బస్సు ఢీకొని వృద్ధునికి గాయాలు | Older man injured in Road accident | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని వృద్ధునికి గాయాలు

Published Mon, Sep 7 2015 2:47 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Older man injured in Road accident

అర్వపల్లి (నల్గొండ జిల్లా) : సూర్యాపేట - జనగాం ప్రధాన రహదారిపై మండల పరిధిలోని తిమ్మాపురం బస్‌ స్టేజ్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధునికి గాయాలైన ఘటన సోమవారం జరిగింది. అర్వపల్లి ఎస్‌హెచ్‌ఓ డి.వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం... తిమ్మాపురం గ్రామానికి చెందిన కోడెబోయిన వెంకటయ్య అనే వృద్ధుడు సోమవారం పశువులు తోలుకొని వ్యవసాయ పొలం వద్దకు వెళ్తూ రోడ్డు దాటుతుండగా సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తాటిపాములకు వెళ్లి వస్తూ ఢీకొట్టింది. దీంతో బాధితుడిని నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement