‘నిజాంను పొగిడితే జనం కొడతారు’ | people may beat those who pray nizam, says bjp leader muralidhar rao | Sakshi
Sakshi News home page

‘నిజాంను పొగిడితే జనం కొడతారు’

Published Wed, Sep 2 2015 6:30 PM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

‘నిజాంను పొగిడితే జనం కొడతారు’ - Sakshi

‘నిజాంను పొగిడితే జనం కొడతారు’

పరకాల: 'నిజాం ఆదర్శ పాలనపై చర్చించేందుకు మేం రెడీ.. నిజాం గుణగణాలపై పరకాల చౌరస్తాలో మాట్లాడుకుందాం.. చరిత్రను వక్రీకరించి నిజాంను పొడిగితే జనం కొడతారు..' అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు అన్నారు.

వరంగల్ జిల్లా పరకాలలో బుధవారం అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని అమరవీరులకు నివాళులు అర్పించారు. నిజాం లాగే మళ్లీ జమీందారీ వ్యవస్థకు ప్రాణం పోసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశం కోసమే పుట్టిన పార్టీగా చెప్పుకున్న కాంగ్రెస్, తెలంగాణ ఉద్యమం కోసం స్థాపించిన టీఆర్‌ఎస్ పార్టీకి తేడా ఏమాత్రం లేదన్నారు. రెండు పార్టీలు ఇప్పుడు కుటుంబ పార్టీలుగా, జేబు పార్టీలుగా మారిపోయాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement