సతీశ్‌రెడ్డికి నేషనల్‌ డిజైన్‌ అవార్డు | National Design Award for Satish Reddy | Sakshi
Sakshi News home page

సతీశ్‌రెడ్డికి నేషనల్‌ డిజైన్‌ అవార్డు

Published Wed, Dec 20 2017 2:55 AM | Last Updated on Wed, Dec 20 2017 2:55 AM

National Design Award for Satish Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, క్షిపణి, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి జాతీయ డిజైన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. దేశ రక్షణకు కీలకమైన క్షిపణుల అభివృద్ధి, డిజైనింగ్‌ రంగాల్లో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ ఆధ్వరంలో పనిచేసే నేషనల్‌ డిజైన్‌ రీసెర్చ్‌ ఫోరం ఈ అవార్డును ఏర్పాటు చేసింది. సతీశ్‌రెడ్డి హైదరాబాద్‌లోని రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ప్రస్తుతం ఏపీజే అబ్దుల్‌ కలాం మిస్సైల్‌ కాంప్లెక్స్‌) డైరెక్టర్‌గా పనిచేశారు.

చెన్నైలో గురువారం జరిగే కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు అందజేయనున్నట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంజనీరింగ్‌ విభాగాల్లో సామాజిక ప్రయోజనాలు ఉన్న పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు ఈ అవార్డు అందజేస్తున్నారు. భారతీయ క్షిపణులకు మనదైన డిజైన్లు సిద్ధం చేయడంతోపాటు వేర్వేరు క్షిపణి వ్యవస్థలకు అవసరమైన నావిగేషన్‌ పరికరాల అభివృద్ధిలోనూ సతీశ్‌రెడ్డి కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement