
ప్రజలను విడదీసే రాజకీయాలను ఆపి ...
ప్రజలను విడదీసే రాజకీయాలకు స్వస్తి పలికి... కొత్త రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు హితవు పలికారు.
నల్గొండ: ప్రజలను విడదీసే రాజకీయలకు స్వస్తి పలికి... కొత్త రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు హితవు పలికారు. మంగళవారం నల్గొండలో చేపట్టిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మురళీధరరావు ప్రసంగిస్తూ... తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కలసి పని చేయాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలో ఏర్పడిన అభద్రత భావాన్ని తొలగిస్తేనే పెట్టుబడులు వస్తాయని చెప్పారు. నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో పని చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.