వడదెబ్బతో వ్యక్తి మృతి | Man dies due ti Sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వ్యక్తి మృతి

Published Thu, May 21 2015 3:00 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

మండుతున్న ఎండలకు ప్రజల ప్రాణాలు బలవుతున్నాయి.

రంగారెడ్డి : మండుతున్న ఎండలకు ప్రజల ప్రాణాలు బలవుతున్నాయి. తాజాగా వడదెబ్బతో వ్యక్తి మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చీర్యాల గ్రామానికి చెందిన ఆంజనేయులు(49)  కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఎండలో పనిచేయాల్సిరావడంతో గురువారం మధ్యాహ్నం వడదెబ్బ బారిన పడ్డాడు. గమనించినవారు వెంటనే ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement