోతే ఓటు బదిలీ జరగక వారు ఓడిపోయే ప్రమాదం ఉందన్న భావనలో బీఆర్ఎస్ ఉందని వామపక్షాలు అంచనా వేస్తున్నాయి. అలాగే పది సీట్లు ఇచ్చినా వామపక్షాలు డబ్బు ఖర్చు పెట్టవని, దానివల్ల కూడా సీట్లు కోల్పోవాల్సి వస్తుందని కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్తో పొత్తు కుదరకపోతే కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకొనే దిశగా కూడా వామపక్షాలు ఆలోచిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు వామపక్షాలతో పొత్తుపై ఆసక్తి చూపించడంలేదని సమాచారం. -
TS: పొత్తుల విషయంలో వామపక్షాలు మౌనం.. కారణం అదేనా!
కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. దీంతో పొత్తుల విషయంలో కమ్యూనిస్టు పార్టీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయనే వాదన వినిపిస్తోంది. అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయించుకోలేకపోతున్నాయనే చర్చ కూడా నడుస్తోంది. బీఆర్ఎస్ విషయంలో క్లారిటీ రాలేదా? కాంగ్రెస్ బలపడుతున్నదని ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఎర్రన్నల ఆలోచనలు ఎలా ఉన్నాయి? కొంతకాలంగా పొత్తుల విషయంలో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలు మౌనం పాటిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సాధారణ ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగుతుందని రెండు వైపుల నుంచి ప్రచారం ఊపందుకుంది. కాని తాజా పరిణామాల నేపథ్యంలో పొత్తుల సంగతి తర్వాత ముందు మన బలం పెంచుకుందామని రెండు వామపక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తమకు పట్టున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బహిరంగసభలతో బలాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగూడెంలో సీపీఐ భారీ బహిరంగ సభ నిర్వహించి బీజేపీని టార్గెట్ చేసింది. ఖమ్మం అంటే కమ్యూనిస్టుల అడ్డా అని..ఇక్కడ కాషాయ పార్టీ పప్పులు ఉడకవని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అంటున్నారు. అదే సమయంలో లెఫ్ట్ పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకుంటాయనే విషయమై ఎలాంటి చర్చలూ జరగలేదని ఆయన చెప్పారు. పొత్తుల అంశంపై ఎన్నికల సమయంలోనే స్పష్టత వస్తుందని కూడా ఆయన ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతోందని.. అదే సమయంలో కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడ బీజేపీ పూర్తిగా బలహీనపడిందని లెఫ్ట్ నేతలు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా కూడా గట్టిగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. వారి అంచనాలు, అభిప్రాయాలు చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, వైరా, పినపాక స్థానాలపై సీపీఐ గురిపెట్టింది. అందులో భాగంగానే కొత్తగూడెంలో భారీ బహిరంగ సభతో బలప్రదర్శన చేసింది. కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సీపీఏం సైతం అదే ఫార్ములాను అనుసరిస్తోంది. పొత్తుల విషయం పక్కన పెట్టి వారికి పట్టు ఉన్నా ప్రాంతాల్లో బలం పెంచుకునే ప్రయత్నంలో సీపీఎం నాయకులు ఉన్నారు. ఇటివలే ఖమ్మం నగరంలో సీపీఏం కూడా భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటే ప్రయత్నం చేసింది. ఉమ్మడి జిల్లాలో సీపీఏంకి పాలేరు, మధిర, భద్రాచలం నియోజకవర్గాల్లో బలం ఉంది. పాలేరు నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ సైతం మొదలుపెట్టారు. సీట్ల విషయంలో బీఆర్ఏస్ నుంచి క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో.. ముందు తమకు పట్టు ఉన్న ప్రాంతాల్లో బలం చూపించుకుంటే సీట్లు అవే వస్తాయన్న భావనలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పొత్తుల విషయంలో మౌనంగా ఉంటున్నాయి. అయితే సీపీఎం, సీపీఐ కలిసే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. మరి వారి పొత్తు కాంగ్రెస్తో ఉంటుందా? బీఆర్ఎస్తో ఉంటుందా? బహుశా వారికి కావాల్సిన సీట్లు ఎవరిస్తే వారితో ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చదవండి: బండ్ల గణేష్ పొలిటికల్ ట్వీట్.. రాజకీయాల్లోకి రీఎంట్రీ! -
చంద్రబాబు బరితెగింపునకు నిదర్శనం ‘కరకట్ట నివాసం’: సజ్జల
సాక్షి, విజయవాడ: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుకబడిన వర్గాల అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారని తెలిపారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లెఫ్ట్ పార్టీలు సంపన్నుల వైపు నిలబడతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏజెంట్లా పవన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ రాజకీయ నిర్ణయాలు చంద్రబాబుకు రాజకీయంగా ఉరితాడు లాంటివని అన్నారు. అందుకే తోడేళ్ల మందలా ఏకమై దాడి చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణసీకారోత్సవ కార్యక్రమం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. 'రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు చేసేలా సీఎం జగన్ పాలన ఉంది. మేనిఫెస్టోలో 98.2 శాతం హామీలను అమలు చేసి చూపించారు. చంద్రబాబు హయాంలో జరిగిన దేశంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతి. బాబు అక్రమాలకు చిరునామా చంద్రబాబు కరకట్ట నివాసం. లింగమనేని రమేష్కి, హెరిటేజ్కి మధ్య లావాదేవీలు జరిగాయి. చంద్రబాబు బరితెగింపునకు నిదర్శనం ఈ అక్రమ నివాసం. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చట్టం చేసిన వ్యక్తి చంద్రబాబు. డబ్బున్న వాళ్లకోసం పేదలకు ఇవ్వకుండా చేశారు. రియల్ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా చంద్రబాబు గొడవ చేయిస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు.' అని సజ్జల ఫైర్ అయ్యారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం.. -
ఆపత్కాలంలో ఐక్యతా రాగం!
దేశంలో వామపక్షాలు బలహీనమై పోతున్న కాలమిది. ఇదే సమయంలో మతతత్త్వ శక్తులు బలపడిపోతుండటం ప్రగతి శీల ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఉభయ కమ్యూనిస్టు పార్టీల (సీపీఐ, సీపీఎం) జాతీయ నాయకత్వాలు హైదరాబాద్లో సమావేశమై వామపక్షాల ఐక్యత అవసరంపై చర్చించాయి. ఈ పార్టీల్లో సీపీఐ తాజాగా ‘జాతీయ పార్టీ’ హోదాను కోల్పోయిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు వామపక్షాలు ఐక్యమైతేకాని మతతత్త్వ శక్తులను అడ్డుకోవడం సాధ్యం కాదని ప్రకటించాయి. వామపక్షాల ఐక్యత అవసరాన్ని ఎనభై ఏళ్ల క్రితమే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రమాణ పత్రం ఒకటి నొక్కి వక్కాణించడం గమనార్హం. ‘‘భారతదేశాన్ని ‘హిందూ దేశం’గా మార్చేందుకు, భారత సెక్యులర్ రాజ్యాంగం స్థానంలో దేశాన్ని విభజించి కేవల ‘హిందూ’ దేశంగా మార్చే ‘మను స్మృతి’ని అమలు పరిచేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ప్రయత్నిస్తు న్నాయి. మితవాద రాజకీయాలపై శక్తిమంతంగా పోరాడాలంటే దేశంలో వామ పక్షాల మధ్య ఐక్యత మరింత అవసరం. దేశంలోని మితవాద రాజకీ యాలపై నిరంతర పోరుకు వామపక్షాల ఐక్యత నేడు తక్షణావసరం. ఈ ఐక్యత పరస్పర విశ్వాసం ద్వారానే సాధ్యం’’. – సీపీఐ, సీపీఎం పార్టీలు హైదరాబాద్లో తొలిసారిగా జరిపిన సంయుక్త సమావేశంలో (10.4.2023) తీసుకున్న నిర్ణయం. వామపక్షాలైన సీపీఐ, సీపీఎంల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి ‘యూనిటీ’ సమావేశం వామపక్ష అభిమానులలో నూతనోత్తే జానికి కారణమయింది. ఉభయపక్షాల ఐక్యత తక్షణావసరాన్ని ఇరు పక్షాల నాయకులు, కార్యకర్తలు గుర్తించడం ముదావహం. నిజానికి ఉభయ పార్టీలూ కలవ వలసిన అవసరాన్ని కొత్తగా ఇప్పుడు గుర్తించారని చెప్పనవసరం లేదేమో. ఎనిమిది దశాబ్దాల క్రితమే కాన్పూర్ కేంద్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఎస్. సత్యభక్త కమ్యూనిస్టుల ఐక్యత కోసం తొలి ప్రమాణ పత్రాన్ని వెలువరించారు. హైదరాబాద్ కేంద్రంగా వెలువడిన ఉభయ పార్టీ (సీపీఐ, సీపీఎం)ల సంయుక్త సమావేశంలో ప్రసంగించిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, ïసీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలు ఉగ్గడించిన ‘ఉభయ పక్షాల ఐక్యత అవసరం’ గుర్తించ డానికి ఇన్నేళ్ల సమయం పట్టడం... ఉభయ వామ పక్షాల ఉమ్మడి వార సత్వానికి ఒక రకంగా ‘మచ్చ’గానే భావించాలి. అయినా ఇప్పటికైనా ఏకపక్షంగా ఉభయపక్షాల ఐక్యతావాంఛ... అనేక సమస్యల పరిష్కా రానికి ఎదురుచూస్తున్న దేశానికి శుభసూచకంగా భావించాలి. ఈ సందర్భంగా కాన్పూర్ తొలి పార్టీ ప్రమాణ పత్రాన్ని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, ఆ పత్రం ఆనాటికే కాదు, ఎప్పటికీ పోరాట పటిమ గల పార్టీకి ఒక బలమైన దిక్సూచిగా ఎలా నిలబడి పోయిందో గుర్తించడం కోసమే! అందులో పేర్కొన్న ప్రమాణాలలో కొన్నింటిని ఒక్కసారి పరిశీలిద్దాం: ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా లేని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలనుకొనేది సంపాదన కోసం, అది వీలు చిక్కకపోతే ప్రజలపై నిర్బంధ విధానాల ద్వారా ఒడుపుకోవడం కోసమే గానీ ప్రజల ప్రయోజనాలను గుర్తించి వారిని సకాలంలో ఆదుకోవడానికి కాదు; ఈ పరిస్థితుల్లో వామపక్షాల బాధ్యత పెట్టుబడిదారీ శక్తుల తరఫున కొమ్ము కాయడం కాదు, ఆ కొమ్ములను విరిచి ప్రజాబాహుళ్యం మౌలిక అవసరాలైన తిండి, బట్ట, వసతి, ఉపాధి సౌకర్యాలను కల్పించడం. తద్వారా ప్రజలు తమ కష్టార్జితాన్ని తాము స్వేచ్ఛగా అనుభవించడానికి దోపిడీకి తావు లేకుండా చేయడం కమ్యూనిస్టుల విధిగా ఉండాలి. ఇదీ స్థూలంగా 1924 నాటి కాన్పూర్ డాక్యుమెంట్ ఆదేశించింది. ఆ ‘ప్రమాణ పత్రం’ మకుటం కూడా ‘సత్యభక్త, భార తీయ సామ్యవాది దళ్’ (ది ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ) అనీ, ‘సత్యవాది’ అనీ! 1924 నాటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని సమ స్యల్ని ఎంతగా మనసు విప్పి బాహాటంగా ప్రకటించిందో చూడండి: ‘సమాజంలో నాయకులకు, రాజకీయవేత్తలకు, మత ప్రవక్తలకు, సంఘ సంస్కర్తలకు కొదువ లేదు వీరంతా ప్రజలకు చేసే మార్గ నిర్దేశానికి కొదవ లేదు. కానీ వీరు చూపే అనేక మార్గాలు ఉన్న ‘జబ్బు’ను పెంచేవే కానీ తుంచేవి కావు. పైగా చాలామంది మార్గదర్శ కులు తమ పొట్టలు నింపుకోవడం కోసం ప్రజల్ని బుద్ధి పూర్వకంగానే అగాథంలోకి నెట్టేస్తారు. కానీ, ఇలా అగాథంలోకి నెట్టే వాళ్లనుంచి ప్రజల్ని రక్షించడానికే భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టింది. ప్రజలు ఎదుర్కొనే అన్ని సమస్యల నుంచీ వారిని తామే రక్షిస్తామన్న హామీ ఏ పార్టీ ఇవ్వదు. ఎందుకంటే, ఏ పార్టీ వ్యవస్థా అలా ఉండదు కనుక. ప్రజలంతా ఏకమై తమ కాళ్లమీద నిలబడి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి. ధనికులకు, పేదలకు మధ్య దారుణంగా పేరుకు పోయిన సమస్యల్ని తగ్గించడం పార్టీ లక్ష్యంగా ఉండాలి. సమాన త్వాన్ని ప్రేమించేవారికి పార్టీలో నిస్సందేహంగా స్థానం ఉంటుంది. అంతేగాని తాము మాత్రమే అన్ని సౌకర్యాలు అనుభవించాలనుకొనే వారికి పార్టీలో స్థానం ఉండదు. ఎవరైతే ప్రజల్ని మోసం చేస్తూ, ఇతరులను దోచుకుంటూ అనుభవించగోరతారో... వారికి పార్టీలో స్థానం ఉండదు. తమ చెమటోడ్చి సంపాదించుకుంటూ, తప్పుడు మార్గాల ద్వారా సంపాదనకు ఒడిగట్టని పేద రైతులు, కార్మికులు, నిరుపేద గుమస్తాలు, చిన్నచిన్న ప్రభుత్వోద్యోగులు, రైల్వే సిబ్బంది, స్కూలు మాస్టర్లు, చిన్నచిన్న వ్యాపారులు, చిన్నస్థాయి పోలీస్ కానిస్టేబుల్స్, ప్రెస్ ఉద్యోగులు – వంటి వారు మాత్రమే మా పార్టీలో సభ్యత్వానికి అర్హులు’ అని పార్టీ ఈ పత్రం ద్వారా చాటింది. అయితే పెట్టుబడిదారీ (కాపిటలిస్ట్) వర్గానికి, వారి ప్రయోజ నాల కోసం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పనిచేసే సంస్థలను పార్టీ సహించదని చెప్పింది. అందుకనే శ్రమ జీవులంతా ఏకైక భారత కమ్యూనిస్టు పార్టీ పతాకం కింద సమకూడి, తుది శ్వాస వరకూ నిలబడాలని ప్రమాణ పత్రం నిర్దేశించింది. అంతేగాదు, రంగంలో ఉన్న పెక్కు రాజకీయ పార్టీలు వర్గ ప్రయోజనాలను ప్రతిబింబించేవి కాబట్టి... వీటన్నింటిలో ఏకైక పెద్ద కార్మికవర్గ శక్తి కమ్యూనిస్టు పార్టీ కాబట్టి అందరూ ఐక్య శక్తిగా సమీకృతం కావాలని ఆ మానిఫెస్టో ప్రకటించింది. బహుశా అందుకనే సుభాష్ చంద్రబోస్ రానున్న రోజుల్లో భారతదేశ భవిష్యత్తు మౌలికంగా వామపక్ష శక్తుల పోరాటం, త్యాగాల మీదనే ఆధారపడి ఉంటుందని జోస్యం చెప్పారు. ఎందుకంటే, విప్లవోద్యమం అనేది అరాచక ఉద్యమం కాదు, టెర్రరిస్టుల ఉద్యమమూ కాదు. భారత స్వాతంత్య్రోద్యమంలో దేశ భక్తులైన అనేకమంది మేధావులను, నాయకులను, యువకులను, రచయిత లను ‘దేశద్రోహులు’గా వలస పాలకులు ముద్రవేసి జైళ్లలో పెట్టారు. అందులో వామపక్ష భావాలు ఉన్నవారు అనేకమంది ఉన్నారు. ‘మనల్ని దేన్ని చదవకూడదని బ్రిటిష్ పాలకులు కోరుకున్నారు’ (బ్యాన్డ్ అండ్ సెన్సార్డ్: వాట్ ది బ్రిటిష్ రాజ్ డిడిన్ట్ వాంట్ అజ్ టు రీడ్’) అనే గొప్ప చారిత్రిక విశ్లేషణా గ్రంథాన్ని తాజాగా అందించిన చరిత్రకారిణి దేవికా సేథి... అప్పటి వలస భారతంలోని ‘సెన్సార్షిప్’ నిబంధనల మాలోకం గురించీ వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 75 ఏళ్ల తర్వాత రాసిన ఆ గ్రంథం ఎన్నో మరుగున పడిన విషయాలను తెలియచేస్తోంది. ఇంతకూ ‘దేశద్రోహి’ అంటే ఎవరు, అన్న ప్రశ్నకు టర్కీ ప్రసిద్ధ ప్రజా మహాకవి హిక్మెట్ను అడిగితే చెబుతాడు: ‘‘ఔను, నేను దేశద్రోహినే – మీరు దేశభక్తులైతే మీరే మన మాతృభూమి పరిరక్షకులైతే నేను నా మాతృభూమికి దేశద్రోహినే దేశభక్తి అంటే మీ విశ్వాసాల వ్యవసాయ క్షేత్రాలే అయితే దేశభక్తి అంటే మీ బొక్కసాల్లో సంపదలే అయితే దేశభక్తి అంటే మీ బ్యాంకు ఖాతాల్లో నిధులే అయితే దేశభక్తి అంటే దారి పక్క దిక్కులేని ఆకలి చావులే అయితే దేశభక్తి అంటే జనాలు కుక్కపిల్లల్లా చలికి వణికిపోవడమే అయితే ఎండా కాలంలో మలేరియాతో కునారిల్లడమే అయితే మతగ్రంథాలను వల్లించడమే దేశభక్తి అయితే పోలీసు చేతి లాఠీయే దేశభక్తి అయితే మీ కేటాయింపులూ, మీ జీతభత్యాలు మాత్రమే దేశభక్తి అయితే మూఢ విశ్వాసాల అజ్ఞానపుటంధకారపు మురికి గుంట నుంచి విముక్తి లేకపోవడమే దేశభక్తి అయితే – నేను దేశద్రోహినే!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కలి‘విడి’గానే! చర్చనీయాంశంగా కారు – కామ్రేడ్ల స్నేహబంధం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికల కార్యాచరణను అమలు చేస్తున్నాయి. కానీ ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. అయినప్పటికీ అధికార బీఆర్ఎస్ – వామపక్షాల పొత్తు అంశం మాత్రం గత కొన్నాళ్లుగా చర్చనీయాంశమవుతోంది. ఆ పార్టీల నేతలు పోటీలు పడుతూ దీన్ని తెరపైకి తెస్తున్నారు. తాజాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేస్తాయని, ఈ అవగాహనలో భాగంగా తాము అడిగే మొదటి స్థానం పాలేరేనని, ఇక్కడ తాము పోటీ చేస్తే మంచోళ్లంతా తమకే ఓట్లు వేయాలని ఆయన కోరారు. పొత్తు చర్చలు ప్రారంభం కాకుండానే ఆయన సీపీఎం పోటీ చేసే స్థానాలపై మాట్లాడటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ఓ సభలో కూడా ఇక్కడి నుంచి సీపీఎం కచ్చితంగా పోటీ చేస్తుందంటూ తమ్మినేని చెప్పుకొచ్చారు. తమ్మినేని మాత్రమే కాదు.. తాము కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్న అసెంబ్లీ స్థానాల పరిధిలోని సీపీఎం, సీపీఐ నేతలు కూడా ఆయా సందర్భాల్లో బీఆర్ఎస్తో పొత్తు, తాము పోటీ చేసే నియోజకవర్గాలను ప్రస్తావిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని, కొత్తగూడెం నుంచి తాను తప్పనిసరిగా పోటీ చేస్తానని పార్టీ కేడర్కు చెపుతున్నారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ ఆలోచన ఏ విధంగా ఉందన్నది బయటపడక పోవడంతో.. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ పార్టీల మధ్య ఏర్పడిన స్నేహ బంధం ఎంత దూరం కొనసాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. గౌరవప్రదమైన స్థాయిలో అంగీకారం! వామపక్ష పార్టీల్లో జరుగుతున్న చర్చల ప్రకారం.. బీఆర్ఎస్తో పొత్తు కుదిరితే మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు అడగాలని సీపీఎం, సీపీఐలు నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. పాలేరు, వైరా, మధిర, భద్రాచలం, ఖమ్మం, నకిరేకల్, మిర్యాలగూడ, నల్లగొండ, ఇబ్రహీంపట్నం స్థానాలు కావాలని సీపీఎం అడిగే అవకాశం ఉండగా కొత్తగూడెం, దేవరకొండ, హుస్నాబాద్, బెల్లంపల్లి, వైరా, ఇల్లందు, మునుగోడు నియోజకవర్గాలను సీపీఐ కోరే అవకాశముంది. అయితే కోరినన్ని స్థానాలు ఇవ్వకపోయినా గౌరవప్రదమైన స్థాయిలో పొత్తును అంగీకరించే యోచనలో రెండు పార్టీలూ ఉన్నట్టు సమాచారం. కనీసం మూడు అసెంబ్లీ సీట్లు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యత్వం కోసం బీఆర్ఎస్ను కోరే విషయమై సీపీఎం నేతలు అంతర్గతంగా చర్చించికుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సీపీఐ కూడా కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు కావాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ, ఇతర పదవుల గురించి కూడా చర్చించాలనే యోచనలో సీపీఐ పెద్దలున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా పొత్తు విషయంలో తగ్గేదేలేదని ఆ పార్టీలు చెబుతున్నాయి. తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రెండు నియోజకవర్గాల తర్వాతే ఏ స్థానం గురించైనా చర్చ జరుగుతుందని వామపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పెద్దల మదిలో ఏముందో? కామ్రేడ్ల ఆలోచనలు ఎలా ఉన్నా.. వారితో తమ అనుబంధంపై బీఆర్ఎస్ పెద్దల మదిలో ఏముందన్నది అంతు పట్టడం లేదు. పలు సందర్భాల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం తెరపైకి వస్తున్నప్పటికీ ఆ పార్టీ కీలక నేతలెవరూ ఎక్కడా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం లేదు. సీఎం కేసీఆర్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశాన్ని కనీస మాత్రంగా కూడా ప్రస్తావించడంలేదు. అయితే వామపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇప్పిస్తామని, ఆయా స్థానాల్లో తామే పోటీ చేస్తామని స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వామపక్ష పార్టీల నేతలకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అంశం కూడా ఎక్కడా చర్చకు రావడం లేదు. ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం! వామపక్ష పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతాయి కానీ, అధికారికంగా పొత్తు కుదిరే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తుండటం సందిగ్ధతకు తావిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోలేదని, ఆ రెండు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, 2023లో లెఫ్ట్తో కలిసి వెళితే తాము గతం కంటే బలహీనపడ్డామని తామే అంగీకరించినట్టు అవుతుందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ నాయకుల్లో ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారని, వారు కోరుతున్న స్థానాలను వదులుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధంగా లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ స్థానాల్లో కేడర్ను నిలబెట్టుకునేదెట్టా? లెఫ్ట్తో పొత్తు అంశం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వామపక్షాలు ఖచ్చితంగా అడుగుతాయని భావిస్తున్న స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కందాల ఉపేందర్రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రవీంద్రనాయక్, వనమా వెంకటేశ్వరరావు తదితరులకు తమ నియోజకవర్గాల్లో కేడర్ను నిలబెట్టుకోవడం కత్తిమీద సాములా మారుతోంది. ఆయా స్థానాలు లెఫ్ట్ పార్టీలకు వదిలివేస్తారనే సంకేతాల నేపథ్యంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎక్కడ జారిపోతుందోననే ఆందోళన స్థానిక బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. పలువురు కమ్యూనిస్టు నాయకులకు ఏకంగా సీఎం కేసీఆర్ స్థాయిలో హామీ లభించిందన్న ప్రచారం కూడా వారికి మింగుడు పడడం లేదు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద ప్రకటనలకు కూడా సిద్ధమవుతున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా కొద్దిరోజుల క్రితం.. అక్కడ జూలకంటి రంగారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పినా, ఆ తర్వాత సీపీఎం నేతలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగూడెంలో అయితే వనమాతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు తదితరులు తమకంటే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తంమీద లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కోరే విషయమై సీపీఎం నేతలు అంతర్గతంగా చర్చించికుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సీపీఐ కూడా కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు కావాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ, ఇతర పదవుల గురించి కూడా చర్చించాలనే యోచనలో సీపీఐ పెద్దలున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా పొత్తు విషయంలో తగ్గేదేలేదని ఆ పార్టీలు చెబుతున్నాయి. తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రెండు నియోజకవర్గాల తర్వాతే ఏ స్థానం గురించైనా చర్చ జరుగుతుందని వామపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం! వామపక్ష పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతాయి కానీ, అధికారికంగా పొత్తు కుదిరే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తుండటం సందిగ్ధతకు తావిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోలేదని, ఆ రెండు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, 2023లో లెఫ్ట్తో కలిసి వెళితే తాము గతం కంటే బలహీనపడ్డామని తామే అంగీకరించినట్టు అవుతుందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ నాయకుల్లో ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారని, వారు కోరుతున్న స్థానాలను వదులుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధంగా లేదని, స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ స్థానాల్లో కేడర్ను నిలబెట్టుకునేదెట్టా? లెఫ్ట్తో పొత్తు అంశం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వామపక్షాలు ఖచ్చితంగా అడుగుతాయని భావిస్తున్న స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కందాల ఉపేందర్రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రవీంద్రనాయక్, వనమా వెంకటేశ్వరరావు తదితరులకు తమ నియోజకవర్గాల్లో కేడర్ను నిలబెట్టుకోవడం కత్తిమీద సాములా మారుతోంది. ఒకవేళ ఆయా స్థానాలు లెఫ్ట్ పార్టీలకు వదిలివేస్తే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎక్కడ జారిపోతుందోననే ఆందోళన స్థానిక బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద ప్రకటనలకు కూడా సిద్ధమవుతున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మిర్యా లగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా కొద్దిరోజుల క్రితం.. అక్కడ జూలకంటి రంగారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పినా, ఆ తర్వాత సీపీఎం నేతలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగూడెంలో అయితే వనమాతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు తమకంటే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తంమీద లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. -
కామ్రేడ్.. కథ అడ్డం తిరిగిందా?
తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కొన్ని ప్రశ్నలు తెర మీదికి వచ్చాయి. లక్ష్యం ఒక్కటే. చీకటి ఒప్పందాలతో అయినా పచ్చ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి. తాము బలపరిచిన అభ్యర్థి గెలవకపోయినా ఫర్వాలేదు.. 1. టీడీపీ గెలిస్తే చాలనుకున్న ఆ పార్టీలు ఏవి? 2. పచ్చ పార్టీతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ నాయకులు ఎవరు? 3. సొంత పార్టీని ఫణంగా పెట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి సహకరించింది ఎవరు? ఎందుకిలా జరిగింది? 4. నెల్లూరు జిల్లాలో ఆ రెండు పార్టీల మద్య కుదిరిన రహస్య ఒప్పందమేంటి..? సైద్దాంతిక నిబద్ధతను కామ్రేడులు గాలికి వదిలేశారా? 5. భవిష్యత్ ఇస్తామని పచ్చ పార్టీ చూపిన ఆశలకు లొంగిపోయారా? 6. చంద్రబాబు ప్రలోభాలకు సరెండర్ అయి వారి బలాన్ని టీడీపీకీ ట్రాన్స్ఫర్ చేశారా..? లేక డబ్బు కోసం చేతులు కలిపారా ? 7. పట్టభద్రుల ఎన్నికలో టీడీపీ చేసిన జిమ్మిక్కులేంటి..? ఇప్పుడు ఇదే చర్చ ప్రస్తుతం వామపక్ష అభిమానుల్లో నడుస్తోంది.. గెలిచే బలమున్నప్పటికీ.. ఎందుకు టీడీపీ అభ్యర్దికి సహకరించారని అందరూ చర్చించుకుంటున్నారు. తమను తాకట్టు పెట్టుకుని బాబుకు జై కొట్టారా? తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలంటే పీడీఎఫ్ అభ్యర్దుల గెలుపు ఖాయమనే భావన ఉండేది. గత పదిహేను సంవత్సరాలుగా ఈ రెండు స్థానాల్లో వామపక్షాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్దులే గెలుస్తూ వచ్చారు. కానీ ఈ సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ బరిలోకి దిగడంతో పీడీఎఫ్ అభ్యర్దులకు ముచ్చెమటలు పట్టాయి. గెలుపు అంత ఈజీ కాదని అర్దమైంది.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ది చంద్రశేఖర్ రెడ్డిని, పట్టభద్రుల అభ్యర్ది శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఓడించేందుకు పావులు కదిపింది. డిపాజిట్లు అయినా సంపాదించుకోవాలనుకుంటున్న టీడీపీ వారితో జతకట్టింది.. ఇరు వర్గాల మధ్య తెరవెనుక ఒప్పందం కుదిరింది. రెండుసార్లు గెలిచిన పట్టభద్రుల పీడీఎఫ్ అభ్యర్థులు ఓడి, టీడీపీ అభ్యర్థిని గెలిపించారు. రాజకీయం ఎన్ని మలుపులు తిరిగింది? కామ్రేడ్స్ సైద్దాంతిక విలువలను గాలికొదిలేశారనే విమర్శలు నెల్లూరు జిల్లాలో వినిపిస్తున్నాయి. గత పదిహేనేళ్ళ నుంచి ఇక్కడి స్థానాల్లో విజయం సాదిస్తున్న పీడీఎఫ్ అభ్యర్దులకు సాంప్రదాయ ఓటు బ్యాంకు వుంది. కానీ వారు తమ బలాన్ని ఈసారి టీడీపీకి ట్రాన్స్ఫర్ చేయించారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి నారాయణ విద్యాసంస్థల అధినేత, అప్పటి మంత్రి పొంగురు నారాయణ అనుచరుడు పట్టాభి బరిలోకి దిగాడు. నారాయణ విద్యాసంస్థలతో కోట్లు ఖర్చుచేయగల సత్తా ఉన్నప్పటికీ.. పీడీఎఫ్ అభ్యర్థులను టీడీపీ టచ్ చెయ్యలేకపోయింది.. పట్టాభిని పీడీఎఫ్ అభ్యర్దులు కామెడీగా పక్కకి నెట్టేశారు. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలిచింది.. గత ఎన్నికల్లో నారాయణ విద్యాసంస్థలనే ఢీకొట్టిన వామపక్షాలు... ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోవడం వెనుక కుల సమీకరణాలు బాగా పనిచేశాయనే టాక్ నడుస్తోంది. వామపక్ష పార్టీలను లీడ్ చేసేది కూడా చంద్రబాబునాయుడి సామాజికవర్గమే కావడంతో జగన్ ను ఎదుర్కొనేందుకు వారంతా ఒక్కటయ్యారనే చర్చ కమ్యూనిస్టు పార్టీల్లోనే జరుగుతోంది. మన వాళ్లు కక్కుర్తి పడ్డారు కమ్యూనిస్టులు తెరచాటు రాజకీయం చెయ్యడం వల్లనే టీడీపీ అభ్యర్ది శ్రీకాంత్ విజయం సాధ్యమైంది. అనామకుడుగా ఎమ్మెల్సీ బరిలోకి దిగిన శ్రీకాంత్ కు కామ్రేడ్స్ సాయం చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ సాయం వెనుక భవిష్యత్ లో ఏమైనా పదవులు రావొచ్చు.. లేదంటే భారీగా లబ్ది అయినా చేకూరి ఉండొచ్చని నెల్లూరులో గాసిప్స్ వినిపిస్తున్నాయి. పచ్చ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి తాము బలపరిచిన అభ్యర్థినే త్యాగం చేసిన కమ్యూనిస్టుల పార్టీల వ్యవహార సరళిని వామపక్ష అభిమానులే చీదరించుకుంటున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
కాంగ్రెస్ వైపు కామ్రేడ్లు.. ప్రణాళికలు సిద్ధం..!
అసెంబ్లీ ఎన్నిక లకు ఏడాది సమయం కూడా లేదు. ముందస్తు ఎన్నికలపైనా ఊహాగా నాలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ ఎన్నికలు లక్ష్యంగానే వ్యూహాలు రూపొందించి అమ లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తులు తెరపైకి వస్తుండగా.. వామ పక్షాలు తాజాగా కాంగ్రెస్తో కలిసి వెళ్లాలనే ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికలో లెఫ్ట్ పార్టీలు బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించాయి. ప్రచారం సైతం నిర్వ హించాయి. భవిష్యత్తులోనూ సీపీఎం, సీపీఐ తో కలిసే వెళ్తామని ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు చెప్పారు. సీఎం కేసీఆర్ కూడా కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిన్న, మొన్నటివరకు ఇదే విధమైన వాతావరణం కన్పించింది. కానీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, కేవలం అవగాహన మాత్రమే ఉంటుందని ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేయడం, బీఆర్ఎస్ అధిష్టానం దీనిపై మౌనం వహించడం ఉభయ కమ్యూనిస్టు పార్టీలను అయోమయంలో పడేసింది. ఈ నేపథ్యంలోనే.. బీఆర్ఎస్ కలిసిరాని పక్షంలో కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ ఓటమే లక్ష్యం.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా లెఫ్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి. బీజేపీతో విభేదించే పార్టీలు ఏవైనా సరే వాటితో కలిసి ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల్లో పొత్తులు కూడా పెట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీపీఐ, సీపీఎం పార్టీలు బీఆర్ఎస్తో జత కట్టాయి. ఆ పార్టీ విజయంలో తమ వంతుపాత్ర పోషించాయి. బీఆర్ఎస్ ఆవిర్భావం నేపథ్యంలో ఇటీవల ఖమ్మంలో ఆ పార్టీ నిర్వహించిన సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం పాల్గొని ఐక్యత చాటారు. కానీ ఇటీవల కాలంలో వామపక్షాలతో పొత్తుపై బీఆర్ఎస్ నాయకులు స్వరం మార్చారు. అసెంబ్లీ స్థానాలు ఇచ్చేది లేదని, అవసరమైతే పెద్దల సభకు నామినేట్ చేస్తామంటూ తలోమాట మాట్లాడుతుండటంతో లెఫ్ట్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీపీఐ, సీపీఎంలు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాయని, ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగిందని, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కొందరు లెఫ్ట్ పార్టీల నేతలతో మంతనాలు జరిపారని తెలిసింది. అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన కాంగ్రెస్ పెద్దలు.. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే అధికారం ఖాయం. కాబట్టి మీరు మా వైపు రండి..’ అంటూ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు ఎన్నికలకు సంబంధించి మూడు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కమ్యూనిస్టుల ముందు 3 ప్లాన్లు... లెఫ్ట్ పార్టీలు ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ.. ఇలా మూడు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ప్లాన్ ఏ.. బీఆర్ఎస్తో పొత్తు ఉండేలా కృషి చేయడం. చెరో పది సీట్లు అడగాలి. మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ, నకిరేకల్, పాలేరు, వైరా, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, ఇబ్రహీంపట్నం, హుస్నాబాద్ స్థానాల కోసం పట్టుబట్టాలి. ఒకవేళ కొన్ని కాదని ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామంటే ఆలోచించాలి. ప్లాన్ బీ.. బీఆర్ఎస్ తర్వాత బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్, వైఎస్సార్టీపీ, తెలంగాణ జన సమితి వంటి పార్టీలతో జత కట్టడం. కాంగ్రెస్ పార్టీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి సాను కూలంగా ఉండటం కీలకాంశం. ప్లాన్ సీ కాంగ్రెస్ గౌరవప్రదమైన సీట్లకు అంగీకరించని పక్షంలో, ఏదైనా కారణంతో ఆ పార్టీతోనూ పొత్తు కుదరని పక్షంలో ఒంటరి పోరాటం చేయడం. చెరో 25 స్థానాల్లో పోటీ చేసి ఎన్నికల పోరాటంలో బీజేపీ సహా ఇతర పార్టీల వైఖరులను, విధానాలను ఎండగట్టడం. -
Tripura Assembly Elections 2023: మోత మోగేనా?
2018 అసెంబ్లీ ఎన్నికలు. లెఫ్ట్ కూటమి పాతికేళ్ల పాలనతో విసిగిపోయిన త్రిపుర ప్రజలను బీజేపీ అభివృద్ధి మంత్రం ఆకట్టుకుంది. దాని భాగస్వామ్య పార్టీ ఐపీఎఫ్టీకి గిరిజనుల్లో ఉన్న ఆదరణ తోడైంది. దాంతో 60 సీట్లకు గాను కాషాయ పార్టీ ఏకంగా 36 స్థానాల్లో నెగ్గింది. ముఖ్యంగా 20 ఎస్టీ స్థానాల్లో ఏకంగా 17 సీట్లను కొల్లగొట్టింది! ఐదేళ్ల తర్వాత పరిస్థితులు తారుమారవుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర నినాదంతో రాజకీయ పార్టీ అవతారమెత్తిన ఉద్యమ సంస్థ టిప్రా మోతా ఈసారి అధికార పార్టీ పుట్టి ముంచేలా కన్పిస్తోంది... ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుతోంది. పోలింగ్ (ఫిబ్రవరి 16) తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీలన్నీ అమ్ములపొదుల్లోంచి అన్ని అస్త్రాలూ బయటికి తీస్తున్నాయి. రాష్ట్రంలో పాతికేళ్ల లెఫ్ట్ పాలనకు 2018 ఎన్నికల్లో బీజేపీ తెర దించింది. గిరిజనుల్లో బాగా పట్టున్న ఐపీఎఫ్టీ పార్టీతో జట్టు కట్టి ఘనవిజయం సాధించింది. సీపీఎం 16 సీట్లకు పరిమితం కాగా కాంగ్రెస్ సోదిలోకూడా లేకుండా పోయింది. ఈసారి మాత్రం టిప్రా మోతా రూపంలో కొత్త పార్టీ తెరపైకి రావడంతో సమీకరణాలన్నీ మారిపోయాయి. పరిస్థితి తారుమారు... త్రిపుర మాజీ రాజ కుటుంబానికి చెందిన ప్రద్యోత్ బిక్రం మాణిక్యదేబ్ బర్మన్ సారథ్యంలో కొంతకాలంగా ప్రత్యేక గిరిజన రాష్ట్రం కోసం పోరాడుతున్న తిప్రా (త్రిపుర ఇండిజినస్ ప్రోగ్రెసివ్ రీజనల్ అలయన్స్) మోతా ఈసారి పార్టీగా రూపాంతరం చెందింది. బీజేపీతో పొత్తు ప్రయత్నాలు విఫలం కావడంతో ఒంటరిగానే రంగంలోకి దిగి పోటీని ముక్కోణంగా మార్చేసింది. అధికార బీజేపీ కూటమికి గట్టి సవాలు విసురుతోంది. మూలవాసులైన గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రంగా గ్రేటర్ తిప్రాలాండ్ను సాధిస్తామన్న మోతా హామీ ఎస్టీలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఐపీఎఫ్టీతో పొత్తు ద్వారా బీజేపీ కొల్లగొట్టిన గిరిజన ఓట్లు ఈసారి చాలావరకు మోతావైపు మళ్లే సూచనలు కన్పిస్తున్నాయి. గిరిజనుల్లోని లెఫ్ట్ ఓటు బ్యాంకుకూ మోతా గండి కొట్టేలా ఉంది. త్రిపురలో గిరిజన ప్రాబల్యం ఎక్కువ. మొత్తం 60 అసెంబ్లీ స్థానాల్లో 20 వారికి రిజర్వయ్యాయి. అంతేగాక మరో 23 గిరిజనేత స్థానాల్లోనూ 10 శాతానికి పైగా ఉన్న ఎస్టీలు అక్కడా నిర్ణయాత్మకంగానే ఉన్నారు. 2018లో బీజేపీ కూటమి 20 ఎస్టీ సీట్లలో ఏకంగా 17 స్థానాలను దక్కించుకుంది! అలా బీజేపీ కూటమికి అధికారంలోకి రావడంలో కీలకంగా మారిన గిరిజన ఓట్లరు ఈసారి టిప్రా మోతాకే ఓటేస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ సీట్లలో ముఖ్యంగా గిరిజనులు 60 శాతానికి పైగా ఉన్న 12 చోట్ల మోతాకు విజయావకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి. 50–60 శాతం మధ్య ఉన్న 5 స్థానాల్లో మోతా గట్టి పోటీ ఇవ్వనుండగా 50 శాతాం కంటే తక్కువగా ఉన్న మిగతా మూడు చోట్ల ముక్కోణ పోరు జరిగేలా కన్పిస్తోంది. ఎలా చూసినా బీజేపీ కూటమికి ఈ 20 సీట్లలో ఈసారి రెండు మూడు సీట్లకు మించి దక్కకపోవచ్చని అంచనా. దీనికి తోడు గిరిజన ప్రాబల్యమున్న 23 గిరిజనేతర అసెంబ్లీ స్థానాల్లో కూడా మోతా ఏకంగా 22 చోట్ల పోటీకి దిగడం బీజేపీకి నిద్ర లేకుండా చేస్తోంది. బీజేపీ కూటమి 12 నుంచి 15 సీట్లు కోల్పోయి హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని అంచనా. 10 నుంచి 15 సీట్లు గెలిచేలా కన్పిస్తున్న మోతా కింగ్మేకర్ అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు. ఓట్ల చీలికపైనే లెఫ్ట్ ఆశలు గత ఎన్నికలఓల 42 శాతానికి పైగా ఓట్లు సాధించినా సీట్ల లెక్కలో వెనకబడ్డ సీపీఎం, ఈసారి ఓట్ల చీలికపై బాగా ఆశలు పెట్టుకుంది. బీజేపీ–ఐపీఎఫ్టీ కూటమిని ఓడించేందుకు శత్రుత్వాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్తో జట్టు కట్టింది. 20 గిరిజన సీట్లతో పాటు 22 గిరిజనేతర స్థానాల్లో బీజేపీ ఓటు బ్యాంకుకు మోతా గండికొట్టనుండటం సీపీఎం–కాంగ్రెస్ కూటమికి కలిసొచ్చేలా కన్పిస్తోంది. దీనికి తోడు 2.5 లక్షల ఉద్యోగాలు తదితర హామీలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాకపోతే కాంగ్రెస్ ఓటర్లలో చాలామంది పొత్తును గౌరవించి సీపీఎం అభ్యర్థులకు ఓటేసేందుకు సిద్ధంగా లేరు. ఏడు దశాబ్దాల వైరాన్ని, అధికారంలో ఉండగా తమపట్ల సీపీఎం అనుసరించిన అణచివేత ధోరణిని మర్చిపోలేమని స్పష్టంగా చెబుతున్నారు. అయితే ముస్లింల్లో అత్యధికులు లెఫ్ట్ వైపే మొగ్గుతున్నారు. బీజేపీ.. అభివృద్ధి మంత్రం 2018లో బీజేపీ అభివృద్ధి నినాదాన్ని జనం నమ్మడంతో ఆ పార్టీ ఏకంగా 43 శాతం ఓట్లు సాధించింది! ఆశించిన అభివృద్ధి కనిపించలేదన్న అసంతృప్తి జనాల్లో ఉంది. శాంతిభద్రతలు క్షీణించాయన్నది మరో పెద్ద ఆరోపణ.అయితే మరోసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూస్తామంటున్న వారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. పీఎం ఆవాస్ యోజన మొదలుకుని కిసాన్ సమ్మాన్ నిధి దాకా పలు కేంద్ర పథకాల లబ్ధిదారులు ఎక్కువగానే ఉన్నారు. వీరిలోనూ మహిళల సంఖ్య ఎక్కువ. వారు మళ్లీ బీజేపీకే ఓటేస్తామంటున్నారు. పైగా సీఎం మాణిక్ సాహాకు ప్రజల్లో మంచి పేరుంది. కానీ 9 నెలల క్రితం దాకా సీఎంగా ఉన్న బిప్లబ్ దేబ్ పట్ల జనంలో ఉన్న వ్యతిరేకత బీజేపీకి నష్టం చేసేలా కన్పిస్తోంది. పైగా 2018లో గిరిజనుల్లో మంచి ఆదరణతో 8 సీట్లు సాధించిన భాగస్వామ్య పార్టీ ఐపీఎఫ్టీ ఆ తర్వాత అధ్యక్షుడు ఎన్.సి.దేబ్బర్మ మృతితో బాగా బలహీనపడింది. దాంతో బీజేపీ ఈసారి ప్రభుత్వ పథకాలనే నమ్ముకుని వాటిపై భారీ ప్రచారంతో హోరెత్తిస్తోంది. రాష్ట్రమంతటా కాషాయ జెండాలే ఎగురుతున్నాయి! ఎక్కడికక్కడ పోలింగ్ బూత్ కార్యాలయాలు తెరిచి తమ నేతలు, కార్యకర్తలను ఓటర్లతో నిత్యం టచ్తో ఉంచుతూ అధికార పార్టీ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు పోతోంది. హిందువుల్లో అత్యధికులైన బెంగాలీలు, ఎస్టీల్లో ఎగువ కులాల వారు బీజేపీ వైపే మొగ్గుతున్నారు. ఇక గిరిజన స్థానాల్లోని బెంగాలీలు బీజేపీకి, ముస్లింలు సీపీఎంకు జై కొడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిగ్ క్వశ్చన్: పేరుకు కమ్యూనిజం లోపలంతా ఎల్లో ఇజం
-
పేదోడికి ఇల్లు ఇస్తుంటే వద్దనే వారు కమ్యూనిస్టులా?
తాడేపల్లి: నిజమైన కమ్యూనిస్టులు పేదల బాగుకోసం పోరాడతారని, మరి అటువంటిది అమరావతి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కమ్యూనిస్టులు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. నిజమైన కమ్యూనిస్టులు సింగపూర్ కోరుకోరని, పేదల బాగుకోసం మాత్రమే ఆలోచిస్తారని అన్నారు పేర్ని నాని. తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మాట్లాడిన పేర్ని నాని.. చంద్రబాబుకు కమ్యూనిస్టు నేతలు రామకృష్ణ, నారాయణ అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. ‘సీపీఐ రామకృష్ణ కమ్యూనిస్ట్ సిద్ధాంతం పాటిస్తున్నారా?, అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకున్నారు. నిజమైన కమ్యూనిస్టులు సింగపూర్ కావాలని కోరుకోరు.పేదోడికి ఇల్లు ఇస్తుంటే వద్దనే వారు కమ్యూనిస్టులా?, చంద్రబాబుకు రామకృష్ణ, నారాయణ అమ్ముడు పోయారు. చంద్రబాబును సీఎం చేయడమే వారి లక్ష్యం. చంద్రబాబు ఏం చెబితే అది చేస్తున్నారు. అసత్యాలను నిజమని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. కమ్యూనిస్టుల్లో నిజమైన కమ్యూనిజం ఉందా? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో ప్రజలు తేలుస్తారు. విడివిడిగా పోటీ చేయడానికి మీకెందుకు అంత భయం’ అని పేర్ని నాని నిలదీశారు. -
ఓటేయకుంటే ఈడీ దాడులు చేస్తామని బెదిరించరుగా!
కొంపదీసి వాళ్లను ఓటేయకుంటే ఈడీ దాడులు చేస్తామని బెదిరించరుగా! -
మనం చెప్పుకోలేకపోతున్నాం.. వాళ్లు ధైర్యంగా చెప్పుకుంటున్నారు!
మన పాత్ర ఉన్నా చెప్పుకోలేక పోతున్నాం.. వాళ్లది లేకపోయినా ధైర్యంగా చెప్పుకుంటున్నారు! -
Munugode: సీఎం కేసీఆర్ కారులో సీపీఐ చాడ వెంకట్రెడ్డి!
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: మునుగోడు సమరం తెలంగాణలో మరో ఆసక్తికర పరిణామానికి తెర తీసింది. ఉప ఎన్నిక కోసం.. బీజేపీని బలంగా ఢీకొట్టే టీఆర్ఎస్ మద్దతు ప్రకటించాలని వామపక్షాలు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందే పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలోకి దిగాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలో ఇవాళ(శనివారం) బహిరంగ సభ నిర్వహించనుంది అధికార టీఆర్ఎస్. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే ఈ బహిరంగ సభ నుంచే మద్దతు ప్రకటించాలని, కార్యక్రమానికి రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ వాహనంలోనే చాడ.. మనుగోడుకు చేరుకోనున్నట్లు సమాచారం. ఇక మునుగోడు సభ కోసం టీఆర్ఎస్ భారీ ఎత్తున్న కసరత్తులు చేస్తోంది. రెండు వేల మందితో హైదరాబాద్ నుంచి ర్యాలీ తీయాలని చూస్తోంది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నాం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు-ఐదు గంటల వరకు విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదన్న ఆలోచనలో సీపీఐ-సీపీఎంలు ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. కాబట్టి, కాంగ్రెస్ ఓట్లు రెండుగా చీలడం ఖాయమని, ఒకవేళ కాంగ్రెస్కు వామపక్షాలు మద్దతిచ్చినా బీజేపీనే లాభపడుతుందని విశ్లేషిస్తున్నాయి. ఈ తరుణంలో.. బీజేపీని ఎదుర్కొనే టీఆర్ఎస్కు ఇవ్వడం కొంత మంచిదని నిర్ణయించుకున్నాయి. రెండు పార్టీలకు కలిపి మునుగోడు నియోజకవర్గంలో 25 వేలకుపైగానే ఓటింగ్ ఉండగా.. విజయవకాశాలను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదీ చదవండి: కారు వైపే కామ్రేడ్లు! -
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు అభ్యర్థులు కరువు
సాక్షి, యాదాద్రి: రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ బొమ్మతో ఎన్నికలకు వెళ్తే నిండా మునిగిపోతామనే భయం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు పట్టుకుందన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన యాదాద్రి భువ నగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకిలో బుధవారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిలో బీజేపీలో చేరే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య చాలా ఎక్కువగానే ఉందన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందనను చూశాక ఆయా ఎమ్మెల్యేలు బీజేపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపారు. ఇటీవల 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వస్తారని నేను చెబితే ఆ జాబితాలో నా పేరు కూడా ఉందా? లేదా? అని ఆయా ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ కోసం పని చేసే నిజమైన కార్యకర్తలంతా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విసిగిపోయారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే హైదరాబాద్లోని కంపెనీల వద్ద నెల కిందటే ఎన్నికల కోసం డబ్బులు వసూలు చేసుకున్నా రని సంజయ్ ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీలకు దమ్ముంటే మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయాలని సవాల్ చేశారు. కమ్యూనిస్టు, మజ్లిస్ పార్టీల నాయకులు కేసీఆర్ కోవర్టుల్లా మారారని మండిపడ్డారు. మిషన్ భగీరథ కోసం జిల్లాలో రూ.800 కోట్లు ఖర్చుతో అందిస్తున్న నీళ్లను ప్రజలు తాగడం లేదన్నారు. కాగా,ఈనెల 21న మునుగోడు లో జరిగే భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని సంజయ్ వెల్లడించారు. 8వ రోజు బండి సంజయ్ పాదయాత్ర 14కి.మీ మేర కొనసాగింది. చదవండి: మునుగోడుపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ -
బీహార్ రాజకీయాల్లో ఊహించని మలుపు.. బీజేపీకి నితీశ్ షాక్!
పట్నా: ఎన్డీఏతో మిత్రపక్షం జేడీయూ తెగదెంపులు చేసుకోనుందా? ఆగస్టు 11కు ముందే బిహార్లో జేడీయూ-బీజేపీ సర్కార్ కూలిపోనుందా? నితీశ్ కుమార్ మళ్లీ ఆర్జేడీతో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తోంది. బిహార్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మిత్రపక్షం బీజేపీతో సీఎం నితీశ్ కుమార్ చాలా కాలంగా అంటీమున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశం సహా జులై 17 తర్వాత కేంద్రం నిర్వహించిన నాలుగు సమావేశాలకు నితీశ్ డుమ్మా కొట్టారు. దీంతో ఎన్డీఏ నుంచి ఆయన విడిపోనున్నారనే వాదనలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు నితీశ్ మళ్లీ ఆర్జేడీతో జట్టుకట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలను కూడా కలుపుకొని బిహార్లో బీజేపీకి షాక్ ఇస్తూ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన ఆయా పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వంలో భాగమైన బీజేపీతో విడిపోయి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని నితీశ్ భావించినా.. అందుకు జేడీయూ ఎమ్మెల్యేలు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆర్జేడీ మద్దతు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నాలుగుసార్లు డుమ్మా జులై 17న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్షా నిర్వహించిన సమావేశానికి నితీశ్ హాజరుకాలేదు. రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోతున్న సందర్భంగా రామ్నాథ్ కోవింద్కు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి కూడా వెళ్లలేదు. ఆ తర్వాత జులై 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకరానికి కూడా నితీశ్ డుమ్మా కొట్టారు. తాజాగా ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా హాజరుకాలేదు. దీంతో ఆయన ఎన్డీఏకు రాంరాం చెప్పడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆర్సీపీ సింగ్పై అసంతృప్తి.. జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ పార్టీకి శనివారమే రాజీనామా చేశారు. ఆయన కుమార్తెల అక్రమాస్థులకు సంబంధించి సీఎం వివరణ కోరడంతో పార్టీని వీడారు. అయితే ఆర్సీపీ సింగ్పై నితీశ్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉండటమే ఇందుకు కారణం. గతేడాది మోదీ కేబినెట్ను విస్తరించినప్పుడు ఆర్సీపీ సింగ్ను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా జరగడంపై నితీశ్ తీవ్ర అసహనంతో ఉన్నారు. అలాగే మోదీ కేబినెట్లో రెండు బెర్తులు కావాలని నితీశ్ అడిగితే కేంద్రం అందుకు ఒప్పుకోలేదు. అమిత్ షాపై నమ్మకం లేదా? ఇటీవలే పట్నాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ సీఎం అభ్యర్థి నితీశ్ కుమారే అని అమిత్ షా ప్రకటించారు. అయినా నితీశ్ బీజేపీపై నమ్మకంగా లేరని తెలుస్తోంది. బిహార్లో పట్టు సాధించాలని అమిత్షా భావించడం, ఆర్సీపీ సింగ్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం, రాష్ట్రంలో బలపడాలని బీజేపీ చూస్తుండటం వంటి అంశాలు నితీశ్ను కాస్త కలవరపాటుకు గురి చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు రాష్ట్ర బీజేపీ నాయకులు తనపై బహిరంగంగా విమర్శలు కురిపిస్తుండటం అస్సలు నచ్చడం లేదట. అందుకే బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే మంచిదని నితీశ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 11లోగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన ఆర్జేడీతో చేతులు కలిపితే బీజేపీకి గట్టి షాక్ ఇచ్చినట్లే అవుతుంది. చదవండి: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్కు హోంశాఖ? -
మనమంతా ఏకమవుదాం..విపక్ష నేతలకు మమతా బెనర్జీ పిలుపు..!!
-
బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ వైఖరిని వ్యతిరేకించే కాంగ్రెస్, వామపక్ష, ప్రాంతీయ పార్టీలన్నీ సమైక్యఫ్రంట్గా ఏర్పడాలని డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రాజకీయ స్వార్థాలను విడిచిపెట్టి దేశాన్ని రక్షించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమిళనాడులో డీఎంకేతో మైత్రి మాదిరిగానే దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా సూత్రప్రాయమైన మైత్రిని ఏర్పర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఎంకే స్టాలిన్ పీటీఐకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భారతదేశం భిన్నత్వాన్ని, సమాఖ్య విధానం, లౌకికత, ప్రజాస్వామ్యం, సౌభ్రాతృత్వం, రాష్ట్రాల హక్కులు, విద్యారంగ హక్కులను పరిరక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రాజకీయ స్వార్థాన్ని పక్కనబెట్టి ఏకం కావాలి. ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి దేశాన్ని కాపాడుకోవాలి’అని ఆయన అన్నారు. బీజేపీ పట్ల తమది వ్యక్తిగత ద్వేషం కాదన్నారు. అంశాల ప్రాతిపదికగానే బీజేపీ విధానాలను తాము విమర్శిస్తున్నామని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో డీఎంకే ఎప్పుడూ కీలకభూమిక పోషిస్తూనే ఉందన్నారు. పార్లమెంట్లో డీఎంకే మూడో అతిపెద్ద పార్టీ అని చెప్పారు. ‘రాష్ట్రాల రాజకీయాలన్నీ కలిస్తేనే జాతీయ రాజకీయాలు. అంతే తప్ప, జాతీయ, రాష్ట్ర రాజకీయం అంటూ వేర్వేరుగా ఉండవు’అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలహీనంగా మారినందున బీజేపీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉండా లంటూ వస్తున్న వాదనపై ఆయన స్పందిస్తూ.. ఈ విధానం కొన్ని రాష్ట్రాల్లో సరైంది కావచ్చు. కానీ, చాలా రాష్ట్రాల విషయంలో ఈ వైఖరి సరిపోదు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకం కావాలి. మా రాష్ట్రంలో బీజేపీతో విభేదించే పార్టీలతో కూటమిగా ఏర్పడి, లౌకిక శక్తులను ఏకం చేశాం. కాంగ్రెస్ పార్టీ కూడా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఇదే మైత్రితో వ్యవహరించాలని స్టాలిన్ అన్నారు -
సాక్షి కార్టూన్ 09-02-2022
ప్రతిపక్షాలున్నన్ని రోజులు మాకు అభివృద్ధి చేయడం సాధ్యపడదు! -
సద్దుమణిగితే సహించలేరా?
సాక్షి, అమరావతి: ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వం సకాలంలో సమస్యలు పరిష్కరించడాన్ని టీడీపీ, వామపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఉద్యోగులు సమ్మె చేయకపోవడం వల్ల రాజకీయంగా పేలాలు ఏరుకోలేకపోయామనే దుగ్ధతో విపక్షాలు నిస్పృహలో కూరుకుపోయాయన్నారు. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి సంతకాలు చేసి సమ్మెను స్వచ్ఛందంగా విరమించుకుంటున్నట్లు పీఆర్సీ సాధన సమితి ప్రకటించిందని గుర్తు చేశారు. వామపక్షాలకు అనుబంధంగా వ్యవహరించే ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆ ప్రతిపాదనలకు తాము అంగీకరించడం లేదని, దశలవారీగా సమ్మె చేస్తామని చెప్పడం సబబు కాదన్నారు. చర్చలకు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఉపాధ్యాయ సంఘాల నేతలకు సూచించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అధికారం నుంచి దించి చంద్రబాబును పీఠంపై కూర్చోబెట్టేందుకు తాపత్రయపడుతున్న ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ 5 లాంటి టీడీపీ అనుకూల మీడియా లేని సమస్యను ఉన్నట్లు చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి వల్లే.. రాష్ట్ర సొంత ఆదాయం రూ.85 వేల కోట్లకు బదులు కోవిడ్తో రూ.62 వేల కోట్లకు తగ్గిపోయింది. మరోవైపు ఉద్యోగుల వేతనాల వ్యయమే రూ.70 వేల కోట్లు (111 శాతం) దాటిపోయింది. అందువల్ల ఇంతకంటే చేయలేని నిస్సహాయత. పేదల సంక్షేమానికి నేరుగా నగదు బదిలీతో మేలు చేకూరుస్తున్నాం. సంక్షేమ పథకాలకు వ్యయం చేయడం తప్పా? దుబారానా? ధైర్యం ఉంటే చెప్పండి? ఫిట్మెంట్ 30 శాతానికిపైగా ఇవ్వాలనుకున్నా కానీ ప్రస్తుతం పరిస్థితులు అందుకు తగ్గట్టుగా లేవు. సమంజసమేనా? అన్ని సంఘాలు సమ్మె విరమించుకుంటున్నామని ప్రకటించాక వామపక్షాలకు అనుబంధంగా ఉండే ఉపాధ్యాయ సంఘాలు 27 శాతం ఫిట్మెంట్, 12 శాతం హెచ్ఆర్ఏ కావాలని కోరడం సమంజసమేనా? ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. 3.10 లక్షల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి గత సర్కారు ఏటా రూ.1,198 కోట్లు వెచ్చిస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.3,187 కోట్లకు పెరిగింది. కేరళలో హెచ్ఆర్ఏ ఎంత? కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి మినిమమ్ టైమ్ స్కేల్ను ఇప్పటికే అమలు చేస్తున్నాం. సీపీఎస్ రద్దుకు రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పాక కూడా కొందరు ఉద్యమం చేస్తామనడంలో అర్ధ రహితం. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో హెచ్ఆర్ఏ ఎంత శాతం ఉంది? కేరళలో ఇస్తున్న హెచ్ఆర్ఏ కేవలం 4–6–8 శాతం మాత్రమే. తెలుగు రాష్ట్రాలే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఎక్కువ ఇస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. బెదిరింపులు.. బాబు లక్షణమే ఉద్యోగులను ఎందుకు బెదిరిస్తాం? మాకెందుకు అంత అవసరం? బెదిరించింది ఎవరు? బెదిరేవాళ్లు ఎవరు? అవన్నీ చంద్రబాబు లక్షణాలే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నçప్పుడు ఉద్యోగులను ఏవిధంగా బెదిరించారో అందరికి తెలిసిందే. బాలిక చనిపోతే స్పందనేది పవన్? ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో వ్యవహరించిందంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం విడ్డూరం. విజయవాడలో టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులకు తాళలేక ఓ బాలిక చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? సమ్మె జరగలేదనే బాధ, దుగ్ధ, టీడీపీకి ఉపయోగపడలేదనే ఆక్రోశంతో ఆయన అలా మాట్లాడుతున్నట్లున్నారు. అభివృద్ధికే వెచ్చిస్తాం అమరావతి భూములను చంద్రబాబు సర్కారు ఏకంగా విక్రయించాలనే చూసింది. మేం అవసరం కోసం వినియోగిస్తూ వచ్చిన నిధులతో అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఏది మేలు అనేది వాళ్లే ఆలోచించుకోవాలి. గుడివాడలో జరిగిన సంక్రాంతి కార్యక్రమాలను టీడీపీ ఎంపీలు పార్లమెంట్ వరకూ తీసుకెళ్లడం హాస్యాస్పదం. -
లెఫ్ట్ పార్టీల నేతలను కలిసిన సీఎం కేసీఆర్
-
తెలుగు రాష్ట్రాల్లో వామపక్షాలు బలపడే పరిస్థితి వస్తుందా ??
-
పెట్రో ధరలపై 14న అమిత్ షాకు నిరసన
సాక్షి, అమరావతి: ఈ నెల 14న తిరుపతి వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాకు పెట్రో ధరల పెంపుపై నిరసనలు తెలపాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. త్వరలో జరుగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ఇలా కంటి తుడుపుగా రూ.5 తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నిరసన తెలపాలని నిర్ణయించినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుత క్రూడ్ ఆయిల్ ధరలను ప్రామాణికంగా తీసుకుంటే లీటర్ పెట్రోల్ను రూ.70–75కు, డీజిల్ను రూ.55–60కు అందించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని, పెరిగితేనే.. పెరుగుతాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని ధ్వజమెత్తారు. మోదీ ప్రధాని అయిన 2014లో లీటర్ పెట్రోల్ సగటు ధర రూ.72 కాగా, ఆనాడు అంతర్జాతీయ మార్కెట్లో బేరల్ క్రూడ్ ఆయిల్ సగటు ధర 93 డాలర్లుగా ఉందని తెలిపారు. ఇప్పుడు 82 డాలర్లు మాత్రమేనని.. అయినా 2021 నవంబర్ 1 నాటికి లీటర్ పెట్రోల్ రూ.116కు చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రూడ్ ఆయిల్ ధర 11 డాలర్లు తగ్గినా పెట్రోల్ ధరను రూ.44 పెంచారని మండిపడ్డారు. అలాగే, లీటర్ డీజిల్ ధర రూ.47గా ఉన్నదాన్ని రూ.109కి పెంచారని తెలిపారు. మోదీ ప్రభుత్వం పెట్రోల్పై రూ.44 పెంచి రూ.5 తగ్గించిందని, డీజిల్పై రూ.61 పెంచి రూ.10 తగ్గించిందంటూ ఎద్దేవా చేశారు. దుర్మార్గమైన ఆర్థిక నీతిని మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని, దీన్ని నిరసించాలని వామపక్ష పార్టీలు తమ శ్రేణులకు పిలుపునిచ్చినట్టు రామకృష్ణ పేర్కొన్నారు. -
పెట్రో ధరల బాదుడుపై వామపక్షాల నిరసన
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): కేంద్ర ప్రభుత్వం ప్రజలపై వేసిన పెట్రో భారాలతో పేదల బతుకులు దుర్భరంగా మారాయని పలువురు వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా పెరిగిపోతున్న పెట్రో ధరలకు నిరసనగా సీపీఎం, సీపీఐ, ఇతర పది వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. మరో నెల రోజుల్లో పెట్రోల్ ధర లీటరు రూ.130కి చేరే ప్రమాదముందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. పెట్రో ధరలతో పాటు, గ్యాస్, నిత్యావసరాల ధరలు అదుపు చేయటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. నిరసనలో భాగంగా పి.మధు, కె.రామకృష్ణల నాయకత్వంలో వామపక్షాల నాయకులు ఒక్కసారిగా రాస్తారోకోలకు దిగారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఫలితంగా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని వాహనాల్లో పోలీసుస్టేషన్లకు తరలించారు. నిరసనల్లో ప్రత్యేక హోదా సాధాన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం, సీపీఐ నేతలు సీహెచ్ బాబారావు, దోనేపూడి కాశీనాథ్, దోనేపూడి శంకర్, జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
Huzurabad Bypoll 2021: వామపక్షాల దారెటు?
సాక్షి, హైదరాబాద్: మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పారీ్టల వైఖరి ఇంకా స్పష్టం కావడం లేదు. నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ముగిసి బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిన నేపథ్యంలో మిగిలిన రాజకీయ పక్షాలు ఎవరికి మద్దతుగా నిలుస్తాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రధాన వామపక్షాలుగా గుర్తింపు పొందిన సీపీఎం, సీపీఐతో పాటు తెలంగాణ జనసమితి (టీజేఎస్) సహకారం ఏ అభ్యర్థికి లభిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆయా పార్టీలకు నియోజకవర్గంలో ఎంత బలం ఉంది.. ఎన్ని ఓట్లు ఉన్నాయన్న దాంతో సంబంధం లేకున్నా ఇతర పారీ్టల మద్దతు పోటీలో ఉన్న అభ్యర్థికి నైతికంగా బలం చేకూర్చనుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు పారీ్టలు ఎవరికి మద్దతు ప్రకటిస్తాయో అని రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కుల సంఘాల మద్దతు కోసం.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే సీపీఐ, టీజేఎస్.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పక్షాన వచ్చిన అభ్యర్థనను ఆయా పార్టీలు పరిశీలిస్తున్నాయి. కాంగ్రెస్కు మద్దతివ్వాలా.. లేదా.. అన్న దానిపై పారీ్టలో చర్చించి వెల్లడిస్తామని సీపీఐ, టీజేఎస్ నేతలు చాడా వెంకట్రెడ్డి, కోదండరాం గతంలో వెల్లడించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు, రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరవుతున్న ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించవచ్చనే చర్చ సాగుతోంది. అయితే, సీపీఎం కూడా ప్రతిపక్ష ఆందోళనలు, సమావేశాలకు వస్తున్నా బహిరంగంగా కాంగ్రెస్కు మద్దతిస్తుందా.. లేదా.. అన్న సందేహం వ్యక్తమవుతోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన సీపీఎం ఇప్పుడు మాత్రం బీజేపీని ఓడించాలని చెబుతోంది. ఇటీవల జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాల్లో కూడా ఇదే తీర్మానం చేశారు. కానీ, అధికారికంగా ఏ పార్టీకీ మద్దతు ప్రకటించలేదు. బీజేపీని ఓడించాలని ఇచ్చే పిలుపును ఆ పార్టీ శ్రేణులు ఎలా అర్థం చేసుకుంటాయి.. టీఆర్ఎస్, కాంగ్రెస్లో ఏ అభ్యర్థి పక్షాన నిలుస్తారన్నది కామ్రేడ్లకే తెలియాలని రాజకీయ వర్గాలంటున్నాయి. మరోవైపు ప్రధాన కుల సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల మద్దతు కూడగట్టేందుకు కూడా ప్రధాన రాజకీయ పక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వీలున్నంత ఎక్కువ సంఘాల మద్దతు తీసుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు శతవిధాలా ప్రయతి్నస్తుండడం గమనార్హం. -
Bharat Bandh: బెంగళూరు డీసీపీ కాలిపై నుంచి దూసుకెళ్లిన కారు
Bharat Bandh Highlights: బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో భారత్ బంద్ ర్యాలీలో భాగంగా కారులో వెళుతున్న నిరసనకారుడు.. తన కారును డీసీపీ ధర్మేందర్ కుమార్ మీనా పాదాల మీదుగా తీసుకెళ్లాడు. బెంగళూరు సిటీ నార్త్ డివిజన్ డీసీపీ మీనా.. గోరగుంటెపాళ్య వద్ద వాహనాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత నిరసనకారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రమాదంలో డీసీపీ కాలుకి గాయలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఉత్తర ప్రదేశ్లో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం విఫలమైందని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికైత్ మండిపడ్డారు. పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించడం లేదని విమర్శించారు. యోగి ఆదిత్యనాథ్ తన మ్యానిఫెస్టోలో చెరకు ధరను రూ. 375-రూ. 450 కి పెంచుతానని హామీ ఇచ్చాడని అయితే అతను దానిని రూ. 25 మాత్రమే పెంచారని అన్నారు. పోలీసుల బారికేడ్లను పగలగొట్టిన రైతులు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ నేపధ్యంలో తమిళనాడు నిర్మానుష్యంగా మారింది. చెన్నైలోని అన్నాసలై ప్రాంతంలో పోలీసులతో ఘర్షణ పడిన రైతులు పోలీసుల బారికేడ్లను పగలగొట్టారు. దీంతో పరిస్థితి చెయ్యి దాటింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. #WATCH | Tamil Nadu: Protesters agitating against the three farm laws break police barricade in Anna Salai area of Chennai, in support of Bharat Bandh called by farmer organisations today; protesters detained by police pic.twitter.com/iuhSkOeGFV — ANI (@ANI) September 27, 2021 గురుగ్రామ్-ఢిల్లీ సరిహద్దు: రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ నేపథ్యంలో దేశ రాజధానిలో ప్రవేశించే వాహనాలను ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది తనిఖీ చేస్తుండగా గురుగ్రామ్-ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కేరళ: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కేరళలో భారత్ బంద్ కొనసాగుతోంది. రాష్ట్రంలో పలు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రైతుల నిరసనకు మద్దతుగా.. తిరువనంతపురంలో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు భారత్ బంద్లో పాల్గొన్నాయి. ఢిల్లీ- అమృత్సర్: ఢిల్లీ- అమృత్సర్ జాతీయ రహదారిపై రైతులు నిరసన తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్ కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు భారత్ బంద్ను విజయవంతం చేసేందుకు బీజేపీయేతర ప్రతిపక్షాలు నడుంబిగించాయి. పంజాబ్- హర్యానా: భారత్ బంద్లో భాగంగా పంజాబ్-హర్యానా సరిహద్దులను మూసివేసి రైతులు నిరసన తెలుపుతున్నారు. ఉదయం 4 గంటల నుంచే సరిహద్దులను వేసివేసినట్లు ఓ రైతు మీడియాతో పేర్కొన్నాడు. ఉత్తరప్రదేశ్: ఘజిపూర్ సరిహద్దులో రైతుల నిరసన కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కొనసాగుతోంది. రైతుల నిరసనలతో ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఘజిపూర్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ను కొనసాగుతోంది. భారత్ బంద్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏపీలోని విజయవాడ బస్టాండ్ ఎదుట వామపక్ష, కాంగ్రెస్ పార్టీల ఆందోళన చేపట్టాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వాహానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వామపక్ష పార్టీల బంద్కు వ్యాపార వాణిజ్య, విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వర్షం సైతం లెక్క చేయకుండా విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద రైతులకు మద్దతుగా వామపక్ష, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆందోళన చేస్తున్నారు. -
ఏపీ బీజేపీపై వామపక్ష పార్టీల ఆగ్రహం
-
ఏపీ బీజేపీపై వామపక్ష పార్టీల ఆగ్రహం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో సామరస్య, శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ నాయకులు వినాయక చవితిని ఒక వివాదంగా మారుస్తున్నారని వామపక్ష పార్టీలు ఏపీ బీజేపీపై మండిపడ్డాయి. కాషాయ పార్టీ కుటిల యత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో సోమవారం వామపక్ష పార్టీలు ఓ లేఖను విడుదల చేశాయి. ‘‘ప్రస్తుతం కోవిడ్ మూడవ దశ ప్రమాదం పొంచి ఉంది. ఈ తరుణంలో ప్రజలంతా కోవిడ్ నియమ నిబంధనలను జాగ్రత్తగా పాటిస్తూ వినాయక చవితి జరుపుకోవాలి’’ అని లేఖలో కోరాయి. (చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి) ‘‘రాష్ట్రంలో కోవిడ్ విజృంభించినప్పుడూ కేంద్ర బీజేపీ రాష్ట్రానికి ఏ సహాయమూ చేయలేదు. రాష్ట్రం కోరిన మేరకు వ్యాక్సిన్లనూ ఇవ్వకుండా వివక్షను చూపుతోంది. కేంద్ర ప్రభుత్వం పండగ సీజన్లో తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్రాలకు ఇచ్చిన ఆదేశాలను సైతం విస్మరించి రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రజల విశ్వాసాలతో రాజకీయ కుతంత్రం నడుపుతోంది’’ అంటూ వామపక్ష పార్టీలు మండిపడ్డాయి. -
Petrol Diesel: ధరలపై వామపక్షాలు భగ్గు
గన్ఫౌండ్రీ: కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలపై కనికరం లేకుండా మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతోందని వామపక్ష పార్టీల నేతలు విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం సీపీఐ, సీపీఐ(ఎం), ఎస్యూసీఐ (సీ) తదితర వామపక్ష పార్టీల నాయకులు బషీర్బాగ్ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం మోసాల ప్రభుత్వమని, కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. కేరళ ప్రభుత్వం 12 శాతం పన్ను తగ్గించి ప్రజలపై భారం పడకుండా చేసిందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సైతం నాడు పన్నులను తగ్గించారని తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎస్యూసీఐ (సీ) పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మురహరి మాట్లాడుతూ.. 70 శాతం వరకు పన్నులను పెంచే అధికారం మోదీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని, కోవిడ్ సంక్షోభంలోనూ ప్రధాని కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ సామాన్య ప్రజల పొట్టగొడుతున్నారని ధ్వజమెత్తారు. వామపక్ష, విప్లవకారులపై మోదీ ప్రభుత్వం నిర్భంద చట్టాలను ప్రయోగిస్తోందని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, నగర కార్యదర్శి ఈటీ నర్సింహ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రమ, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయగ్, ఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు స్టాలిన్, ఎస్యూసీఐ (సీ) పార్టీతో పాటు పలు వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మీ మద్దతు మాకివ్వండి: ఉత్తమ్
హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో మద్దతివ్వాలంటూ వామపక్షాలను కాంగ్రెస్ కోరింది. తమ పార్టీ అభ్యర్థి కె.జానారెడ్డి గెలుపునకు సహకరించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆదివారం సీపీఐ, సీపీఎంలకు లేఖలు రాశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అవినీతి, అప్రజాస్వామ్య పాలన, బీజేపీ మత రాజకీయాలను ఓడించేందుకు తెలంగాణలోని అన్ని లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు తమతో కలసి రావాలని ఇరు పార్టీల రాష్ట్ర కార్యదర్శులను కోరారు. తమ అభ్యర్థి జానారెడ్డి.. సమితి అధ్యక్షుడిగా, 7 సార్లు ఎమ్మెల్యేగా, 17 సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా, 5 సంవత్సరాలు సీఎల్పీ నేతగా పనిచేశారని, ప్రజాజీవితంలో గౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. ఆయన గెలుపు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు అవుతుందని, ఈ నేపథ్యంలో తమకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పార్టీల నేతలకు లేఖలు రాయడంతో పాటు ఆ పార్టీ నేతలతో ఫోన్లో కూడా మాట్లాడారని, తమ పార్టీల్లో చర్చించిన అనంతరం నిర్ణయం వెల్లడిస్తామని కామ్రేడ్లు చెప్పారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ విషయమై ఒకట్రెండు రోజుల్లో ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
లెఫ్ట్ భవిష్యత్ కాంగ్రెస్ చేతిలో
ఒక రాష్ట్రంలో కాంగ్రెస్తో కరచాలనం చేస్తూ మరో రాష్ట్రంలో అదే పార్టీపై కత్తులు దూస్తూ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిన లెఫ్ట్ పార్టీలకు అంతా అగమ్యగోచరంగా ఉంది. ఒక చోట నిలబెట్టుకోవాలి, మరో చోట పునర్వైభవం సాధించాలి వామపక్ష పార్టీలను తేల్చడమైనా, ముంచడమైనా ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లోనే ఉంది. కేరళలో అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయాలి, పశ్చిమ బెంగాల్లో తిరిగి పట్టు సాధించాలంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలి. ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ వైచిత్రిని ఎదుర్కోవడమే ఇప్పుడు వామపక్ష పార్టీల ముందున్న అసలు సిసలు సవాల్గా మారింది. అసోం, తమిళనాడు, పాండిచ్చేరితో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠను పెంచుతున్న పశ్చిమ బెంగాల్, కేరళలో ఎన్నికల వేడి రాజుకుంది. 2016లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విఫలప్రయోగంగా నిలిచినప్పటికీ ఈ సారి ఎన్నికల్లోనూ కాంగ్రెస్తోనే కలిసి వామపక్షాలు ఎన్నికల బరిలో దిగాయి. బెంగాల్లో ఆదివారం జరిగిన కాంగ్రెస్–లెఫ్ట్ కూటమి నిర్వహించిన మెగా ర్యాలీకి జనం వెల్లువెత్తినప్పటికీ కాంగ్రెస్ అగ్రనేతలెవరూ హాజరుకాలేదు. కేరళలో యూడీఎఫ్ కూటమి విజయానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, బెంగాల్లో వామపక్ష నాయకులతో కలిసి ఒకే వేదికను పంచుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో స్థానిక కాంగ్రెస్ నేతలే ర్యాలీకి హాజరయ్యారు. మరోవైపు కేరళలో వామపక్షాల నేతృత్వంలోని అధికారి ఎల్డీఎఫ్కు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కి మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. కేరళలో వామపక్ష పార్టీలను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీతో తెరవెనుక అవగాహనతో పని చేస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. బీజేపీ ఓటమి కోసం పని చేయాల్సిన కాంగ్రెస్ ఇలా చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. లెఫ్ట్ దారి వివాదాస్పదం భారతీయ జనతా పార్టీని ఓడించడానికి కాషాయ వ్యతిరేక శక్తులన్నీ పిలుపునిస్తున్న వామపక్ష పార్టీలు ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)తో చేతులు కలపడానికి సిద్ధపడడం వివాదానికి దారి తీస్తోంది. 30 శాతం ముస్లిం జనాభా ఉన్న బెంగాల్లో 100–110 సీట్లలో వారి ప్రభావం ఉంటుంది. ముస్లిం ఓట్లను కొల్లగొట్టడానికి పరిషద్ అబ్బాస్ సిద్దికి నేతృత్వంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)లను తమ కూటమిలో చేర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. కోల్కతాలో జరిగిన మెగా ర్యాలీకి సిద్దికి హాజరై ప్రసంగించారు. ‘‘మేమే ప్రత్యామ్నాయం, మేమే లౌకికవాదులం, మేమే మీ భవిష్యత్’’ అన్న నినాదంతో బెంగాల్ బరిలోకి దిగిన వామపక్ష నాయకులు తమ వేదికపై ముస్లిం మత పెద్ద సిద్దికిని కూర్చోబెట్టడం పలు విమర్శలకు దారి తీస్తోంది. కరడుగట్టిన మతవాదితో కలుస్తూ లౌకిక రాగాలాపన ఎలా సాధ్యమంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు హోరెత్తిపోతున్నాయి. వామపక్షాలు వేసే అడుగులు బీజేపీకి లబ్ధి చేకూరుతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పదేళ్లుగా మమతా దీదీ అణచివేత చర్యల్ని ఎదుర్కొంటూనే ప్రజా ఉద్యమాల ద్వారా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాలైతే వామపక్ష పార్టీలు చేస్తూనే ఉన్నాయి. – న్యూఢిల్లీ ఓటు బ్యాంకు 2016లో లెఫ్ట్, కాంగ్రెస్ కూటమికి 38% ఓట్లువచ్చాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్కు పోలయిన ఓట్ల కంటే ఇది కేవలం 7శాతం మాత్రమే తక్కువ. అందులో వామపక్ష పార్టీలే 26శాతం ఓటు బ్యాంకుని సాధిం చాయి. అయితే గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల ఓటు బ్యాంకు ఏకంగా 7.52 శాతానికి తగ్గిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్తో మిత్రలాభం, మిత్రభేదాన్ని ఏకకాలంలోనే ఎదుర్కొంటూ వామపక్షాలు ఎలా ముందుకు సాగుతాయో చేచి చూడాల్సిందే. -
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా 29 నుంచి దీక్షలు
సాక్షి, అమరావతి/సూర్యారావుపేట(విజయవాడ సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో రిలే నిరాహార దీక్షలు చేయాలని పది వామపక్ష పార్టీలు రైతులకు పిలుపునిచ్చాయి. ప్రస్తుత కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి కొనసాగింపుగా ఈ నిరశన దీక్షలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశాయి. వ్యవసాయ బిల్లులపై రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ఉధృతం చేసే విషయాన్ని చర్చించేందుకు శనివారం పది వామపక్ష పార్టీలు విజయవాడలోని సీపీఎం కార్యాలయంలో భేటీ అయ్యాయి. సమావేశం అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మీడియాతో మాట్లాడుతూ రైతులకు మద్దతుగా జరిగే దీక్షల్లో వామపక్షపార్టీలతో పాటు రైతు శ్రేయోభిలాషులందరూ పాల్గొనేలా చూస్తామన్నారు. దీక్షల నిర్వహణపై ఆది, సోమవారాలలో అవగాహన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కార్పొరేట్ అజెండాను అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు దోచిపెట్టాలని మోదీ ప్రభుత్వం చూస్తోందన్నారు. వ్యవసాయ బిల్లులు మూడింటిని కేంద్ర ఉపసంహరించే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. సమావేశంలో వామపక్ష నేతలు జల్లి విల్సన్, వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
దీపంతో మహమ్మారిని ఎలా ఆపుతారు?
సాక్షి, హైదరాబాద్: కరోనా నివారణకు అవసరమైన వస్తు సామగ్రిని అందించే బదులు ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆర్పి కొవ్వొత్తులు పట్టుకోవాలని ప్రధాని చెప్పడం విడ్డూరంగా ఉందని వామపక్ష పార్టీలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశ ప్రజ లు, విపక్షాలు రాజకీయాల కు అతీతంగా కేంద్రానికి అం డగా నిలిచాయని, అయితే దీప నినాదం ఈ మహమ్మా రి నిరోధానికి ఎలా దోహదపడుతుందని ప్రశ్నించాయి. ప్రస్తుత ఆపత్కాల సమయంలో రాజకీయాలకు తావివ్వవద్దని చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), సాదినేని వెంకటేశ్వరరావు, పోటు రంగారా వు (సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు) శనివారం ఒక సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఆకస్మిక లాక్డౌన్తో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా వలస కార్మికులు, దినసరి కూలీల బతుకులు ఛిద్రం అయ్యాయని వారు ఆ ప్రకటనలో విమర్శించారు. -
అసెంబ్లీ ముట్టడి విఫలం
సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు/తుళ్లూరు/తుళ్లూరు రూరల్: అసెంబ్లీ ముట్టడికి టీడీపీ శ్రేణులు చేసిన యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. సోమవారం శాసనసభ సమావేశాల నేపథ్యంలో టీడీపీ, వామపక్షాలు, అమరావతి జేఏసీ చేపట్టిన ఛలో అసెంబ్లీ, అసెంబ్లీ ముట్టడికి పోలీసులు అనుమతించకపోవడంతో నిరసనకారులు రాళ్లతో దాడికి దిగారు. రాళ్ల దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులు, పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం పొలాల్లో నుంచి సచివాలయం వైపు చొచ్చుకుని వచ్చేందుకు చేసిన యత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా విధుల్లో ఉన్న పోలీసులను మహిళలు తీవ్ర దుర్భాషలాడారు. ఎర్రబాలెంలో స్పృహ కోల్పోయిన మల్లీశ్వరి అనే మహిళకు మంచినీరు అందించి పోలీసులు సేవలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టేలా టీడీపీ మెసేజ్లు అసెంబ్లీ ముట్టడికి ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో టీడీపీ నేతలు వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ ద్వారా ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ‘కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు ఏమైపోయారు? 5 లక్షల మందితో అసెంబ్లీని ముట్టడించాలి. లేదంటే రాష్ట్రంలో బతకడమే దండగ’ అంటూ టీడీపీ నేతలు రెచ్చగొడుతూ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టారు. గుంటూరులో హోంమంత్రి మేకతోటి సుచరిత ఇంటి ముందు నిరసనకు దిగిన టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. రాళ్లు తగిలి కింద పడిపోతున్న పోలీసు సహనంతో పోలీస్ వ్యూహం బయటి ప్రాంతాల నుంచి అమరావతి చేరుకున్న వ్యక్తులు అవాంఛనీయ ఘటనలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆదివారం రాత్రి ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో చెక్పోస్టులు, మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాలను బాంబ్స్క్వాడ్ బృందాలతో జల్లెడ పట్టారు. పోలీసు బలగాలు శాంతి, సహనంతో వ్యవహరించి అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా జరగడానికి కృషి చేశాయి. గల్లా జయదేవ్పై కేసు రాజధాని ప్రాంతంలో 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగి రైతులు, ఆందోళనకారుల ముసుగులో పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. అసెంబ్లీ పరిసరాల్లో ముట్టడికి యత్నించిన ఎంపీ గల్లా జయదేవ్పై 143, 332, 188, 353, 323, 324, రెడ్/149 సెక్షన్ల కింద తుళ్లూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జయదేవ్ను పోలీసులు అరెస్టు చేయడంతో టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఐజీ బ్రిజ్లాల్ను కాపాడే యత్నంలో ఆక్టోపస్ ఎస్సై ఒకరు గాయపడ్డారు. పలు చోట్ల రాళ్ల దాడుల్లో గాయపడ్డ పోలీస్ సిబ్బంది వి.నగేష్, గొట్టె లింగా, హరీశ్, పి.వేణుగోపాలరావు, బి.చక్రధర్, పి.ఏసురాజును ఆస్పత్రికి తరలించారు. అసెంబ్లీ వెనుక పొలాల్లో నుంచి సుమారు 600 మంది ఆందోళనకారులు పోలీసులపై ఒక్కసారిగా రాళ్లతో దాడిచేశారని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు తుళ్లూరులో మీడియాతో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై 353, 324 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. -
పవన్.. చెంగువీరా
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి అన్నివిధాలా ద్రోహం చేసిన బీజేపీతో చేతులు కలుపుతావా? అంటూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు జనసేన అధినేత పవన్కల్యాణ్పై మండిపడ్డాయి. రాజకీయాల్లో ఎత్తులు పొత్తులు ఉంటాయే తప్ప బాకీలు ఉండవని గురువారం వేర్వేరు ప్రకటనల్లో ఆ పార్టీల నేతలు ఎద్దేవా చేశారు. ‘‘విప్లవ వీరుడు చేగువేరా బొమ్మ పెట్టుకుని చిలకపలుకులు పలికిన పవన్ ఇప్పుడు ‘చెంగువీరుడు’ అయ్యాడు. ఢిల్లీలో బీజేపీ నాయకుడు నడ్డాను కలిశాక పవన్కు పాచిపోయిన లడ్డూలు బందరు లడ్లు అయ్యాయి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ‘‘కమ్యూనిస్టులకు బాకీ పడ్డానా? అంటున్నాడు పవన్.. రాజకీయాల్లో అప్పులుంటాయా?’’ అని ప్రశ్నించారు. దమ్మున్నవాడే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడగలరని, ఆ దమ్ము మాకుందని, నీకు లేకనే బీజేపీతో కలుస్తున్నావా? అని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనకు కారణమై, ప్రత్యేక హోదాను నిరాకరించి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీతో ఎలా చేతులు కలుపుతావని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆక్షేపించారు. రాష్ట్రానికి ‘పాచిపోయిన లడ్లు’ ఇచ్చారంటూ బీజేపీని విమర్శించిన పవన్కు ఇప్పుడవే తాజాగా కనిపించడం విడ్డూరమన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయమనడం జనాన్ని మోసం చేయడమేనని, ఆత్మవంచన కూడా అని అన్నారు. పవన్ బీజేపీతో కలవడమంటే నిస్సందేహంగా అవకాశవాదమేనన్నారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన ద్రోహానికి ప్రజలు గత ఎన్నికల్లో ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారని, రాబోయే రోజుల్లోనూ మీకూ(పవన్), బీజేపీకీ అదే గతి తప్పదని అన్నారు. కాగా, జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ) అమలును నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా మిగతా రాష్ట్రాల మాదిరిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మధు వేరొక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
డర్టీ పాలిటిక్స్.. విపక్షాల భేటీకి మమత దూరం
కోల్కత్తా : ఢిల్లీలో జనవరి 13న జరగనున్న విపక్షాల భేటీకి తను దూరంగా ఉండనున్నట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. సీఏఏపై ఒంటరిగానే పోరు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం జరిగిన భారత్ బంద్లో భాగంగా కాంగ్రెస్తోపాటు లెఫ్ట్ పార్టీలు బెంగాల్లో తమ ప్రభుత్వంపై దాడి చేయడంపై మమత ఆగ్రహంగా ఉన్నారు. బంద్ సందర్భంగా బెంగాల్లో జరిగిన హింసపై మమత తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ద్వంద వైఖరిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మమత గురువారం మాట్లాడుతూ.. ‘జనవరి 13న సోనియా గాంధీ పిలుపు మేరకు జరిగే విపక్షాల భేటీని బాయ్కాట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే బుధవారం బెంగాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పాల్పడిన హింసకు నేను మద్దతు తెలుపలేను’ అని పేర్కొన్నారు. మరోవైపు లెఫ్ట్ పార్టీలతోపాటు ప్రతిపక్షాలు మాత్రం తమ పార్టీలకు చెందిన నాయకులను ఇబ్బంది పెట్టేందుకే టీఎంసీ హింసను ప్రోత్సహించిందని ఆరోపించారు. ఒకవేళ మమత కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి జాతీయ స్థాయిలో విపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తే.. బెంగాల్కు వచ్చేసరికి ఆ పార్టీలే ఆమెకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇది చాలా కాలంగా మమతను ఇబ్బంది పెడుతున్న విషయం. కాగా, యూనివర్సిటీలలో జరుగుతన్న హింసతోపాటు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆందోళనలపై చర్చించడానికి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్షాల భేటీకి పిలుపునిచ్చారు. సోనియా అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశాన్ని విజయవంతరం చేయడానికి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఈ భేటీకి సంబంధించి సోనియా ఇటీవల సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో మాట్లాడారు. చదవండి : భారత్ బంద్.. లెఫ్ట్ పార్టీలపై మమత ఫైర్ -
భారత్ బంద్.. లెఫ్ట్ పార్టీలపై మమత ఫైర్
కోల్కతా : వామపక్ష పార్టీలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లెఫ్ట్ పార్టీలు భారత్ బంద్కు పిలుపునివ్వడంపై విమర్శలు గుప్పించారు. చీప్ పబ్లిసిటీ కోసమే ఆ పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయని ధ్వజమెత్తారు. బుధవారం మమత మాట్లాడుతూ.. బంద్కు పిలుపునిచ్చిన లెఫ్ట్ పార్టీలు బస్సులపై బాంబులు వేసి చీప్ పబ్లిసిటీ పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం కన్నా.. రాజకీయంగా సమాధి కావడం ఉత్తమమని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ ఉనికి లేనివారు.. బెంగాల్ ఆర్థిక పరిస్థితిని దిగజార్చడానికి సమ్మెల పేరిట నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మమత మండిపడ్డారు. బెంగాల్లో ఎటువంటి సమ్మెలను అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీపీఎంకు ఎటువంటి భావజలం లేదన్న మమత.. రైల్వే ట్రాక్లపై బాంబులను విసరడం, ఉద్యమం పేరుతో ప్రయాణికులపై దాడికి పాల్పడటం గుండాగిరికి నిదర్శనమన్నారు. ఈ చర్యలను తను ఖండిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు, సీఏఏకు, ఎన్నార్సీకి వ్యతిరేకంగా జరుగుతుందని మమత గుర్తుచేశారు. అయితే బంద్ వెనక ఉన్న ఉద్దేశానికి తన మద్దతు ఉంటుందన్న ఆమె.. తమ పార్టీ గానీ, ప్రభుత్వం గానీ బంద్కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో ఆ పార్టీలు ఎక్కడ కనిపించలేదన్నారు. కానీ ఇప్పుడు ఆ పేరుతో బంద్కు పిలుపునివ్వడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు. కాగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తమ ఉద్యోగులు బుధవారం రోజున సాధారణ సెలువు పొందడంపై నిషేధం విధించింది. మరోవైపు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. బెంగాల్లో పలు చోట్ల కార్మిక సంఘాల నాయకులు రోడ్లపై, రైల్వే ట్రాక్ల బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఇచ్చిన బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. -
ర్యాలీని భగ్నం చేసిన పోలీసులు
-
సీఏఏను వెంటనే ఉపసంహరించుకోవాలి!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం, పలు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు వామపక్షాలు, ముస్లిం సంఘాల నేతృత్వంలో పలువురు ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. వామపక్షాల నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద పెదసంఖ్యలో మోహరించిన పోలీసులు ఎక్కడిక్కడ నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు ముందస్తుగా చర్యలో భాగంగా చార్మినార్ వద్ద 50 మందిని దక్షిణ మండలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ర్యాలీ లో పాల్గొనేందుకు వచ్చిన సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ ర్యాలీ నేపథ్యంలో నాంపల్లి- మొజంజాహి మార్కెట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. బీజేపీ కార్యాలయం ముట్టడి సీఏఏను వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు వామపక్ష విద్యార్థి నేతలు, శ్రేణులు ప్రయత్నించారు. బీజేపీ కార్యాలయం వద్ద చేరుకున్న వామపక్ష శ్రేణులు.. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు గురువారం ధర్నా నిర్వహించారు. మోదీ సర్కార్ సీఏఏను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. -
19న ర్యాలీ: లెఫ్ట్ పార్టీలు
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివిధ వామపక్షాలు (లెఫ్ట్ పార్టీలు) ప్రకటించాయి. హైదరాబాద్లో చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు, అదేరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇతర పార్టీలు, సామాజిక సంస్థలతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపాయి. సోమవారం మఖ్దూంభవన్లో సీపీఎం కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాడ వెంకట్రెడ్డి, గుండ మల్లేశ్ తదితరులు ఈ మేరకు నిర్ణయించారు. -
ఆర్టీసీని నాకివ్వండి.. లాభాల్లో నడిపిస్తా!
సాక్షి, హైదరాబాద్ : ‘ఆర్టీసీని నడపడం మీకు చేతకాకుంటే నాకివ్వండి. వేల కోట్ల లాభాల్లో నడిపిస్తాను’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. ప్రభుత్వం తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద వామపక్షాలు చేపట్టిన సామూహిక దీక్షను ఆయన ప్రారంభించి సమ్మెకు తన మద్దతును తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడతూ.. తమిళనాడు తరహాలో డీజిల్ ధరలను ప్రభుత్వం భరిస్తే ఆర్టీసీకి నష్టాలు రావని వెల్లడించారు. ప్రభుత్వం ఆర్టీసీకి నయాపైసా ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఆదాయం తీసుకోకుండా ఉంటే చాలన్నారు. ఆర్టీసీ ఏటా డీజిల్పై 1300 కోట్లు ఖర్చు చేస్తే 300 కోట్లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తుందని పేర్కొన్నారు. నష్టాలొచ్చినా ఆర్టీసీపై పన్నులు వసూలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని విమర్శించారు. ప్రైవేటు బస్సులను అరికడితే ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తుందని సూచించారు. ప్రభుత్వం అబద్దపు ప్రచారాలను మానుకోవాలని నాగేశ్వర్ కోరారు. అంతకు ముందు సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. సమ్మె విషయంలో ప్రస్తుతం సీఎం వర్సెస్ తెలంగాణ సమాజం అనే విధంగా మారిందన్నారు. తెలంగాణ సమాజం బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా సమ్మె న్యాయమైందే అంటున్నారని వ్యాఖ్యానించారు. సీఎం మొండి వైఖరి వల్ల చీకటి రోజులు వస్తున్నాయని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అభిప్రాయపడ్డారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తనకు ఎదురులేదని విర్రవీగుతున్నాడని విమర్శించారు. ఐదుగురు కార్మికులు మరణించిన తర్వాత కూడా మానవత్వం లేదా? అని ప్రశ్నించారు. కార్మికులపై కక్ష కట్టిన కేసీఆర్ సమ్మెను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. -
ఆచితూచి మాట్లాడండి కామ్రేడ్స్!
సీపీఎం నేత బృందా కారత్ ఏపీలో ఒక సభలో మాట్లాడుతూ మోదీని ఏమాత్రం విమర్శించలేదంటూ సీఎం జగన్పై ఆరోపించారు. కానీ హుజూర్నగర్లో ఉపఎన్నికలతో సహా పాలకవర్గ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంపై వామపక్షాలు ప్రతి సందర్భంలోనూ వేస్తున్న తప్పటడుగులను, వామపక్షాల అనైక్యతను సరిదిద్దడంలో బృందా కారత్ తన వంతు కృషి చేస్తే బాగుంటుంది. పైగా, ఎన్నడూ లేనివిధంగా ఏపీలో గిరిజనులు, దళితులు, మైనారిటీలు, బీసీలు తదితరుల అభ్యున్నతికి వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ చర్యల గురించి బృందా తెలుసుకుని ఉంటే బాగుండేది. సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న శక్తులతో శ్రామిక వర్గ పార్టీలు కలిసి పనిచేయడం ఇప్పటి అవసరం. ఇటీవల సీపీఎం నేత బృందా కారత్ విశాఖ పట్నంలో అనుకుంటాను.. ఒక సభలో మాట్లాడుతూ, ‘జగన్ ఏమన్నా ఫెవికాల్తో పెదాలు అంటించుకున్నారా? మోదీని ఏమీ విమర్శించలేదు’ అన్నారు. నాకు తెలిసినంతవరకు బృందాకారత్ నిబద్ధత గల నాయకురాలు. పైగా సీపీఎం పార్టీ తరపున ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికై ఏర్పాటు చేసుకున్న ఒక కమిటీ నేత కూడా. గిరిజనుల అభివృద్ధి కోసం గత పాలకులు ఎన్నడూ చేయని విధంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వాన ఎలా కృషి చేస్తున్నదో ఆమెకు సరైన సమాచారం లభించినట్లు లేదు. ఒక గిరిజన మహిళను ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఘనత జగన్కే దక్కింది. తన మంత్రివర్గంలో 60 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ గిరిజన మైనారిటీ మహిళా ప్రతినిధులకు స్థానం కల్పించారు జగన్. ఇంతవరకు ఈ విధంగా సామాజిక న్యాయాన్ని ఆచరించిన రాజకీయపార్టీ గానీ, ముఖ్యమంత్రి గానీ మరెవరైనా ఉన్నారా? అలాగే ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా వెళ్లినప్పుడు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ప్రత్యేకించి ఆదివాసీ గిరిజనుల కోసం వైద్య కళాశాల, విద్యాసంస్థలు, వైద్య సదుపాయం అలాగే ఆ ప్రాంతంలో ఉన్న కిడ్నీ బాధితుల కోసం ప్రత్యేక డయాలసిస్ కేంద్రాలు, రక్తశుద్ధి అవసరమైన వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల ఆర్థిక సదుపాయం ఇవన్నీ కల్పించే కృషి ప్రస్తుత రాష్ట్ర పాలనలో నిజాయితీగా జరుగుతున్నది కదా. ఆ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేసింది జగన్ ప్రభుత్వమే కదా! అమలు క్రమంలో ఏవైనా లోపాలుంటే సహజంగా ప్రజానుకూల ప్రభుత్వానికి బాధ్యతగల ప్రతిపక్షం తగు సూచనలిచ్చి, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. పైగా ప్రతి 50 ఇళ్లకు వలంటీర్లను ఏర్పాటు చేసి, ప్రజల గడపవద్దకు ప్రభుత్వాన్ని తీసుకువెళ్లి, వాళ్లలో అర్హులకు ప్రభుత్వ రేషన్ అందించడం, ఇతరత్రా రేషన్ కార్డులు, పెన్షన్ సదుపాయాలు, కులధృవీకరణ పత్రాలు, మొదలగు సమస్యలు తీర్చే వలంటీర్ వ్యవస్థకు జగన్ ఏర్పాటు చేయడం అపూర్వం కాదా! దానిని కూడా గోనెసంచులు మోసినందుకు అయిదువేల జీతం అంటూ అపహాస్యం చేయడం, ఆ గ్రామ వాలంటీర్లను అవమానించడమే కదా! చంద్రబాబు కృష్ణా జిల్లాలో ఆ గ్రామ వలంటీర్ల నియామక పత్రాలనందించే సంఖ్యను చూసి ఉండరు. వారి స్పందన గమనించారా? ఆ సభలో జగన్ ప్రసంగం విన్నారా? ఆ వలంటీర్లలో అత్యధికులు యువతీయువకులు. ఇలా మా గ్రామంలో మా ప్రజలకు జగనన్న కుటుంబంలో పెద్దకొడుకు వలే ఏర్పాటు చేయడం, ఈ వలంటీర్ వ్యవస్థ, దాని ద్వారా మాకు, మా వారికి, మా ఊరికి ప్రజాసేవ చేసే అవకాశం రావడం మా అదృష్టం అని ఆ యువతీయువకులు స్పందించడం.. ఎంత హృద్యమైన దృశ్యమో అనిపించింది. బాబుగారు ప్రతి సభను ఒక ఈవెంటుగా మార్చి, తాను ఆ ఈవెంట్ మేనేజర్గా వ్యవహరించడం ఎంత అహంకార ఆడంబర ప్రదర్శనగా ఉండేదో కదా. తద్భిన్నంగా ఏదో పెద్దన్న, చెల్లెళ్లు, తమ్ముళ్లు కలిసి తమ కుటుంబం కోసం ఏం చెయ్యాలి అని చర్చించుకున్నట్లు సాగింది జగన్ సభ. అందుకే బాబు ఉక్రోషం పట్టలేకపోతున్నారు. ఈ వ్యాసం మొదట్లో బృందాకారత్ జగన్ను విమర్శించిన ప్రస్తావన తేవడం ఎందుకంటే, ప్రస్తుతం చంద్రబాబు వ్యవహార శైలి వంటిది కమ్యూనిస్టులకు తగనిదని, తెలియజేసేందుకే! ఇటీవల సీపీఐ నేత నారాయణ కూడా గత స్పీకర్ కోడెల శివప్రసాద్ భౌతిక కాయాన్ని చూడటానికి వెళ్లి జగన్ అక్రమ వేధింపుల వల్లనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు సమక్షంలోనే అన్నారు. ఆ ప్రకటన చూసిన మిత్రుడొకరు సీపీఐ వారు చంద్రబాబుకు దగ్గరవనున్నారా? అని అడిగాడు. 2009లో చంద్రబాబుతో మహాకూటమి కట్టిన తర్వాత, ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనుభవం తర్వాత, చంద్రబాబు గారితో కమ్యూనిస్టులు ఎవరూ చేతులు కలపరనే అనుకుంటున్నానని అన్నాను. కమ్యూనిస్టు పార్టీలకు ప్రజాభ్యుదయం, పురోగామి తత్వం, లౌకిక విధానాలు వంటి శాశ్వత విలువలు ఉంటాయి. బాబు లాంటి వారికి అధికారంలోకి రావడమే ముఖ్యం కాబట్టి వారు కమ్యూనిస్టులతోనైనా ఎన్నికల్లో జతకట్టగలరు. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేక సంస్థ అయిన ఆరెస్సెస్, బీజేపీ వంటి వారితో సైతం పొత్తుకు వెనుకాడరు. కానీ కమ్యూనిస్టులకు మాత్రం బాబులాంటి వారితో పొత్తు ధృతరాష్ట్ర కౌగిలే. ఈ సందర్భంగా జగన్ ఆచరణను కమ్యూనిస్టులు మర్చిపోకూడదు. పైగా బీజేపీ హిందూ మతతత్వ ఎజెండాను కాదని, మన రాష్ట్రంలో జగన్ పాలన సర్వ మతసమానత్వాన్ని పాటిస్తూ నడుస్తున్న విషయం వాస్తవం కాదా? దాన్ని గుర్తించకుండా, ఇంతకు ముందు బాబు పాలనలో ప్రజలు స్వర్గధామంలో ఉన్నట్లు జగన్పై విమర్శలు గుప్పించడం కమ్యూనిస్టులకు కూడని పని.ప్రధాని మోదీ కార్పొరేట్ సంస్థలకు అత్యధిక లాభాలు లభించే విధంగా ఆర్థిక విధానాలు అవలంభించి, మన దేశ మౌలిక ఆర్థిక పరిస్థితిని క్షీణింప చేస్తున్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను పెంచి వారి కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక పరిపుష్టి సాధించే దిశగా దృఢనిశ్చ యంతో పయనిస్తున్నారు. అదే రైతు భరోసా, గ్రామ స్వరాజ్ వివిధ కార్పొరేషన్ల ప్రధాన ఉద్దేశం. ఈ పాలన అందిస్తున్న ప్రత్యామ్నాయ విధానాలను సరిగా బేరీజు చేసుకోకుండా, ప్రతిపక్షపాత్ర పోషిం చడం అంటే కాళ్లల్లో కట్టె పెట్టడమేనని కమ్యూనిస్టులు భావించడం సరికాదు. ఈ సందర్భంగానే తప్పులెన్నువారు తమతప్పులెరగరు అన్నట్లు త్వరితగతిని మన ప్రజాభిమాన గ్రాఫ్ పడిపోతున్నప్పుడు తీవ్ర ఆత్మవిమర్శను నిజాయితీగా చేసుకోవాలని కమ్యూనిస్టులతో నాకున్న పేగు సంబంధంతో కోరుతున్నాను. సీపీఎం జాతీయ కార్యదర్శి ఏచూరి, హైదరాబాద్లో నిర్వహించిన సీపీఎం తెలంగాణ కార్యదర్సి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర ముగింపు సభలో లాల్ నీల్ నినాదం ఇచ్చారు. దాని అర్థం. వర్గపోరాట శక్తులు అలాగే సామాజిక అణచివేతకు గురవుతున్న వర్ణ(కుల) వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు, ఇతర వెనుక బడిన కులాలతో ఐక్యపోరాటం అవసరం అని భావించాము. దానికి ఆచరణ రూపం ఇస్తూ బహుజన, వామపక్ష సంఘటన (బీఎల్ఎఫ్)పై తెలం గాణ రాష్ట్రకమిటీ తత్సంబంధిత నేతలందరితో సంప్రదించి ఒక సృజనాత్మక మార్గాన్ని చేపట్టింది. అయితే వర్ణ (కుల) వ్యవస్థ నిర్మూలనా పోరాటం అనేది వర్గపోరాటాలకు, వర్గఐక్యతకు భంగం అని భయపడి, భయపెట్టే కామ్రేడ్లు ఆ పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీల్లో మెజారిటీగా ఉన్నారు. వారు ఈ బీఎల్ఎఫ్ ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ మెజారిటీకి మైనారిటీ లోబడి ఉండాలనే పార్టీ నిబంధన ఆధారంగా దాన్ని వదిలిపెట్టాలని బలవంతం చేశారు. ఫలితంగా పార్లమెంటు ఎన్నికలో బీఎల్ఎఫ్ను విడిచి సీపీఐతో కలిసి ఎన్నికలలో తెలంగాణ సీపీఎం అయిష్టంగా జతకట్టింది. ఇప్పుడు హుజూర్నగర్లో శాసనసభకు ఉపఎన్నిక వచ్చింది. పై కమిటీ కామ్రేడ్లు తెలంగాణ సీపీఎం పార్టీకి ఒంటరిగానే పోరాడమని తాఖీదు పంపారు. అక్కడ సీపీఐ టీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తోంది. గతంలో సీపీఎం నిర్మించిన బీఎల్ఎఫ్లోనే బాధ్యతలు నిర్వహించిన, మరో కమ్యూనిస్టు పార్టీ ఎంసీపీఐ (యూ), కంచ ఐలయ్య, కాకి మాధవరావు, తదితర సామాజిక న్యాయపోరాట సంస్థల నేతలు కొందరు కలిసి బీఎల్ఎఫ్ పేరుతో ఒక అభ్యర్థిని పెట్టింది. ఈ స్థితిలో సీపీఎం అభ్యర్థి నామినేషన్ సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైంది. ఇప్పుడైనా తమ అభ్యర్థి రంగంలో లేడు గనుక తామే నిర్మిం చిన బీఎల్ఎఫ్ అభ్యర్థిని బలపరచడం సీపీఎం కర్తవ్యం. తెలంగాణ సీపీఎం విషయంలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట కేంద్రీకృత నియంతృత్వాన్ని అమలు జరిపి, ఆ పార్టీ పైకమిటీ ఏం ఆదేశిస్తుందో చూడాలి. ఒకవేళ సీపీఎం, తాను బీఎల్ఎఫ్ని బలపర్చడం లేదని ప్రకటిస్తే, తెలంగాణలో ప్రత్యేకించి, దేశవ్యాప్తంగాను సీపీఎం ప్రతిష్ట దిగజారుతుంది. విస్తృత ప్రజా సమీకరణ చేయాల్సిన మౌలిక లక్ష్యానికి సీపీఎం దూరమవుతుంది. కానీ ఆ తప్పు నిర్ణయాన్ని సీపీఎం చేయదని ఆశిద్దాం. అణగారిన ప్రజల, కష్టజీవుల విస్తృత ఐక్య పోరాటమే మార్క్సిజాన్ని మన దేశ ప్రత్యేకతకు అన్వయించడం! - డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
‘ఏపీకి మరోసారి బీజేపీ ద్రోహం’
సాక్షి, విజయవాడ: ఆంధ్రా బ్యాంక్ను యూనియన్ బ్యాంక్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక వన్టౌన్ ఆంధ్రా బ్యాంక్ జోనల్ కార్యాలయం ఎదుట వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేసు మాట్లాడుతూ.. 90 వేల శాఖలు కలిగిన ఆంధ్రాబ్యాంక్ను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. దేశ ఆర్థిక వృద్ధి కోసమే విలీనం చేస్తున్నామంటూ.. బీజేపీ ప్రభుత్వం ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఆంధ్రా బ్యాంక్ విలీనానికి కమ్యూనిస్టు పార్టీలు పూర్తి వ్యతిరేకమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఏపీకి బీజేపీ ద్రోహం.. బీజేపీ ప్రభుత్వం మరోసారి ఏపీకి ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా బ్యాంక్ విలీనాన్ని సీపీఎం, సీపీఐలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. నిరంకుశ విధానాలు మానుకోవాలి.. వైఎస్సార్ జిల్లా: ఆంధ్రా బ్యాంక్ను యూనియన్ బ్యాంక్లో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. మంగళవారం కడప నగరంలోని ఏడు రోడ్లు సర్కిల్లో ఆంధ్రా బ్యాంక్ ఎదుట సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. తెలుగు ప్రజల పట్ల ప్రధాని నరేంద్రమోదీ నిరంకుశ విధానాలు మానుకోవాలని హితవు పలికారు. -
విద్యార్థులారా... ఆత్మహత్యలకు పాల్పడవద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో గందరగోళంపై సోమవారం (29న) ఇంటర్బోర్డు ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, టీడీపీ ప్రకటించాయి. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఇతర రాజకీయపార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర వర్గాలవారు కలసి రావాలని పిలుపునిచ్చాయి. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, వారికి తాము అండగా ఉంటామని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశాయి. శనివారం ఇక్కడి మఖ్దూంభవన్లో భేటీ అనంతరం ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. 23 మంది మరణం హృదయవిదారకం ఇంటర్ బోర్డు తప్పులకు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం హృదయ విదారకరమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ఎదిగిన పిల్లలు రాలిపోయి, ఎద నిండా ఆవేదనతో తల్లిదండ్రులున్నారని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ సమాజం మొత్తం మేల్కొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. ఒక కంపెనీ ప్రయోజనాల పరిరక్షణకే ప్రభుత్వం, అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఈ సంస్థ మొదటి నుంచి తప్పులు చేస్తున్నా వెనకేసుకు వచ్చారని విమర్శించారు. తప్పులపై కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు మొదటి నుంచి హెచ్చరిస్తున్నా బోర్డు అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇంటర్ కార్యదర్శికి సమస్యలన్నీ తెలుసని, విద్యార్థులు ఫెయిలైతే డ్రైవర్లు కావచ్చని, దుకాణాల్లో పని చేసుకోవచ్చని ఉచిత సలహాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కూడా ఉచితంగా విద్యార్థులకు వాల్యూయేషన్ చేస్తామన్నారే తప్ప ఈ సమస్యపై సమగ్ర సమీక్ష నిర్వహించలేదన్నారు. తమకు ఎమ్మెల్యేల సంఖ్య లేకపోయినా సమాజం పట్ల నిబద్ధత ఉందని, ఏదిఏమైనా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామన్నారు. నిద్ర నటించే సర్కార్ను తట్టి లేపేందుకే ఈ వ్యవహారంపై నిద్ర నటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు ధర్నా నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిఫారసుతోనే పరీక్షల నిర్వహణలో అనుభవంలేని గ్లోబరీనా సంస్థకు టెండర్ కట్టబెట్టారని ఆరోపించారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే ఈ సంస్థకు పరీక్షా ఫలితాల బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. ప్రతి అంశంపై ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ ఇంటర్ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిం చారు. విద్యార్థులు రోడ్డున పడితే టీఆర్ఎస్ మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ ఫ్యూడల్ మైండ్సెట్తో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేబినెట్ బాధ్యత వహించాలి: రమణ ఇంటర్ బోర్డు తప్పులకు సీఎం కేసీఆర్, కేబినెట్ బాధ్యత వహించాలని, మంత్రి జగదీశ్రెడ్డిని బర్తరఫ్ చేయాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంపై విపక్షపార్టీలుగా గవర్నర్ను కలిస్తే నామమాత్రంగా స్పందించారన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేటీఆర్ మాత్రం ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిర్బంధాన్ని ఛేదిస్తాం: చాడ సీఎం కేసీఆర్ ప్రయోగించే నిర్బంధాన్ని, పోలీస్ వ్యవస్థను ఛేదించి 29న ధర్నా నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. తొంభై మార్కులు వచ్చిన అమ్మాయికి ఇంటర్బోర్డు సున్నా మార్కులు వేసినందుకు సిగ్గుపడాల్సింది పోయి... ఇలాగే జరుగుతాయి అని చెప్తారా? అని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఉంటామని, జోలె పట్టి ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. -
ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించిన వామపక్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం వామపక్ష నేతలు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అయితే వామపక్ష నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు. ప్రశ్నించిన వాళ్లను ప్రభుత్వం అణిచివేస్తోందని మండిపడ్డారు. చనిపోయిన ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
లెఫ్ట్ పార్టీలకే ఓటేయండి.. కేరళ చర్చి పిలుపు!
సాక్షి, తిరువనంతపురం: పినరయి విజయన్ సారథ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులకే ఓటేయండని కేరళలోని ప్రముఖ చర్చి అక్కడి క్రైస్తవులకు పిలుపునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘రానున్న లోక్సభ ఎన్నికల్లో మనకు సహాయం చేసిన లెఫ్ట్ కూటమి అభ్యర్థులకే ఓటేయాల’ని ఓ చర్చి మతబోధకుడు క్రైస్తవులకు సూచించారు. దీనిపై కేరళ సీపీఎం నాయకుడు సునీత్ చోప్రా మాట్లాడుతూ.. ‘హిందువుల మీద దాడులపై, హిందూ ధార్మిక సంస్థలు మాట్లాడగా లేనిది, బీజేపీకి ఓటేయొద్దని క్రైస్తవ చర్చిలు చెప్పడంలో తప్పేంట’ని ప్రశ్నించారు. అయితే, ఇది ముమ్మాటికీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమేనని ఈ మధ్యే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నాయకుడు టామ్ వడక్కన్ అభిప్రాయపడ్డారు. ఈ వివాదం నేపథ్యంలో ఓటర్లును ప్రభావితం చేసే ఎటువంటి ప్రసంగాలను నిర్వహించొద్దని ఇదుక్కి జిల్లా చర్చి బిషప్ మార్ మ్యాథ్యూ.. చర్చి మతబోధకులకు హెచ్చరించినట్టు సమాచారం. ‘దీనివల్ల భవిష్యత్తులో చర్చి కార్యకలాపాలకు నష్టం వాటిల్లే అవకాశముంది. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో చాలా తెలివిగా, స్పృహతో ఉన్నారు. చర్చి మతబోధకులు ఇటువంటి విషయాల్లో ఏ పక్షానికీ తలొగ్గకుండా ఉండటమే మంచిద’ని బిషప్ మార్ మ్యాథ్యూ హితవు పలికారు. ఇకపోతే 2014 లోక్సభ ఎన్నికల్లో ఇదుక్కి బిషప్ మార్ మ్యాథ్యూ మద్దతుతో లెఫ్ట్ అభ్యర్థి జాయ్స్ జార్జ్ దాదాపు 50 వేల మెజార్టీతో గెలుపొందారు. అనేక చోట్ల చర్చి బిషప్లు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉండటంతో, పార్టీలు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. -
కర్తవ్యాన్ని గుర్తించండి కామ్రేడ్స్!
నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ప్రత్యక్ష, తక్షణ ప్రమాదం.. ప్రజలలో విశ్వసనీయత పూర్తిగా కోల్పోయిన చంద్రబాబు ప్రభుత్వం నుంచే ఉంది. అవినీతిలో, ఆశ్రిత పక్షపాతంలో, ప్రజలను మాటల్తో వంచించడంలో ఆత్మస్తుతి, పరనిందలో బాబు ఆకాశమే హద్దుగా వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయిన ప్రజలు ఆయనకు చరమగీతం పాడాలని ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని, ప్రజాస్వామిక పాలనను ఖూనీ చేసిన చంద్రబాబు పాలనను, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించటమే ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టులు పరిష్కరించాల్సిన కీలక వైరుధ్యం. ఈ కర్తవ్య నిర్వహణ పక్కదారి పట్టకుండా పోరాటంలో కమ్యూనిస్టులు ముందుండాలి. ఇది మన నవ్యాంధ్రప్రదేశ్కు, దేశ లోక్సభకు ఎన్నికల వాతావరణం! ఎన్నికల ప్రాధాన్యత గురించి మార్క్స్ మహనీయుడు ఒక సందర్భంలో ‘సంఖ్యరీత్యా అధికసంఖ్యలో ఉండే ఎన్నో పోరాటాలలో రాటుదేలి చైతన్యవంతమైన శ్రామికవర్గం ఉన్న ఇంగ్లండ్ వంటి దేశాల్లో వయోజన ఓటింగ్ ద్వారా సమాజంలో సోషలిజం దిశగా మార్పు రావచ్చు’ అని ఆశించారు. ఆయన సహచరుడు ఎంగెల్స్ మాత్రం ఎన్నికలు ప్రజాచైతన్యానికి గీటురాళ్లు మాత్రమే అన్నారు. అందుకే సీపీఎం పార్టీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, ఆదర్శ కమ్యూనిస్టు నేత కీ.శే. పుచ్చలపల్లి సుందరయ్య కొటేషన్ల (ఉటంకింపులు) దేముందయ్యా, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ రచనల నుంచి ఎన్నయినా ఇవ్వవచ్చు కానీ, కావలసింది వాటిని మన పరిస్థితికి అన్వయించుకోవడమే అనేవారు. ఆ విధంగా ప్రస్తుత సమాజాన్ని విశ్లేషించుకుంటే ఇక్కడ నిన్నటి భూస్వాములే నేటి పెద్ద పెట్టుబడిదారులు–ఆ రెండు వ్యవస్థల దుర్లక్షణాలన్నీ నేటి మన దేశ వ్యవస్థలో ఉన్నాయి. ఒకవైపు బడా పెట్టుబడిదారులు, విదేశాలకు పెట్టుబడిని ఎగుమతి చేసే స్థాయికి పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి చెందినా, బ్యాంకులను, ప్రజాధనాన్నీ కొల్లగొట్టిన, కొల్లగొడుతున్న మాల్యాలు, నీరవ్ మోదీలు, సుజనా చౌదరిలు, సీఎం రమేష్లతోపాటు పాత సంస్కృతి అవశేషంగా సామాజిక అణచివేతకు ఆలవాలమైన కులవ్యవస్థ కూడా బలంగా ఉంది. ఇఎంఎస్ అన్నట్లు మనదేశంలో బానిసవ్యవస్థ కులవ్యవస్థ రూపంలో ఘనీభవించింది. అందుకే పైపై మార్పులు ఎన్ని జరిగినా, దాని ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దీనికి ఉదాహరణ. సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే ‘ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా?’ అంటూ వారి జన్మ అప్రతిష్టకరమైనదని చెప్పకనే చెప్పారు. ‘మీకు రాజకీయాలెందుకురా, అవి మాకు.. పిచ్చి ముం..ల్లారా’ అంటూ చంద్రబాబు కులానికి చెందిన మరో నేత అంటాడు. పైగా ఆయన ఒక మహిళా అధికారి జుట్టు పట్టుకుని ఈడ్చిన ఘనుడు కూడా. ఇక ప్రతిపక్షంలో ఉండి గోడదూకి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మరోనేత అయితే ‘ఈ దళితులు శుభ్రంగా ఉండరు. స్నానాలు చేయరు’ అని ఏవగించుకుంటాడు. ‘ఈ మాదిగ... లకు చదువుపై శ్రద్ధ ఉండదు. వారికి చదువు అబ్బదు’ అని పాలకపార్టీలోని దళితనేత ఒకరు ఎగతాళి చేస్తాడు. గతంలో ఎన్నడూ లేనట్లు దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారి టీలు, బాగా వెనుకబడిన కులవృత్తుల వారి పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. వారి అస్తిత్వమే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పాలనకు సంబంధించి అన్ని రంగాల్లోనూ చంద్రబాబుకు చెందిన సామాజిక వర్గానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నది నిర్వివాదాంశం. ఆ పార్టీని వీడి ఇతర పార్టీలవైపు ముఖ్యంగా వైఎస్సార్సీపీ వైపు వలస వస్తున్న చంద్రబాబు అనుయాయులే ఈ విషయం స్పష్టంగా ప్రజల ముందు చెప్పడమూ మనం చూస్తున్నాం. ఈ కమ్మ కులం నేతల్లో కూడా కులకంపుతో ఊపిరాడని కొందరు ప్రజాప్రతి నిధులు సైతం ఈ నిజం చెప్పేందుకు సిద్ధపడుతున్నారు. దురదృష్టమేమిటంటే, ఈ కులవ్యవస్థ అణచివేత, భారతదేశ ప్రత్యేకతలో ఒక ప్రధాన వైరుధ్యంగా భావించి అందుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన కమ్యూనిస్టులు తెలిసో తెలియకో ఆ అంశాన్ని కొన్ని సందర్భాల్లో అసలు భౌతిక వాస్తవికతగా గుర్తించడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఈ వర్ణవ్యవస్థపై పోరాడితే మౌలికమైన వర్గ ఐక్యతే చెదిరిపోతుందని బెదిరిపోతున్నారు. ప్రతి మహాసభలోనూ శ్రామిక వర్గం నుండి వచ్చిన ప్రతినిధులు ఎంతమంది ఉన్నారనేది ఆయా కమిటీల లెక్కల ద్వారా తేల్చుకుం టారు. కానీ పార్టీ ఉన్నత కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, బీసీ, మహిళలు, మైనారిటీలు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్నే ఉండదు. ఇది గమనించే బీటీ రణదివే విజయవాడలో అప్పట్లో జరిగిన మహాసభలో మనపార్టీ ఏమైనా ఎస్సీ, ఎస్టీయేతర పార్టీనా అని ప్రశ్నించాల్సి వచ్చింది. దీనిపై ఆమధ్య సీపీఎం ఆత్మవిమర్శా పత్రంలో ప్రస్తావించి, ఈ పరిస్థితి ఉమ్మడి ఏపీలో అధికంగా ఉందని చెప్పింది. ఇటీవలి కాలంలో పార్టీలో ఈ అంశంపై తక్కువస్థాయిలోనైనా కాస్త మార్పు వస్తోందనిపిస్తోంది. ఈ అంశంపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ చేస్తున్న కృషి ఒక ఆశాజనకమైన ఉదాహరణ. ఇతర కమ్యూనిస్టు పార్టీలతో పోలిస్తే ఇది సృజనాత్మకమైన సానుకూల ప్రయోగం. వారు బహుజన వామపక్ష సంఘటనను.. సామాజిక అణచివేతకు గురవుతున్నవారు శ్రామికవర్గ దృక్పథం గలవారు, ఇతర మధ్యతరగతి మేధావులతో ఏర్పాటు చేశారు. ఆ సంఘటన ఒంటరిగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ అది ఆశించిన స్థాయిలో ఓట్లు సాధించలేక పోయింది. అది సాకుగా చూపి వర్గపోరాటమే ఏకైక పోరాటరూపం అన్న నినాదం మాటున తెలంగాణ సీపీఎం ఏర్పర్చిన బీఎల్ఎఫ్పై విమర్శలు, అవహేళనలు మంద్రస్థాయిలో సాగాయి. కానీ మన దేశంలో భౌతిక వాస్తవికతగా నిలిచి ఉన్న సామాజిక అణచివేతకు ఆలంబనగా ఉండిన వర్ణవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడకుండా కమ్యూనిస్టులు తమ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యం! విభిన్న భాషలు, నాగరికతలు, జీవన పరిస్థితులు, వివిధ జాతులు, విభిన్న వైవిధ్యాలు, వైరుధ్యాలు గల మన దేశంలో దాదాపు దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల స్వల్పమార్పులు తప్ప సాధారణంగా ఉన్న సామాన్య అంశం ఈ వర్ణ వ్యవస్థే. కాబట్టి కమ్యూనిస్టుల పోరాటంలో ఈ సామాజిక అణచివేత అంశం కూడా ప్రధానమైందే. అందుకే తెలంగాణ సీపీఎం రాష్ట్ర కమిటీ దీనిపై తీసుకున్న నిర్ణయం, దాని ఆచరణ క్రమం సామాజిక పురోగమనంలో మరో ముందుడుగుగా చెప్పాలి. వారి ప్రయత్నం ఈ రోజు చిన్నదే కావచ్చు కానీ అది పెరిగిపెరిగి దేశ ప్రజానీకానికి ఆశావహంగా రూపొందుతుందని నమ్ముతున్నాను. ఇక రెండో ప్రధాన అంశం మనదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ. పార్లమెంటరీ మార్గమే మౌలికంగా ప్రజాజీవనాన్ని మార్చేస్తుందని చెప్పలేం. కానీ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో, వారు తమ అనుభవం ద్వారా తమకు ఎలాంటి పాలన కావాలో గ్రహింపు కలిగించడంలో ఎన్నికల పాత్రను కాదనలేం. అలాగని చెప్పి ఎక్కువ స్థానాలు, తద్వారా రాష్ట్ర స్థానిక స్థాయిలోనైనా అధికారం పొందడమే కమ్యూనిస్టుల లక్ష్యం కాకూడదు. దేశ ప్రజల జీవన పరిస్థితులు, రాజకీయ చైతన్యం, భౌతిక పరిస్థితులు నిశితంగా పరిశీలించుకుని అవి మరింత మెరుగుపడేందుకో, కాకుంటే మరింత అధ్వానమైనా కాకుండా ఉంచేందుకే కమ్యూనిస్టుల పార్లమెంటరీయేతర పోరాటాలు ఉండాలి కదా! ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో, అలాగే కేంద్రంలో ఉన్న పాలన దాని మంచిచెడ్డలు వాటిని ప్రభావితం చేయగల మనశక్తి సామర్థ్యాలు, అన్నీ ఊహాలోక విహారాలు కాకుండా వాస్తవికంగా నిర్దేశించుకోగలగాలి. నేడు ఏపీలో ప్రజలకు ప్రత్యక్ష, తక్షణ ప్రమాదం ప్రజలలో విశ్వసనీయత పూర్తిగా కోల్పోయిన బాబు ప్రభుత్వం నుంచే ఉంది. అవినీతిలో, ఆశ్రిత పక్షపాతంలో, ప్రజలను మాటలతో వంచించడంలో ఆత్మస్తుతి, పరనిందలో బాబు ఆకాశమే హద్దుగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు ఆయనకు చరమగీతం పాడాలని ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. పైగా చంద్రబాబు స్పీకర్ పదవిని కూడా భ్రష్టుపట్టించి కోడెల శివప్రసాద్ ద్వారా శాసనసభ సత్సంప్రదాయాలను ఉల్లంఘించి, అసెంబ్లీనే ‘కురుసభ’గా మార్చిన వ్యవహారం కూడా ప్రజలు గమనించిందే. ఇక ఎన్నికల ప్రక్రియనే తల్లకిందులు చేసే రీతిలో ప్రతిపక్షాల ఓట్లను, ఓటర్లను తొలగించి తన అనుకూలుర దొంగ ఓట్లను చేర్పించడం వంటి అక్రమ చర్యలకు సిద్ధపడ్డారు. నిన్నటిదాకా తన ‘షేవ్ ఆంధ్రప్రదేశ్ మిషన్’ని సాధ్యమైనంతగా పూర్తి చేసుకుని, అందుకు మోదీ సహాయాన్ని స్వీకరించి తీరా ఏపీ ప్రజలు తననూ, మోదీని కూడా రాజకీయ సమాధి చేయడానికి సిద్ధమైనారని గ్రహించి ఏదో విధంగా తన మిషన్ సాగించేందుకు బాబు పెనుగెంతువేసి రాహుల్గాంధీ సరసన చేరారు. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో గెలవాలనే ఏకైక లక్ష్యంతో ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు, ముందస్తు గృహనిర్బంధాలు, చీటికీమాటికీ పోలీసు దాడులు వంటివి మున్నెన్నడూ ఎరుగని స్థాయిలో బాబు జరిపిస్తుండటం చూస్తున్నాం. ఎన్నికల కమిషన్కు ప్రత్యేక యంత్రాంగం ఏదీలేని నేపథ్యంలో అశోక్బాబు వంటి చెంచాగిరి చేసే అధికార బృందం, కోరి తెచ్చుకున్న పోలీసు ఉన్నతాధికారులు వీరి సాయంతో నిస్సిగ్గుగా, ప్రజాస్వామ్య విలువలను పాతరేసే ప్రయత్నాలు జరగవచ్చు కనుక ఈ నామమాత్రపు ప్రజాస్వామ్యం కూడా కృష్ణార్పణం కాకుండా అందరికంటే కమ్యూనిస్టులు తమ అనుభవంతో ఎదుర్కోవడంలో ముందుండాలని వాంఛించడం సహజం. ఇటు రాష్ట్రంలో బాబు టీడీపీ అధికారంలోకి రాకుండా చేయడం అందుకు ప్రజాసమీకరణ, ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో కమ్యూనిస్టు పార్టీల పోరాట పటిమ, ప్రజానుకూల ధోరణిని ప్రజానీకం గుర్తించగలుగుతారు కూడా. అలాగే ప్రత్యేక హోదాకు మంగళం పాడిన ఎన్డీయే పాలనను ఓడిం చడం కూడా కమ్యూనిస్టుల లక్ష్యం కావాలి. వీటికి దూరంగా ప్రస్తుత పరిస్థితిలో ఆచరణీయ కర్తవ్యం కాని కూటములతో మరోసారి కమ్యూనిస్టులు అప్రతిష్ట కొనితెచ్చుకోరాదు. పై రెండు ప్రధాన కర్తవ్యాల నిర్వహణ పక్కదారి పట్టకుండా పోరాటంలో కమ్యూనిస్టులు ముందుండాలి. ఈ ప్రధాన పాత్ర నిర్వహణకు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ అగ్రగామిగా ఉంది. ఆ పార్టీతో కమ్యూనిస్టులకు ఎన్ని వైరుధ్యాలైనా సరే రాజకీయ రంగంలో ఉండవచ్చు, ఉంటాయి కూడా. కానీ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని, ప్రజాస్వామిక పాలనను ఖూనీ చేసిన చంద్రబాబు పాలనను, కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఓడించటమే ప్రస్తుతం వామపక్షాలు పరిష్కరించాల్సిన కీలక వైరుధ్యం. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
మోదీ పర్యటన నిరసిస్తూ వామపక్షాల ర్యాలీ
-
మోదీ పర్యటనను అడ్డుకుంటాం
-
సీట్ల సర్దుబాటుపై ఫిబ్రవరిలో నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం/నగరంపాలెం (గుంటూరు): జనసేన, వామపక్షాల పొత్తు నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంటామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ తెలిపారు. వచ్చే నెలలో మరోసారి సమావేశమవుతామన్నారు. విశాఖ రుషికొండలోని ఓ రిసార్ట్స్లో జనసేన, సీపీఐ, సీపీఎం ముఖ్య నాయకులు రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులుతో పవన్కల్యాణ్ మూడు గంటలపాటు చర్చించారు. అనంతరం వారితో కలిసి పవన్ విలేకరులతో మాట్లాడారు. వామపక్షాలు, జనసేన పార్టీల భావజాలం ఒకేలా ఉండడంతో వాటితో కలిసి పనిచేయాలన్న నిర్ణయానికొచ్చామని పవన్ చెప్పారు. పర్యావరణ కాలుష్యం, మైనింగ్ పాలసీ, 2013 భూసేకరణ చట్టం అమలు, జాయింట్ ఫ్యాక్టస్ ఫైండింగ్ కమిటీ నివేదికను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై చర్చించామని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఎలా కలిసి వెళ్లాలన్న దానిపై చర్చించామన్నారు. ఈవీఎంలలో లోపాలపై తమకు అభ్యంతరాలున్నాయని, త్వరలో వాటిపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. నిపుణుల కమిటీ వేయాలి ఈవీఎంలపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్పై ఉందని సురవరం సుధాకరరెడ్డి చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు వ్యత్యాసం ఉండడం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యాయన్నారు. ఇలాంటి అనుమానాల నివృత్తికి నిపుణుల కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీవీ రాఘవులు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు, ఆ ప్రక్రియలో మూడు పార్టీల పాత్ర గురించి చర్చించామని తెలిపారు. ప్రత్యేక హోదా, వాగ్దానాల అమలులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్నారు. సమావేశంలో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, మాదాసు గంగాధరం, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు పాల్గొన్నారు. 27న జనసేన శంఖారావం సభ 27న గుంటూరు లాడ్జి సెంటరులోని ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్లో జనసేన శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకుడు, మాజీ మంత్రి రావెల కిశోర్బాబు తెలిపారు. శుక్రవారం ఆయన సభ ఏర్పాట్లను పరిశీలించారు. పవన్కల్యాణ్ ఈ సభలో పాల్గొంటారన్నారు. -
లాఠీఛార్జ్ని ఖండించిన వైఎస్ జగన్
-
లాఠీఛార్జ్ని ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు, విభజన హామీలు నెరవేర్చాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. వామపక్ష పార్టీల నాయకులతో పాటు, పలు విద్యార్థి సంఘాల నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో ధర్నా చేసిన ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జ్, అరెస్టులను ఆయన ఖండించారు. ఢిల్లీలో ఉన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఉద్యమ కారులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ తెలిపారు. -
వామపక్షాలతో తప్ప ఎవరితోనూ కలిసి వెళ్లం
-
కడపలో వామపక్షాల బంద్
-
సర్కారు తీరుకు నిరసనగా వామపక్షాల బంద్
-
విజయవాడలో తొమ్మిది లెఫ్ట్ పార్టీల సమావేశం
-
అవకాశం కోల్పోయాం...‘అధ్యక్షా’!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ చవిచూడని పరిస్థితి ఈ మారు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు చవిచూశాయి. గత 66 ఏళ్ల చరిత్రలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క సభ్యుడినైనా చట్టసభకు పంపుకోలేని దుస్థితిలో అవి పడ్డాయి.దీంతో తొలిసారిగా వామపక్షపార్టీల గళం వినిపించని కొత్త శాసనసభ ఏర్పడబోతోంది. 2014లో జరిగిన ఏపీ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టుపార్టీలు ఖాతా తెరవకపోవడంతో ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల శాసనసభల్లో ఈ పార్టీలకు ఉనికి లేకుండా పోయింది. పొత్తుల ఎత్తుల్లో ఏదోలా లబ్ధి... వామ పక్షాలు మారిన రాజకీయ ఎత్తుగడలకు అనుగుణంగా వివిధ పార్టీలతో పొత్తులు కుదుర్చుకొని ఎన్నికలకు దిగినప్పుడు కాస్తా లాభపడ్డాయి. ఒకసారి టీడీపీతో మరోసారి కాంగ్రెస్తో, ఇంకోమారు టీడీపీ, టీఆర్ఎస్లతో ఇలా రాష్ట్రంలో ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీతో ఉభయ కమ్యూనిస్టుపార్టీలు గతంలో పొత్తులు కుదుర్చుకున్నాయి. అందుకు భిన్నంగా ఈ సారి తెలంగాణలో సీపీఐ ఏకంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్లతో సీట్ల సర్దుబాటు చేసుకుంది. సీపీఎం మాత్రం విడిగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్తో కలిసి పోటీచేయడం ద్వారా రాష్ట్రంలో కొత్త ప్రయోగానికి తెరతీయాలని ప్రయత్నించింది. 1983 నుంచి మారిన పరిస్థితి... 1983 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టుపార్టీలతో టీడీపీ సీట్ల సర్దుబాటు ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో 28చోట్ల పోటీచేసిన సీపీఎం ఐదుచోట్ల, 48 స్థానాల్లో పోటీచేసిన సీపీఐ నాలుగుస్థానాల్లో గెలిచాయి. 1985 మధ్యంతర ఎన్నికల్లో సీపీఐ,సీపీఎం, మరోవైపు జనతాపార్టీ, బీజేపీలతో టీడీపీ పొత్తు కుదుర్చుకుంది. ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు చెరో 11 స్థానాలు దక్కించుకున్నాయి. 1989లో టీడీపీ పొత్తుతో సీపీఎం ఆరు, సీపీఐ ఐదు సీట్లలో గెలుపొందాయి. 1994లో టీడీపీతో పొత్తులో సీపీఐ 19, సీపీఎం 15 సీట్లు గెలిచాయి. 1999లో ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీచేసినపుడు సీపీఎంకు రెండుసీట్లు దక్కగా సీపీఐకి ఒక్కసీటుకూడా రాలేదు. మళ్లీ 2004లో కాంగ్రెస్తో పొత్తులో సీపీఎం 9, సీపీఐ 6 స్థానాల్లో గెలిచాయి. మళ్లీ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు కుదుర్చుకున్నపుడు సీపీఐ 4 స్థానాలు, సీపీఎం ఒక సీటు గెలిచాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో వామపక్షాలు చెరోస్థానానికే పరిమితమయ్యాయి. -
వామపక్షాల ఐక్యతతోనే మతోన్మాద అంతం
సాక్షి, హైదరాబాద్: వామపక్షాల ఐక్యతతోనే మతోన్మాదాన్ని అంతం చేయగలమని ఎంసీపీఐ(యు) అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఎం.డి.గౌస్ అన్నారు. ఎంసీపీఐ–ఆర్ఎంపీఐ పార్టీల ఐక్యత సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ‘వర్తమాన రాజకీయాలు– వామపక్షపార్టీల ఐక్యత అవకాశాలు’పై సదస్సు జరిగింది. సదస్సులో ఆర్ఎంపీఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మంగత్రాం పాస్లా, చైర్మన్ గంగాధరన్ తదితరులు పాల్గొని మాట్లాడారు. గౌస్ మాట్లాడుతూ.. మత స్వేచ్ఛను హరించివేయడం, పౌరహక్కులను అణచివేయడం, ప్రజల ఆహార అలవాట్లు, ఆచార వ్యవహారాలపైనా ఆంక్షలు విధించడం వంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలనే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోందని ఈ 2 పార్టీలనుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం వామపక్షపార్టీలపై ఉందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన బహుజన లెఫ్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) కారుచీకటిలో కాంతిరేఖ వంటిదన్నారు. కాంగ్రెస్, బీజేపీ,టీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా వామపక్షా లు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఎంసీపీఐ–ఆర్ఎమ్పీఐ ముఖ్యనేతలు కిరణ్జిత్, నారాయణన్, మద్దికాయల అశోక్, అనుభవదాస్ శాస్త్రి, కాటం నాగభూషణం, వనం సుధాకర్, హర్కమల్లు పాల్గొన్నారు. -
వామపక్షాలపై నమ్మకం పోయింది: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ప్రధాన పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంతో కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడిందని దీంతో వామపక్షాలపై ప్రజలకు నమ్మకం పోయిం దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్ విధానాలు ఒకటేనని అందుకే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)గా ప్రజల ముందుకు సీపీఎం వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో సీపీఎం 20 నుంచి 25 స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. మిగతా స్థానాల్లో బీఎల్ఎఫ్ అభ్య ర్థులు పోటీలో ఉంటారన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో 14 కులదురహంకార హత్యలు జరిగాయని, ఈ హత్యలను టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ కులదురహం కార హత్యలపై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, నాయిని ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఈ హత్యలకు నిరసనగా ఈ నెల 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ప్రణయ్ హత్య లో ఆరోపణలెదుర్కొంటున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఇతర రాజకీయనేతల పాత్రపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న 20నుంచి 25 మందితో బీఎల్ఎఫ్ మొదటి జాబితాను ప్రకటిస్తామన్నారు. -
రైతుల పోరుపై ఉక్కుపాదం
తుళ్లూరు రూరల్/సాక్షి, అమరావతి: తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం రాజధాని ప్రాంత రైతులు సోమవారం తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ చెక్పాయింట్లు ఏర్పాటుచేసి.. భారీఎత్తున మొహరించిన పోలీసులు రైతులను, నాయకులను అదుపులోకి తీసుకుని ఉద్యమంపై ఉక్కుపాదం మోపారు. అంతకుముందు.. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు రైతులు, లంక భూముల సొసైటీల అధ్యక్షులకు నోటీసులు ఇచ్చి నిర్బంధకాండ కొనసాగించారు. తుళ్లూరు మండలాన్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆందోళనకు తరలివచ్చే అవకాశం ఉన్న రైతులందరినీ రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు. చలో అసెంబ్లీకి రావద్దని.. అలాగే పెద్ద నాయకులందరూ ఇంటికే పరిమితం కావాలని హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు.. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సచివాలయం చుట్టూ ఆరు చెక్ పాయింట్లు పెట్టారు. మల్కాపురం మలుపు వద్ద మందడం జెడ్పీ ఉన్నత పాఠశాల వెనుక నుంచి సచివాలయానికి చేరుకునే ప్రధాన రహదారిపై ఒకేచోట మూడు చెక్ పాయింట్లు ఏర్పాటుచేశారు. వేర్వేరుచోట్ల నేతలు అదుపులోకి.. ఇదిలా ఉంటే.. ‘చలో అసెంబ్లీ’కి రైతులందరూ తరలివస్తున్నారని భావించిన వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన, కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున తరలివచ్చారు. వీరందరినీ వేర్వేరు చోట్ల పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11గంటలకు సీపీఐకి చెందిన మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, సీఆర్డీయే ఏఐటీయూసీ కార్యదర్శి జీవీ రాజు, సీపీఎం సీఆర్డీయే కార్యదర్శి ఎం. రవి, జిల్లా రైతు విభాగం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్లను మందడంలో అదుపులోకి తీసుకున్నారు. ఐనవోలు వద్ద లింగాయపాలేనికి చెందిన రైతు నాయకుడు అనుమోలు గాంధీతోపాటు మరో న్యాయవాదిని 11.30గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో బాపట్ల వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్తోపాటు పార్టీ తుళ్లూరు మండల నేత చలివేంద్రం సురేష్ను మందడంలో అరెస్టుచేసి పెదకూరపాడు పోలీసుస్టేషన్కు తరలించారు. అలాగే, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు శృంగారపాటి సందీప్, లంక రైతు పులి ప్రకాష్లను తెల్లవారుజామున 6 గంటలకు అదుపులోకి తీసుకుని తుళ్లూరు స్టేషన్కు తరలించారు. తాడికొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చిలకా విజయ్ను ఉ.6గంటలకు గృహనిర్బంధం చేశారు. వెంకటపాలెంలో జనసేన నేతలను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరందరినీ సాయంత్రం అయిదు గంటలకు విడుదల చేశారు. తుళ్లూరు పోలీసుస్టేషన్లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు, రాజధాని రైతులను తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కత్తెర హెనీ క్రిస్టీనా పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. రైతుల డిమాండ్లు ఇవీ.. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో ఎక్కువ శాతం భూములు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ అసైన్డ్, లంక భూములను సాగుచేసుకుంటున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని రైతుల ప్రధాన ఆరోపణ. లింగాయపాలెం, రాయపూడి, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో లంక భూములు దాదాపు 1600 ఎకరాల వరకు ఉంటాయి. ఈ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు చట్ట ప్రకారం ప్యాకేజ్ ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా అధికారులకు, మంత్రులకు తమ సమస్యలను విన్నవించినా ఫలితం లేకపోవడంతో చివరి అస్త్రంగా రైతులు సోమవారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జరీబు ప్యాకేజీ ఇవ్వాలి : వైఎస్సార్సీపీ ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేత నందిగం సురేశ్ మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో దళితులకు అన్యాయం జరుగుతోందని, ప్యాకేజీ విషయంలో వివక్ష ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. రాజధానిలో 29 గ్రామాల్లో సాగు చేసుకునే ఐదు వేల ఎకరాల భూములను జీవో నంబర్ 259 ప్రకారం మాత్రమే తీసుకోవాలని, అందరికీ జరీబు ప్యాకేజ్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోతున్న వారికి తగిన పరిహారాన్ని అందజేయాలన్నారు. అక్రమ అరెస్టులపై వామపక్షాల ఖండన రాజధాని ప్రాంతంలో శాంతియుతంగా ఆందోళన చేయడానికి ప్రయత్నించిన వారిని అక్రమంగా అదుపులోకి.. అరెస్టులు చేయడాన్ని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి. మధు, కె. రామకృష్ణ సోమవారం ఖండించారు. అసైన్డ్ రైతులను, వారికి సంఘీభావంగా వెళ్లిన వివిధ పార్టీల నాయకులను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. రాజధాని ప్రాంతంలో పోలీసులు భయానక వాతావరణాన్ని సృష్టించారని పేర్కొన్నారు. అసైన్డ్, లంక భూముల రైతులకు ఇతర రైతులతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు సామాజిక పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. -
‘మహా కూటమి’కి ఓకే
సాక్షి, హైదరాబాద్: ‘మహాకూటమి’ఏర్పాటుకు లైన్క్లియర్ అయింది. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి, కేసీఆర్ను గద్దెదింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా మరో అడుగు పడింది. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా కలసి పనిచేయాలని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నిర్ణయించాయి. ఈ మేరకు మంగళవారం పార్క్ హయత్ హోటల్లో జరిగిన మూడు పార్టీల సమావేశంలో అంగీకారం కుదిరింది. కాంగ్రెస్ నుంచి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, గూడూరు నారాయణరెడ్డి, టీడీపీ నుంచి ఎల్.రమణ, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు ఈ సమావేశానికి హాజరై ఎన్నికల పొత్తుల గురించి చర్చించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని కేసీఆర్ సాగిస్తున్న అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలంటే భావసారూప్యం ఉన్న పార్టీలూ కలసి పనిచేయాల్సిందేనని నేతలు అభిప్రాయపడ్డారు. సబ్బండ వర్ణాల ఆకాంక్షలను ఫణంగా పెట్టి కేసీఆర్ సాగించిన పాలన అన్ని వర్గాల్లో అసంతృప్తిని మిగిల్చిందని, ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా అబద్ధాలతో అరాచక పాలన సాగించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ను గద్దెదింపాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడిగా ముందుకెళ్లాలని, కలసి వచ్చే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో చర్చలు జరిపి కూటమిలో చేర్చుకోవాలని నిర్ణయించారు. పొత్తు ప్రాతిపదికలపై చర్చ... మూడు పార్టీల నేతల సమావేశంలో భాగంగా మహాకూటమిలోకి వచ్చే పార్టీల మధ్య పొత్తు కుదుర్చుకోవాల్సిన ప్రాతిపదికలపై చర్చించారు. ఎక్కడా భేషజాలకు పోకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది ముఖ్యం కాదని, గెలిచే స్థానాల్లో పోటీచే యడంపైనే దృష్టి పెట్టి కసరత్తు చేయాలనే అభిప్రాయానికి వచ్చారు. అన్ని పార్టీలు, ప్రజాసంఘాలతో చర్చలు పూర్తయి విశాల వేదిక ఏర్పాటయిన తర్వాతే సీట్ల పంపకాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. కూటమి ఏర్పాటు చేసిన అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని, ఆ సభ నుంచే ఎన్నికల శంఖారావం పూరించాలని నేతలు అభిప్రాయపడ్డారు. యూపీఏ తరహాలో.. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయి ఫార్ములాతో మహాకూటమి ముందుకెళ్లనుంది. 2004 సార్వత్రిక ఎన్నికల అనంతరం యూపీఏ భాగస్వామ్య పక్షాల తరఫున ‘కనీస ఉమ్మడి ప్రణాళిక’ తయారు చేయగా, ఈసారి ఎన్నికలకు ముందే రాష్ట్రంలోని మహాకూటమి పక్షాన ఈ కనీస ఉమ్మడి ప్రణాళికను ప్రజల ముందుపెట్టాలని నిర్ణయించారు. కూటమిలోని అన్ని పక్షాలు తమ తమ పార్టీల మేనిఫెస్టోలను ప్రజల ముందు పెట్టాలని, వాటిల్లోని ప్రధాన అంశాలతో కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపొందించాలని నిర్ణయించారు. ఈ కనీస ఉమ్మడి ప్రణాళిక ద్వారా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై ప్రజల్లో భరోసా కల్పించాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఉద్యమ సందర్భంలో కేసీఆర్ చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చాక ఎలా ఉల్లంఘించారో ఎత్తిచూపాలని నిర్ణయించారు. టీజేఎస్, సీపీఎంలతోనూ చర్చలు... కూటమిలోకి ఈ మూడు పార్టీలతో పాటు తెలంగాణ జన సమితి, సీపీఎంను కూడా ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మూడు పార్టీలతో కలసి మాట్లాడేందుకు సమయమివ్వాలని కోరుతూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో నేడు టీజేఎస్తో మూడు పార్టీల నేతలు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సీపీఎం కూడా కూటమిలో భాగస్వామి కావాలని అభిప్రాయపడ్డ నేతలు ఆ పార్టీ కేంద్ర కమిటీతో కూడా సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. కేసీఆర్ను గద్దె దింపడమే లక్ష్యం: ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి ‘రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గపు పాలన చేస్తున్నారు. కేసీఆర్ను గద్దె దింపడం కోసం అన్ని ప్రతిపక్షాలను కలుపుకుని ఎన్నికలకు వెళ్తాం. ఇది మొదటి సమావేశం మాత్రమే. భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ, నిరుద్యోగ, మహిళ సంఘాలతో కలసి చర్చిస్తాం. వారిని కూడా కలుపుకుని ఎన్నికలకు వెళ్తాం.’ ప్రజల కోసమే ప్రతిపక్షలన్నీ కలుస్తున్నాయి: ఎల్.రమణ ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ ఆదరబాదరగా రద్దు చేశారు. దేశంలో ఆదర్శంగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో చర్చలు జరపకుండా నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, లెఫ్ట్ పార్టీలు కలసి మహా కూటమిగా ముందుకెళతాం. రాష్ట్ర ప్రజల కోసమే ప్రతిపక్షాలన్నీ కలుస్తున్నాం.’ అందరం కలిసే ముందుకు..: చాడ వెంకటరెడ్డి ‘కేసీఆర్ ప్రజాస్వామ్య విలువలను మట్టిలో కలిపారు. పార్టీ పిరాయింపులను ప్రోత్సహించి విలువలను తుంగలో తొక్కారు. ప్రతిపక్ష పార్టీలందరం కలసి ఎన్నికలకు వెళ్తాం. కేసీఆర్ని గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తాం.’ -
గెర్దావ్ ఫ్యాక్టరీ ఘటనకు జేసీ నైతిక బాధ్యత వహించాలి
-
అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం : జిల్లాలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. తాడిపత్రి గెర్దావ్ ఫ్యాక్టరీ ఘటనకు జేసీ నైతిక బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు రూ. 25లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితులు చేయిదాటిపోయే అవకాశం ఉండటంతో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో వామపక్షాలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. -
చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి
-
పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి
సాక్షి, విజయవాడ : భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ వామపక్ష పార్టీలు శనివారం ఆంధ్రప్రదేశ్ అంతటా ఆందోళనలు నిర్వహించాయి. విజయవాడలో సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధు ఈ ఆందోళనలకు నేతృత్వం వహించారు. నగరంలోని పాతబస్టాండ్లో వామపక్ష శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి.. సామాన్యులకు ఉపశమనం కల్పించాలని ఈ సందర్భంగా వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని నేతలు మధు, రామకృష్ణలతోపాటు పార్టీ శ్రేణులు బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆందోళన.. గుంటూరు : పెట్రోలు ధరలు తగ్గించాలంటూ కమ్యూనిస్టులు గుంటూరులో ఆందోళన నిర్వహించారు. శంకర్ విలాస్ సెంటర్లో సీపీఐ, సీపీఎం కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. అనంతపురం : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద వామపక్షాల నేతలు రాస్తారోకో నిర్వహించారు. నెల్లూరు : పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రకాశం జిల్ లా: మార్కాపురం కోర్టు సెంటర్ వద్ద వామపక్షాలు, ఇతర పార్టీల రాస్తారోకో, ఒంగోలు పట్టణంలో వామపక్షాల ఆందోళన కర్నూలు : పట్టణంలోని కలెక్టరేట్ వద్ద వామపక్షాలు ఆందోళన. పశ్చిమ గోదావరి : వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో తణుకు నరేంద్ర సెంటర్ వద్ద రాస్తారాకో.. పాల్గొన్న వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు. విజయనగరం : పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలంటూ పట్టణంలోని మయూరి జంక్షన్లో వామపక్షాల రాస్తారోకో