Nizam
-
Pushpa 2: పుష్ప-2 ప్రభంజనం.. నైజాంలో తొలిరోజే ఆల్ టైమ్ రికార్డ్!
అల్లు అర్జున్ పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను ఊపేస్తోంది. ఈనెల 5న రిలీజైన ఈ సినిమాకు మొదటి రోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ను తెగ మెప్పిస్తోంది. పుష్పరాజ్.. తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా సరే థియేటర్స్ దగ్గర హౌస్ఫుల్ బోర్డులే దర్శనిస్తున్నాయి.మొదటి రోజే కలెక్షన్స్లో పుష్పరాజ్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ వసూళ్లతో తిరుగులేని రికార్డ్ను సాధించింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్ను బద్దలు కొట్టింది. ఇప్పటికే కేవలం హిందీలోనే రూ.72 కోట్లకు పైగా కలెక్షన్స్తో బాలీవుడ్లోనే ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది.అయితే తాజాగా పుష్ప-2 మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది. నైజాంలో మొదటి రోజే 30 కోట్ల షేర్ వసూళ్లు సాధించినట్లు పుష్ప టీమ్ వెల్లడించింది. ఈ మేరకు పుష్ప-2 పోస్టర్ను విడుదల చేసింది. నైజాం రీజియన్లో ఒపెనింగ్ డే ఆల్టైమ్ రికార్డ్తో బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.భారతీయ సినీ చరిత్రలో పుష్ప రికార్డ్భారతీయ సినీ చరిత్రలో అతి పెద్ద ఓపెనర్గా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ దెబ్బకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు వరకు ఉన్న టాప్ రికార్డ్స్ అన్నీ చెల్లా చెదురయ్యాయి. ఇప్పటి వరకు ఫస్ట్ డే నాడు అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో ఆర్ఆర్ఆర్ ఉండేది.. ఇప్పుడు ఆ రికార్డ్ను బీట్ చేస్తూ పుష్ప2 రూ. 294 కోట్ల కలెక్షన్లతో ప్రథమ స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఆర్ఆర్ఆర్ ( రూ. 223 కోట్లు), మూడో స్థానంలో 'బాహుబలి2' (రూ.214 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కల్కి 2898AD (రూ. 191 కోట్లు),సలార్ (రూ. 178 కోట్లు), దేవర (రూ. 172 కోట్లు), కేజీఎఫ్2 (రూ. 160 కోట్లు),లియో (రూ. 148 కోట్లు), ఆదిపురుష్ (రూ. 140 కోట్లు), సాహో (రూ. 130 కోట్లు), జవాన్ (రూ. 129.5 కోట్లు) ఉన్నాయి.ALL TIME RECORD in Nizam ❤️🔥WILDFIRE BLOCKBUSTER #Pushpa2TheRule collects a share of 30 CRORES on Day 1 making it the biggest opener in the region 💥💥#RecordRapaRapAA 🔥#Pushpa2BiggestIndianOpener RULING IN CINEMAS Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/Xqt3Mmzw5g— Pushpa (@PushpaMovie) December 6, 2024 -
కలెక్టర్ నిజాంను మించిపోయారు!
సాక్షి, హైదరాబాద్: భూములను కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్ నిజాం నవాబ్ను కూడా మించిపోయారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పేదలకు పంచడం కోసం రామచంద్రారెడ్డి దాదాపు 300 ఎకరాలు ఇచ్చారని, అందినకాడికి నొక్కిన అధికారులు వాటి స్వాహాకు సహకరించారని చెప్పింది. భూదాన్ భూములంటూ అప్పిలేట్ ట్రిబ్యునల్ అథారిటీగా ధ్రువీకరించిన వ్యక్తి.. జిల్లా కలెక్టర్గా వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఆరోపణలున్న అధికారులు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది. పీవీ నరసింహారావు లాంటి ఎందరో మహానుభావులు సీలింగ్ చట్టం వచ్చినప్పుడు వందల ఎకరాలు ఇచ్చేశారంది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నం.182లో 10.29 ఎకరాలకు ఖాదర్ ఉన్నీసాకు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాలు చేస్తూ నవాబ్ ఫారూక్ అలీఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. గతంలో భూదాన్ భూములపై ఆర్డీవో ఆదేశాలివ్వగా స్పెషల్ ట్రిబ్యునల్ సమరి్థంచిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా ఖాదర్ ఉన్నీసా ఇచ్చిన దరఖాస్తును కలెక్టర్ ఆమోదించి పాస్బుక్ కూడా జారీ చేశారని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందరో మహానుభావులు ఇచ్చిన వందల ఎకరాలను అమ్ముకుని తినేశారని, భూదాన్ భూముల రక్షణలో గత బోర్డుతోపాటు అధికారులూ విఫలమయ్యారని చెప్పారు. భూదాన్ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థానంలో పెండింగ్లో ఉండగా పట్టా పాస్బుక్ జారీ చేశారన్నారు. వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేశారో కౌంటరు దాఖలు చేయాలని భూదాన్ యజ్ఞబోర్డు, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, నాటి కలెక్టర్ అమోయ్కుమార్కు నోటీసులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ భూములపై యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
నైజాం నుండే రికార్డ్స్ వేట మొదలుపెట్టనున్న దేవర..
-
చారిత్రక ఆనవాలుగా చార్మినార్ గడియారం
చార్మినార్: నిజాం కాలంలో నిర్మించిన చార్మినార్ కట్టడానికి నలువైపుల ఏర్పాటు చేసిన గడియారాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ నాలుగు గడియారాల్లో ఒకటి రిపేర్కి వచి్చంది. వాచ్లోని 4–5 అంకెల నడుమ సిరామిక్ మెటల్ పగిలిపోవడంతో 12 గంటల పాటు సమయం నిలిచిపోయింది. వెంటనే బాగు చేయించి అందుబాటులోకి తెచ్చారు. ఇక ఈ గడియారాల పనితీరును ఒకసారి పరిశీలిస్తే... నిజాం కాలంలో... నిజాం కాలంలో అంటే.. 1889లోనే చార్మినార్ కట్టడానికి నలువైపులా ఈ గడియారాన్ని నిర్మించారు. అప్పట్లో స్థానిక ప్రజలకు సమయం తెలియడం కోసం నిర్మించిన ఈ గడియారంలోని సెరామిక్ మెటల్ ఇటీవల పగిలిపోవడంతో దాదాపు 12 గంటల పాటు సమయం నిలిచిపో యింది. నాలుగింట్లో జీహెచ్యంసీ సర్దార్ మహాల్ భవనం (తూర్పు) వైపు ఉన్న ఈ గడియారం మొరాయించింది.1942 నుంచి వాహెద్ వాచ్ కంపెనీ పర్యవేక్షణలో... 1942 నుంచి లాడ్బజార్లోని వాహెద్ వాచ్ కంపెనీ యాజమాన్యం చార్మినార్ గడియారం పని తీరును పర్యవేక్షిస్తుంది. అప్పట్లో మోతీగల్లిలో ఉండే సికిందర్ ఖాన్ ఈ గడియారాలకు మరమ్మతులు, పర్యవేక్షణ బాధ్యతలను చూసే వారు. ఆయన మరణానంతరం 1962 నుంచి లాడ్బాజర్లోని గులాం మహ్మద్ రబ్బానీ మరమ్మతు పనులను చూస్తున్నారు.పావురాలు తిష్ట వేయడంతో..విషయం తెలిసిన వెంటనే చార్మినార్ కట్టడం కన్జర్వేషన్ క్యూరేటర్ రాజేశ్వరి సంబంధిత వాహెద్ వాచ్ కంపెనీ టెక్నీషియన్స్తో మరమ్మతులు చేయించడంతో సమయం తిరిగి అందుబాటులోకి వచ్చింది. గడియారాన్ని మూసి వేయడానికి అవకాశాలు లేకపోవడంతో అలాగే వదిలేశారు. దీంతో అప్పుడప్పుడు సమయం చూపించే ముల్లులపై పావురాలు కూర్చుంటుండడంతో వాటి బరువుకు సమస్యలు తలెత్తుతున్నాయని క్యూరేటర్ రాజేశ్వరి స్పష్టం చేశారు. నాలుగింట్లో చార్కమాన్ వైపు గంటల శబ్దం వినిపించే గడియారం.. ఐదు అడుగుల వ్యాసార్ధంతో గుండ్రంగా ఐరన్ మెటల్తో ఏర్పాటు చేశారు. లోపల సిరామిక్ మెటల్తో రూపొందించారు. గడియారంలోని అంకెలను చెక్కతో ఏర్పాటు చేశారు. ఇక గంటల ముల్లులను ఐరన్ మెటల్తో తయారు చేయించి అమర్చారు. గంట ముల్లు దాదాపు మూడు అడుగుల పొడవు, నిముషాల ముల్లు నాలుగ అడుగుల పొడవు ఉన్నట్లు వాహెద్ వాచ్ కంపెనీ యజమాని గులాం మహ్మద్ రబ్బానీ తెలిపారు. మక్కా మసీదు, లాడ్బజార్, చార్కమాన్, సర్దార్ మహాల్ వైపు నాలుగు గడియారాలను ఏర్పాటు చేయగా.. ఇందులో కేవలం చార్కమాన్ వైపు గడియారం ప్రతి గంటకూ శబ్దం చేస్తుంది. అయితే నాలుగు గడియారాల్లో ఈ ఒక్కదానికే సౌండ్ సిస్టం ఉందంటున్నారు.48 గంటలకోసారి... నలువైపుల ఉన్న గడియారాలకు ప్రతి 48 గంటలకొకసారి కీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ‘కీ’వాహెద్ వాచ్ కంపెనీ వద్ద ఉంటుంది. దాదాపు అర గంటలో ఈ ‘కీ’ ఇవ్వడం పూర్తి చేస్తారు సిబ్బంది. చేతితో ఇచ్చే ఈ ‘కీ’ని సకాలంలో ఇవ్వకపోతే గడియారాలు పనిచేయవు.నిరంతర పర్యవేక్షణలో...ఏళ్ల తరబడి తమ వాచ్ కంపెనీ ఆధ్వర్యంలో చార్మినార్ గడియారాల పని తీరును పర్యవేక్షిస్తున్నాం. వాచ్ మోరాయిస్తుందని తెలిసిన వెంటనే మరమ్మతు చేస్తాం. 1995లో సాలార్జంగ్ మ్యూజియం గడియారం పనిచేయకపోతే.. మేమే మరమ్మతు చేశాం. – గులాం మహ్మద్ రబ్బానీ–వాహెద్ వాచ్ కంపెనీ యజమాని -
నిరుపేదల నెత్తురులో ఎన్ని విప్లవాలో!
నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఆయన్ని ప్రశ్నించటం అంటే ప్రాణాలకు తెగించడమే. దాశరథి కృష్ణమాచార్యులు చేసింది అదే! నిజాం పాలనలో తెలంగాణ ప్రజల ఆర్తనాదాలనూ, ఆకలి కేకలనూ చూసి చలించి ఉక్కు పిడికిలి బిగించి జంగు సైరన్ ఊదారు దాశరథి. నిజాం రాజు తనను నిజామాబాద్ జైలులో బంధిస్తే జైలు గోడలపై బొగ్గుతో నిజాంకు వ్యతిరేకంగా ‘ఓ నిజాం పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని’ అంటూ కవితలు లిఖించారు. దాశరథి శతజయంతి సంవత్సర ప్రారంభ సందర్భంగా ఆయన రచించిన ‘అగ్నిధార’ కవితా ఖండికలోని కొన్ని సాహిత్య విషయాలూ, చారిత్రక వాస్తవాలూ పరిశీలించడం నేటి తరానికి స్ఫూర్తినిస్తుంది.‘ఇది నిదాఘము; ఇందు సహింపరాని/ వేడి యేడ్పించుచున్నది; పాడువడిన / గోడలందున జైలులో పాడినాడ/ వాడిపోనున్న పూమొగ్గపైన పాట;/ ఆయాసపడు జైలులో యెన్ని ప్రజల రా/జ్యము లున్నవో! యని యరసినాను;/ నిరుపేదవాని నెత్తురు చుక్కలో నెన్ని/ విప్లవాలో! యని వెదకినాను’ అని ఇందూరు జైలులో (నిజామాబాద్) బందీ అయినది శరీరమే కానీ మనస్సు కాదంటూ నిప్పులు చెరిగే కవిత్వాన్ని రాశారు. బొగ్గుతో గోడలపై వ్రాసి నన్ను బంధిస్తే తన గళం ఇంకా పదునెక్కుతుందని గొంతు చించుకొని అరిచారు. జైలులోని పరిస్థితులను వివరిస్తూ– సహింపరాని వేడి ఏడ్పిస్తు ఉండగా, మొత్తుకున్నాను, ఏడ్చాను నా స్వేచ్ఛకు ఆంక్షలు విధించిన ఓ నిజాం పిశాచమా నన్నే నువ్వు ‘‘బందీని’’ చేస్తే సామాన్యులు పరిస్థితి ఏమిటి? నిరుపేద వాని నెత్తురు చుక్కలో ఎన్ని విప్లవాలో అని వెదికాను అంటూనే... ‘వెన్నెలలు లేవు, పున్నమ కన్నే లేదు, పైడి వెన్నెల నెలవంక జాడలేదు, చుక్కలే లేవు, ఆకాశ శోకవీధి, ధూమదామమ్ము దుఃఖ సంగ్రామ భూమి’ అంటూ తెలంగాణ ప్రాంతం మొత్తం చీకట్లో ఉన్నట్లుగా, యుద్ధ భూమిని తలపిస్తున్నట్లుగా వుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓసి కూలిదానా! అరుణోదయాన/ మట్టి తట్ట నెట్టిన బెట్టి మరుగులేని/యెత్తు రొమ్మును పొంగించి యెందుకొరకు/ ఉస్సురనెదవు? ఆకాశ ముడికిపోవ?’ అంటూ రాసిన కవితా పాదాలు చార్మినారు పరిసరాలలో రాతికట్టడాల నిర్మాణ సమయంలో ఓ మహిళా కూలీని చూసి చలించి వ్రాసిన ‘ఉస్సురనెదవు’ కవితలోనివి. ‘అనాదిగా సాగుతోంది/ అనంత సంగ్రామం/ అనాథుడికి, ఆగర్భ/ శ్రీనాథుడికీ మధ్య/ సేద్యం చేసే రైతుకు/ భూమి లేదు, పుట్రలేదు/ రైతుల రక్తం త్రాగే/ జమీందార్ల కేస్టేట్లు’ అంటారు ‘అనంత సంగ్రామం’ కవితలో! యుద్ధం ఇంకా మిగిలేవుంది అన్నట్లుగా ఆదిమ కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు అనేక సంఘర్షణలకు పరిష్కారం లభించట్లేదు, పెద్దచేప చిన్నచేపను మింగుతున్నట్లుగా, ఉన్నవాడు లేనివాడిని దోచుకుంటే, కర్షకుడికి భూమి లేకుండా, విలాసంగా గడిపేవారికి వందల ఎకరాలు (ఎస్టేట్లు) వుంటే తప్పకుండా ‘సంగ్రామం’ జరుగుతుంది మరి! ‘ఇదే మాట ఇదే మాట/ పదే పదే అనేస్తాను/ కదం తొక్కి పదం పాడి/ ఇదే మాట అనేస్తాను/ దగాకోరు బటాచోరు/ రజాకారు పోషకుడవు/ వూళ్ళ కూళ్ళు అగ్గిపెట్టి/ ఇళ్ళన్నీ కొల్లగొట్టి/ తల్లి పిల్ల కడుపుకొట్టి/ నిక్కిన దుర్మార్గమంత/ దిగిపోవోయ్ తెగిపోవోయ్ / తెగిపోవోయ్ దిగిపోవోయ్/ ఇదే మాట ఇదే మాట/ పదే పదే అనేస్తాను’ అంటారు ‘అగ్నిధార’ కావ్యంలోని చివరి కవితలో. ఈ కవిత శ్రీశ్రీ ‘జగన్నాథుని రథ చక్రాలు’ కవితను గుర్తుకు తెస్తుంది. ‘ఇక చాలు నీ అసమర్థపాలన’ అంటూ కడిగిపారేశారు, ఈ కవితలో. కవి ఎప్పుడూ పాలకపక్షం కాకుండా ప్రజలపక్షం నిలబడాలి. అన్నార్థుల వైపు, అనాధల వైపు, ఆకలి కేకల వైపు నిలబడాలి. అచ్చంగా అదే చేశారు దాశరథి.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఊరు ఊరునా వాడవాడలా ‘అగ్నిధార’ కావ్యంలోని వాక్యాలు తెలంగాణ సమాజంలోని ప్రతి గొంతుకను పిడికిలెత్తి అరిచేలా చేశాయి. స్వరాష్ట్రం సిద్ధించాక దాశరథి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా లబ్ధప్రతిష్ఠులకు అవార్డులు ఇచ్చి సన్మానించి దాశరథి కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తోంది అధికారికంగా!– డా‘‘ మహ్మద్ హసన్తెలుగు సహాయాచార్యులు, నల్గొండ99080 59234(రేపు దాశరథి శతజయంతి ప్రారంభం) -
'కల్కి' రేంజ్ ఇది.. నైజాంలో వసూళ్ల రికార్డ్ బ్రేక్
ప్రభాస్ 'కల్కి' రిలీజై అప్పుడే ఓ రోజు అయిపోయింది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి అంచనాలతో బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మిగతా చోట్ల ఏమో గానీ నైజాంలో మాత్రం సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సాధించిన ఓ రికార్డుని దాటేయడం విశేషం.(ఇదీ చదవండి: 'బాహుబలి'కి కట్టప్ప.. 'కల్కి'లో మాత్రం ఏకంగా రెండు)'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలు టాక్తో సంబంధం లేకుండా రచ్చ లేపుతున్నాయి. మరీ ముఖ్యంగా తొలిరోజు వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మిగతా వాటి సంగతి కాస్త పక్కనబెడితే తాజాగా థియేటర్లలోకి వచ్చిన 'కల్కి' కేవలం నైజాం ఏరియాలోనే మొదటి రోజు రూ.24 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ (రూ.23.55 కోట్లు) పేరిట ఉన్న ఘనత వెనక్కి వెళ్లిపోయింది.కేవలం ఒక్క నైజాం ఏరియాలోనే 'కల్కి' ఈ రేంజు వసూళ్లు సొంతం చేసుకుందంటే ఓవరాల్ Day-1 కలెక్షన్స్లో ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొట్టేసి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. అయితే నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా తొలిరోజు వసూళ్లు గురించి పోస్టర్ రిలీజ్ చేయాల్సి ఉంది.(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)(ఇదీ చదవండి: 'కల్కి' మూవీలో కృష్ణుడిగా చేసిన నటుడెవరో తెలుసా?)(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ) -
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. సలార్ టికెట్స్ బుకింగ్ ఎప్పుడంటే?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సలార్.. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే విడుదలైన సలార్ టీజర్, ట్రైలర్లోనూ ప్రభాస్ ఎలివేషన్స్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో సలార్ మూవీ టికెట్ల అమ్మకాలు ఇప్పటికే ఆన్లైన్లో స్టార్ట్ కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మొదలు కాలేదు. తాజాగా సలార్ టికెట్ల బుకింగ్కు సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు రాత్రి 8.24 నిమిషాలకు సలార్ నైజాం టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుది. కాగా.. సలార్ చిత్రానికి సంబంధించి తెలంగాణ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. Khansaar ee kaadhu, anni theatres housefulls tho erupekkala ❤️🔥❤️🔥#SalaarNizamBookings opens online today at 8.24 PM 🔥#Salaar Nizam Release by @MythriOfficial 💥#SalaarCeaseFire#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai… pic.twitter.com/FqUidhS126 — Mythri Movie Makers (@MythriOfficial) December 19, 2023 -
నిమ్స్ను సందర్శించిన నిజాం మనవడు
సాక్షి, సిటీబ్యూరో: నిజాం మనవడు నవాబ్ నజీఫ్ అలీ ఖాన్ శుక్రవారం నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. పిల్లల గుండె శస్త్ర చికిత్సల శిబిరాన్ని విజయవంతం చేసినందుకు నిమ్స్ డైరెక్టర్ బీరప్పను అభినందించారు. యూకే నుంచి వచ్చిన కార్డియోథెరపిక్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. పేద రోగులు, సమాజానికి ప్రయో జనం చేకూరేలా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగం ఇంచార్జ్, ఆర్ఎంఓ డాక్టర్ సల్మాన్ పాల్గొన్నారు. -
విమోచన కాదు విద్రోహం!
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కొన్ని రాజకీయ పక్షాలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా చిత్రించుకుంటున్నాయి. కానీ అసలు చరిత్రలో జరిగింది వేరు. నైజాం నవాబు ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎట్టి హక్కులు లేకుండా, వెట్టి చాకిరీ చేస్తూ, దారుణ దోపిడీకి గురౌ తున్న సమయంలో ‘ఆంధ్ర మహాసభ’ ఏర్పడింది. క్రమంగా ‘ఆంధ్ర మహాసభ’ కమ్యూనిస్టుల నాయ కత్వంలోకి వచ్చింది. వెట్టి చాకిరీ రద్దు, కౌలు తగ్గింపు, ‘దున్నే వానికే భూమిపై హక్కు’ వంటి డిమాండ్లను ముందుకు తెచ్చి నిజాం పాలనపై ఉద్యమించింది. సంఘంలోకి ప్రజలు పెద్ద ఎత్తున చేరారు. భూమి కోసం పోరు ప్రారంభమైంది. ‘ఆంధ్ర మహాసభ’ ప్రతి గ్రామానికీ విస్తరించింది. తన భూమి, పంటల రక్షణ కోసం చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగువ భూపోరాట ప్రాధాన్యాన్ని ముందుకు తెచ్చింది. జనగామ తాలూకా కలవెండి గ్రామంలో దేశ్ ముఖ్ విసునూరి రామచంద్రారెడ్డి గూండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమురయ్య అమరత్వంతో పోరాటం కొత్త మలుపు తీసుకున్నది. దేశ్ముఖ్ల, జమీందార్ల దాడులను సాయుధంగా ప్రతిఘటన చేయాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. రైతాంగ ఉద్యమంపై నిజాం నవాబ్ ప్రభుత్వం తీవ్ర నిర్భందం ప్రయోగించింది. నిజాం రజాకార్లు ప్రజలపై పాశవిక దాడులు చేశారు. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ఈ దాడులను తిప్పికొట్టేందుకు గెరిల్లా దళాలు ఏర్పడ్డాయి. పోరాటం ద్వారా పది లక్షల ఎకరాల భూములు ప్రజలు స్వాధీనపర్చుకుని సాగు చేశారు. వేలాది గ్రామల్లో గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాశక్తికి భయపడి జమీందార్లు, దేశ్ముఖ్లు, జాగీర్దార్లు పట్టణాలకు పారి పోయారు. నిజాం నిరంకుశ ప్రభుత్వం నిర్బంధం పెంచి ప్రజలను తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. ప్రజలను ఒకేచోట మందవేసి పాశవికంగా హింసించారు. అయినా పోరాటం ఆగలేదు. పోరా టాన్ని అడ్డుకునే శక్తి నిజాం ప్రభుత్వం కోల్పోయింది. రైతాంగ సాయుధ పోరాటం నెహ్రూ ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టించింది. ఉద్యమం కొనసాగితే కమ్యూనిస్టుల ప్రాబ ల్యం పెరిగి ఇతర ప్రాంతాల్లో కూడా ఉద్యమాలు ప్రారంభమౌతా యని నెహ్రూ ప్రభుత్వం భయపడింది. అందుకే 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానానికి సైన్యాలను పంపింది. నిజాం సైన్యాలు బూటకపు ప్రతిఘటన నాటకమాడాయి. రెండు రోజు ల్లోనే నైజాం రాజు లొంగిపోయినట్లు ప్రకటించి, నెహ్రూ సైన్యా లకు స్వాగతం పలికాడు. దీన్ని గమనిస్తే ముందుగానే సైనిక చర్య గురించి నెహ్రూ ప్రభుత్వానికి, నైజాం నవాబుకూ మధ్య ఒప్పందం జరిగిందనేది వెల్లడవుతుంది. నిజాం నవాబును గద్దె దింప టానికే సైన్యం వస్తే, మరి నవాబును (రాజుని) అరెస్టు చేసి నిర్బంధించాలి కదా! కానీ అలా జరగలేదు. ‘రాజ్య ప్రముఖ్’గా నిజాం రాజుని ప్రకటించి 1950 జనవరి 26 వరకు నైజాం ప్రాంతాన్ని అతని పాలనలోనే ఉంచి, నెహ్రూ ప్రభుత్వం 1950లో సెప్టెంబర్ 17న భారత యూనియన్లో విలీనం చేసింది. ఈ క్రమంలో గ్రామాలకు సైన్యాలను పంపి ప్రజలు సాగు చేసుకుంటున్న భూములను జమీందార్లకు, భూస్వాములకు అప్ప గించింది. దీన్ని గమనిస్తే నైజాం నవాబును, జమీందార్లను, జాగీర్దారులను, భూస్వాములను రక్షించటానికే రైతాంగ సాయుధ పోరాటంపైకి మిలిటరీ దాడి అన్నది స్పష్టమవుతున్నది. అందుకు అనుగుణంగానే పెద్ద ఎత్తున నిజాం రాజ్యంలో సైన్యాన్ని దింపి రైతాంగ పోరాటంపై విరుచుకుపడింది. కాన్సట్రేషన్ క్యాంపులు పెట్టి ప్రజలను తీవ్ర చిత్రహింసలకు గురిచేసింది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించింది. నాయకులను, కార్యకర్తలను పట్టుకుని కాల్చి చంపింది. నెహ్రూ ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా రైతాంగ సాయుధ పోరాటం కొన సాగింది. పార్టీలో చోటు చేసుకున్న మితవాద, అతివాద ధోరణులు 1951 అక్టోబర్ 31న మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం విరమణకు కారణమయ్యాయి. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించింది కమ్యూనిస్టు పార్టీ. అందుకు అనేక త్యాగాలు చేసింది కమ్యూనిస్టు పార్టీనే! అందువలన ఆ పోరాట వారసులు కమ్యూ నిస్టులే. ఇతరులు దాన్ని ఉచ్చరించటానికి కూడా హక్కు లేదు. అలాగే సెప్టెంబర్ 17న జరిగినది విమోచన కాదు, ప్రజలకు విద్రోహమని ప్రజలు గొంతు విప్పాలి. తెలంగాణ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని నినదించాలి. బొల్లిముంత సాంబశివరావు వ్యాసకర్త ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526 -
‘హైదరాబాద్ హౌస్’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు?
జీ-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఢిల్లీలోని ‘హైదరాబాద్ హౌస్’లో ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ కలుసుకున్నారు. 95 ఏళ్ల చరిత్ర కలిగిన ‘హైదరాబాద్ హౌస్’లో ప్రధాని మోదీని యువరాజు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ను ఎవరు నిర్మించారో తెలుసా? సంస్థానాధీశులు ఢిల్లీకి పరుగులు స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో సుమారు 560 సంస్థానాలు ఉండేవి. ప్రతి సంస్థానానికి వాటి రాజులు, రాచరిక రాష్ట్రాలు, నవాబులు, నిజాంలు ఉండేవారు. నాటి రోజుల్లో స్థానికుల సమస్యలను వినేందుకు, వారితో సమన్వయం కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1920లో 'ది ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్'ను ప్రారంభించింది. ఈ ఛాంబర్ సమావేశాలు ఢిల్లీలో జరుగుతుండేవి. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా సంస్థానాధీశులు ఢిల్లీకి పరుగులు తీయాల్సి వచ్చేది. అయితే వారికి తగినట్లు అక్కడ సరైన ఏర్పాట్లు ఉండేవి కాదు. ఎకరా భూమి రూ.5000 చొప్పున కొనుగోలు ఆ సమయంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానానికి నిజాంగా ఉండేవాడు. ఆయన ఢిల్లీలో తన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో భూమి కోసం అన్వేషణ ప్రారంభించారు. వైస్రాయ్ హౌస్ (ప్రస్తుతం రాష్ట్రపతి భవన్) సమీపంలోని 8.2 ఎకరాల స్థలాన్ని నిజాం కొనుగోలు చేశారు. అయితే ఆ భూమి కొద్దిగా తక్కువగా ఉందని భావించి, దానికి ఆనుకునివున్న ఓ భవనాన్ని కూడా కొనుగోలు చేశారు. అప్పట్లో నిజాం ఈ భూమిని ఎకరా రూ.5000 చొప్పున కొనుగోలు చేశారు. ‘వైస్రాయ్ హౌస్’ను పోలివుండేలా.. భూమిని కొనుగోలు చేసిన తర్వాత భవన నిర్మాణ మ్యాప్ తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీని బాధ్యతను నిజాం.. నాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్కు అప్పగించారు. లుటియన్స్ ‘హైదరాబాద్ హౌస్’ కోసం ‘సీతాకోకచిలుక’ ఆకారంలో డిజైన్ను సిద్ధం చేశారు, ఇది దాదాపు ‘వైస్రాయ్ హౌస్’ను పోలి ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలోనే అత్యంత ధనవంతుడైన నిజాం ‘హైదరాబాద్ హౌస్’కు తొలుత రూ.26 లక్షలు ఖర్చు చేయాలని అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.50 లక్షలకు పెంచారు. ఆ రోజుల్లో బర్మా (ప్రస్తుతం మయన్మార్)కు చెందిన టేకు చెక్క నాణ్యమైనదిగా గుర్తింపు పొందింది. నిజాం ఈ భవన నిర్మాణానికి అవసరమైన కలపను అక్కడి నుంచి ఆర్డర్ చేశాడు. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్లు,ఇతర వస్తువులు న్యూయార్క్ నుండి ఆర్డర్ చేశారు. ఇంటీరియర్ డెకరేషన్కు విదేశాల నుంచి ఆర్డర్లు ఆ రోజుల్లో, లండన్లోని హాంప్టన్ అండ్ సన్స్ లిమిటెడ్, వారింగ్ అండ్ గిల్లో లిమిటెడ్ ఇంటీరియర్ డిజైనింగ్లో ప్రసిద్ధి చెందిన సంస్థలు. నిజాం ఈ రెండు కంపెనీలకు ‘హైదరాబాద్ హౌస్’ను అలంకరించే బాధ్యతను అప్పగించారు. అలంకారానికి లోటు రాకుండా ఉండేందుకు 1921లో ప్రపంచంలోని ప్రముఖ చిత్రకారులందరి నుంచి దాదాపు 17 పెయింటింగ్స్కు ఆర్డర్ ఇచ్చారు. అప్పట్లో ఈ పెయింటిగ్స్ ధర రూ.10,000 నుండి 20,000 వరకు ఉండేది. లాహోర్కు చెందిన ప్రముఖ చిత్రకారుడు అబ్దుల్ రెహ్మాన్ చుగ్తాయ్ తీర్చిదిద్దిన 30 పెయింటింగ్లను కూడా ఆర్డర్ చేశారు. వాటి విలువ రూ. 12,000. 'హైదరాబాద్ హౌస్' కోసం కార్పెట్లను ఇరాక్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ నుండి తెప్పించారు. నిజాం హోదాకు తగినవిధంగా ఉండేలా ఒకేసారి 500 మంది అతిథులకు భోజన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా వెండి ప్లేట్లు, కత్తులు, ఇతర వస్తువులను ఆర్డర్ చేశారు. భవనాన్ని చూసిన నిజాం ఏమన్నారు? 1928 నాటికి ‘హైదరాబాద్ హౌస్’ పూర్తయింది. యూరోపియన్, మొఘల్ శైలిలో నిర్మితమైన ఈ భవనంలో మొత్తం 36 గదులు ఉన్నాయి. అందులో నాలుగు గదులు ‘జనానా’ అంటే మహిళలకు సంబంధించినవి. దాదాపు 10 ఏళ్లకు పూర్తయిన ఈ ‘హైదరాబాద్ హౌస్’లోకి అడుగుపెట్టినప్పుడు నిజాం ఎంతో బాధపడ్డారుట. నిజాంకు ఈ ‘హైదరాబాద్ హౌస్’ అస్సలు నచ్చక దానిని ‘గుర్రపుశాల’తో పోల్చారు. రూ. 50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ‘హైదరాబాద్ హౌస్’ అనేది కొన్ని చౌక భవనాల కాపీ మాత్రమే అని నిజాం పేర్కొన్నారట. ‘హైదరాబాద్ హౌస్’ ఇప్పుడు ఎవరిది? స్వాతంత్ర్యం సిద్ధించాక సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. 1954లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘హైదరాబాద్ హౌస్’ని లీజుకు తీసుకుంది. ఇందుకు ప్రతిగా 1970ల వరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తూ వచ్చింది. అనంతరం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రం, రాష్ట్ర మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వానికి 7.56 ఎకరాల భూమిని ఇచ్చింది. దీంతో ‘హైదరాబాద్ హౌస్’ కేంద్రానికి సొంతమయ్యింది. ఇప్పుడు విదేశాంగ మంత్రిత్వ శాఖ హైదరాబాద్ హౌస్ను పర్యవేక్షిస్తోంది. -
బ్రో నైజాం రైట్స్ క్లోజ్.. ఫ్యాన్స్కు ఊహించని షాక్ ఇచ్చిన నిర్మాతలు
పవన్ కల్యాణ్ - మెగా హీరో సాయితేజ్ కలిసి నటించిన 'బ్రో' సినిమా రిలీజ్కు సిద్దంగా ఉంది. తాజాగా ఈ సినిమా నైజాం హక్కుల పంచాయతీకి శుభం కార్డు పడింది. నైజాం హక్కులను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ తీసుకుంది. పీపుల్స్ మీడియా కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఇవ్వగా సముద్రఖని దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్ కుమారుడు.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే..?) ఈ చిత్రాన్ని నైజాం ఏరియా కోసం రూ.32 కోట్ల నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ప్రాతిపదికన మైత్రి వారు కొన్నారని తెలుస్తోంది. ఇదే నిజం అయితే.. అదనంగా జీఎస్టీ ఉంటుంది కాబట్టి నైజాంలో బ్రో సినిమా నుంచి మైత్రీ డిస్ట్రిబ్యూటర్ సంస్థకు రూ. 38 కోట్ల వరకు షేర్ రావాల్సి వుంటుంది. ఈమేరకు వస్తేనే సేఫ్ జోన్లో ఉంటారు.. లేదంటే దిల్ రాజు అంచనాలే నిజం అవుతాయి. నైజాంలో ఎంతో పట్టున్న దిల్ రాజు ఇంత భారీ ధరకు 'బ్రో'ని కొనేందుకు ముందుకు రాలేదు. ఆయన సుమారు రూ. 30 కోట్ల వరకు డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేశారని టాక్. నైజాం హక్కులను రూ. 35 కోట్లకు ఇవ్వాలని పీపుల్స్ మీడియా ప్రయత్నించినా ఉపయోగం లేదు. చివరకు రూ.32 కోట్లతో మైత్రి వారు డీల్ క్లోజ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. (ఇదీ చదవండి: దుమ్మురేపిన ‘బేబీ’.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..) ఫ్యాన్స్కు ఊహించని షాక్ ఈ నెల 28న థియేటర్లలోకి బ్రో సినిమా వస్తోంది. బ్రో మూవీ రన్ టైం విషయంలోనూ కొంతమేరకు నిరాశే కానుంది. ఈ సినిమా కేవలం 130 నిమిషాలు రన్ టైం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే నిజం అయితే పవన్ ఫ్యాన్స్కు ఊహించని షాక్ ఎదురైనట్లే. అంటే కేవలం రెండు గంటల పది నిమిషాలతో మాత్రమే బ్రో రానున్నాడు. స్టార్ హీరోల సినిమా అంటేనే రెండున్నర గంటలకు పైగానే నిడివి ఉండేలా ప్లాన్ చేస్తారు డైరెక్టర్లు.. అలాంటిది మల్టీస్టారర్ సినిమాకు ఇలా తక్కువ రన్ టైమ్ ఉంటే మూవీపై ఎఫెక్ట్ చూపుతుందని నెటిజన్స్ తెలుపుతున్నారు. ఏదేమైనా జులై 28న అసలైన బొమ్మ ఎవరికి కనిపిస్తుందో చూడాలి. -
యాదాద్రీశుడికి నిజాం తరపున బంగారు హారం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి వారికి నిజాం కుటుంబం తరపున ప్రిన్సెస్ బేగం సాహిబా ఎస్రా బిర్గెన్ బంగారు హారాన్ని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు ద్వారా అందజేశారు. ఈ హారాన్ని ఆదివారం కిషన్రావు ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. శ్రీస్వామి వారి ప్రధానాలయం ప్రారంభమైన తరువాత తొలిసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.4లక్షల విలువైన 67 గ్రాముల బంగారు హారాన్ని నిజాం కుటుంబం తరపున పంపించారని ఆలయాధికారులు వెల్లడించారు. -
ఎనిమిదో నిజాం రాజు ముఖరంజా బహుదూర్ కన్నుమూత
-
టప్పాఖానాలకు కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: ఇది షాద్నగర్ సమీపంలోని మొగిలిగిద్ద టప్పాఖానా. 1925లో నిజాం ప్రభుత్వం నిర్మించిన భవనం. 97 ఏళ్లుగా అందులోనే తపాలా కార్యాలయం కొనసాగుతోంది. వందేళ్లకు చేరువవుతున్న నేపథ్యంలో దాదాపు రూ.10 లక్షలు వెచ్చించి దీనికి పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని, ప్రస్తుత అవసరాలకు వీలుగా మార్చాలని తపాలాశాఖ నిర్ణయించింది. స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగంగా మరమ్మతులకు శనివారం శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ డా‘‘ పీవీఎస్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొగిలిగిద్ద పాత భవనం ముందు పచ్చికతో లాన్ కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తపాలాశాఖ అధికారులు సంతోశ్కుమార్ నరహరి, వెంకటేశ్వర్లు, గౌస్ పాషా, జుబేర్, హేమంత్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా... మొగిలిగిద్దతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిజాం హయాంలో నిర్మించిన టప్పాఖానాలను అభివృద్ధి చేసేందుకు తపాలాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు అందించిన వినతులు, సూచనలకు సంబంధించిన పనులను పూర్తి చేస్తున్నారు. ప్రజలు నేరుగా గానీ, సామాజిక మాధ్యమాల ద్వారా గానీ ఇచ్చిన వినతుల ఆధారంగా పరిష్కరిస్తున్నారు. కార్యాలయాల్లోని తుక్కు, అవసరం లేని కాగితాలు, ఇతర చెత్తను తొలగించి పరిశుభ్రం చేయటంతోపాటు తదుపరి అవసరాలకు వీలుగా ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. -
చరిత్ర వక్రీకరణ మహానేరం
చరిత్రను వక్రీకరించడం జనసంహారం చేసే ఆయుధాల కన్నా ప్రమాదకరం. అది ప్రజలను తరతరాలుగా తప్పుదోవ పట్టిస్తుంది. చరిత్ర ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, అది భావి తరాలకు మార్గదర్శి. తమ రాజకీయ, ఆర్థిక, సామాజిక అవసరాలకు చరిత్రను ఒక సాధనంగా చూడటమనేది స్వార్థ చింతన. చరిత్రకు మసిపూసి మారేడు కాయ చేయడమనేది ఒక రాజకీయ దృక్పథంగా మారిపోవడం విషాదం. ప్రస్తుతం తెలంగాణ సమాజం అదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. తెలంగాణ విమోచన, విలీనం, విద్రోహం, సమైక్యత అనే వాదాలు, వివాదాలు కొనసాగుతున్నాయి. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది నిష్పాక్షిక దృష్టితో చూడాల్సిన బాధ్యత తెలంగాణ గడ్డపై ప్రతి ఒక్కరికీ ఉంది.తమ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరిస్తోన్న శక్తుల సంఖ్య గణ నీయంగా పెరిగిపోతున్నది. అందుకుగానూ అసత్యాలను, అర్ధ సత్యాలను తమ అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. సమత, మమత, కరుణ, ప్రేమలకు ప్రతీకగా ఉన్న తెలంగాణ సమాజాన్ని విద్వేషపు విషంతో నింపాలని చూస్తున్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. హైదరాబాద్ రాష్ట్రం మూడు భాషాప్రాంతాల కలయిక. హిందూ, ముస్లిం, ఇతర సామాజిక వర్గాల సమ్మేళనంతో కలిసి నడిచిన గంగా–జమునా తెహెజీబ్. హైదరాబాద్ రాజ్యం కేవలం ముస్లింలు పాలించినది కాదు. రాజ్యానికి కేంద్రం నిజాం అయితే, గ్రామీణ ప్రాంతాలు హిందూ సామాజిక వర్గానికి చెందిన జమీం దారులు, జాగీర్దారుల కబంధ హస్తాల్లో ఉండేవి. నిజానికి పరోక్షంగా నిజాంలు సాగించిన దుర్మార్గాల కన్నా, ఎందరో జమీందారులు, జాగీర్దారులు సాగించిన అమానుషాలు ఎన్నో రెట్లు ఎక్కువ. కానీ నిజాం పాలన అనగానే కేవలం నిజాం గుర్తుకు రావడమే సహజంగా జరుగుతోంది. ‘మానుకోట’(ఇప్పటి మహబూబాబాద్) జెన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డి లాంటి జమీందారులు జరిపిన దారుణాలు మనం చరిత్రలో మరెక్కడా చూడం. వీటన్నింటికీ రజాకార్ల దాడులు, దౌర్జన్యాలు తోడయ్యాయి. హిందూ జమీందార్లు, ముస్లిం రజాకార్లు ఒక కూటమిగా ఏర్పడ్డారు. రజాకార్ ఉద్యమం 1938లో ప్రారంభమైంది. కానీ 1947 నుంచి దౌర్జన్యాలకు వేదికగా తయారైంది. రజాకార్ అంటే స్వయం సేవకులు అని అర్థం. రజాకార్లలో కొందరు హిందువులు కూడా ఉండేవారు. ప్రభుత్వానికి అండగా ఉండడానికి రజాకార్లను వినియోగించాలన్న కొందరు ముస్లిం జమీదారుల ఒత్తిడికి తలొగ్గి వారికి ప్రత్యేకమైన అధికారాలను ప్రకటించారు. దీనితో రజాకార్లు కమ్యూనిస్టులపైనా, ఇతర ఉద్యమకారులపైనా దాడులు కొనసాగించారు. 1947 జూలై 30 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు రజాకార్లు విచ్చలవిడి దౌర్జన్యాలు చేసిన మాట నిజం. వాళ్ళను ప్రతిఘటించి ప్రజలకు రక్షణగా నిలి చింది కమ్యూనిస్టులే. జమీందారుల, భూస్వాముల దౌర్జన్యాలకు పరాకాష్ఠగా నిలిచిన దొడ్డి కొమరయ్య హత్యతో అంటే 1946 జూలై 4న కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశం స్వతంత్రమైంది. ఆనాటికి 565 సంస్థానాలు ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించేనాటికి హైదరాబాద్ స్వతంత్ర పాలనా ప్రాంతంగా ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసు కొన్నప్పకీ అన్ని విషయాల్లో స్వేచ్ఛగానే నిర్ణయాలు తీసుకునేది. బ్రిటిష్ ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తన సైన్యాన్ని హైదరాబాద్లో ఉంచింది. అదే మనం ఇప్పుడు చూస్తోన్న హైదరా బాద్లోని కంటోన్మెంట్. 1947లో స్వాతంత్య్రం పొందిన భారతదేశం అన్ని సంస్థానాలను భారత యూనియన్లో కలపాలని అడిగింది. అందరూ ఒప్పుకున్నారు. కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు తాము స్వతంత్రంగా ఉంటామని ప్రకటించుకున్నాయి. అందుకుగానూ భారత ప్రభుత్వం, హైదరాబాద్ రాజ్యం ఒక ఒడంబడికను కుదుర్చు కున్నాయి. దానినే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చేటప్పుడు కొన్ని నిబంధ నలను పెట్టింది. అందులో ఒకటి, ఇప్పటివరకూ బ్రిటిష్ పాలనలో లేని సంస్థానం అటు పాకిస్తాన్లోగానీ, ఇటు భారతదేశంలో గానీ చేర వచ్చు. లేదా స్వతంత్రంగా ఉండవచ్చు. అయితే నిజాం స్వతంత్ర పాకి స్తాన్ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. భారతదేశంతో మాత్రం స్నేహంగా ఉండడానికి అంగీకరించాడు. 1947లో ఉనికిలోకి వచ్చిన రజాకార్ల దాడులను ఆసరాగా తీసుకొని భారత ప్రభుత్వం నిజాం మీద ఆంక్షలను పెంచింది. ఆర్థికంగా దిగ్బంధనం చేసింది. భారత ప్రభుత్వం పెంచుతోన్న ఒత్తిడిని తట్టుకోలేక నిజాం ప్రభుత్వం 1948 ఆగస్టు 9న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం కొన సాగిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలనీ, తాము స్వతంత్రంగా కొనసాగే అవకాశం కల్పించాలనీ నివేదించింది. అది 1948 ఆగస్టు 21న చర్చలకు వచ్చింది. ఆ అభ్యర్థనను స్వీకరించాలా లేదా అనేది చర్చకు వచ్చినప్పుడు అందులో ఉన్న పది దేశాల్లో ఫ్రాన్స్, అమెరికా, కెనడా, కొలంబియా, సిరియా, బెల్జియం, అర్జెంటీనా అభ్యర్థనను స్వీకరించ డానికి తమ మద్దతును తెలియజేశాయి. రష్యా, చైనా, ఉక్రెయిన్ తటస్థంగా ఉన్నాయి. ఇది 1948 సెప్టెంబర్ 16న జరిగింది. అయితే దానిని ఒక రెండు రోజులు వాయిదా వేయాలని భారత ప్రభుత్వ ప్రతినిధులు తెరవెనుక కథ నడిపారు. అప్పటికే భారత సైన్యం హైదరాబాద్లో సైనిక చర్యలను ప్రారంభించింది. దాదాపు హైదరా బాద్ సంస్థానం పూర్తిగా ఆక్రమణకు గురైంది. తెల్లారితే సెప్టెంబర్ 17. ఆరోజు హైదరాబాద్ను హస్తగతం చేసుకున్నారు. సెప్టెంబర్ 17 మధ్యాహ్నంకల్లా నిజాం చేత భారత ప్రతినిధి కె.ఎం.మున్షీ ఒక ప్రకటన చేయించారు. హైదరాబాద్ ప్రభుత్వం తరఫున భద్రతా మండలిలో చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నామనేది అందు లోని ప్రధానాంశం. సెప్టెంబర్ 12న మొదలుపెట్టిన సైనికదాడి మొదటి లక్ష్యం ఐక్యరాజ్య సమితి నుంచి ఫిర్యాదును వెనక్కి తీసుకునేటట్టు చేయడం. సైనిక చర్య జరిగిన సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు సైన్యం చేతిలో గానీ, అక్కడక్కడా జరిగిన ఘర్షణల్లోగానీ 25 వేల నుంచి 30 వేల మంది వరకు మరణించినట్టు నిజాం ప్రభుత్వం నియమించిన సుందర్లాల్ కమిటీ నివేదిక వెల్లడించింది. ఇది ఒక ఘట్టం. దీనినే మనం విమోచన అంటున్నాము. విమోచన అంటే శత్రువును పదవీ చ్యుతుడిని చేయాలి. కానీ అలా జరగలేదు. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరుమీదనే 1950 జనవరి 26 వరకు ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాతనే హైదరాబాద్ భారత ప్రభుత్వంలో అధికారికంగా భాగమైంది. 1948 సెప్టెంబర్ 17న నిజాంను లొంగదీసుకున్న తరువాత భారత సైన్యం కమ్యూనిస్టులపై యుద్ధం ప్రకటించింది. అప్పటి వరకు ప్రజలను దోచుకున్న దొరలు, భూస్వాములు, జమీందారులు, జాగీర్దార్లు కమ్యూనిస్టుల పోరాటంతో ఊళ్ళొదిలి పెట్టారు. భారత సైన్యం రావడంతో, కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని మళ్ళీ పల్లెలకు వచ్చారు. భారత సైన్యం, భూస్వాములు, గూండాలు కలిసి ఊరూరునీ వల్లకాడుగా మార్చేశారు. 1948 సెప్టెంబర్ 17 నుంచి 1951 అక్టోబర్ సాయుధ పోరాట విరమణ వరకూ దాదాపు 4 వేల మంది కమ్యూనిస్టులతో పాటు, వేలాది మంది సాధారణ ప్రజలు చనిపోయారు. మరి 1948 సెప్టెంబర్ 17న విమోచన అయితే, 1951 వరకు భారత సైన్యం తెలంగాణ పల్లెలపై ప్రకటించిన యుద్ధం ఎవరి విమోచనం కోసం జరిగింది? కాబట్టి సెప్టెంబర్ 17న జరిగింది నిజాం బలవంతపు లొంగుబాటుగానే చరిత్ర మనకు చెబుతున్నది. ఆ తర్వాత మూడేళ్ళ పాటు తెలంగాణ పల్లెల్లో నెత్తురు ప్రవహించింది. అందువల్ల మనం సెప్టెంబర్ 17న జరపాల్సింది సంబురాలు కాదు. మనల్ని మనం సింహావలోకనం చేసుకోవడమే. రజాకార్ల దౌర్జన్యా లనూ, అమానుషాలనూ ఎండగట్టాల్సిన సమయమిదే. కానీ భారత సైన్యం జరిపిన నరమేధాన్ని తక్కువ చేసి చూడటం ముమ్మాటికీ సరికాదు. తెలంగాణ ప్రజలు అటు నిజాం రాజు, జమీందార్లు, దేశ్ముఖ్లు, జాగీర్దార్ల దోపిడీ, దౌర్జన్యాలకు బలైపోయారు. రజాకార్ల అమానుషాలను అనుభవించారు. అదేవిధంగా భారత సైన్యం చేసిన విధ్వంసాన్ని, వినాశనాన్ని కూడా చవిచూశారు. ఇదే వాస్తవం. ఇదే నగ్న సత్యం. - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
నిజాం వెంట చీతా.. అతిథులకు వేట సరదా తీర్చిన నవాబులు
నిజాం పాలనా సమయం.. అది మలక్పేటలోని రేస్ కోర్సు.. ఓ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయం.. ఉన్నట్టుండి అలజడి మొదలైంది. ఆరో నిజాం తన వెంట రెండు చీతాలను తీసుకుని అక్కడికి వచ్చారు. చీతాలను రెండు వైపులా కూర్చోబెట్టుకుని గుర్రపు పందాలను వీక్షించి.. కాసేపటికి వెళ్లిపోయారు. అది 1885.. బ్రిటిష్ అధికారి, రచయిత లార్కింగ్ హైదరాబాద్కు వచ్చారు. నిజాం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. భోజనం, ఆ తర్వాత ప్యాలెస్ల వీక్షణంతో గడిచిపోయింది. మరునాడు పొద్దునే లార్కింగ్ను నిజాం పరివారం మహబూబాబాద్ ప్రాంతంలో వేటకు తీసుకెళ్లారు. వారు వెంట రెండు చీతాలను తీసుకురావటం, వాటి సాయంతో వేటాడటం చూసి లార్కింగ్ ఆశ్చర్యపోయారు. ఆ వేటను వివరిస్తూ ఓ పెయింటింగ్ రూపొందించారు. ‘బందోబస్త్ అండ్ ఖబర్’ పేరుతో రాసిన పుస్తకంలో దాన్ని ప్రచురించారు. సాక్షి, హైదరాబాద్: నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలోనూ చీతాలు ఉండేవి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న విదర్భ ప్రాంతంలో చీతాలు ఉండేవని బ్రిటిష్వారి నివేదికలు చెబుతున్నాయి. అక్కడి నుంచి ఆదిలాబాద్ వరకు అటవీ ప్రాంతంలో అవి తిరుగాడేవి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ లెక్కల ప్రకారం.. 1900 నాటికి ఇండియాలో 414 చీతాలు ఉండేవి. అయితే హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి నిజాం ఎలాంటి లెక్కలు తీయించలేదు. ఆ సమయంలో వేట విలాసంగా ఉండేది. పెద్ద పులులను వేటాడేందుకు వెళ్లినవారికి చీతాలు సులభంగా చిక్కేవి. అలా ఎన్నింటినో చంపినా.. ఆ తర్వాతికాలంలో జింకల వేట కోసం చీతాలను వాడటం మొదలుపెట్టారు. ఇందుకోసం నిజాం పాలకులు వేటకుక్కల్లా చీతాలను మచ్చిక చేసుకున్నారు. కానీ వేట, అనారోగ్యం, ఇతర కారణాలతో త్వరగా అంతరించిపోయాయి. దీనితో అడవుల్లో చీతా పిల్లలు కనిపిస్తే తెచ్చి అప్పగించాలని ప్రజలకు నిజాం ఆదేశాలు జారీ చేశారు. చివరికి బ్రిటీష్ అధికారులకు లేఖ రాసి మధ్యప్రదేశ్ ప్రాంతంలో చీతాలను పట్టుకుని, హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఎడ్ల బండిపై చీతాను తీసుకెళ్తున్నట్టు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గీయించిన చిత్రం 1908లో హైదరాబాద్కు వచ్చిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఆల్బర్ట్ ఎడ్వర్డ్.. ఇక్కడ నిజాంతో కలిసి వేటలో పాల్గొన్నారు. వేటకు వెళ్లేప్పుడు రెండు ఎడ్ల బండ్లపై మంచాలు వేసి, వాటికి చీతాలను కట్టి తీసుకురావడం ఆల్బర్ట్ ఎడ్వర్డ్ను ఆశ్చర్యపర్చింది. చీతాలు వాయువేగంతో పరుగెడుతూ జింకలను వేటాడటాన్ని చూసిన ఆయన.. ఆ దృశ్యాలను వివరిస్తూ ఈ చిత్రాలను గీయించారు. జింకను వేటాడుతున్నట్టు గీయించిన మరో చిత్రం ఇప్పటికీ నాటి గుర్తులు నిజాం వారసుల ఇళ్లలో చీతాలకు, నాటి వేటకు సంబంధించిన గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. హైదరాబాద్లోని మౌలాలి ప్రాంతంలో నిజాం ఆంతరంగికుడి వారసుడి నివాసంలో నాడు చీతాల కోసం వినియోగించిన పెద్ద పెద్ద ఇనుపబోన్లు ఉన్నాయి. అప్పట్లో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ కూడా నిజాం సమక్షంలో వేట సరదా తీర్చుకున్నారు. నిజాం 1903లో లార్డ్ కర్జన్ను నిజాం పూర్వపు వరంగల్ జిల్లా నెక్కొండ అడవుల్లో వేటకు తీసుకెళ్లారు. వారు అక్కడ పెద్దపులిని వేటాడి.. దాని పక్కన కూర్చుని ఫొటోలకు ఫోజులిచ్చారు. (క్లిక్: 70 ఏళ్ల తర్వాత భారత్లోకి 8 చీతాలు.. పేరు పెట్టిన ప్రధాని మోదీ) -
ఓడినా పైచేయి నిజాందేనంటూ.. మజ్లిస్ పత్రిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థకు ‘మీజాన్’ పేరుతో ఓ పత్రిక ఉంది. నరరూప రాక్షసుడిగా ముద్రపడ్డ ఖాసింరజ్వీ నేతృత్వంలో ఉన్న సంస్థ కావటంతో దాని పత్రిక కూడా నిజాం సేనలకు అనుకూల వార్తలతో జనాన్ని తప్పుదోవ పట్టించే యత్నం చేసింది. ఓవైపు భారత సేనలు హైదరాబాద్ను చుట్టుముట్టడంతో నిజాం సైన్యం తోకముడిచినా.. ఎంఐఎం పత్రిక మీజాన్ మాత్రం, నిజాం సైన్యానిదే పైచేయి అంటూ తప్పుడు కథనాలను జనంలోకి వదిలింది. మరోవైపు నిజాం నియంత్రణలో ఉన్న హైదరాబాద్ రేడియో కూడా నిజాం సేనలు వీరోచితంగా పోరాడుతూ భారత సైన్యాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నాయని వార్తలు వెలువరించింది. సెప్టెంబర్ 17 సాయంత్రం వరకు జరిగిన ఈ తంతు ఆ తర్వాత ఆగిపోయింది. తప్పుడు వార్తలే కాదు, తుదకు ఆ పత్రిక, రేడియో కూడా ఆ తర్వాత మూగబోయాయి. సైన్యానికి స్వాగతం పలికిన జనంపై రజాకార్ల దాడులు భారత సైన్యం రాకను అడ్డుకోలేకపోయిన నిజాం సేనలు, ఆ అక్కసును సాధారణ ప్రజలపై చూపించాయి. నగరానికి చేరుకున్న భారత సైనిక పటాలాలను చూసి సంబరపడ్డ జనం, హారతులిచ్చి స్వాగతం పలికాయి. బొల్లారం మిలటరీ కేంద్రం వద్ద పండగ వాతావరణం నెలకొంది. సెప్టెంబరు 17న రాత్రి అక్కడికి దొంగచాటుగా చేరుకున్న రజాకార్ల బృందం సాధారణ ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో అమాయకులు బలయ్యారు. విషయం తెలుసుకున్న భారత సైనికులు గాలించి మరీ ముష్కరులను పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. చదవండి: (బురఖా ధరించి మహిళ వేషంలో గోడ దూకి పరారైన... నిజాం నవాబు ప్రధాని) -
వంతెనను పేల్చేయించాడు
1948 సెప్టెంబర్ 16 ఉదయం.. మూసీనది పరవళ్లు తొక్కుతోంది. వరద హోరు తప్ప అంతా ప్రశాంతంగా ఉంది. ఇంతలో పెద్ద శబ్దం. దాని తర్వాత వరస శబ్దాలు. చూస్తుండగానే.. సూర్యాపేట – టేకుమట్ల వంతెన నేలకొరిగింది. అద్భుత నిర్మాణ కౌశలంతో రూపుదిద్దుకున్న ఆ రాతి వంతెనను బాంబులు తునాతునకలు చేసేశాయి. సైనికాధ్యక్షుడు జనరల్ ఎడ్రూస్ ప్లాన్. నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాలు. భారత సైన్యాలు హైదరాబాద్లోకి అడుగుపెట్టకుండా అడ్డుకునే ప్రణాళిక ఫలితంగా నిజాం ముచ్చటపడి నిర్మించిన టేకుమట్ల వంతెన కూలిపోయింది. – సాక్షి, హైదరాబాద్ హైదరాబాద్–విజయవాడ రహదారిపై సూర్యాపేటకు పది కి.మీ. ముందున్న మూసీ నదిపై నిజాం ముచ్చటపడి నిర్మించిన వంతెన అది. మంచి ప్లాన్తో అద్భుతంగా నిర్మింపజేశాడా వంతెన. సంస్థానానికి సముద్ర రవాణా లేకపోవటంతో సముద్ర వాణిజ్యానికి మచిలీపట్నం పోర్టే ఆధారం. అందుకే అక్కడి నుంచి భాగ్యనగరానికి విశాలమైన రోడ్డు నిర్మించాడు. పన్నుల వసూళ్లకు వెళ్లేందుకు, పోర్టు వస్తువుల రవాణా, సైనిక పటాలాలు వచ్చి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. ‘దండు బాట’గా పిలుచుకునే ఈ రోడ్డుపైనే మూసీ దాటేందుకు అద్భుతంగా వంతెన నిర్మించాడు. సైనికాధికారి ఎడ్రూస్ ప్లాన్.. అయితే 1948 సెప్టెంబర్లో భారత సైన్యం దాడికి ఉపక్రమించబోతోందని నిజాంకు సమాచారం వచ్చింది. అప్పటికే ఢిల్లీలోని కొందరు పెద్దలతో నిజాం మంతనాలు జరిపాడు. పెద్దగా ప్రతిఘటించొద్దన్న సంకేతాలొచ్చాయి. దానికి నిజాం కొన్ని షరతులు పెట్టాడు. తుది నిర్ణయంపైనే తర్జనభర్జన నడుస్తోంది(ఇది చరిత్ర పరిశోధకుల మాట). సైనిక చర్యపై నిజాం ఆంతరంగికులలో ముఖ్యుడైన సైనికదళా«దిపతి జనరల్ ఎడ్రూస్ వెంటనే కార్యరంగంలోకి దిగాడు. నిర్ణయం తీసుకునేందుకు నిజాంకు సమయం కావాలని గుర్తించిన ఎడ్రూస్, భారత సైన్యం వెంటనే హైదరాబాద్కు చేరకుండా అడ్డుకోవాలనుకున్నాడు. నగరానికొచ్చే ప్రధాన మార్గాలు, సైన్యం ఏయే ప్రాంతాల నుంచి వస్తుందో మ్యాప్ రూపొందించుకున్నాడు. సైన్యాన్ని నిలువరించాలంటే వంతెనలు పేల్చేయడమే మార్గమనే నిర్ణయానికొచ్చాడు. మహారాష్ట్ర నుంచి వచ్చే సైన్యాన్ని అడ్డుకునేందుకు ఉస్మానాబాద్ మార్గంలోని మూడు వంతెనలు గుర్తించాడు. ఒడిశా గుండా వస్తున్న సైన్యాలను, ఆంధ్రాప్రాంతం నుంచి ఖమ్మం మీదుగా వస్తున్న సైన్యాలను ఆపేందుకు టేకుమట్ల వంతెనను పేల్చాలని నిర్ణయించాడు. దీంతో 15 రోజులు సైన్యాన్ని నిలవరించగలమని చెప్పి.. నిజాం ఆమోదంతో వంతెనలు పేల్చేందుకు బృందాలను పంపాడు. అందులో భాగంగా సెప్టెంబరు 16న సూర్యాపేట వంతెనను పేల్చేశారు. ఇంతా చేస్తే ఈ వ్యూహం పారలేదు. కొన్ని దళాలు అనుకున్న సమయానికే హైదరాబాద్కు చేరుకోగలిగాయి. మళ్లీ నిర్మాణం.. సైనిక చర్య ముగిసి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం అయినప్పటికీ, నాటి కేంద్రప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు రాజ్ప్రముఖ్గా కొనసాగిన నిజాం.. సూర్యాపేట వంతెనను పునర్నిర్మింపజేశాడు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆధునిక వంతెనను నిర్మించేవరకు సేవలందించిన ఆ వంతెన.. నాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటోందన్నట్టుగా విశ్రాంతి తీసుకుంటోంది. -
నలువైపులా ముట్టడి.. హైదరాబాద్పై ఐదు రోజుల ‘ఆపరేషన్’
సాక్షి, హైదరాబాద్: స్ట్రైక్.. స్మాష్.. కిల్.. వీర్.. ఇవి కేవలం నాలుగు పదాలు కాదు.. భారత సైన్యాన్ని హైదరాబాద్ సంస్థానంపైకి నడిపించిన నాలుగు సైనిక దళాల పేర్లు అవి.. సంస్థానాన్ని నలువైపుల నుంచీ ముట్టడించి నిజాం సైన్యాలను తరిమికొట్టిన దళాలు అవి.. నాటి భారత సైన్యం దక్షిణ మండల ప్రధానాధికారి గొడాల్ట్ వ్యూహ రచన మేరకు ‘ఆపరేషన్ పోలో’పేరిట జరిగిన సైనిక చర్యలో.. హైదరాబాద్ సంస్థానంపై నలుదిక్కుల నుంచీ దాడులు జరిగాయి. నల్దుర్గ్ నుంచి నార్కట్పల్లి.. ఔరంగాబాద్ నుంచి హోమ్నాబాద్ వరకు జరిగిన ఈ దాడుల వివరాలన్నీ భారత సైన్యానికి చెందిన అధికార పత్రాల్లో ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఆపరేషన్ పోలో గురించి ఒక్కొక్కరు ఒక్కో కథనం వినిపిస్తుండగా.. కొందరు చరిత్రకారులు భారత సైన్యం అధికారిక పత్రాల్లో పేర్కొన్న అంశాలను వివరిస్తున్నారు. ఆ వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 12న మొదలు.. మద్రాసు, ముంబై రాష్ట్రంలోని సేనలు హైదరాబాద్ సంస్థానం వైపు కదలాలని 1948 సెపె్టంబర్ 12న భారత సైన్యం అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్రలోని నల్దుర్గ్ ప్రాంతంలో నిజాం సైన్యం ఏర్పాటు చేసుకున్న శిబిరం తమ వశమైందని సెపె్టంబర్ 13న ఉదయం భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది. ఆ రోజునే సైనిక చర్య ప్రారంభమైందని కూడా ప్రకటించింది. తొలుత సైనిక చర్యకు ‘ఆపరేషన్ కాటర్ పిల్లర్’అనే పేరు పెట్టినా.. తర్వాత ‘ఆపరేషన్ పోలో’పేరుతో కొనసాగించారు. నాలుగు వైపుల నుంచీ.. హైదరాబాద్ సంస్థానంపై భారత సైన్యం దాడి నలువైపులా ఒకేసారి ప్రారంభమైందని చరిత్రకారులు చెప్తున్నారు. షోలాపూర్–హైదరాబాద్ మార్గంలో పశ్చిమ దిశ నుంచి మేజర్ జనరల్ జయంత్నాథ్ చౌదరి నాయకత్వంలోని దళం.. విజయవాడ– హైదరాబాద్ మార్గంలో తూర్పు దిశ నుంచి మేజర్ జనరల్ ఏఏ రుద్ర నాయకత్వంలోని దళం ముందుకు నడిచాయి. ఈ దళాల దాడి సాగుతుండగానే రైల్వే మార్గాల రక్షణతోపాటు నిజాం సైన్యం, రజాకార్లు పారిపోకుండా ఉండేందుకు దక్షిణాన కర్నూలు వైపు నుంచి మరో దళం కదిలింది. ఉత్తర దిశలోని జాల్నా వైపు నుంచి ఇంకో దళం దాడి మొదలుపెట్టింది. ఈ నాలుగు దళాలకు స్ట్రైక్, స్మాష్, కిల్, వీర్ ఫోర్స్లుగా నామకరణం చేశారు. 9వ డొగ్రా బెటాలియన్, 1వ ఆర్మర్డ్ బ్రిగేడ్, 7వ, 9వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్లు, భారత వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఐదు రోజుల పాటు సాగి.. సైన్యం ప్రకటన మేరకు 1948 సెపె్టంబర్ 13న ఉదయం ప్రారంభమైన ‘ఆపరేషన్ పోలో’ఐదు రోజుల పాటు కొనసాగింది. ఈ ఐదు రోజుల పాటు ఏ రోజు ఏం జరిగిందో సైనిక పత్రాల్లో రాసి ఉంది. నల్దుర్గ్ కోట పతనం, బోరీ నది మీద వంతెన కూలగొట్టడం వంటి విధ్వంసాలనూ పత్రాల్లో నమోదు చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేటను జల్లెడ పట్టాం, సూర్యాపేట పతనమైంది, నార్కట్పల్లి పతనమైంది, చిట్యాల దగ్గర ఉన్నాం, కాప్చరింగ్ జాల్నా, ఔరాంగాబాద్, హోమ్నాబాద్ అంటూ.. యుద్ధంలో ప్రాంతాలను, స్థావరాలను స్వాధీనం చేసుకున్న తరహాలో భాషనే ఇందులో ఉపయోగించారు. నాటి పత్రికల్లో కూడా.. అధికారిక సైన్య పత్రాలతోపాటు నాటి పత్రికలు కూడా అప్పట్లో జరిగిన ఉదంతాలను ఉటంకిస్తూ కథనాలు రాశాయి. మెర్జర్, అనెక్సేషన్, యాక్సెషన్, అటాక్, యాక్షన్, మిలిటరీ ఆపరేషన్, ఎండ్ ఆఫ్ అసఫ్జాహీ రూల్, హైదరాబాద్ పతనం, విలీనం, ఆక్రమణ అనే పదాలు తప్ప సమకాలీనంగా ఇతర మాటలు అప్పట్లో వాడలేదు. నాటి సమకాలీన పత్రికలన్నీ ఈ దాడిని ‘ఇండియా ఇన్వేడ్స్’ అని రాశాయి. స్వయంగా భారత ప్రభుత్వం దీనిని సైనిక చర్యగానే పేర్కొంది. రూ.3.5 కోట్ల ఖర్చుతో.. ‘ఆపరేషన్ పోలో’దాడికి రూ.3.5 కోట్లు ఖర్చయిందని సైనిక పత్రాల్లో పేర్కొన్నట్టు చరిత్రకారులు చెప్తున్నారు. మొత్తం 66 మంది ఇండియన్ యూనియన్ సైనికులు చనిపోగా, 97 మంది గాయపడ్డారని, 490 మంది నిజాం సైన్యం చనిపోగా, 122 మంది గాయపడ్డారని వివరిస్తున్నారు. సైనిక చర్యలో జరిగిన నష్టాలపైనా అప్పటి పత్రికలు కథనాలు రాశాయి. హైదరాబాద్పై విజయం సాధించడంపై నాటి సైనిక చర్యకు నాయకత్వం వహించిన మేజర్ జనరల్ రాజేంద్ర సింహ్జీకి బంగారు ఖడ్గంతోపాటు భగవద్గీత గ్రంథాన్ని బహూకరించాలని తూర్పు పంజాబ్ విశ్వవిద్యాలయ హిందూ రక్షణార్థి విద్యార్థులు తీర్మానించారు. వారు దక్షిణ భారత మిలటరీ శాఖను అభినందించారని నాటి పత్రికల్లో రాశారు. ఇదీ చదవండి: Operation Polo: నిజాంను తెలివిగా తోకముడిచేలా చేసిన వల్లభాయ్ పటేల్ -
హైదరాబాద్పై కేంద్రం సైనిక చర్య.. ‘ఆపరేషన్ పోలో’ పేరెలా వచ్చింది?
హైదరాబాద్లో ఖాసీం రిజ్వీ అరాచాకాలు పెరుగుతుండటంతో శాంతిభద్రతలు పూర్తిగా సన్నగిల్లే ప్రమాదం ఉందని నిఘావర్గాలు భారత ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. చాలా సున్నితమైన హైదరాబాద్ సంస్థానం విలీనం అంశంపై నెహ్రూ-పటేల్లు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో ఓ వైపు సైన్యం సిద్ధమవుతున్నా హైదరాబాద్పై సైనిక చర్య జరుగుతుందా లేదా అనే విషయంపై గందరగోళం నెలకొంది. చివరికి సెప్టెంబర్లో హైదరాబాద్ సంస్థానంలోకి భారతసైన్యం అడుగుపెట్టడానికి పటేల్ ఓకే అన్నారు. దీనికి ఆపరేషన్ పోలో అని నామకరణం చేశారు. హైదరాబాద్లోని పోలో గ్రౌండ్స్ వల్లే సైనికచర్యకు పోలో అనే పేరుపెట్టారని కొందరు చరిత్రకారులు అంటారు. ఇక హైదరాబాద్లో భారత సైన్యం ప్రవేశాన్ని సైనిక చర్య అని పిలవకుండా పోలీసు చర్యగా పిలవాలని నిర్ణయించారు. సైనిక చర్య అంటే మళ్లీ అంతర్జాతీయంగా వివాదం రేగే ప్రమాదం ఉంటుందని.. పోలీసుచర్య అంతర్గత వ్యవహారంగా ఉంటుందనేది పటేల్ భావన. అయితే తరువాతి కాలంలో ఆపరేషన్ పోలోను ఆపరేషన్ క్యాటర్ పిల్లర్గా మార్చారు. ఇక అటు భారత్ సైనిక చర్యకు సిద్ధమవుతుందనే సమాచారం నిజాం చెవినపడింది. దీంతో ఎలాగైనా యుద్ధం చేయాలని నిజాం నిర్ణయించుకున్నాడు. దీనికోసం తన మంత్రి లాయక్ అలీని లండన్కు పంపి అక్కడ భారీగా అయుధాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడు. ఇక సిడ్నీ కాటన్ అనే ఆస్ట్రేలియాకు చెందిన పైలట్ ద్వారా యుద్ద విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించాడు. దీంతో ఆపరేషన్ పోలోను వేగవంతం చేయాలని భారత సైన్యం నిర్ణయించింది. ఆపరేషన్ పోలో ఎప్పుడు ప్రారంభమయినా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగకూడదని పటేల్ నిశ్చయించుకున్నారు. ఒకవేళ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే నిజాం సంస్థానంలో మత కల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందని పటేల్ ఆందోళన చెందారు. నిజాం రాజుకు దేశవ్యాప్తంగా ముస్లింలలో ఉన్న పలుకుబడి వల్ల ఈ కల్లోలాలు దేశవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని ఉక్కుమనిషి ముందే ఊహించారు. దీంతోపాటు యుద్ధం ఆలస్యం అయితే ఇదే అదనుగా పాకిస్తాన్ కాశ్మీర్లో ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉంది. అందుకే పటేల్ సైనిక చర్యను వేగంగా ముగించాలని పట్టుదల ప్రదర్శించారు. సెప్టెంబర్ 13న సైనికచర్యకు అన్ని రకాలుగా రంగం సిద్ధమయింది. సరిగ్గా రెండు రోజుల ముందు పాకిస్తాన్లో జిన్నా సెప్టెంబర్-11న చనిపోయాడు. భారత ఆర్మీకి జిన్నా మృతి రూపంలో అవకాశం కలిసి వచ్చింది. దీంతో 13వ తేదీన సైనికచర్య ప్రారంభిస్తే పాకిస్థాన్ అంత తొందరగా స్పందించే అవకాశం ఉండదని పటేల్ భావించారు. సెప్టెంబర్-13 తెల్లవారు జామున ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. అయితే ఆపరేషన్ పోలో ప్రారంభం విషయం ప్రధాని నెహ్రూకు తెలియదని పటేల్ నెహ్రూకు చెప్పకుండానే ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. ఇటు హైదరాబాద్పై పోలీసు చర్య ప్రారంభం కాగానే అప్పటి పాకిస్థాన్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ అత్యవసరంగా తన డిఫెన్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో భారత్ ఆర్మీ హైదరాబాద్ సంస్థానంపై దాడి చేసిన నేపథ్యంలో.. హైదరాబాద్లో ఉన్న భారత సైన్యంపై పాకిస్తాన్ ఏమైనా చర్యకు దిగే అవకాశాలున్నాయా అని తన సైన్యాన్ని ప్రశ్నించారు. పాకిస్థాన్ సైన్యంలో కెప్టెన్గా ఉన్న ఎలవర్థీ.. హైదరాబాద్లో పాకిస్తాన్ ఎలాంటి సైనిక చర్యకు దిగే అవకాశం లేదని స్పష్టంచేశారు.. దీంతో ఢిల్లీ పైన పాకిస్థాన్ బాంబులు వేసే అవకాశం ఉందా? అని లియాఖత్ అలీఖాన్ మరో ప్రశ్నవేశారు. దీనికి సమాధానంగా ఎలవర్దీ పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం నాలుగు యుద్ధ విమానాలే ఉన్నాయని.. అందులో రెండు పనిచేయడం లేదన్నాడు. తమ వద్ద ఉన్న రెండు విమానాల్లో ఒకటి మాత్రమే ఢిల్లీ వరకు వెళ్లగలదని.. అయితే అది తిరిగివచ్చే గ్యారంటీ లేదని స్పష్టం చేశాడు. దీంతో హైదరాబాద్ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని పాకిస్థాన్ నిర్ణయించింది. -
Shoyabullakhan: అక్షర యోధుడు షోయబుల్లాఖాన్
భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణకు మాత్రం 13 నెలల తర్వాత స్వాతంత్య్రం సిద్ధించింది. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం కావడానికి ఎందరో దేశభక్తులు నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు. నిజాం నిరంకుశత్వానికి.. రజాకార్ల ఆరాచకాలను ప్రపంచానికి తెలిసేలా వార్తలు, సంపాదకీయాలు రాసిన షోయబ్–ఉల్లా–ఖాన్ గురించి మనం తెలుసుకోవాలి. హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చాలని తన కలాన్ని గళంగా మార్చుకుని నిజాం వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడుతూ అసువులు బాసిన షోయబుల్లాఖాన్కు సలాం. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నేటి యువత, విద్యార్థులు ఆయన గురించి తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ కథనం. పోచారం: ప్రజాస్వామ్య విలువల కోసం అక్షర పోరాటం చేస్తూ.. నడి రోడ్డుపై ప్రాణ త్యాగం చేసిన షోయబుల్లాఖాన్ జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం. 1947 ఆగష్టు 15న భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయాలని షోయబ్ ఆకాంక్షించారు. ఆ తరుణంలోనే హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని నిజాం రాజుకు ఏడుగురు ముస్లిం పెద్దలు విజ్ఞాపన పత్రం సమర్పించారు. దీనిని షోయబ్ తన సొంత పత్రిక ఇమ్రోజ్లో ప్రచురించారు. పత్రికలో వచ్చిన కథనాన్ని ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రస్తావిస్తుందేమోనని నిజాం భయపడి షోయబ్ను హత్య చేయించాడు. కుటుంబ నేపథ్యం.. ఉత్తరప్రదేశ్కు చెందిన వీరి కుటుంబం నిజాం ప్రాంతానికి వలస వచ్చింది. ఖమ్మం జిల్లా సుబ్రవేడ్లో 1920 అక్టోబర్ 17న హబీబుల్లాఖాన్, లాయహున్నీసా బేగం దంపతులకు షోయబుల్లాఖాన్ జన్మించారు. తేజ్, రయ్యత్ పత్రికల్లో జర్నలిస్టుగా.. ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తేజ్ అనే ఉర్దూ పత్రికలో చేరి రజాకార్ల అరాచకాలపై అక్షర నిప్పులు చెరిగేవారు. దీంతో తేజ్ పత్రికను సర్కార్ నిషేధించడంతో రయ్యత్ పత్రికలో చేరారు. చివరకు రయ్యత్ పత్రికను ప్రభుత్వం మూసివేయించింది. బూర్గుల సాయంతో ఇమ్రోజ్ పత్రిక స్థాపన నగలు నట్రా అమ్మి బూర్గుల రామకృష్ణారావు సహాయంతో హైదరాబాద్లోని కాచిగూడలో ఇమ్రోజ్ అనే పత్రికను షోయబ్ స్థాపించారు. షోయబ్ రచనలకు రగిలిపోయిన ఖాసిం రజ్వీ 1947 నవంబర్ 17న తొలి సంచిక వెలువడింది. నిజాం సంస్థానాన్ని భారత్లో విలీనం చేయాలంటూ పదునైన సంపాదకీయాలు రచించేవారు. వీరి రచనలకు రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ రగిలిపోయాడు. (క్లిక్: చరిత్రను కాటేయ జూస్తున్నారు!) చప్పల్బజార్ రోడ్డులో చంపిన రజాకార్లు ► 1948 ఆసుస్టు 21న కాచిగూడ రైల్వే స్టేషన్లోని ఇమ్రోజ్ ఆఫీస్ నుంచి అర్ధరాత్రి తన బావమరిది ఇస్మాయిల్ఖాన్తో కలిసి ఇంటికి వస్తుండగా చప్పల్బజార్ రోడ్డులో రజాకార్లు అతిక్రూరంగా చేతిని నరికి తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించారు. ► అడ్డుకోబోయిన తన బావమరిది చేతులు సైతం నరికేశారు. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ 1948 ఆగస్టు 22వ తేదీన తెల్లవారు జామున షోయబ్ తుదిశ్వాస విడిచారు. ► ప్రస్తుతం వీరి కుటుంబ సభ్యులు పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్లో నివసిస్తున్నారు. మలక్పేట్లో షోయబ్ పేరుతో ఒక గదిలో లైబ్రరీ, చుట్టూ చిన్న పార్కు ఏర్పాటు చేశారు. (క్లిక్: సెప్టెంబర్ 17.. ప్రాధాన్యత ఏమిటి?) -
రజాకార్లకు ఎదురొడ్డిన గుండ్రాంపల్లి!
చిట్యాల: నిజాం కాలంలో రజాకార్ల అకృత్యాలకు సజీవ సాక్ష్యం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామం. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి యువకులెందరో రజాకార్లకు ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు వదిలారు. నాటి పోరాటానికి జ్ఞాపకంగా గ్రామంలో అమరవీరుల స్తూపం సగౌరవంగా నిలబడి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం తమ గ్రామానికి తగిన గుర్తింపు లేదని స్థానికులు వాపోతున్నారు. రక్షక దళాలుగా ఏర్పడి.. రజాకార్ల దారుణాలు సాగుతున్న సమయంలో సూర్యాపేట తాలూకా వర్దమానకోటకు చెందిన సయ్యద్ మక్బూల్ అనే వ్యక్తి.. తన సోదరి నివాసం ఉంటున్న గుండ్రాంపల్లికి వలస వచ్చాడు. మొదట బతుకుదెరువు కోసం ఇదే మండలం ఏపూరులో ఒక భూస్వామి వద్ద పనిలో చేరాడు. కానీ తర్వాత రజాకార్ల బృందంలో చేరాడు. గుండ్రాంపల్లి కేంద్రంగా సాయుధ పోరాటంలో పాల్గొంటున్నవారిపై రజాకార్లతో కలిసి అరాచకాలకు పాల్పడ్డాడు. అవి ఎంత దారుణంగా ఉండేవంటే.. గ్రామంలో తాను నిర్మించుకున్న ఇంటి పునాదిలో నిండు గర్భిణులను సజీవ సమాధి చేసి ఆపై నిర్మాణాన్ని చేపట్టాడని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ క్రమంలో మక్బూల్, ఇతర రజాకార్ల ఆగడాలను అడ్డుకోవడానికి గుండ్రాంపల్లి కేంద్రంగా ఏపూర్, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, ఆరెగూడెం, పలివెల, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె గ్రామాలకు చెందిన యువకులు రక్షక దళాలుగా ఏర్పడ్డారు. రజాకార్ల దాడులను తిప్పికొట్టారు. 30 మందిని సజీవ దహనం చేసి.. గుండ్రాంపల్లి కేంద్రంగా జరుగుతున్న తిరుగుబాటుతో రగిలిపోయిన మక్బూల్.. పెద్ద సంఖ్యలో రజాకార్లను కూడగట్టి భారీ దాడికి దిగాడు. తమకు దొరికిన 30 మంది యువకులను గుండ్రాంపల్లిలో ఎడ్లబండ్లకు కట్టి చిత్రహింసలు పెట్టాడు. తర్వాత గుండ్రాంపల్లి నడిబొడ్డున మసీదు ఎదురుగా బావిలో వారందరినీ పడేసి సజీవ దహనం చేశాడు. ఇది తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారు. ప్రస్తుత మునుగోడు మండలం పలివెలకు చెందిన కొండవీటి గురునాథరెడ్డి నాయకత్వంలో సాయుధ దళాలు మక్బూల్పై దాడికి ప్రయత్నించాయి. కానీ మక్బూల్ తప్పించుకున్నాడు. తర్వాత మరోసారి చేసిన దాడిలో మక్బూల్ చేయి విరిగినా, ప్రాణాలతో తప్పించుకుని పారిపోయాడు. మక్బూల్కు సహకరించిన వారి ఇళ్లపై కమ్యూనిస్టు సాయుధ దళాలు దాడి చేసి హతమార్చాయి. నిజాం పాలన నుంచి విముక్తి లభించాక గుండ్రాంపల్లి ఊపిరిపీల్చుకుంది. నాటి పోరాటంలో యువకులను సజీవ దహనం చేసినచోట 1993 జూన్ 4న సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. అమరులైన వారిలో గుర్తించిన 26 మంది పేర్లను ఆ స్తూపంపై రాశారు. ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణవాదులు ఈ స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో ఈ స్థూపాన్ని తొలగించగా.. మరోచోట అమరవీరుల స్తూపాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. గ్రామాన్ని సందర్శించిన అమిత్ షా 2017 మే నెలలో గుండ్రాంపల్లి గ్రామాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్షా సందర్శించారు. నాటి సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారసులను ఆయన సన్మానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా ఈ ఏడాది జూలైలో గుండ్రాంపల్లిని సందర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే గుండ్రాంపల్లి గ్రామ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చుతామని.. గ్రామంలో స్మారక కేంద్రం, మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రజాకార్ల దుర్మార్గాలు చెప్పలేనివి నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు రజాకార్ల దాడులు జరిగాయి. గ్రామంలోని యువకులు దళాలుగా ఏర్పడి తిరుగుబాటు చేశారు. రజాకార్లు వారిని పట్టుకుని చంపేశారు. తర్వాత మా ఊరితోపాటు చుట్టుపక్కల గ్రామాల వారంతా కలిసి మక్బూల్పై దాడి చేశారు. నాటి రజాకార్ల దుర్మార్గాలు చెప్పనలవికాదు. – గోపగోని రామలింగయ్య, గుండ్రాంపల్లి గుండ్రాంపల్లికి గుర్తింపు ఇవ్వాలి నిజాం నవాబుకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గుండ్రాంపల్లి గ్రామ చరిత్రకు తగిన గుర్తింపు ఇవ్వాలి. పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి ముందు తరాలకు తెలియజేయాలి. ఏటా సెప్టెంబర్ 17న మా గ్రామంలో అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలి. – గరిశె అంజయ్య, గ్రామ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు,గుండ్రాంపల్లి -
నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవ సమితి ఆవిర్భావం
సనత్నగర్ (హైదరాబాద్): భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు పూర్తి చేసుకున్న వేళ..నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ‘నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవ సమితి’ పురుడుపోసుకుంది. ఈ సమితి సెప్టెంబర్ 17 నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు రంగంలోకి దిగనుంది. బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో శనివారం సాయంత్రం జరిగిన ఉత్సవ సమితి సభ్యుల సమావేశంలో కమిటీని ప్రకటించి పలు తీర్మానాలు చేశారు. సెప్టెంబర్ 17న అన్ని జిల్లాల్లో, రెవెన్యూ మండల కేంద్రాల్లో ప్రముఖులు, యువకులతో ఈ అమృతోత్సవాలను ప్రారంభించి జనవరి 2023లో అన్ని గ్రామాల్లో ‘జనజాగరణ’ ద్వారా తెలంగాణ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని చాటుతామని రిటైర్డ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 17, 2023న గ్రామాల్లో ఇంటింటికీ త్రివర్ణ పతాక వందనంతో ఈ ఉత్సవాలను ముగిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సమావేశాలతో పాటు రాజకీయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఉత్సవ సమితి కమిటీ ఇదే.. గౌరవాధ్యక్షుడిగా రిటైర్డ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, అధ్యక్షుడిగా స్వాతంత్య్ర సమరయోధుడు టీవీ నారాయణ కుమారుడు డాక్టర్ వంశ తిలక్, ఉపాధ్యక్షుడిగా రిటైర్డ్ ఐఏఎస్ చామర్తి ఉమామహేశ్వరరావు, రిటైర్డ్ లేబర్ కమిషనర్ హెచ్కే నాగు, ఉస్మానియా వర్సిటీ తెలుగు విభాగం మాజీ అధిపతి కసిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మసడి బాపురావు (వరంగల్), కార్యదర్శులుగా నిరంజనచారి (కరీంనగర్), ఇటిక్యాల కృష్ణయ్య (నల్లగొండ), గడ్డం సరోజాదేవి (మాజీ ఎంపీ వివేక్ సతీమణి), కోశాధికారిగా చంద్రశేఖర్లతో పాటు మరో 18 మంది సభ్యులు కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ 2022–23 ఏడాది కాలం పాటు ఉంటుంది. -
నిజాం రాజ్యంలో నిశ్శబ్దం!
సాక్షి, హైదరాబాద్: అది 1947 ఆగస్టు 15. పరాయి పాలన నుంచి విముక్తి పొంది దేశమంతా ఆనందోత్సాహాలతో పండగ జరుపుకొంటున్న వేళ. వినువీధుల్లో మువ్వన్నెల జెండా సగర్వంగా, సమున్నతంగా రెపరెపలాడిన తరుణం. ఆబాలగోపాలం స్వాతంత్య్ర వేడుకల్లో మునిగిపోయారు. కానీ.. ఆ రోజు హైదరాబాద్లో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలింది. నగరవాసులు ఇళ్లకే పరిమిత మయ్యారు. ఎక్కడో ఒకచోట కొంతమంది దేశభక్తులు రహస్యంగా త్రివర్ణ పతాకలతో సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఎక్కడా జాతీయ జెండాలను ఎగురవేయలేదు. నగరంలో కర్ఫ్యూ విధించినట్లుగా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అప్పటికే నిజాం నియంతృత్వ పాలనలో మగ్గుతున్న జనం ఆశావహ దృక్పథంతో స్వాతంత్య్రం కోసం ఎదురుచూశారు. శుక్రవారమూ ఓ కారణమే! దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు శుక్రవారం. హైదరాబాద్కు అది సెలవు దినం. దాంతో నగరంలోని ప్రభు త్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కళాశాలలు మూసి ఉన్నాయి. వ్యాణిజ్య సంస్థలు కూడా మూసి వేయడంతో సాధారణంగానే జనసంచారం లేకుండా పోయింది. ‘ఒకవేళ అది వర్కింగ్ డే అయి ఉంటే వాతావరణం మరోలా ఉండేది. ఎందుకంటే అప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాతీయోద్యమ భావాలు వెల్లువెత్తాయి. విద్యార్ధులు ఉద్యమాలు చేప ట్టారు. వందేమాతర ఉద్యమం పెద్ద ఎత్తున నడిచింది. బ్రిటిష్ ప్రభుత్వానికి బలమైన మద్దతుదారుగా నిలిచిన నిజాం వందేమాతర గీతాన్ని నిషేధించడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆ శుక్రవారం యూనివర్సిటీకి సెలవు కావడంతో విద్యార్థులు వేడుకలను నిర్వహించలేకపోయారు’ అని ఇంటాక్ సంస్థ ప్రతినిధి అనురాధారెడ్డికి ఆమె చిన్నతనంలో తన తల్లి స్నేహలత చెప్పినట్లు గుర్తు చేశారు. దక్కన్ రేడియో మూగనోము... అప్పటికి హైదరాబాద్లో ఉన్న ముఖ్య మైన ప్రసారమాధ్యమం దక్కన్ రేడియో. ఆ రోజు యథావిధిగా అన్ని రకాల కార్యక్రమాలను ప్రసారం చేశా రు. కానీ స్వాతంత్య్ర వేడుకలను గురించి ఒక్క మాటైనా రేడియోలో ప్రస్తావించకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకలను దక్కన్ రేడియో ప్రసారం చేయలేదు. దీంతో నగరవాసులు ఆల్ ఇండియా రేడి యో, బీబీసీ రేడియోలను ఆ శ్రయించారు. ‘ఆ రోజు మా అమ్మ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వెళ్లారట. కానీ అక్క డా ఎలాంటి సందడి లేదు. కొద్దిమంది ప్రయాణికులు తప్ప రైల్వేస్టేషన్ చాలా వరకు నిర్మానుష్యంగా ఉంది’ అని చెప్పినట్లు అనురాధ గుర్తు చేశారు. అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజ్ల ఆధ్వర్యంలో మాత్రం సికింద్రాబాద్, నారాయణగూడలలో కొద్దిమంది నాయకులు త్రివర్ణ పతాకలను ఎగురవేశారని ఆమె పేర్కొన్నారు. (చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం ) -
అనగనగా హైదరాబాద్.. భాగ్యనగరంలో స్వరాజ్య సమరశంఖం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఆ రోజు మువ్వన్నెల జెండా రెపరెపలాడలేదు. దేశమంతా స్వాతంత్య్రోత్సవాలు వెల్లివిరిసిన 1947 ఆగస్టు 15న హైదరాబాద్లో జాతీయోద్యమ నేతలు, కాంగ్రెస్ నాయకులు, వివిధ వర్గాల ప్రజలు రహస్యంగానే తమ దేశభక్తిని చాటుకున్నారు. కానీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన జాతీయోద్యమానికి దీటుగా హైదరాబాద్లోనూ మహత్తరమైన స్వాతంత్య్ర పోరాటాలు జరిగాయి. న గరంలోని అబిడ్స్, కోఠి, సుల్తాన్బజార్, బొగ్గులకుంట, ట్రూప్బజార్, కుందన్బాగ్ వంటి ప్రాంతాలు స్వాతంత్య్రోద్యమ నినాదాలతో మార్మోగాయి. గాంధీజీ పిలుపు మేరకు స్వామి రామానంద తీర్థ నేతృత్వంలో స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమాలను చేపట్టారు. ఇదంతా ఒకవైపు అయితే భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా పేరొందిన సిపాయిల తిరుగుబాటు హైదరాబాద్లోనూ ఉవ్వెత్తున ఎగిసిపడింది. బ్రిటిష్ వలస పాలనను, ఆధిపత్యాన్ని ప్రతిఘటించింది. ఒప్పందంపై నిరసన... అప్పటి నిజాం నవాబు 1800 బ్రిటిష్ ప్రభుత్వంతో సైనిక సహకార ఒప్పందం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మేరకు బ్రిటిష్ అధికార ప్రతినిధికి హైదరాబాద్లో రెసిడెన్సీ (కోఠి)ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే ఏడాది అక్టోబర్ 12 నుంచి సహకార ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే అప్పటికే జాతీయ భావాలతో చైతన్యం పొందిన యువత బ్రిటిష్ ఆధిపత్యం పట్ల తమ వ్యతిరేకతను చాటుకుంది. అదే సమయంలో బెంగాల్ సహా దేశవ్యాప్తంగా బ్రిటిష్ పాలకుల వ్యతిరేకంగా మొదలైన వహాబీ ఉద్యమం నగరంలోని ఉద్యమకారులను ప్రభావితం చేసింది. అప్పటి నిజాం నవాబు నసీరుద్దౌలా సోదరుడు ముబారిజ్ ఉద్దౌలా నగరంలో వహాబీ ఉద్యమానికి సారథ్యం వహించాడు. 20 వేల మంది వహాబీ ఉద్యమకారులతో బ్రిటిష్ అధికార ప్రతినిధిపై దాడికి ప్రయత్నించాడనే ఆరోపణలపై నిజాం ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి 1854లో చనిపోయే వరకు కోటలోనే బంధించారు. చదవండి: ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారా?.. ఈ నియమాలు తప్పనిసరి.. నగరంలో 1857 అలజడి.. మీరట్, లక్నో తదితర ప్రాంతాల్లో సిపాయిలు చేపట్టిన తిరుగుబాటు హైదరాబాద్లో పెద్దఎత్తున అలజడిని సృష్టించింది. అప్పటికే ముబారిజ్ద్దౌలా మృతితో ఆగ్రహంతో ఉన్న ఉద్యమకారులు బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కేంద్రంగా సిపాయిల తిరుగుబాటును చేపట్టేందుకు వచ్చాడనే ఆరోపణలతో జమేదార్ చీదాఖాన్ను అరెస్టు చేశారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వంపై ఉద్యమకారుల వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకుంది. జమేదార్ తుర్రెబాజ్ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ల నేతృత్వంలో సుమారు 500 మంది రొహిల్లాలు 1857 జూలై 17వ తేదీన బ్రిటిష్ రెసిడెన్సీ కోఠిపై దాడి చేశారు. బ్రిటిష్ సైనికుల ప్రతిఘటనతో ఇది విఫలమైంది. ‘బ్రిటిష్ వాళ్లను దేశం నుంచి తరిమివేయడమే తమ లక్ష్యమని’ తుర్రెబాజ్ ఖాన్ ప్రకటించడంతో అరెస్టు చేసి జీవిత ఖైదు విధించింది. జైలు నుంచి తప్పించుకొని పారిపోయే క్రమంలో పోలీసులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. అతని శవాన్ని జోగిపేట వద్ద బహిరంగంగా వేలాడదీసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ♦ఇలా నగరంలో జాతీయోద్యమానికి స్ఫూర్తినిచ్చింది ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం. -
సామ్రాజ్య భారతి: నిజాంతో బ్రిటిషర్ల సానుకూల ఒప్పందం
సామ్రాజ్య భారతి.. 1860/1947 ఘట్టాలు 1857 తిరుగుబాట్లలో విధేయ పక్షమైన హైదరాబాద్ నైజాం పాలకులతో బ్రిటిష్ ప్రభుత్వం సరికొత్త సానుకూల ఒప్పందం కుదుర్చుకుంది. కొన్ని ప్రాంతాలను కానుకగా ఇచ్చింది. చట్టాలు హైదరాబాద్ నిజామ్ అఫ్జల్ ఉద్దౌలా (1860), ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్, ఇండియన్ సెక్యూరిటీస్ యాక్ట్, అడ్మిరాలిటీ జ్యూరిస్డిక్షన్ యాక్ట్, అడ్మిరాలిటీ అఫెన్సెస్ (కలోనియల్) యాక్ట్, సూపరాన్యుయేషన్ యాక్ట్, ఈస్టిండియా లోన్ యాక్ట్, ఈస్టిండియా స్టాక్ యాక్ట్లు... అమల్లోకి వచ్చాయి. జననాలు విష్ణు నారాయణ్ భత్కాంఢే, మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించారు. భత్కాండే హిందూస్థానీ శాస్త్రీయ సంగీత పరిశోధకులు. బాంబేలో జన్మించారు. విశ్వేశ్వరయ్య ఇంజనీరు. పండితులు. రాజనీతిజ్ఞులు. 1912 నుండి 1918 వరకు మైసూరు సంస్థానానికి దివానుగా పని చేశారు. చిక్బళ్లాపూర్లో జన్మించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య -
సముద్రం పాలైన ‘హైదరాబాద్’ కరెన్సీ
అభిమానుల హృదయాలను గెలుచుకోవడమే కాదు ఆస్కార్లో అవార్డుల పంట పండించింది. బాక్సాఫీసు రికార్డులను తిరగరాసింది అప్పుడెప్పుడో వచ్చిన టైటానిక్ సినిమా. సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్లో ఉన్న విలువైన వజ్రాన్ని వెతికే క్రమంలో వెలకట్టలేని ‘ప్రేమ’ గురించి తెలుస్తుంది. టైటానిక్ ఘటన 1912 ఏప్రిల్ 14 రాత్రి జరిగింది. ఆ తర్వాత పదేళ్లకు 1922 మే 20న అదే తరహా ఘటనలో మన హైదరాబాద్ స్టేట్కి చెందిన కరెన్సీ సముద్రం పాలైంది. ఈ ప్రమాదం ఇండియాలో పేపర్ కరెన్సీ ముద్రణకు అడుగులు పడేలా చేసింది. ఆ ఘటన జరిగి వందేళ్లు పూర్తైన సందర్భంగా... దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు అప్పటి బ్రిటీష్ ఇండియాలో హైదరాబాద్ స్టేట్ ప్రిన్సిలీ స్టేట్గా ఉండేంది. హైదరాబాద్ స్టేట్కి ప్రత్యేక రైల్వే, టెలికాం, విద్యుత్లాగే సెపరేట్ కరెన్సీ ఉండేది. హైదరాబాద్ కరెన్సీని సిక్కాగా పిలిచేవారు. అప్పటి పాలకులైన నిజాం రాజులు ఈ కరెన్సీని ఎంతో భద్రంగా కట్టుదిట్టంగా లండన్లోని ప్రతిభూతి (మింట్)లో ముద్రించేవారు. అలా ముద్రించిన లక్షలాది రూపాయల విలువైన కరెన్సీని ఓడల ద్వారా ఇండియా సరిహద్దులకు తీసుకువచ్చేవారు. లండన్ నుంచి కరెన్సీ నిజాం రాజ్య పాలకుడిగా మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ కొనసాగుతున్న కాలంలో కరెన్సీ అవసరం ఉందంటూ లండన్కు కబురు పంపాడు. నిజాం ఆదేశాలను అనుసరించి లండన్ మింట్ వంద రూపాయల విలువ చేసే సిక్కా నోట్లు 40 వేలు, ఐదు రూపాయల విలువ చేసే సిక్కా నోట్లు 25 వేలు, పది రూపాయల విలువ చేసే సిక్కాలు ఒక లక్ష వంతున ముద్రించారు. మొత్తంగా ఈ కరెన్సీ విలువ ఆ రోజుల్లో రూ. 51.25 లక్షలు. సముద్రమార్గంలో ఈ కరెన్సీని ప్రయాణికుల ఓడలో ముంబైకి పార్సెల్ చేశారు. ఈ కరెన్సీ కట్టల పార్సెల్ను ది పెన్సిల్యూర్ ఓరియంటల్ స్టీమ్ నావిగేషన్ కంపెనీకి చెందిన ఓడలో వేశారు. నిజాం కరెన్సీ కట్టలు కలిగిన ఓడ 1922 మే 19న ఇంగ్లండ్ నుంచి ముంబైకి బయల్దేరింది. అలా ఇంగ్లండ్ నుంచి బయల్దేరిన ఓడ మరుసటి రోజు సెల్టిక్ సముద్ర తీరంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా సముద్ర వాతావరణం మారిపోయింది. ఎగిసిపడుతున్న అలలు, బలంగా వీస్తున్న గాలులకు ఓడ కంపించిపోయింది. జలసమాధి అల్లకల్లోల పరిస్థితుల మధ్య సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడ దారితప్పి ఫ్రెంచ్ ఓడ ఉషాంత్ను ఢీ కొట్టి నీటిలో మునిగిపోయింది. ఈ ఘటన 1922 మే 20 రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో ఓడలో ప్రయాణిస్తున్న 44 మంది ప్రయాణికులు, 294 మంది ఓడ సిబ్బంది జలసమాధి అయ్యారు. వీళ్ల ప్రాణాలతో పాటు నిజాం కరెన్సీ కూడా ఆ సముద్రంలోనే మునిగిపోయింది. తీర ప్రాంతం నుంచి 48 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఓడ జాడ లేకుండా పోయింది. పదేళ్ల పాటు నష్టపోయిన కరెన్సీ విషయంలో పార్సిల్ సేవలు అందించిన వాటర్లూ సంస్థకు నిజాం ప్రభుత్వానికి మధ్య వివాదం నడిచింది. ఆ రోజుల్లో లండన్లో ముద్రించిన కరెన్సీ హైదరాబాద్కు చేరుకున్న తర్వాత ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ సంతకం చేసిన తర్వాతే ఆ కరెన్సీనికి విలువ ఉండేంది. లేదంటే అది ఉత్త కాగితంతో సమానం. ఇలా పదేళ్ల పాటు నడిచిన కేసు 1932లో కొలిక్కి వచ్చింది. వాటికి విలువ లేదంటూ నీటిలో మునిగిపోయింది నిజాం ఆర్థిక మంత్రి సంతకం చేయని కరెన్సీ అంటే అవి ఉత్త కాగితాలతో సమానం అని కోర్టు తీర్పు వచ్చింది. ఐనప్పటికీ నిజాంకి నష్ట పరిహారంగా రెండు వేల పౌండ్లు చెల్లించాలంటూ వాటర్లూను ఆదేశించింది. ఈ కేసులో తమకు అన్యాయం జరిగినట్టుగా నిజాం రాజులు భావించారు. నిజాం ముందు చూపు సముద్రంలో కరెన్సీ మునిగిపోయిన ఘటనతో నిజాం రాజులు పునరాలోచనలో పడ్డారు. ఎంతో దూరం నుంచి లండన్లో ముద్రించి సముద్రం మార్గంలో దాన్ని తెప్పించడం వ్యయప్రయాసలతో కూడిన పనిగా వారికి అర్థమైంది. అందుకే ప్రమాదం జరిగిన వెంటనే తమ కరెన్సీ వ్యూహంలో మార్పులు చేశారు. తమ సంస్థానంలో ఉన్న నాసిక్లో పేపర్ కరెన్సీ ముద్రణాలయాన్ని 1928లో నెలకొల్పారు. నోట్ల రద్దు సమయంలో 2016 నవంబరులో ఒకేసారి సుమారు 15 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లను రద్దు చేసింది భారత ప్రభుత్వం. దీంతో ప్రజల దగ్గన నగదు లేని పరిస్థితి నెలకొంది. భారీ ఎత్తున కొత్త కరెన్సీ ముద్రించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒకప్పుడు నిజాం రాజులు స్థాపించిన నాసిక్ పేపర్ కరెన్సీ ముద్రాణాలయం నిర్విరామంగా పని చేసింది. ఫలితంగా రెండు మూడు నెలలోనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. హైదరాబాద్ మింట్ పేపర్ కరెన్సీ ఇండియాలోకి రాకముందు నాణెలు నగదుగా చలామణిలో ఉండేవి. వీటి కోసం హైదరాబాద్లో 1806లో మింట్ను ఏర్పాటు చేశారు. అంతకు ముందు 1770వ దశకంలో పేపర్ను కనుగొన్నారు. అనంతరం బ్రిటీష్ వర్తకుల రాకతో పేపర్ కరెన్సీ ఇండియాలోకి వచ్చింది. అయితే ప్రభుత్వ పరంగా ఇండియాలో తొలిసారిగా పేపర్ కరెన్సీ వాడకాన్ని బ్రిటీషర్లు 1861లో ప్రారంభించారు. ఇండియన్ కరెన్సీ లండన్లో ముద్రించేవారు. అప్పుడు అక్కడ ప్రింటింగ్ వ్యవస్థ ఉండేది. నిజాం కారణంగా ఇండియాలో పేపర్ కరెన్సీ ముద్రణ మొదలైంది. చదవండి: అది భారత భవిష్యత్తుకి మంచిది కాదంటున్న ఆర్బీఐ మాజీ గవర్నర్ -
రూ. 99 వేల కోట్ల..నిజాం నగలున్నాయి
బంజారాహిల్స్: సీఏం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోవాలంటే.. హైదరాబాద్లో నిజాం జ్యువెలరీ మ్యూజియం నిర్మించాలని ప్రిన్స్ మోజంజాహ్ మనవడు హిమాయత్ అలీ మీర్జా అన్నారు. రూ.99వేల కోట్ల విలువ చేసే నిజాం జ్యువెలరీ హైదరాబాద్కు రావాలంటే ఒక్క కేసీఆర్తోనే సాధ్యమవుతుందని వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని మషెల్లా మంజిల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం జ్యువెలరీ మ్యూజియం నిర్మించాలని తాను ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశానని తెలిపారు. ప్రస్తుతం నిజాం ఆభరణాలు ఆర్బీఐ కస్టడీలో ఉన్నాయని.. వాటిని హైదరాబాద్ తరలించాలని 4 నెలల క్రితం ప్రధానమంత్రి మోదీకి తాను లేఖ రాశానన్నారు. అందుకు ప్రధాని సుముఖత చూపుతూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డికి ఆదేశాలు జారీ చేశారన్నారు. అందుకే... రాష్ట్ర ప్రభుత్వం భద్రతతో కూడిన మ్యూజియం నిర్మించి ఇస్తే వెంటనే తరలిస్తామని కిషన్రెడ్డి ఇటీవల హామీ ఇచ్చారని చెప్పారు. నిజాంకు సంబంధించిన 2 వేల ఎకరాల భూములు 70ఏళ్లుగా హైదరాబాద్ చుట్టుపక్కల నిరుపయోగంగా ఉన్నాయని.. ఆ వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తానని, అనువైన స్థలం ఎంపిక చేసి అక్కడ మ్యూజియం నిర్మించాలని అన్నారు. ఈ మ్యూజియం నిర్మాణంతో సీఎం కేసీఆర్ ప్రతిష్ట పెరుగుతుందని, సుమారు 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. దీనివల్ల పర్యాటకంగానూ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా నిజాం భూములను స్వాధీనం చేసుకొని మ్యూజియం నిర్మించాలని ఆయన కోరారు. -
నగ మెరిసేనా!
సాక్షి, సిటీబ్యూరో: నిజాం నగలు మన ముంగిటకు రానున్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రదర్శిస్తున్న ఆభరణాలను హైదరాబాద్కు తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అనువైన స్థలం, రక్షణ కల్పిస్తే భాగ్యనగరానికి నగలు తీసుకురావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో నిజాం నగల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఆరో స్థానంలో ఉన్న నిజాంకు భారీగా ఆస్తులున్నాయి. వీటి విలువ ఏకంగా 11,80,000 కోట్లుగా అంచనా. ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ 1967లో 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇప్పటివరకు(ఆల్టైం) భారతీయుల్లోనే అత్యంత సంపన్నుల్లో ఆయన ఒకరిగా నిలిచారు. కేవలం 2012లో ఆస్తుల విలువను మదించడం ద్వారా నిజాం ఆస్తుల లెక్కను తేల్చారు. రూ.218 కోట్లకు కేంద్రం కొనుగోలు ప్రస్తుతం నిజాం నగలు కేంద్ర ప్రభుత్వ అదీనంలో ఉన్నాయి. 1995లో భారత ప్రభుత్వం వీటిని రూ.218 కోట్లకు కొనుగోలు చేసింది, 1967లో ఉస్మాన్ అలీఖాన్ మరణానంతరం నిజాం ట్రస్టీలు ప్రసిద్ధిగాంచిన ఈ ఆభరణాల విక్రయానికి అంగీకరించారు. 1970లో వీటిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. దీంతో నిజాం జ్యువెలరీ ట్రస్టీ వీటిని జాతీయ, విదేశీ సంస్థలకు విక్రయించాలని భావించారు. ఈ క్రమంలో నిజాం మనవరాలు ఫాతిమా ఫౌజియా జోక్యంతో ఆభరణాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 465 ముత్యాలు పొందుపర్చిన సత్లాడ.. 173 రకాల వజ్రాభరణాలు, వెండి వస్తువులు వీటిలో ఉన్నాయి. తలపాగా ఆభరణాలు, నెక్లెస్లు, చెవి పోగులు, ఆర్మ్ బ్యాండ్లు, కంకణాలు, గంటలు, బటన్లు, కఫ్ లింక్లు, చీలమండలు, వాచ్ చైన్, ఉంగరాలు, ముత్యాలు, వైఢూర్యాలు, పగడాలు తదితర నగలున్నాయి. నిజాంలు, వారి వారసులు ధరించిన ఆభరణాల్లో ముఖ్యంగా వజ్రాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో ఏడు తీగల బస్రా ముత్యాలహారాన్ని సత్లాడ అని పిలుస్తారు. ఇందులో 465 ముత్యాలను పొందుపర్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం.. 184.75 క్యారెట్ల బరువున్న ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద వజ్రం జాకబ్ డైమండ్ విలువైన వస్తువులలో ఒకటి. వీటిని కొనుగోలు చేసిన కేంద్రం.. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ దీనిని ప్రదర్శిస్తోంది. ఆభరణాలను తిలకించే సమయంలోనూ కేవలం 50 మందినే అనుమతిస్తోంది. విలువైన వారసత్వ సంపద కావడంతో జాగ్రత్తగా కాపాడుతోంది. నిజాం నగలను హైదరాబాద్కు తెప్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం గతంలో ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశారు. తాజాగా నగరానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. నిజాం నగలను హైదరాబాద్కు తీసుకురావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించిన నేపథ్యంలో వీటి తరలింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వాటి ప్రదర్శనకు అనువైన స్థలం, భద్రత ఏర్పాట్లను కల్పిస్తే.. నగల తరలింపునకు చొరవ చూపుతామని కిషన్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. -
MBS Jewellers: నిజాం నగల పెట్టెలు.. విడిపించాక పంచుకుందాం
సాక్షి, హైదరాబాద్: ఎంబీఎస్ జ్యువెలర్స్ నిర్వాహకుడు సుఖేష్ గుప్తపై మరో కేసు నమోదైంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నిజాం నగలను విడిపించి, పంచుకుందామంటూ నగరానికి చెందిన రాజేష్ అగర్వాల్ అనే వ్యక్తికి ఎర వేసి రూ.50.8 కోట్లు తీసుకుని మోసం చేశారు. బాధితుడు కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సిందిగా కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నేరం నిరూపించడానికి అవసరమైన ఆధారాలు సేకరిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. నిజాంకు చెందిన నగలతో కూడిన ఐదు బాక్సులు సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డుల కమిషనర్ ఆధీనంలో ఉన్నాయని, వీటిని విడిపిద్దామంటూ సుఖేష్ గుప్తా, మహ్మద్ జకీర్ ఉస్మాన్ అనే వ్యక్తితో కలిసి రాజేష్ అగర్వాల్ను సంప్రదించారు. నిజాం వారసుల నుంచి నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసీ) తీసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందంటూ నమ్మబలికారు. వారితో సంప్రదింపులు జరపడానికి, ఎన్ఓసీలు తీసుకోవడానికి కొంత ముట్టజెప్పాల్సి ఉంటుందంటూ రాజేష్ను నమ్మించారు. 5 నగల పెట్టెలు తమ చేతికి వచ్చాక పంచకుందామంటూ పత్రాలు సైతం రాసుకున్నారు. చదవండి: హైదరాబాద్లో ఒమిక్రాన్ గుబులు: ఆరుగురిలో నలుగురు చిక్కారు.. ఏ ఏరియా అంటే.. వీరి మాటలు నమ్మిన రాజేష్ ఆషిష్ రియల్టర్స్తో పాటు ఎంబీఎస్ జ్యువెలర్స్ సంస్థలకు ఆన్లైన్ ద్వారా రూ.50.8 కోట్లు చెల్లించారు. ఈ మొత్తం తమ చేతికి వచ్చాక నిందితులు తనను మోసం చేశారంటూ బాధితుడు న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో సుఖేష్ గుప్తతో పాటు జకీర్ ఉస్మాన్పైనా కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఒమిక్రాన్ దడ, థర్డ్వేవ్ హెచ్చరిక.. ‘బూస్టర్’ వైపు పరుగులు.. -
ఖమ్మం జిల్లా ప్రాచీన నామమేదో తెలుసా?
సాక్షి, ఖమ్మం: ఖమ్మం చారిత్రక నేపథ్యం కలిగిన జిల్లా. ఈ జిల్లాను 1953లో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఈ ప్రాంతం వరంగల్ జిల్లాలో భాగంగా ఉంది. ఖమ్మం, మధిర, ఇల్లందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్లను విడదీసి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. అలాగే 1959లో అప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్లను జిల్లాలో కలిపారు. ఈ జిల్లా భూబాగం వేర్వేరు రాజవంశాల కాలాల్లో వేర్వేరుగా ఉంది. ఖమ్మం నగరం మధ్యలో ఉన్న స్తంభాద్రి నుంచే మండపాలకు, స్తంభాలకు కావాల్సిన రాళ్లు తరలిస్తూ ఉండేవారు. అందుకే ఖమ్మంకు స్తంభాద్రి అనే ప్రాచీన నామం ఉంది. చరిత్రకారుల కథనం ప్రకారం ఖమ్మం అనే పేరు నగరంలోని నృసింహాద్రి అని పిలవబడే నారసింహాలయం నుంచి వచ్చినట్లు, కాలక్రమంలో స్తంభ శిఖరిగా.. ఆ పై స్తంభాద్రిగా మారినట్లు చరిత్రకారులు తెలుపుతున్నారు. ఉర్దూ భాషలో కంబ అంటే రాతిస్తంభం అని అందుకే ఖమ్మం అనే పేరు నగరంలోని నల రాతి శిఖరం నుంచి వచ్చినట్లు మరో వాదన ఉంది. (చదవండి: రైతు బతుకులో నిప్పులు పోసిన గ్యాస్.. బీరువాలో దాచిన రూ. 6 లక్షలు..) నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా.. చివరి నైజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి కాకలు దీరిన నాయకులు, యోధులను అందించిన ప్రాంతంగా ఖమ్మం చరిత్రలో నిలిచిపోయింది. 1931లో ఖమ్మంలో మొదటి స్వాతంత్య్ర ఉద్యమం జరిగింది. 1945లో ఖమ్మంలో 12వ రాష్ట్ర ఆంధ్ర మహాసభ సమావేశం నిర్వహించారు. ఖమ్మం నగరంతోపాటు జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకునే గాంధీ ఖమ్మం సందర్శన 1946లో జరిగింది. 1946 ఆగస్టు 5న మహాత్మాగాంధీ ఖమ్మం సందర్శించారు. పర్యాటక ప్రాంతాలివే.. జిల్లాతోపాటు ఖమ్మం నగరంలో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. నగరంలో నరసింహస్వామి ఆలయం, శ్రీజలాంజనేయ స్వామి ఆలయం, లకారం చెరువు, దానవాయిగూడెం పార్కు, తీర్థాల సంగమేశ్వర స్వామిఆలయం, లకారం పార్క్, ట్యాంక్బండ్, నేలకొండపల్లి వంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ఖమ్మం కోట చారిత్రక నేపథ్యం.. సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ 1531 ఏడాదిలో అప్పటి ఖమ్మం పాలకుడైన సీతాబ్ఖాన్ (సీతాపతిరాజు)ను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ దుర్గం కుతుబ్షాహి పాలనలో ఉంది. గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ పటిష్టమైన కోట నాలుగు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కోటకు 10 ద్వారాలు ఉన్నాయి. పశ్చిమం వైపున దిగువ కోట ప్రధాన ద్వారం, తూర్పు వైపున రాతి దర్వాజా, కోట చుట్టూ 60 ఫిరంగులను మోహరించే వీలుంది. కోటలోపల జాఫరుద్దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహల్ ఉన్నాయి. 60 అడుగులు పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న జాఫర్టౌలి అనే బావి కూడా ఉంది. కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవడానికి ఒక రహస్య సొరంగం కూడా ఉంది. (చదవండి: ఆ పంట సాగుచేస్తే రైతు బంధు, రైతు బీమా కట్.. కేసీఆర్ కీలక ఆదేశాలు) -
సెప్టెంబరు 17: సాయుధ చరిత్రకు సాక్ష్యాలు
ఓ వైపు దేశం మొత్తం స్వాతంత్య్ర సంబురాలు చేసుకుంటుంటే తెలంగాణ మాత్రం నిజాం కబంధ హస్తాల్లోనే మగ్గిపోయింది. ఉమ్మడి జిల్లాలో సామంతరాజులు స్థానికంగా గడులు నిర్మించుకుని గడ్చిరోలి జిల్లా సిరొంచా, ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్, ఆసిఫాబాద్, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, వేములవాడ తదితర ప్రాంతాల్లో శిస్తు వసూలు చేసేవారు. నాడు చెన్నూర్, ఆసిఫాబాద్, ఇందారం, తాండూర్ తదితర ప్రాంతాల్లో నిర్మించిన భవనాలు, గడులు, చెరువులు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. తాండూర్లో ఠాణా భవనం తాండూర్(ఆదిలాబాద్): నిజాం పాలనలో తాండూర్ ఓ ముఖ్య పట్టణంగా ఉండేది. ఆసిఫాబాద్–చెన్నూర్ ప్రాంతాలకు మధ్యలో, మహారాష్ట్రలోని చంద్రాపూర్కు సమీపంలో ఉండటంతో తాండూర్లో పోలీస్ ఠాణాను ఏర్పాటు చేశారు. 1912–1920 మధ్యకాలంలో అక్కడ ఓ భవనాన్ని నిర్మించారు. రెండేళ్ల క్రితం వరకు భవనాన్ని మాదారం పోలీసుస్టేషన్గా వినియోగించగా.. ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. అదేవిధంగా తాండూర్లో పోస్టాఫీసు నిర్వహణ కోసం ప్రత్యేకంగా నిజాం ప్రభుత్వం 1912 సంవత్సరంలో భవనం నిర్మించారు. ఇప్పడు కూడా ఈ భవనాన్ని పోస్టాఫీసుగా వినియోగిస్తుండటం విశేషం. రెండేళ్లు అజ్ఞాతంలో.. పట్టణానికి చెందిన సాయుధ పోరాట యోధుడు సుడిగాల విశ్వనాథ సూరి రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. పోరాటయోధులను రజాకార్లు అరెస్ట్ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న అధిష్టానం విశ్వనాథ సూరిని అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో ఆయన రెండేళ్లపాటు అజ్ఞాత జీవితాన్ని గడిపాడు. 1946లో సుభాశ్ చంద్రబోస్ అధ్వర్యంలో మహారాష్ట్రలోని సిరొంచా గ్రామంలో ఏర్పాటు చేసిన రహస్య శిబిరానికి హాజరయ్యారు. అక్కడే ఏడాదిపాటు శిక్షణ పొందారు. బల్లార్ష శిబిరంలో కూడా పాల్గొన్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనజీవనంలోకి వచ్చారు. 1952లో చెన్నూర్, లక్సెట్టిపేట ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. 1952 నుంచి 1957 వరకు పదవిలో ఉన్నాడు. ఆ తర్వాత చెన్నూర్ నియోజకవర్గాన్ని 1957లో ఎస్సీ రిజర్వు చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు చెన్నూర్కు ప్రతినిధ్యం వహించిన స్థానికుడు కేవలం విశ్వనాథ సూరి మాత్రమే. నస్పూర్లో దొరల గడి పట్టణ పరిధిలోని ఊరు నస్పూర్లో సుమారు 1927–30 మధ్య కాలంలో నస్పూర్ దొరలు నిర్మించిన గడి నాటి చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యంగా మిగిలింది. నస్పూర్కి చెందిన గోనె రాజ వెంకట ముత్యంరావు దీనిని నిర్మించారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ముత్యంరావు నాటి నిజాం ప్రభుత్వానికి నమ్మకమైన బంటుగా ఉంటూ ప్రభుత్వానికి సంబంధించి కార్యకలాపాలను ఈ గడి నుంచే పర్యవేక్షించేవారు. జన్నారం, తపాలాపూర్, నస్పూర్, ఇందారం, పెద్దపల్లి, భూపాలపల్లి, సిరొంచా గడులను కలుపుతూ ప్రత్యేక దారి ఉండేదని చెప్పుకుంటారు. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత ముత్యంరావు కుటుంబం గడిని వదిలి హైదారాబాద్లో స్థిరపడ్డారు. కాగా.. ఈ కుటుంబంలో నుంచి జీవీ సుధాకర్రావు అప్పటి లక్సెట్టిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మర్రి చెన్నారెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. సాయుధ పోరులో ఆసిఫాబాద్ యోధులు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆసిఫాబాద్ సమరయోధుల పాత్ర కీలకం. ఆసిఫాబాద్, సిర్పూర్, చెన్నూర్, లక్సెట్టిపేట, పెద్దపల్లి ప్రాంతాలకు చెందిన వేలాది మంది యువకులు కాంగ్రెస్ అతివాద నాయకులతో కలిసి పోరాటంలో పాల్గొన్నారు. ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన బోనగిరి వెంకటేశం, చీల శంకర్, చీల విఠల్, ఖాడ్రే శంకర్, రాంసింగ్, రేవయ్య, తాటిపెల్లి తిరుపతి, ఏకబిల్వం శంకరయ్య, చందావార్ విఠల్, జగన్నాథ్ మహారాష్ట్రలోని చాందా సాయుధ శిక్షణ శిబిరంలో ఏడాది పాటు శిక్షణ పొందారు. వీరికి ఆసిఫాబాద్కు చెందిన రాంచందర్ రావు పైకాజీ, సుబ్బబాబురావు, దండనాయకుల గోపాల్ కిషన్రావు, వామన్రావు వైరాగరే, ప్రభాకర్ రావు మసాదే సహకరిస్తూ వచ్చారు. క్యాంపు ఇన్చార్జీలుగా కేవీ నర్సింగరావు, కేవీ కేశవులు, వి.రాజేశ్వరరావు ఉండేవారు. మహారాష్ట్ర నుంచి సైనిక బలగాలు పది యుద్ధ ట్యాంకులు, పది ట్రక్కులు, 20 ఠానే గాఢ్లు, వందలాది మంది సైనికులతో చాందా, బల్లార్షా క్యాంపుల్లో సుశిక్షితులైన పౌరులు ఆసిఫాబాద్ వైపు ముందుకు కదిలారు. నాటి పోరాటంలో పాల్గొన్న యోధులను ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించింది. కీలక సంఘటనలు.. ► 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానాన్ని చుట్టుముట్టిన భారత సైన్యం పోలీస్ యాక్షన్ ప్రకటించింది. ►సెప్టెంబర్ 13 పొద్దుపోయాక చంద్రాపూర్, బల్లార్షా, దాభా (ఉపక్యాంపు, సిరొంచా క్యాంపుల నుంచి సాయుధ సమరయోధులు భారత సైన్యం బాటలో నిజాం పోలీసులు రజాకార్లపై విరుచుకు పడేందుకు చర్యలు ప్రారంభించారు. ► రాత్రి భారత సైన్యం హైదరాబాద్ సంస్థాన హద్దులో ప్రవేశించకుండా రాజూరా సమీపంలోని రైల్వే వంతెనకు బాంబులు అమర్చారు. ► 14న రాత్రి 11 గంటలకు రైల్వే వంతెన పేల్చివేతకు రజాకార్లు చేపట్టిన ప్రయత్నాలను సమరయోధులు గుర్తించారు. రాత్రి 12 గంటలకు ఈ విషయం కొరియర్ వ్యవస్థ ద్వారా మిలటరీకి సమాచారం అందించారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో విద్రోహులపై మిలటరీ దాడి, రజాకార్ల హతం, బాంబుల తొలగింపు. 3 గంటలకు మహారాష్ట్రలోని విరూర్ రైల్వేస్టేషన్పై ఆసిఫాబాద్కు సాయుధ యోధుల దాడి, ఈ ఘటనలో వెంకటేశం కాలికి గాయమైంది. ► 15 తెల్లవారుజామున 4 గంటలకు దాబా మీదుగా వచ్చిన మరో మిలటరీ క్యాంపు, సాయుధ పోరాట వీరులు పెన్గంగా సరిహద్దులోని లోన్వెల్లినాకాపై దాడితో మిలటరీ మార్గం సుగమం. రాత్రి 10 గంటలకు ఆసిఫాబాద్ సమీపంలోని బుజల్ఘాట్ వంతెనను రజాకార్లు పేల్చివేశారు. మరునాడు స్థానికులు ఈ వంతెనపై తాత్కాలిక మార్గం ఏర్పాటు చేసుకున్నారు. ► 16న అర్ధరాత్రి దాటాక సిరొంచా నుంచి వచ్చిన మిలటరీ, స్థానిక సమరయోధులు బెజ్జూర్ ఔట్పోస్టుపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున సాయుధ పోరాటయోధులు దహెగాం సమీపంలో పెసరకుంట వద్ద రజాకార్లపై దాడి చేశారు. ఈ సంఘటనలో 19 మంది మృతి చెందారు. అనంతరం బీబ్రా పోలీస్ స్టేషన్పై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ► ఇదేరోజు ఆసిఫాబాద్ జిల్లా జైలులో పదుల సంఖ్యలో సమరయోధులను నిర్భందించారు. 17న నిజాం లొంగుబాటు వార్తతో ఆసిఫాబాద్ జైళ్లోని సమరయోధులు ఇతర ఖైదీలతోపాటు బయటికి వచ్చారు. చదవండి: నేడు జలసౌధలో కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సబ్ కమిటీ సమావేశం -
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం: ఇక నలుదిశలా ‘దళిత బంధు’
-
నిజాం ఆస్తులు ప్రజలకే..
సాక్షి, హైదరాబాద్/లంగర్హౌస్: ‘బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులు, భూములను స్వా ధీనం చేసుకుంటాం’అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. పరాధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని తిరిగి ప్రజలకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ‘ప్రజా సంగ్రామ యాత్ర మూడోరోజైన సోమవారం సాయంత్రం ఆరెమైసమ్మ ఆలయం వద్ద నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ‘భాగ్యలక్ష్మీ అమ్మ వారి సాక్షిగా ఎంఐఎం అడ్డాను బద్దలు కొట్టిన సత్తా బీజేపీ కార్యకర్తలదే. పాతబస్తీనే కాదు.. వాళ్లు సవాల్ చేస్తే ఏ బస్తీకైనా వచ్చి కాషాయ జెండా ఎగరేస్తాం. టీఆర్ఎస్కు ఆ దమ్ము ఉందా? దేశద్రోహుల పార్టీ ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నా రు. కేసీఆర్ పాతబస్తీకి రావాలంటే ఎంఐఎం పర్మిషన్ తీసుకోవాలి. రాబోయే ఎన్నికల తరువాత దేశద్రోహుల పార్టీని తరిమికొడతాం. భాగ్యనగర్ అమ్మవారి పేరుతోనే భాగ్యనగర్ పేరొచ్చింది. గొల్ల కురుమల కొండ గొల్లకొండనే... అది గోల్కొండ కాదు. నిజాం స్థలాలు, ఆస్తులన్నీ కూడా మావే. హిందువుల స్థలాలను ఆక్రమించుకుని నిజాం ఆస్తులుగా చెప్పుకుంటున్నారు’అని అన్నారు. కుటుంబం చేతిలో తెలంగాణ తల్లి బందీ తెలంగాణ ఇచ్చిన వీరుడు సర్దార్ పటేల్ ముందు మోకరిల్లిన పార్టీ బీజేపీ అని, తెలంగాణ ప్రజల మానప్రాణాలను దోచుకుని హింసించిన నిజాం రాజు ముందు మోకరిల్లిన పార్టీ టీఆర్ఎస్దని బండి సంజయ్ ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏనాడూ ఎంఐఎం సమర్థించలేదన్నారు. తెలంగాణ తల్లి ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందని, విముక్తి చేసేందుకు బీజేపీ పోరాడుతుందని చెప్పారు. 111 జీవో పరిధిలోనే కేసీఆర్కు, ఆయన కొడుకు, కూతురుకు సామ్రాజ్యాలున్నాయని ఆరోపించారు. బీజేపీ ఏ మతానికీ, వర్గానికీ వ్యతిరేకం కాదని, కానీ హిందూ మతాన్ని కించపరిస్తే మాత్రం ఊరుకోదన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ మాట్లాడుతూ.. ఒవైసీ సోదరులపై మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం నేతలను పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల కాళ్లు పట్టుకోవటం ఎంఐఎంకు అలవాటైందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, కర్ణాటక ఎంపీ, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్చార్జి మునుస్వామి, ఎస్సీ మోర్చా జాతీయ ఇన్చార్జి లాల్ సింగ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలికి గాయం: ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రాత్రి లంగర్ హౌస్ వద్ద బండి సంజయ్ను కలిసేందుకు కార్యకర్తలు పోటీపడటంతో తోపులాట జరిగింది. ఈక్రమంలో ఆయన కిందపడిపోవడంతో కాలికి గాయమైంది. కాలికి కట్టుకట్టుకుని సోమవారం బాపూఘాట్ నుంచి యాత్రను కొనసాగించారు. టిప్పుఖాన్ బ్రిడ్జ్ మీదుగా.. ఆరె మైసమ్మ, అప్పా జంక్షన్, అజీజ్ నగర్ క్రాస్రోడ్డు మీదుగా హిమాయత్ సాగర్కు చేరుకున్నారు. యాత్ర రాజేందర్నగర్ నియోజకవర్గంలోకి చేరుకోగా మైలార్దేవరపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గుర్రాలు, ఒంటెలతో ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా బోనాలు, మంగళహారతులతో నీరాజనం పలికారు. ‘డబుల్’ ఇళ్ల లెక్క చెప్పండి: బండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు కడతామన్నారు.. ఎన్ని పూర్తి చేశారు.. లబ్ధిదారుల జాబితాతో సహా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. తాను పాల్గొన్న పట్టణాభివృద్ధి కమిటీ భేటీలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి వెల్లడించిన వివరాల ప్రకారం.. 8,000 ఇళ్లు మాత్రమే కట్టినట్లు స్పష్టమౌతోందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం పేరును టీఆర్ఎస్ సర్కార్ మార్చేసిందని, కేంద్రం ఇచ్చిన నిధులతోనే డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతున్నారని చెప్పారు. ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనే పథకం పేరును మార్చేశారన్నారు. సోమవారం మూడో రోజు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించి, హైదరాబాద్ బాపూఘాట్ సమీపంలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టర్ల కమీషన్ కోసమే డబుల్బెడ్రూం ఇళ్లు కడుతున్నారని, వాటి నాణ్యతను ఇప్పటివరకు సీఎం కేసీఆర్ పరిశీలించలేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు 2 లక్షలకు పైగా, జీహెచ్ఎంసీలో 1.40 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని ఈ ఇళ్లు ఎక్కడ కట్టారో చెప్పాలని ప్రశ్నించారు. వీటి నిర్మాణానికి కేంద్రం ఇప్పటివరకు రూ.3,500 కోట్లు విడుదల చేయగా, కేసీఆర్ సర్కార్ రూ.2,285 కోట్లు ఉపయోగించుకుందని చెప్పారు. ఇవిగాక జీహెచ్ఎంసీలో వివిధ పథకాల అమలుకు మోదీ ప్రభుత్వం రూ.1,287 కోట్లు మంజూరు చేసిందని సంజయ్ వివరించారు. ఆయుష్మాన్ భారత్ అమలేదీ.. హైదరాబాద్ శివారు భోజగుట్టలో టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు ఆక్రమించుకున్న 40 ఎకరాల స్థలంతో పాటు ఇతర చోట్ల పీఎంఏవై కింద ఇళ్లు కట్టించి ఇవ్వాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. కోవిడ్ కష్టకాలంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే వైద్యచికిత్స ఖర్చుల నుంచి పేదలకు ఉపశమనం లభించి ఉండేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నాయకులు మోకాళ్ల యాత్ర చేయకతప్పదని బండి హెచ్చరించారు. -
తనికెళ్ళ భరణి.. వెరీమచ్ ఫ్రెండ్లీ మరి!
వెబ్డెస్క్: సంప్రదాయాన్ని ఎవరైనా నిలబెడుతున్నారంటే చాలూ ‘నమస్తే అన్నా..’ వాళ్ల కోసం ఎంత దూరమైన వెళ్తాడు ఆయన. బహుశా సినీ రంగంలో ఇంత సాహితీ యావ ఉన్న నటుడు మరోకరు లేరేమో!. ఈ తోట రాముడు... పరమశివుడినే ‘ఏరా’ అంటూ జిగిరీ దోస్తుగా సంభోధిస్తుంటాడు. అదేమంటే... గది గంతే అంటాడు. ఆ ముక్కంటి ప్రియ భక్తుడైనందుకేమో.. ఈ భరణి కూడా వెరీమచ్ ఫ్రెండ్లీ మరి!. కళాధరణి ఈ సాహితీ భరణి 1954, జులై 14న సికింద్రాబాద్లో పుట్టాడు తనికెళ్ళ భరణి. నటుడికన్నా ముందు ఆయన ఒక మంచి రచయిత.. సాహితీవేత్త. నటుడిగా బిజీ అయ్యాక మాట మాట్లాడితే ‘కలం మడిచి జేబులో పెట్టేశాన’ని అంటుంటాడు. కానీ ఆ కలానికి సాగటమే తప్ప ఆగటం తెలీదు. పద్యాలు అలవోకగా చెప్పే ఆయన కవితా ధార... మాటలతో ఆయన ఆడుకునే తీరు.. చూస్తే ఎవరైనా ఆయన వీరాభిమానిగా అయిపోవటం ఖాయం. ‘‘కదలిపోతోంది... భావన వదిలి పోతోంది. వెళ్లలేక వెళ్లలేక ఒదిగిపోతోంది. ఒదిగిపోయిన భావనలతో కవితలల్లాను. కవితలన్నీ మనసులో కలమెట్టి రాశాను. కవితలను రాసి రాసి అలసిపోయాను. అలసిపోయిన నాకు చక్కని తలపు కలిగింది. తలపులన్నీ వలపులై నన్ను బాధ పెట్టాయి. బాధలో నా భావనలను చెదరగొట్టాను. వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయాయి. భావనలు వెళ్లిపోయాయి నన్ను వదిలి వెళ్లిపోయాయి’’... అని ఆయన చెప్తుంటే ‘వాహ్ వా... వాహ్ వా...’ అనకుండా ఉండలేం మరి! గురువు రాళ్లపల్లి లేకుంటేనా.. డెబ్భై దశకం మధ్యలో తనికెళ్ల భరణి సరదాగా నాటకాలు వేస్తుండేవాడు. ఆ టైంలోనే నటుడు రాళ్లపల్లి పరిచయం అయ్యారు. భరణిలోని రచనా పటిమను గుర్తించి ప్రోత్సహించాడు రాళ్లపల్లి. అలా నాటకాలకు డైలాగులు రాయడం మొదలుపెట్టాడు. అటుపై థియేటర్ ఆర్ట్స్లో డిప్లోమా చేశాడు. గురువు రాళ్లపల్లి ప్రోత్సాహంతో చెన్నైకి చేరి సినిమా డైలాగుల రచయితగా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఆనాడు రాళ్లపల్లి లేకుంటే.. ఈనాడు తనికెళ్ళ భరణి ఇలా మన ముందు ఉండేవాడు కాదేమో. ఇలాంటి వ్యక్తిని తెలుగు ప్రజానీకానికి అందించిన రాళ్లపల్లికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకోవాలి. లేకుంటే చెడు సావాసాలతో ఈ సాహితి పిపాసి జైలుకు పోయేవాడేమో! శివుడంటే ప్రాణం తెలంగాణా యాసలో ఇంత చక్కటి శివస్తుతిని పలికించగలగడం భరణి ఇస్టయిల్. నిషాని వాడిలా శివుడిని పూజిస్తూ ఆయన చెప్పిన పద్యాలు శభాష్ శంకరా. శివుడి లయలో ఈ ప్రపంచపు అన్ని కోణలని తాకతూ అభినవ భక్త కన్నప్పలా ఆయన వర్ణించిన తీరు సామాన్యుడికి సైతం అర్థమయ్యే భాషలో రచించిన తనికెళ్లకు సలాం కొట్టక ఉండలేం. సర్వం శివమయం జగత్ అనే శివ ఫిలాసఫీని సింపుల్ గా చెప్పగలిగిన సాహితివేత్త తనికెళ్ల భరణి. ‘చెంబుడు నీళ్లు పోస్తే ఖుష్... చిటికెడు బూడిద పోస్తే బస్... వట్టి పుణ్యానికి మోక్షమిస్తవు గదా శబ్బాష్రా శంకరా...’ అన్నాడు. అది వింటే శివుడు కూడా భరణి భుజంపై చేయి వేసి హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడేమో! నైజాం అభిమానం యాదగిరి, భువనగిరి అంటూ పేర్లు పెడుతూ కమెడియన్లకు, విలన్లకు తెలంగాణ యాసను అంటగట్టి గేలి చేస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తం కావడం మనం చూశాం.. చూస్తున్నాం. కానీ, నైజాం భాషను, తెలంగాణ యాసను ఎలా పలకాలో తెలియకనే సినిమాల్లో వ్యంగ్యంగా వాడుతున్నారనేది భరణి అభిప్రాయం. ‘‘సినీ పరిశ్రమలోని ఏ వ్యక్తికీ తెలంగాణ భాషపై కోపంగానీ, దాన్ని అవమానించాలన్న ఉద్దేశం ఎవరికీ ఉండదు. ఉచ్ఛరించే విధానం తెలీకనే కామెడీ కోసం ఆ భాషను వాడేసుకుంటున్నారని’’ ఆయన చెప్తుంటారు. అంతేకాదు ఓ హీరోయిన్ ను పూర్తి స్థాయి తెలంగాణలో మాట్లాడించాలన్న ఉద్దేశంతోనే విజయశాంతితో మొండిమొగుడు-పెంకి పెళ్లాం చిత్రాన్ని తీసినట్లు ఆయన చెప్తుంటారు. గతి మార్చింది ‘శివ’నేనా? దొరబాబు, పాతసామాన్లోడు, నానాజీ, తోటరాముడు, మాణిక్యంగాడు, చేపలక్రిష్ణగాడు.. ఇట్లా 800 సినిమాలకు నటనతో అలరించాడు తనికెళ్ల భరణి. ప్రారంభంలో కామెడీ వేషాలు వేసిన ఆయన.. ‘శివ’తో నానాజీ పాత్రతో విలన్గా ఓ మెట్టు పైకి ఎక్కాడు. ఇది కూడా శివుడి ఆజ్ఞ ఏమో!.. అప్పటి నుంచి విలన్ క్యారెక్టర్లలో భరణి నటన కొనసాగింది. అటుపై కమెడియన్గా, సపోర్టింగ్ రోల్స్, కమెడియన్ విలన్గా.. 2000 సంవత్సరం తర్వాత తండ్రి, బాబాయ్ లాంటి హుందా క్యారెక్టర్లతో అలరిస్తోంది భరణి నటన. అన్నట్లు దర్శకత్వ కోణంతో ఆయన అందించిన ‘మిథునం’.. తెలుగు ప్రేక్షకులకు మాంచి అనుభూతిని కూడా పంచింది. -
వయసు 26.. కేసులు 20
శంషాబాద్: అతడి పేరు మహ్మద్ గౌస్ అలియాస్ గౌస్ పాషా.. వయసు 20 సంవత్సరాలు.. పదహారేళ్ల వయసు నుంచి ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తున్న అతడిపై సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఇరవై కేసులు నమోదయ్యాయి. గతేడాది ఆగస్టులో జైలు నుంచి విడుదలైన గౌస్ తిరిగి చోరీలు చేస్తుండడంతో రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. వివరాలను శంషాబాద్ డీసీపీ ప్రకాష్రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో వివరించారు. రాజేంద్రనగర్ చింతలమెట్కు చెందిన గౌస్ పాషా ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్రవాహనంపై తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తాడు. అదే రోజు, మరసటిరోజు ఆ ఇంటి కిటికీలను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు, బంగారం దొంగిలిస్తుంటాడు. అంతేకాకుండా రాత్రి సమయాల్లో ఒంటిరిగా వెళ్తున్న వారిని బెదిరించి డబ్బులు, నగలు లాక్కోవడం వంటి నేరాలు కూడా చేశాడు. ఇటీవల రాజేంద్రనగర్ సర్కిల్ సులేమాన్నగర్లో కత్తులతో వీధుల్లో తిరిగి స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పర్యవేక్షణలో శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు అతడిని ఆదివారం రాజేంద్రనగర్లో అరెస్ట్ చేశారు. అతడి నుంచి 50 తులాల బంగారంతో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గౌస్పై పీడీయాక్టు, రౌడీషీట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసును ఛేదించిన పోలీసులకు రివార్డు అందజేశారు. 2018లో నిజాం మ్యూజియంలో జరిగిన బంగారు టిఫిన్ బాక్స్, స్పూన్, బంగారంతో చేసిన ఖురాన్లు దొంగతనం కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. చదవండి: మొన్న లక్ష, నిన్న రూ.70 వేలు ఇంటి ముందు పడేశారు! -
న్యాయం చేయండి: నిజాం మనవరాలు షఫియా షకీన
సాక్షి, హిమాయత్నగర్: మా తాత, నిజాం నవాబు వలేషాన్ ప్రిన్స్ మౌజామ్ జా బహుదూర్కు చెందిన ‘ప్రిన్స్ మౌజామ్ జా బహుదూర్ ట్రస్ట్’ స్థలాన్ని అన్యాయంగా ట్రస్టీ చైర్మన్ జాఫర్ జావెద్ కబ్జా చేశారని ఆ నవాబు ముని మనవరాలు, నిజాం నవాబ్ హుస్సేన్ అలీఖాన్ కుమార్తె ప్రిన్సెస్ షఫియా షకీన ఆరోపించారు. ట్రస్టుకు చెందిన స్థలాన్ని లీజుకు ఇవ్వడం కానీ, అమ్మడానికి కానీ వీలు లేదన్నారు. ట్రస్టులో నాకు భాగస్వామ్యం ఉన్నప్పటికీ నాకు ఏ మాత్రం చెప్పకుండా దానిని కబ్జా చేసి నాపై దౌర్జాన్యానికి తెగబడుతున్నారని ఆమె పేర్కొన్నారు. గురువారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఆమె భర్త మహ్మద్ అజారుద్దీన్ హైదర్, కుమారుడు హుస్సేన్ హైదర్లతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. బంజారాహిల్స్ రోడ్ నెం.3లో 24.10 ఎకరాల్లో మా స్థలం ఉందని, మా తాత గారు 1949లో చనిపోయేప్పుడు ట్రస్టును ఏర్పాటు చేసి నాతో పాటు మరో 13 మందికి ట్రస్ట్ భాగస్వామ్యాన్ని అప్పగించారన్నారు. ప్రస్తుతం ఈ స్థలంలో ముఫకంజా కాలేజీని స్థాపించి సొమ్ము చేసుకుంటున్నారని, ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపి కబ్జా కోరల్లో ఉన్న సదరు స్థలాన్ని కాపాడి, తమతో పాటు ట్రస్టు సభ్యులకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
రేడియో వినాలా.. మీ దగ్గర లైసెన్స్ ఉందా?
సాక్షి, హైదరాబాద్: బైక్ లైసెన్స్, కారు లైసెన్స్ గురించి అందరికీ తెలుసు.. కానీ, రేడియో లైసెన్స్ గురించి ఎప్పుడైనా విన్నారా! రేడియో వినాలన్నా పన్ను.. కొనాలన్నా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రేడియో కొన్నవారు తొలుత రూ.15 చెల్లించి లైసెన్సు తీసుకునేవారు. అది క్రమంగా రూ.50కి పెరిగింది. అప్పట్లో నగరంలోని ఆజంపురా పోస్టాఫీసులో రేడియో లైసెన్సు దొరికేది. లైసెన్సుకు ఏడాది గడువు ముగిశాక రెన్యువల్ చేసుకోవాల్సిందే. లైసెన్సు లేకుండా రేడియో వింటున్నామన్న సంగతి వైర్లెస్ ఇన్స్పెక్టర్కు తెలిసిందో ఇక అంతే! రేడియోను జప్తు చేసేవారు. రూ.50 జరిమానా చెల్లిస్తేనే రేడియోను తిరిగి ఇచ్చేవారు. ఈ నిబంధనలు నిజాం కాలం నుంచి 1985 వరకు ఉండేవి. ఇక్కడ 1935లో దక్కన్ రేడియో ప్రారంభమైంది. ఇంతకంటే ముందే 1918లోనే షేక్ మహబూబ్ నగరానికి రేడియోను పరిచయం చేశారు. ముంబైలో ఉండే తన మిత్రుడు ఇంగ్లండ్, జర్మనీ తదితర దేశాల్లో తయారైన రేడియోలను విక్రయించేవాడు. అతడి సలహా మేరకు నగరంలోని చెత్తాబజార్లో ‘మహబూబ్ రేడియో’పేరిట దుకాణం తెరిచారు. నగరంలో మొదటి రేడియో షాప్ అదే. ప్రస్తుతం ఈ దుకాణాన్ని ఆయన కొడుకులు మహ్మద్ ముజీబుద్దీన్, మహ్మద్ మొయినుద్దీన్ నడుపుతున్నారు. తొలినాళ్లలో ఉన్నత వర్గాలు, ధనికుల వద్ద మాత్రమే రేడియో ఉండేది. ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలు మాత్రం మహబూబ్ రేడియో దుకాణం దగ్గరికి వార్తలు వినేందుకు వచ్చేవారు. ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 7.30 గంటలకు ఆ ప్రాంతం జనంతో నిండిపోయేది. ‘మార్కోనీ’తో మొదలై.. మార్కోనీ తయారు చేసిన రేడియో నుంచి చివరిసారిగా ఫిలిప్స్ తయారు చేసిన రేడియో దాకా ఆ షాపులో ఉన్నాయి. 150 ఏళ్ల క్రితం తయారైన రేడియోలు ఇప్పటికీ పనిచేస్తుండటం విశేషం. తొలిసారి 1860లో మార్కోనీ తయారు చేసిన రేడియోకు ఒకే బ్యాండ్ ఉండేది. దాన్ని ‘లాంగ్ వే’అనేవారు. అనంతరం మీడియం వే, షార్ట్ వే.. ఇలా బ్యాండ్లు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం సింగిల్, షార్టు వేపై 1–3 వరకు, మీడియం వేపై 1200 వరకు బ్యాండ్లు వస్తున్నాయి. -
నిజాం కుటుంబంలో తీవ్ర విషాదం
సాక్షి, హైదరాబాద్ : నిజాం కుటుబంలో విషాదం నెలకొంది. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చిన్న కుమార్తె బషీరున్నిసా బేగం(93) మంగళవారం కన్నుమూశారు. వయసు సైబడిన కారణంగా గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. కాగా ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ సంతానంలో ఈమె చివరిది. అంతేకాకుండా నిజాం నవాబు సంతానంలో ఇప్పటివరకు బతికి ఉన్నది కూడా ఆమె ఒక్కరే. నవాబ్ కాజీమ్ యార్ జంగ్ను వివాహం చేసుకోగా ఆయన 1998లో కన్నుమూశారు. ప్రస్తుతం బషీరున్నిసా బేగం పురాణీ హవేలీలో నివసముంటున్నారు. బషీరున్నిసా బేగం మరణం పట్ల నిజం కుటుంబానికి చెందిన పలువురు కుటుంబసభ్యులు సంతాపం తెలియజేయడానికి ఆమె నివాసాన్ని సందర్శిస్తున్నారు. పలువురు ప్రముఖులు సైతం సంతాపం తెలిపారు. కాగా ఆమె అంత్యక్రియలు ‘జోహార్’ ప్రార్థనల అనంతరం పాతబస్తీలోని దర్గా యాహియా పాషా స్మశాన వాటికలో జరుగుతాయని బంధువులు తెలిపారు. -
నిజాం వారసుడి అద్భుత సృష్టి
సాక్షి, బంజారాహిల్స్: ఆయన అందరిలా ఉండాలనుకోలేదు.. ఏదో ఒక ప్రత్యేకతతో పది మందిలో నిలవాలనుకున్నాడు.. అందుకోసం కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని కూడా లెక్క చేయలేదు.. ఏళ్ల తరబడి కష్టపడి ఓ కొండనే నిర్మించుకున్నాడు. హైదరాబాద్ మొత్తాన్ని వీక్షిస్తూ టీ తాగాలన్న ఒకే ఒక్క కోరికతో ఆ కొండను మలిచాడు. ఆయనే 6వ నిజాం మహబూబ్ అలీఖాన్ (గ్రేట్ గ్రాండ్ ఫాదర్) ముని ముని మనవడు రౌనక్ యార్ఖాన్. ఆయన ప్రత్యేకతలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–25లోని ఎంసీఆర్హెచ్ఆర్డీని ఆనుకొని రౌనక్ యార్ఖాన్కు 75 ఎకరాల స్థలం ఉంది. దీన్ని బూత్ బంగ్లా స్థలమని కూడా పిలుస్తుంటారు. తరచూ ఈ స్థలంలో సినిమా షూటింగ్లు జరుగుతుంటాయి. పదేళ్ల క్రితం రౌనక్కు ఓ ఆలోచన వచ్చింది. అత్యంత ఎత్తైన కొండ మీద కూర్చొని చాయ్ తాగుతూ హైదరాబాద్ను చూడాలని ఆ కోరిక. దాన్ని అమల్లో పెట్టేందుకు సుమారుగా రూ.5 కోట్లు ఖర్చు చేశాడు. ఆ స్థలంలోనే ఏడు ఎకరాల్లో 8 ఏళ్ల పాటు శ్రమించి లారీలతో ప్రొక్లెయిన్లతో మట్టి, రాళ్లను పేర్చుకుంటూ 180 అడుగుల ఎత్తులో కొండను మలిచాడు. ఆ కొండపైన ఎకరం విస్తీర్ణంలో లాన్, షెడ్డు, చిన్నచిన్న పార్టీలు చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించాడు. ఆ కొండపై కూర్చొని చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. చార్మినార్, గోల్కొండ నుంచి హుస్సేన్సాగర్, మౌలాలి గుట్ట కూడా కనిపించాల్సిందే. 6వ నిజాం మహబూబ్ అలీఖాన్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా తాను ఈ కొండను మలుచుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా రౌనక్ యార్ఖాన్ తెలిపాడు. జూబ్లీహిల్స్ అంటేనే కొండలు. ఆ కొండల్లోనే ఆయన ఇంకో కొండను మలిచాడు. వర్షం పడ్డప్పుడు ఈ కొండపైన కూర్చుంటే కశ్మీర్ను తలపిస్తుందని ఈ సందర్భంగా రౌనక్ వెల్లడించాడు. రాత్రి పూట చూస్తే విద్యుత్ దీపాల కాంతుల్లో నగర ధగధగలు కనువిందు చేస్తాయన్నారు. దీనిపైన ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసం హాలును కూడా నిర్మించానని, ఔత్సాహికులు ఈ కొండపైన తమ చిత్రకళా ప్రదర్శనను ప్రత్యేకతతో ఏర్పాటు చేసుకుంటారన్నారు. ఇక గత 35 సంవత్సరాలుగా బూత్ బంగ్లా ప్రాంతంలో కులమతాలకు అతీతంగా హోలీ వేడుకలు నిర్వహిస్తున్నానని, గత 6 ఏళ్లుగా ఈ హోలీ వేడుకల్ని తాను నిర్మించిన గుట్టపైనే చేస్తున్నానని తెలిపాడు. 105 ఏళ్లుగా ఈ స్థలం తమ ఆధీనంలోనే ఉందని ఇక్కడ ప్లాట్లు చేసి విక్రయిస్తే కోట్లాది రూపాయలు వస్తాయని, అది తనకు ఇష్టం లేదన్నారు. ఈ కొండనే తనకు పూర్తి సంతృప్తిని ఇస్తున్నదన్నారు. ప్రతిరోజూ సాయంత్రం పూట ఇక్కడకు వస్తుంటానని ఒంటరిగా కుర్చీలో కూర్చొని నగరాన్ని చూస్తుంటే ఎన్ని కోట్లు వెచ్చించినా ఆ ఆనందం రాదన్నారు. ఇదిలా ఉండగా నిజాం హయాంలో రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా ఈ స్థలంలోనే ఒక బంకర్ నిర్మించారని ఎయిర్ రైడ్ షెల్టర్ కూడా నిర్మించారని అవి ఇప్పటికీ ఈ స్థలంలో ఉన్నాయన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–25లో తనకున్న 75 ఎకరాల స్థలాన్ని ఎప్పటికీ అమ్మేది లేదని, ఇలా ఉండటమే తనకు ఇష్టమన్నారు. ఈ స్థలం విలువ సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని తెలిపాడు. కొండ, దాని చుట్టూ అడవి ఉంటే ఆ ఆనందమే వేరన్నారు. దీన్ని ఇలాగే కాపాడుకుంటానన్నారు. కొండపైన ఇంకా కొన్ని సౌకర్యాలు కల్పించే యోచన ఉందన్నారు. తనకున్న ఈ ఖాళీ స్థలంలో రంగస్థలంతో పాటు ఎన్నో సినిమా షూటింగ్లు జరిగాయన్నారు. -
కంప్యూటర్ కాలం.. కిరోసిన్ ఫ్యాన్
సాక్షి సిటీబ్యూరో: కిరోసిన్ ఫ్యానా..అదేంటి.. అనుకుంటున్నారా.. అవునండీ.. సిటీలో ఇంకా కిరోసిన్ఫ్యాన్లు ఇంకా కొందరు ఉపయోగిస్తున్నారు. నిజాం కాలం నాటి పురాతన ఫ్యాన్లు పాతబస్తీలో అక్కడక్కడా వాడుతున్నారు. ఫ్యాన్ కనుగొన్న తొలినాళ్లలో విద్యుత్తో కాకుండా వేడితో తిరిగేలా చేసేవారు. మరో విషయమేమంటే.. ఇప్పటికీ ఇలాంటి ఫ్యాన్లను రిపేరు చేసేవారు కూడా ఉన్నారు. విదేశాలనుంచి దిగుమతి... నిజాం పాలనలో నగరానికి వివిధ దేశాలనుంచి టెక్నాలజీ దిగుమతి అయ్యేది. ముఖ్యంగా ఇళ్లలో వినియోగించే ఫ్యాన్లు, విద్యుత్తు పరికరాలు, వాహనాలు, షాండిలియర్స్, రిఫ్రీజిరేటర్లు తదితర వస్తువులు తయారైంది ఆలస్యం సిటీకి వచ్చేవి. అలా కిరోసిన్ ఫ్యాన్ కూడా ఇంగ్లండ్ నుంచి వచ్చింది. పాతబస్తీలోని పురానీహవేలీ నివాసి మహ్మద్ హనీఫ్ ఇల్యాస్ బాబా ఇంట్లో కిరోసిన్ ఫ్యాన్ ఇంకా పనిచేస్తోంది. డిజైన్ డిఫరెంట్.. దీనిని 1800లో ఇంగ్లాండ్లో కనుగొన్నారు. ఫ్యాన్ కింది బాగం గుండ్రంగా ఉంటుంది. ఇందులో కిరోసిన్ వేస్తారు. ఓ చివర దీపం వెలిగిస్తారు. దీపం నుంచి పైపుల ద్వారా వేడి పైకి వెళుతుంది.దీని రూపకల్పనలో నీరు, సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉపయోగించారు. కింద వెనుక బాగంలో కాస్త పైప్ ఉంటుంది. ఇందులో వేడితో పాటు గ్యాస్ ప్రవేశిస్తుంది. దీంతో ఆవిరితో ఫ్యాన్ తిరగడం ప్రారంభమవుతుంది. ఎంత వేడి పెంచితే అంత వేగంగా రెక్కలు తిరుగుతాయి. నగరంలోనే అరుదుగా.. 1980 వరకు పాతబస్తీలోని పలు ఇళ్లలో వినియోగించే వారు. విద్యుత్తుతో నడిచే ఫ్యాన్లు మార్కెట్లో వచ్చాక దీనిగురించి ఆలోచించడం మానేశారు. పలు ఇళ్లల్లో పదేళ్ల క్రితం వరకు వినియోగించారని పురానీ హవేలీ నివాసి ముజాహిద్ తెలిపారు. -
‘మ్యూజియం దొంగలకు’ రెండేళ్ల జైలు
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలోని పురానీహవేలీలో ఉన్న హిజ్ ఎగ్జాల్డెడ్ హైనెస్ (హెచ్ఈహెచ్) నిజాం మ్యూజియంలో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను నాంపల్లి కోర్టు దోషులుగా తేల్చింది. 2018లో జరిగిన ఈ కేసును సిటీ దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రికార్డు సమయంలో ఛేదించి, సొత్తును యథాతథంగా రికవరీ చేశారు. ఆ ఏడాది సెప్టెంబర్ 4 తెల్లవారుజామున ఈ దొంగతనం జరగ్గా.. అదే నెల 11న ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ముబిన్ అనారోగ్యం నేపథ్యంలో 2018 జూలై ఆఖరి వారంలో మస్రత్ మహల్ సమీపంలో ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటంతో టోకెన్ తీసుకున్న మొబిన్ కాలక్షేపానికి దగ్గరలో ఉన్న నిజాం మ్యూజియంలోకి వెళ్లాడు. అక్కడ అవసరమైన భద్రత చర్యలు లేకపోవడంతో పాటు అందులో ఉన్న బంగారం టిఫిన్ బాక్స్, కప్పు, సాసర్, టీ స్ఫూన్లతో పాటు బంగారం పొదిగిన ఖురాన్ను ఇతడిని ఆకర్షించాయి. ఈ పురాతన వస్తువుల్ని చోరీ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించాడు. రాజేంద్రనగర్ ప్రాంతానికే చెందిన సెంట్రింగ్ వర్కర్ మహ్మద్ గౌస్ పాషాతో కలిసి రంగంలోకి దిగాడు. వీరిద్దరూ 2018 సెప్టెంబర్ 3 అర్ధరాత్రి స్క్రూడ్రైవర్లు, కటింగ్ ప్లేయర్, మేకులు పీకే ఉపకరణం, తాడు, పది హాక్సా బ్లేడ్స్లతో ద్విచక్ర వాహనంపై మ్యూజియం వద్దకు చేరుకున్నారు. వెంటిలేటర్పై ఉన్న గ్లాస్, గ్రిల్స్ తొలగించిన దాని ద్వారా మొబిన్ లోపలకు దిగాడు. ఓ అల్మారా పగులకొట్టి టిఫిన్ బాక్స్, కప్పుసాసర్, స్ఫూను తస్కరించి బ్యాగ్లో సర్దుకుని రాగా.. ఇద్దరూ కలిసి వాహనంపై పరారయ్యారు. తొలుత ఆ వస్తువుల్ని గోతిలో పాతిన ఇద్దరూ ముంబై వెళ్లి వచ్చిన తర్వాత తవ్వి తీసి భోజనం చేశారు. ఆ ఏడాది సెప్టెంబర్ 4న నమోదైన ఈ కేసులో నిందితుల కోసం రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు ఇద్దరినీ పట్టుకోవడంతో పాటు బంగారం టిఫిన్బాక్స్, టీకప్పు, సాసర్, స్ఫూన్ స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ రూ.300 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన మీర్చౌక్ పోలీసులకు నిందితులపై పక్కాగా అభియోగాలు మోపారు. వీటిని విచారించిన నాంపల్లి కోర్టు మంగళవారం ఇద్దరు దొంగల్నీ దోషులుగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. -
నిజాం కేసులో పాక్కు మరో దెబ్బ
లండన్: లండన్లోని నేషనల్ వెస్ట్ మినిస్టర్(నాట్వెస్ట్) బ్యాంక్లో దశాబ్దాలుగా ఉన్న హైదరాబాద్ నిజాంలకు చెందిన 3.5 కోట్ల పౌండ్లు నిధులు భారత ప్రభుత్వం, నిజాం వారసులు ముఖ్రంఝా, ముఫఖం ఝాలకే చెందుతాయని అక్టోబర్లో హైకోర్ట్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఆ నిధులు తమవేనంటూ వాదించిన పాక్కు చుక్కెదురైంది. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి న్యాయమూర్తి మార్కస్ స్మిత్ మరో తీర్పునిచ్చారు. ఇది కూడా పాకిస్తాన్ను దెబ్బతీసేదే. పాకిస్తాన్ తమ ప్రతివాదులకు ఈ వివాదానికి సంబంధించి అయిన న్యాయపరమైన ఖర్చుల మొత్తంలో 65% చెల్లించాలని ఆయన గురువారం తీర్పునిచ్చారు. ‘ఈ వివాదానికి సంబంధించిన ఖర్చుల కింద వారికి ఎంత మొత్తం చెల్లించాలనే విషయంలో ఒక అంగీకారానికి రాని పక్షంలో.. ప్రతివాదులకైన ఖర్చులో 65% పాకిస్తాన్ చెల్లించాలి’ అని స్పష్టం చేశారు. 65% పాక్ చెల్లిస్తే.. ప్రతివాదులైన భారత ప్రభుత్వానికి సుమారు 28 లక్షల పౌండ్లు, ప్రిన్స్ ముఫఖం ఝాకు సుమారు 18 లక్షల పౌండ్లు, ప్రిన్స్ ముఖరం ఝాకు సుమారు 8 లక్షల పౌండ్లు లభిస్తాయి. ‘1948 నాటి ఈ వివాదం ఈ నాటికి పూర్తిగా ముగిసింది’ అని నిజాంల తరఫున వాదించిన పాల్ హీవిట్ వ్యాఖ్యానించారు. జస్టిస్ స్మిత్ ఇచ్చిన తీర్పును సవాలు చేయాలని పాక్ నిర్ణయించుకోలేదని, అందువల్ల ఆ నిధులను తన క్లయింట్లను వినియోగించుకోవచ్చని తెలిపారు. 1948లో ఏడవ నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ 10 లక్షల పౌండ్లను బ్రిటన్లోని పాకిస్తాన్ హైకమిషనర్ హబీబ్ ఇబ్రహీంకు పంపించారు. హైదరాబాద్లోని తన ఖాతా నుంచి లండన్లోని నాట్వెస్ట్ బ్యాంక్లోని హబీబ్ ఖాతాకు ఆ మొత్తాన్ని బదిలీ చేశారు. ఆ మొత్తం తమదేనని నిజాం వారసులు, భారత ప్రభుత్వం వాదించగా, ఆయుధాల కొనుగోలు నిమిత్తం వాటిని తమకు బదిలీ చేశారని, ఆ నిధులు తమవేనని పాకిస్తాన్ వాదించింది. అనంతరం, నిజాం వారసులు, భారత ప్రభుత్వం ఒక్కటిగా తమ వాదనలు వినిపించాయి. -
నిజాం నిధులు వచ్చేస్తున్నాయ్..!
సాక్షి, హైదరాబాద్: 1948 సెప్టెంబర్ 17వ తేదీకి కొన్ని గంటల ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నుంచి లండన్లోని పాకిస్తాన్ హైకమిషనర్ అకౌంట్కు చేరిన నిజాం నిధులు మళ్లీ వెనక్కి వచ్చేస్తున్నాయి. సుమారు 70 ఏళ్ల నిధుల వివాదంపై అక్టోబర్ 3న లండన్ రాయల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్.. 1948లో బదిలీ అయిన రూ.3.5 కోట్ల నిధు లు తిరిగి నిజాం వారసులు, భారత దేశానికే చెందుతా యని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తమ తీర్పుపై పాకిస్తాన్కు అభ్యంతరాలుంటే నెల రోజుల్లో అప్పీల్ చేసుకోవాలని గడువు విధించింది. అయితే నవంబర్ 4వ తేదీ వరకు పాకిస్తాన్ అప్పీల్ రాయల్ కోర్టు ఆఫ్ జస్టిస్ ముందుకు రాకపోవటంతో నిధుల బదిలీ ఇక లాంచనమేనని నిజాం వారసులు భావిస్తున్నారు. 306 కోట్లకు చేరిన నిధులు.. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనానికి కొన్ని గంటల ముందు నాటి ఆర్థికమంత్రిగా పనిచేసిన మీర్ నవాజ్ ఝంగ్కు చెందిన హైదరాబాద్లోని ఎస్బీహెచ్ అకౌంట్ నుంచి రూ.3.5 కోట్లు (1,007,940 పౌండ్ల 9 షిల్లింగ్లు) లండన్లో పాకిస్తాన్ హైకమిషనర్ రహమ తుల్లా అకౌంట్లోకి బదిలీ అయ్యాయి. భారత్లో హైదరాబాద్ విలీనం కావటం, ఉస్మాన్ అలీఖాన్ రాజ్ ప్రముఖ్గా నియామకం అయ్యాక ఈ నిధులు తిరిగి తనకు పంపాలంటూ ఉస్మాన్ అలీఖాన్ పాకిస్తాన్ను కోరినా ఫలితం కనిపించలేదు. దీంతో బ్రిటన్లోని నాట్వెస్ట్ బ్యాంక్లో ఉన్న ఆ నిధులు, వడ్డీలు కలుపుకుని ప్రస్తుతానికి రూ.306 కోట్లకు చేరాయి. భారత ప్రభుత్వం ఇంప్లీడ్.. ఈ నిధుల వివాదంపై పాకిస్తాన్తో న్యాయపరంగా కొట్లా డుతున్న నిజాం మనుమలు ముకర్రం ఝా, ముఫకం ఝాలకు మద్దతుగా 2013లో భారత ప్రభుత్వం లండన్ కోర్టులో ఇంప్లీడ్ అయింది. దీంతో పాకిస్తాన్ తన వాదనల వేగాన్ని పెంచి ‘భారత్ మాపై ఆక్రమణ చేస్తున్న సమయంలో ఆయుధాల కోసం నిజాం ఆ నిధుల్ని మాకు పం పారు.’ అని వాదనలను వినిపించినా.. కోర్టు కొట్టేసి నిధులను భారత్, నిజాం వారసులకు కేటాయించింది. అయితే ఈ నిధులను భారత్, నిజాం వారసులకు చెరో సగం చొప్పున పంచుతారా..? లేక భారత్కు 51 శాతం, వారసులకు 49 శాతం మేర పంచుతారా..? అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతివాల్సి ఉంది. -
నిజాం నిధుల్లో.. ఎవరికెంత!
సాక్షి, హైదరాబాద్: భారత్ సొంతమైన నిజాం నిధుల్లో ఎవరి వాటా ఎంత అన్నది ఆసక్తిగా మారింది. 1948లో అప్పటి నిజాం రాజు ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ నుంచి పాకిస్తాన్లోని బ్రిటీష్ హై కమిషనర్కు బదిలీ చేసిన రూ.3.5 కోట్లు భారత్, నిజాం వారసులవేనంటూ లండన్ హైకోర్టు తీర్పిచ్చిన విషయం తెలిసిందే. ఆ మొత్తం ప్రస్తుతం రూ.306 కోట్లకు చేరింది. ఉస్మాన్ అలీఖాన్ మనవడు, ఎనిమిదవ నిజాం ముకర్రంజా, ఆయన సోదరుడు ముఫకంజాతో పాటు భారత ప్రభుత్వానికి సైతం వాటా లభించనుంది. భారత ప్రభుత్వానికి 70 శాతం, నిజాం వారసులకు 30 శాతం నిధులు వచ్చేందుకు అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. లండన్ హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు పాకిస్తాన్కు 4 వారాల సమయం ఉంద. ఈ విషయమై నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి నజాఫ్ అలీఖాన్న్గురువారం మీడియాతో మాట్లాడుతూ, పాకిస్తాన్ అప్పీల్కు వెళితే సిద్ధంగా ఉన్నామని, లేనట్లయితే వచ్చే నిధుల్లో 4 భాగాలు చేయాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. -
ఔను.. ఇది కిరోసిన్ ఫ్రిడ్జ్
సాక్షి సిటీబ్యూరో: నిజాం పాలనలో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే నూతన టెక్నాలజీని నగరానికి తెప్పించేవారు. అవి హైదరాబాద్ సంస్థాన పాలకులు, నవాబులు, ధనికుల ఇళ్లలోకి చేరేవి. ఆలాంటి వాటిలో ఫ్యాన్లు, విద్యుత్ పరికరాలు, వాహనాలు, షాండ్లియార్లు వంటివి ఉన్నాయి. ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీతో పాటు ఇతర దేశాల్లో తయారయ్యే విలాస వస్తువులు మన దేశంలో తొలుత నగరానికే వచ్చేవి. ఇలాంటి వాటిలో ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు ‘కిరోసిన్ రిఫ్రిజిరేటర్’ కూడా ఉంది. కిరోసిన్ రిఫ్రిజిరేటరేంటి..! అలాంటిది కూడా ఒకటుందా..!! అని ఆశ్చర్యపోవద్దు. తొలినాళ్లలో రిఫ్రిజిరేటర్ విద్యుత్తో కాకుండా కిరోసిన్, నూనెతో పనిచేసేవి. ఆ నాటి ఆ రిఫ్రిజిరేటర్ ఇప్పటికీ పాతబస్తీలోని ఓ ఇంట్లో వాడుకలో ఉంది. ఈ రిఫ్రిజిరేటర్ వాడకం కూడా చాలా సులువు. అవసరాన్ని బట్టి దీపాన్ని ఎక్కువ,తక్కువగా మండిస్తే చాలు కావాల్సినంత గ్యాస్ ఉత్పత్తి అవుతంది. ఇందులో ఉంచిన పదార్థాలు అంతే తొందరగా చల్లాబడతాయి. పైగా నిర్వహణ కూడా చాలా తేలిక. ఫ్రాన్స్ నుంచి దిగుమతి కిరోసిన్ రిఫ్రిజిరేటర్ను ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఫెర్డినాండ్ కారే 1858లో కనుగొన్నాడు. ఫ్రిజ్ కింది భాగంలో ఓ పెట్టె ఉంది. ఇందులో కిరోసిన్ పోసి దాని కింది భాగంలోని ఓ చివర దీపం వెలిగిస్తారు. దాన్నుంచి వెలువడే వేడితో నీరు, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మండిస్తే వెలువడే గ్యాస్ ఫ్రిజ్ వెనుక భాగంలో అమర్చిన పైపుల ద్వారా లోపలికి ప్రవేశించడంతో అందులోని పదార్థాలను చల్లగా ఉంటాయి. నగరంలోనే అరుదుగా.. నిజాం కాలంలో నగరంలోని ధనికులు ఈ రిఫ్రిజిరేటర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. 1980 వరకు పాతబస్తీలోని పలు నివాసాల్లో ఇలాంటి ఫ్రిడ్జిలు ఎక్కువగా వినియోగించే వారు. విద్యుత్ రిఫ్రిజిరేటర్లు వచ్చాక వీటి వినియోగం తగ్గింది. తమ ఇంటిలో పదేళ్ల క్రితం వరకు ఇలాంటి కిరోసిన్ ఫ్రిడ్జ్ వినియోగించారని జహీరానగర్ నివాసి ముజాహిద్ తెలిపారు. కూలింగ్ ఎక్కువ కావాలంటే దీపాన్ని పెద్దగా> మండించేవారని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. 175 ఏళ్లుగా సేవలు 19వ శతకంలో తయారైన ఈ కిరోసిన్ రిఫ్రిజిరేటర్ను నేను సంపాదించాను. ఆ రోజుల్లో విద్యుత్ అందుబాటులో లేని ప్రాంతాలు, మిలటరీ క్యాంపుల్లో ఆహారం నిల్వ ఉంచేందుకు వీటిని వాడేవారు. ఇప్పటికీ ఇది అద్భుతంగా పనిచేస్తోంది.– మీర్ యూసుఫ్ అలీ, జహీరానగర్ -
వజ్రాల వేలం.. కోట్లలో అమ్ముడుపోయాయి!
-
కత్తికి పదునే కాదు.. ధర కూడా ఎక్కువే
మన భారతదేశంలో వజ్ర వైడుర్యాలకు కొదువే లేదు. భారత్ను పాలించిన మహారాజులు వాడిన అపురూప ఆభరణాలు ఎన్నో ఎన్నెన్నో... మరి అలాంటి ఆభరణాలు, వజ్రాలు, రత్నాలు వేలం వేయగా వచ్చిన డబ్బెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అమూల్యమైన ఈ సంపదను దక్కించుకున్న ఆ సంస్థ ఏంటి? నిజాం నవాబు వాడిన కత్తి ఎంత ధరకు అమ్ముడుపోయింది? ఎన్ని దేశాలు ఈ వేలంలో పాల్లొన్నాయి.... ఆ విశేషాల కోసం ఈ వీడియో వీక్షించండి. -
గట్టికోట వట్టికోట
నిజాం రాచరిక పాలనను అంతమొందించేందుకు తన రచనలతో తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపిన ధీశాలీ, కమ్యూనిస్టు నేత, ప్రచురణ కర్త, పాత్రికేయుడు, గ్రంథాలయోద్యమకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, అన్నింటికీ మించి తెలుగులో రాజకీయ నవలకు ఆద్యుడు, గట్టికోట మన వట్టికోట ఆళ్వార్ స్వామి. వట్టికోట ఆళ్వార్ స్వామి నవంబర్ 1, 1915న పోరాటాల ఖిల్లా నల్గొండ జిల్లా నకిరేకల్ దగ్గర చెరువు మాదారంలోని ఒక పేద వైష్ణవ కుటుంబంలో సింహాద్రమ్మ,రామచంద్రాచార్యులకు జన్మించాడు. తన పదకొండేళ్లకే తండ్రి మరణంతో కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయాడు వట్టికోట. అప్పటి నుంచి ఒక ఉపాధ్యాయుడ్ని ఆశ్రయించి అతనికి వండి పెడుతూ అతని వద్దే విజ్ఞానాన్ని సముపార్జించి తన సాహిత్య ప్రస్థానం ప్రారంభించాడు. ఇండ్లల్లో వండిపెడుతూ విజయవాడలోని హోటల్లో సర్వర్గా పనిచేస్తూనే ఇంగ్లీష్, ఉర్దూ భాషలపై పట్టు సాధించాడు. ఇదే సమయంలో పెద్ద ఎత్తున సాగుతున్న భారత స్వాతంత్య్ర సంగ్రామానికి వట్టికోట ఆకర్షితుడై జైలుకెళ్లాడు. ఆ తర్వాత 1933లో హైదరాబాద్ రావడం గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్గా ఉద్యోగంలో చేరాడు. నిజామాబాద్లో జరిగిన ఆంధ్ర మహాసభకు తొలిసారిగా హాజరై 1944లో కమ్యూనిస్టు ఉద్యమంవైపు పయనం సాగిస్తూనే తెలంగాణ రైతాంగ పోరా టంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 1938లో హైదరాబాద్లో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి సుమారు 800 మందిని సభ్యులుగా చేర్పించారు. దీని ద్వారా దాదాపు 35 పుస్తకాలను ప్రచురించారు. ప్రజల భాషను తన సాహిత్యంలో రుచి చూపించి, తెలంగాణ నుడికారాలతో ఎన్నో రచనలకు వట్టికోట పెద్దపీట వేశారు. ఆయన రచనల్లో నిబద్ధత, వాస్తవికత దాగి ఉంటుంది. ఆ కోవకి చెందిన ప్రముఖ తెలంగాణ రాజకీయ తొలి నవల ప్రజల మనిషి. ఆనాటి తెలంగాణలో రాచరిక వ్యవస్థ కారణంగా జాగీర్దార్, జమిందార్లు కష్టజీవులను ఏవిధంగా అణగదొక్కారో ఆ నవలలో వట్టికోట అక్షరాలతో బొమ్మకట్టారు. మరో మేటి నవల గంగులో 1940 తర్వాత తెలంగాణలో పరిస్థితులు ప్రత్యక్షమవుతాయి. తను అనుభవించిన జైలు జీవితాన్ని ఆధారంగా చేసుకొని జైలు లోపల కథలు రాశారు. 1948లో నిజామాబాద్ జైలులో దాశరథికి పోరాట పాఠాలు నేర్పుతూ,దాశరథి పద్యాలను జైలు గోడలపై రాసి జైలు అధికారితో దెబ్బలు తిన్నాడు. చివరగా ఫిబ్రవరి 5, 1961లో 46 ఏళ్ల ప్రాయంలోనే తుది శ్వాసవిడిచి తెలంగాణ సమాజానికి తీవ్ర శోకాన్ని మిగిల్చిపోయారు. ఆయన సాహిత్య కృషిని స్మరించుకుంటూ ఘనమైన నివాళి అర్పిద్దాం. -బుర్రి శేఖర్, ధర్మన్నగూడ, రంగారెడ్డి జిల్లా (నేడు వట్టికోట అళ్వార్ స్వామి వర్ధంతి) -
రివార్డు.. రికార్డు
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీ, పురానీహవేలీలోని హిజ్ ఎగ్జాల్డెడ్ హైనెస్ (హెచ్ఈహెచ్) నిజాం మ్యూజియంలో వెలకట్టలేని విలువైన వస్తువులను చోరీ చేసిన దొంగలను పట్టుకున్న సౌత్జోన్ టాస్క్ఫోర్స్ టీమ్కు నగర పోలీసు కమిషనర్ మంగళవారం రూ.5 లక్షల రివార్డును అందించారు. నగర పోలీసు కమిషనరేట్ చరిత్రలో ఇదే భారీ రివార్డు మొత్తం కావడం గమనార్హం. ఈ ఏడాది సెప్టెంబర్ 4 తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ నేరంలో నిందితులుగా ఉన్న ఇద్దరు దొంగల్ని టాస్క్ఫోర్స్ పోలీసులు అదే నెల 11న అరెస్టు చేసిన విషయం విదితమే. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన వెల్డర్ మహ్మద్ ముబిన్, సెంట్రింగ్ వర్కర్ మహ్మద్ గౌస్ పాషా పథకం ప్రకారం ఈ చోరీకి పాల్పడ్డారు. సెప్టెంబర్ 4 తెల్లవారుజామున స్క్రూడ్రైవర్లు, కటింగ్ ప్లేయర్, మేకులు పీకే ఉపకరణం, తాడు, పది హాక్సా బ్లేడ్లతో బైక్పై మ్యూజియం వద్దకు చేరుకున్న వారు, వాటిని వినియోగించి లోపలకు దిగారు. ఓ అల్మారాను పగులకొట్టి అందులో ఉన్న అతి పురాతనమైన బంగారంతో చేసిన, వజ్రాలు పొదిగిన టిఫిన్ బాక్స్, కప్పు–సాసర్, స్ఫూన్ ఎత్తుకెళ్లారు. వీరి కోసం టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ నేతృత్వంలో దక్షిణ మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్రెడ్డి తన బృందంతో ముమ్మరంగా గాలించారు. దేశంలోనే మ్యూజియాల్లో జరిగిన వాటిలో భారీ చోరీ అయిన ఈ కేసును సెప్టెంబర్ 11న ఛేదించి నిందితులను అరెస్టు చేయడంతో పాటు మొత్తం సొత్తు యథాతథంగా రికవరీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మ్యూజియంలలో జరిగిన చోరీలు ఇంత త్వరగా కొలిక్కి రావడం, మొత్తం సొత్తు రికవరీ కావడం జరుగలేదని పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అప్పట్లోనే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రతిభ కనబరిచిన చైతన్యకుమార్, మధుమోహన్రెడ్డిలతో పాటు మొత్తం బృందానికి రూ.5 లక్షల రివార్డు అందించారు. కమిషనరేట్లో జరిగిన కార్యక్రమంలో అదనపు సీపీలు డీఎస్ చౌహాన్, టి.మురళీకృష్ణ, సంయుక్త సీపీ తరుణ్ జోషి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ ప్రళయానికి 110 ఏళ్లు..
కేవలం రెండు రోజులు.. భారీ వర్షం.. చూస్తుండగానే నగరం జలమయమైంది..ఇళ్లల్లోకి వరదనీరు చేరిపోయింది.. తినడానికి తిండి కాదు కదా కనీసం కూర్చోవడానికి కూడా స్థలం లేదు.. వారు తేరుకోవడానికి అనేక రోజులు పట్టింది.. నగరప్రజలు ప్రాణాలను కాపాడుకోవడానికి చెట్లు, భవనాలను ఆశ్రయించారు. పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. అప్పటి నిజాం నిజాం పాలకుడు మీర్మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ ప్రభుత్వ ఖజానాను తెరిచి వరద బాధితుల కోసం ఎనిమిది రోజుల్లో సహాయ చర్యలను చేపట్టి ప్రజలకు ఆశ్రయం కల్పించారు. ఈ విపత్తు 1908లో సంభవించింది. రేపటికి (సెప్టెంబర్ 26) 110 ఏళ్లు అవుతున్న సందర్భంగాప్రత్యేక కథనం... సాక్షి సిటీబ్యూరో: 1908 సంవత్సరం సెప్టెంబర్ 26 ఉదయం 6 గంటలు ఆకాశం మొత్తం నల్లటి మబ్బులు కమ్మకున్నాయి. గంట దాటింది. చినుకులు ప్రాంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు వర్షం పెరగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సాయంత్రం 6 గంటలకు మూసీ నది నిండిపోయింది.. నగర శివారు ప్రాంతాల చెరువులకు, కుంటలకు గండి పడింది. వికారబాద్, చెవేళ్ల, మొయినా బాద్ తదితర ప్రదేశాల్లోని కుంటలు, చెరువులకు కూడా గండి పడి మూసీలో నీళ్లు కలిసాయి. ఆఫ్జల్ గంజ్తోపాటు ఇతర బస్తీల్లో నీరు భారగా చేరింది. మొదట కొలసావాడి నీటి ప్రవహానికి కొట్టుకపోయింది. అనంతరం హుస్సేనీఆలం, షహీద్గంజ్, బద్రీ ఆలావ, ఘాన్సీమీయా బజార్,దారుషిపా, జామ్బాగ్, గౌలిగూడ, ఆఫ్జల్గంజ్ నుంచి రెసిడెన్సి ప్యాలేస్ వరకు ప్రాంతంలో నీరు నిండి పోయింది. వందల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి. ఆఫ్జల్ దవాఖాన కూలిపోయింది. ఆఫ్జల్గంజ్ భవనం పైన ఎక్కిన జనం దానికి అనుకొని ఉన్నా చెట్టుపై ఎక్కి వందల మంది ప్రాణాలను కాపాడుకున్నారు. వరదల సాక్షిగా వందల మంది ప్రాణాలు కపాడిన చెట్టు ఇప్పటికీ ఉంది. మూసీకి ఉత్తరం 2 కిలోమీటర్లు, దక్షిణాన ఒక కిలోమీటర్ వరకు వరద నీరు ప్రవహించాయి. ఆఫ్జల్గంజ్ వంతనా కొట్టుకపోయింది. పురానాపూల్ వంత మీద నుంచి నీరు ప్రవహించింది. మరుసటి రోజూ అదే పరిస్థితి.. మూడోరోజు సెప్టెంబర్ 28 మూసీ నది 60 అడుగుల ఎత్తులో ప్రవహించింది. 36 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతంనమోదైంది. ఆఫ్జల్ గంజ్ వద్ద నీటి మట్టం 11 అడుగులకు చేరింది. నీరు ఇటు చాదర్ఘాట్ దాటి అంబర్పేట బురుజు వరకు, అటు చార్మినార్ దాటి శాలిబండ వరకు ప్రవహించాయి. పేట్లబురుజుపైకి వందల సంఖ్యలో చేరుకున్నారు. రెండు గంటల్లోనే పేట్లబురుజు నీటి ప్రవాహానికి కొట్టుకపోయింది. దీంతో వందల మంది నీటి ప్రవాహంలో కొట్టుకపోయారు. ఆ రోజు సాయంత్రానికి గానీ వరద ఉధృతి తగ్గలేదు. దాదాపు 15వేల మంది ప్రాణాలొదిలారు. 2వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. అప్పటి పాలకుడు నిజాం మీర్ మహబూబ్అలీ నిరాశ్రయుల కోసం సహాయక చర్యలు ప్రారంభించారు. తమ సంస్థానాల్లోని భవనాల్లో ఆశ్రయం కల్పించారు. వైద్య, అన్నదాన శిబిరాలు ప్రారంభించారు.తరువాత మామూలు పరిస్థితులు నెలకొన్నాయి. -
నిజాం మ్యూజియం చోరీ కేసు: నిందితుల అరెస్ట్
హైదరాబాద్: నిజాం మ్యూజియం చోరీ కేసును సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ‘చోరీకి పాల్పడిన నిందితులు మహ్మద్ గౌస్ పాషా, మహ్మద్ ముబీలను అరెస్ట్ చేశాం. 2000 సంవత్సరంలో పురాణాహవేలీలో నిజాం జూబ్లీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజల కోసం మ్యూజియం ఏర్పాటు అయింది. 1925 గ్రాముల బరువున్న టిఫిన్ బాక్సు లూటీ అయింది. ఒక లక్ష రూపాయలు ఖరీదు చేసే ఒక్కో డైమండ్తో టిఫిన్ బాక్స్ను నిజాం కాలంలో తయారు చేశారు. దోపిడీ అయిన ఆస్తుల విలువ రూ.కోట్లలో ఉంటుంది. ఇప్పటి వరకు ఎంత ఖరీదు చేస్తుందనేది ఎవరికీ తెలియదు. సంచలనంగా మారిన కేసును త్వరితగతిన చేధించా’మని అంజనీ కుమార్ వెల్లడించారు. ఇంకా మాట్లాడుతూ.. ‘1991లో యూరప్లో, 1990లో అమెరికాలోని మ్యూజియాల్లో దోపిడీలు జరిగాయి. కానీ అక్కడి పోలీసులు కేసులను చేధించినా పూర్తిస్థాయిలో సొత్తును రికవరీ చేయలేకపోయారు. కానీ నిజాం మ్యూజియం చోరీ కేసులో పూర్తి ఆస్తులు రికవరీ చేశాం. మ్యూజియంలోని పైకప్పు నుంచి దొంగలు తాడు సహాయంలో లోపలికి దిగారు. మ్యూజియంలోని కెమెరాకు చిక్కకుండా నిందితులు జాగ్రత్త పడ్డారు. గదిపై భాగంలో కిటికీలు ఉన్నాయి. వాటి ఆధారంగా నిందితులు బయటికి వెళ్లినట్లు గుర్తించాం. కిటికీలు ఎక్కువ వెడల్పు లేకపోవడంతో నిందితులు స్లిమ్గా ఉంటారని నిర్ధారణకు వచ్చాం. 20 టీమ్లు నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టాయి. ఒక టీం.. మ్యూజియంలోనికి దొంగలు ఎలా వచ్చారు అని, మరో టీం ఎలా బయటికి వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేశాయి. పోలీసులను తప్పుదోవ పట్టించాలని నిందితులు ప్రయత్నం చేశార’ని కమిషనర్ పేర్కొన్నారు. దోపిడీ అనంతరం ఇద్దరు నిందితులు బైక్పై లోకల్గా చక్కర్లు కొట్టారని చెప్పారు. నెల రోజుల నుంచి నిజాం మ్యూజియం వద్ద రెక్కీ నిర్వహించారని తెలిపారు. అంతకు ముందు ఓసారి నిందితులు మ్యూజియంను సందర్శించడానికి వచ్చారని వెల్లడించారు. నిందితుల్లో ఒకరైన ముబీన్ గల్ఫ్లో ఓసారి జైలు జీవితం కూడా గడిపినట్లు అంజనీకుమార్ చెప్పారు. అలాగే నిందితులు ఇద్దరూ కూడా ప్రాణ స్నేహితులు అని వెల్లడించారు. -
నిజాం వారసత్వాన్ని కాపాడండి
సాక్షి, హైదరాబాద్ : నిజాం చారిత్రక కట్టడం గౌలిగూడ బస్ స్టేషన్ ఒక్క సారిగా కుప్పకూలడంపై న్యాయ విచారణ జరిపించాలని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు నజాఫ్ అలీఖాన్ సీఎం కేసీఆర్ను కోరారు. బస్ స్టేషన్ కూలిపోవడంపై పలు అనూమానాలు వ్యక్త మవుతున్నాయి, దానిపై విచారణ జరిపించాలని కేసీఆర్కు ఆదివారం లేఖ రాశారు. హైదరాబాద్లోని నిజాం అస్తులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పలు ఆస్తులు నగరం నుంచి అదృశ్యమవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా ఆసుపత్రి, ఛాతీ ఆసుపత్రిను కూల్చీ వేయాలని ప్రభుత్వం భావిస్తోందని, చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో తెలిపారు. హైదరాబాద్ సందర్శనకు వచ్చిన వారికి హైటెక్ సిటీ లాంటివి కాదని, తెలంగాణ సంస్కృతి, చారిత్రక కట్టడాలే చూపించాలని పేర్కొన్నారు. గౌలిగూడ బస్ స్టేషన్ కూలీపోవడంపై పలు అనూమానాలు వ్యక్తమవుతున్నా విషయం తెలిసిందే. 90 ఏళ్ల క్రితం మూసీ నది ఒడ్డున నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గౌలిగూడ బస్ స్టేషన్ నిర్మించారు. 1994లో మహాత్మ గాంధీ బస్టాండ్ నిర్మించడంతో ప్రస్తుతం దానిని సిటీ బస్ స్టేషన్ (సీబీఎస్)గా ఉపయోగిస్తున్నారు. నిజాం స్మారక చిహ్నాలను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్ఐఎమ్ ఛీప్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్ను కోరిన విషయం తెలిసిందే. -
సిటీ కాలేజీకి 'లాల్' సలాం!
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలం నాటి నిర్మాణ శైలికి అద్దం పట్టే సిటీ కాలేజ్ కొత్త హంగులు సంతరించుకుంటోంది. ఎంతో మంది ప్రముఖులను అందించిన ఈ కాలేజ్ ‘లాల్’రంగులు అద్దుకుంటోంది. నిజాం పాలకుల కాలంలో చిన్నారుల చదువు కోసం పాఠశాలగా ప్రారంభమై నేడు ప్రఖ్యాత విద్యాలయం స్థాయికి ఎదిగింది. 97 ఏళ్ల క్రితం 30 మంది విద్యార్థులతో మొదలైన ప్రస్థానం.. 31 యూజీ కోర్సులు, 8 పీజీ కోర్సులతో నేడు వేల మందికి విద్యనందిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ కింద సిటీ కాలేజ్కి రూ.2 కోట్ల నిధులు కేటాయించింది. జిమ్, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు.. కేంద్రం ఇచ్చిన నిధులతో సిటీ కాలేజ్లో పలు నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్ సి.మంజుల తెలిపారు. రూసా పలు షరతులతో ఈ నిధులను కేటాయించినట్లు చెప్పారు. రూ.1.50 లక్షలతో భవనానికి పెయింటింగ్, మరమ్మతులు, రూ.10 లక్షలతో జిమ్, రూ.40 లక్షలతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదీ కాలేజీ చరిత్ర.. ఆరవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో మదర్సా దారుల్ ఉలూమ్ పేరుతో 1865లో పాఠశాలను ఏర్పాటు చేశారు. ఏడవ నిజాం హయాంలో దీన్ని సిటీ హైస్కూల్గా మార్చి, 1921లో భవనాన్ని నిర్మించారు. అదే సంవత్సరం ఇంటర్మీడియట్ (ఎఫ్ఏ)గా మార్చారు. 1929లో హైస్కూల్తో పాటు కాలేజీ స్థాయికి అప్గ్రేడ్ చేసి.. సిటీ కాలేజ్గా పేరు మార్చారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యాక పీయూసీతో పాటు 1962 నుంచి సైన్స్, ఆర్ట్స్ డిగ్రీ కోర్సులు ప్రారంభమయ్యాయి. ఇటాలియన్, హిందూ వాస్తు కళల మిశ్రమంగా రూ.8 లక్షలతో కాలేజ్ నిర్మాణం జరిగింది. తూర్పు, పశ్చిమ దిక్కు నుంచి చూసినా ఈ భవనం ఒకే మాదిరిగా కనిపిస్తుంది. ఇందులో వెయ్యి మంది కూర్చునేలా గ్రేట్ హాల్ పేరుతో ఓ హాల్ను నిర్మించారు. పలు సినిమాల్లో ఈ కాలేజీని రాజమహల్, న్యాయస్థానంగా చూపించారు. రాజకీయ నేతలు శివరాజ్ పాటిల్, పీ శివశంకర్, మర్రి చెన్నారెడ్డి, మాజీ క్రికెటర్ అర్షద్ అయ్యూబ్ లాంటి ప్రముఖులంతా ఇక్కడ చదువుకున్నవారే. -
పాతబస్తీలో బయటపడ్డ ‘నిజాం’ సొరంగం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో నిజాం కాలంనాటి సొరంగం బయటపడింది. పాతబస్తీలోని డబీర్పురాలో ఓ ఇంటి నిర్మాణం చేపడుతుండగా భారీ సొరంగం కనిపించింది. సొరంగంలో నిజాం కాలంనాటి ఫిరంగి తుటాలు లభ్యమయ్యాయి. దీంతో సొరంగాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సమాచారం అందడంతో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. పురావస్తుశాఖ అధికారులు కూడా సొరంగాన్ని సందర్శించి.. దాని పూర్వాపరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
నగరానికి వచ్చిన నిజాం వారసుడు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సంస్థానాన్ని 224 ఏళ్లు పాలించిన ఆసిఫ్జాహీల చివరి పాలకుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ప్రిన్స్ ముఖఫంజా బహదూర్ లండన్ నుంచి నగరానికి వచ్చారు. ఇటీవల జరిగిన ప్రిన్సెస్ ఈసెన్ స్కూల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలతో పాటు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తాజ్ బంజారాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. పేద అమ్మాయిల కార్పొరేట్ స్థాయి విద్య కోసం పాతబస్తీలో ప్రిన్సెస్ ఈసెన్ గ్రూప్ ఆఫ్ స్కూల్ విద్యా సంస్థలను నడిపిస్తున్నారు. దీనికి ఆయన చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఏటా రూ. 28 లక్షల స్కాలర్షిప్లు ఇచ్చి పేద అమ్మాయిలను చదివిస్తున్నారు. -
కాటన్ కన్నా.. నిజాం మిన్న!
సాక్షి, హైదరాబాద్: నిజాం రాజును తరచూ పొగడ్తలతో ముంచెత్తే ముఖ్యమంత్రి కేసీఆర్.. గురువారం శాసనసభ వేదికగా మరో అడుగు ముందుకేసి మరీ కీర్తించారు. రజాకార్ల దురాగతాలంటూ నిజాం పాలన తీరుపై చెడు ప్రచారం జరిగిందని.. కానీ ఆయనది గొప్ప గుణమన్నారు. ‘‘నిజాంను పొగిడితే నన్ను నయా నిజాం అంటూ కొందరు విమర్శిస్తున్నారు. నేను చెప్పేదొ క్కటే. సమైక్య పాలనలో నిజాం చరిత్రను వక్రీకరించారు. వాస్తవాలతో దాన్ని నేను తిరగరాస్తా..’’అని ప్రకటించారు. హిందూ ముస్లిం సహా అన్ని మతాలవారూ కలసి జీవించడం మినహా మరో మార్గం లేదని.. పరస్పరం ఏహ్యభావం తొలగి సంతోషంగా కలసి జీవించే పరిస్థితి రావాలన్నారు. నిజాంను కీర్తిస్తే తప్పా.. తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాం వారసుల విన్నపం మేరకు తాను నిజాం సమాధిని దర్శించానని.. దీనిపై అప్పట్లో తనను చాలా విమర్శించారని కేసీఆర్ చెప్పారు. ‘‘నిజాం సమాధిని ఎందుకు సందర్శించారంటూ ఓ ఆంధ్రా విలేకరి నన్ను అడిగారు. అప్పుడు నేను ‘మీరు కాటన్ దొర ఉత్సవాలు ఎందుకు చేస్తర’ని అడిగిన. దాంతో ఆ విలేకరి ‘కాటన్ మాకు ఆనకట్ట కట్టించాడు. సాగుకు అవకాశం కల్పించాడు’అని చెప్పిండు. మరి 200 ఏళ్లపాటు దేశాన్ని దోచుకున్న బ్రిటిష్ ప్రభుత్వంలోని మిలటరీ ఇంజనీర్ కాటన్ను పూజిస్తే... నిజామాబాద్లో నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన నిజాంను కీర్తించడం తప్పా? కాటన్ మనోడు కాదు. కానీ ఉజ్వల తెలంగాణ చరిత్రలో నిజాం పాలన భాగం. ఆయన మనవాడు. హైదరాబాద్ సంస్థానం విలీనమైన తర్వాత నిజాం రాజ్ప్రముఖ్గా ఉండగా.. ఓసారి ఆయన డ్రైవర్కు చేయి విరిగింది. ఇక్కడ బొక్కల (ఎముకల) ఆస్పత్రి లేక మద్రాసుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసిన నిజాం.. తాను రాజుగా ఉండగా హైదరాబాద్లో బొక్కల దవాఖాన కట్టకపోవటం తప్పేనంటూ.. నిజాం బొక్కల దవాఖాన (ప్రస్తుత నిమ్స్)ను నిర్మించిండు. దానికి స్థలమిచ్చి, సొంత డబ్బులతో నిర్మించిండు. చైనాతో యుద్ధం తర్వాత మన దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే తనకు చెందిన ఆరు టన్నుల బంగారాన్ని నాటి ప్రధాని లాల్బహదూర్ శాస్త్రికి ఇచ్చిండు. తిరిగి చెల్లిస్తానని శాస్త్రి అన్నా ఒప్పుకోలేదు. ఇది వాస్తవం. నిజాం పాలన గొప్పతనం జనంలోకి పోయేలా చరిత్రను తిరగరాస్తం..’’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
నిజాంను సమర్థించడం చరిత్రను వక్రీకరించడమే..
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి నెహ్రూ యువ సంఘటన్ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్రావు హన్మకొండ: సీఎం కేసీఆర్, కూతురు కల్వకుంట్ల కవిత ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారని నెహ్రూ యువ సంఘటన్ జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్రావు అన్నారు. సోమవారం హన్మకొడ ఎన్జీవోస్ కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం పాలన నుంచి విమోచన కలిగిన సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని భావితరాలకు తెలియకుండా చేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. ప్రజలను దోచుకుని, అకృత్యాలకు, నిరంకుశ పాలన గావించిన నిజాం నవాబ్పై సీఎం కేసీఆర్కు, కూతురు కవితకు ప్రేమేందుకు పుట్టుకొస్తుందని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ గత చరిత్రను బీజేపీ ప్రజల్లోకి తీసుకెళుతుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు పాల్గొనే తిరంగా ముగింపు యాత్ర నభూతో నభవిష్యత్ అనే రీతిలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. అనంతరం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తిరంగ యాత్ర ముగింపు సభ జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కు ప్రత్యమ్నాయంగా బీజేపీ ఎదిగి అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి మాట్లాడుతూ 15న మద్దూరు మండలం బైరాన్పల్లిలో ఎమ్మెల్సీ రాంచందర్రావుతో పాటు బీజేపీ బృందం పర్యటిస్తుందన్నారు. ఇక్కడ పరకాలలో నిర్మించిన స్మారక కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఽసమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డి, నాయకులు వన్నాల శ్రీరాములు కాసర్ల రాంరెడ్డి, పెదగాని సోమయ్య, వెంకటేశ్వర్లు, తాళ్ళపల్లి కుమారస్వామి, త్రిలోకేశ్వర్ పాల్గొన్నారు. -
నిజాంను ఎదిరించిన తొలి మహిళ ఐలమ్మ
మిర్యాలగూడ : నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి పోరాడిన తొలి మహిళ చాకలి ఐలమ్మ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడలోని సాగర్ రోడ్డులో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆమె వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే బాస్కర్రావు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ఐలమ్మ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరు నాగలక్ష్మిభార్గవ్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, జెడ్పీటీసీ నాగలక్ష్మి, రజక సంఘం నాయకులు నాగభూషణం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాయం ఉపేందర్రెడ్డి, నాయకులు ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి, మగ్దూమ్పాష తదితరులు పాల్గొన్నారు. -
నిజాం పాలనను మరిపిస్తున్నారు
జనగామ జిల్లా న్యాయమైన కోరిక టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క జనగామ : నిజాం నిరంకుశ పాలనను మరిపిస్తూ తెలంగాణ లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. పట్టణంలోని గాయత్రి గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. గడీల పాలనను సాగిస్తున్న పాలకులు గల్లీ బిడ్డలను ఎదగకుండా అణచివేస్తున్నారని ఆరోపించా రు. ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చే స్తున్నారని అన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరిట నాలుగు గ్రామాలను ముంచేందుకు 123 జీ వోను తీసుకొచ్చిన ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసినా బుద్ధి రావడం లేదన్నారు. హరితహారం పేరుతో సినిమా చూపిస్తూ అధికారులను ప్రజాపాలనకు దూరం చేస్తున్నారని అన్నారు. బ్యాంకు రుణాలు రైతులు ఇ బ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. ఎంసెట్ పేపర్ లీక్ విషయంలో విద్యార్థులకు రెండవ సారి అగ్నిపరీక్ష పెడుతున్న కేసీఆర్, అందుకు బాధ్యులైన మంత్రులు కడియం, లక్ష్మారెడ్డిలను ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. జనగామ జిల్లా ఉద్యమానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ మధుసూధన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుల్లూరి అశోక్, పట్టణ అధ్యక్షులు పోకల లింగయ్య, నాయకులు బొట్ల శ్రీనివాస్, బెడిదె మైసయ్య, చీకట్ల నవీన్, రామిని హరీష్, మిద్దెపాక స్టాలిన్, మండల పార్టీల అధ్యక్షులు ఎలికట్టె మహేందర్గౌడ్, పర్శరాములు, శ్రీనివాస్రెడ్డి, ప్రభాకర్, ఆకుల దుర్గాప్రసాద్, కొత్తపల్లి సమ్మయ్య, కొత్తపల్లి కాశీపతి, అల్లాదుర్గం వెంకటేశ్వర్లు, గడ్డం క్రిష్ణ, రత్నం, బండారి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నిజాం నిధి ఎవరిది?
గత 7 దశాబ్దాలుగా హైదరాబాద్ ఫండ్స్ కేసు కొనసాగుతోంది. హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో ఇంగ్లాండుకు తరలించిన ఒక మిలియన్ పౌండ్ల నిధులు ఇప్పటికీ తిరిగి రాలేదు. ఇంగ్లాండు ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయడానికి సుముఖంగానే ఉన్నప్పటికీ భారత్, పాక్ ల మధ్య వివాదాలతో ఇవి అక్కడి బ్యాంకులోనే ఉండిపోయాయి. నిజాం వారసులు ఈ నిధులన్నీ తమకే చెందుతాయని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ నిధులకు సంబంధించి ఆధారాల కోసం హైదరాబాద్ను సందర్శించింది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ వివాదం గురించి పూర్తి వివరాలు మీకోసం...... హైదరాబాద్ రాష్ట్రాన్ని చివరగా పరిపాలించింది ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1948 సెప్టెంబర్ 17 వ తేదీన భారత ప్రభుత్వం చేసిన సైనిక చర్యతో నిజాం రాజ్యం(హైదరాబాద్ రాష్ట్రం) భారతదేశంలో విలీనమైంది. అయితే దీనికి సరిగ్గా రెండు రోజుల ముందే(సెప్టెంబర్ 15న) నిజాం రాజ్యం నుంచి ఒక మిలియన్ పౌండ్ల(రూ. 9.29 కోట్లు) నిధులు ఇంగ్లాండులోని వెబ్ మినిస్టర్ బ్యాంకు(రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్)కు తరలించారు. ఈ నిధులను ఇంగ్లాండులో పాకిస్తాన్ హైకమిషనర్ హబిబ్ ఇబ్రహీం రహీమతుల్లా పేరిట ఉన్న అకౌంటులో డిపాజిట్ చేశారు. నిజాం ఆర్థిక మంత్రి మోయిన్ నవాజు జంగ్ ఈ నిధులను ఇంగ్లాండుకు తరలించడంలో కీలక పాత్ర పోషించారు. నిజాంకు తెలియకుండానే నవాజు జంగ్ ఈ నిధులను బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ రాజ్యం.. భారత యూనియన్లో విలీనం తర్వాత ఈ నిధులను తిరిగి ఇవ్వాలని పాక్ హైకమిషనర్ హబిబ్ను నిజాం సంప్రందించాడు. కాని ఫలితం లేకుండా పోయింది. 1956 వరకు ఈ నిధుల కోసం నిజాం ప్రయత్నించాడు. కాని నేటికీ ఈ నిధులు విడుదల కాలేదు. 1967 లో నిజాం మరణాంతరం ఈ నిధులపై ఆయన వారసులు కూడా స్పందించలేదు. ప్రస్తుతం ఇవి ఇంగ్లాండులోని రాయల్ బ్యాంక్ ఆప్ స్కాట్లాండ్లోనే ఉన్నాయి. ప్రస్తుతం వీటి విలువరూ.310కోట్లు. ఆర్టీఐ కింద కేసు నమోదు... హైదరాబాద్ ఫండ్స్ కేసులో గత 67 ఏళ్లుగా వివాదం కొనసాగడానికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే 1948లోనే ఇంగ్లాండ్ నుంచి ఈ నిధులన్నీ పాకిస్తాన్ హైకమిషనర్ హబిబ్ ఇబ్రహీం రహీమతుల్లాకు బదిలీ అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. కాని బదిలీ అయినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వివాదం పెరిగిపోతూ వచ్చింది. కోర్టులతో సంబంధం లేకుండా ఈ వివాదాన్ని భారత్, పాక్లు చర్చించుకోవాలని భారత కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్లు 2008లో వార్తలొచ్చాయి. అయితే ఈ నిధులకు సంబంధించి 1948, సెప్టెంబర్ 20న డిపాజిట్ వివరాలను అందించాలంటూ ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) కింద అక్బర్ అలీ ఖాన్ అనే వ్యక్తి న్యాయ మంత్రిత్వ శాఖను కోరుతూ దరఖాస్తు చేశాడు. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కావడంతో నిజాం ఆస్తులపై మరాఠా ప్రజలకు హక్కు ఉందనీ, అందులో తమ వాటా ఎంతనేది తేల్చాలని కోరాడు. దీంతో కేంద్ర సమాచార కమిషన్ భారత్,పాక్ల మధ్య వివాదాన్ని వెంటనే తేల్చాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఈ నిధులతో పాక్కు సంబంధం ఎక్కడిదీ? ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు పాకిస్తాన్కు చెందిన హబిబ్ ఇబ్రహీం రహీమతుల్లా సన్నిహితంగా ఉండేవాడు. అయితే 1948లో ఇబ్రహీం ఖాన్ బ్రిటన్లో పాకిస్తాన్కు హైకమిషనర్గా పనిచేస్తున్నాడు. అయితే నిజాంకు చెందిన ఒక మిలియన్ పౌండ్ల నిధులను ఇబ్రహీం పేరిట బ్రిటన్లోని వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఈ నిధులన్ని నిజాం వద్ద ఆర్థిక మంత్రి మోయిన్ నవాజు జంగ్ స్వయంగా బ్రిటన్కు పంపించాడు. అనంతరం భారత్లో నిజాం రాజ్యం విలీనమైంది. దీంతో నిజాం ఈ నిధులను తిరిగి ఇవ్వాలని ఇబ్రహీంను ఎన్ని సార్లు అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. ఇబ్రహీం పాకిస్తాన్కు చెందిన వ్యక్తి కావడంతో ఈ నిధులపై పాక్ తనకూ హక్కులున్నాయని డిమాండ్ చేస్తోంది. ఈ నిధులు మాకే చెందుతాయి: నిజాం వారసులు భారత్, పాక్లకు ఈ నిధులపై ఎటువంటి హక్కు లేదని నిజాం వారసుడు నవాబ్ నజాఫ్ అలీఖాన్ 2016 జూన్ 23న ప్రకటించారు. ఇవి నిజాం వ్యక్తిగత నిధులనీ, వీటిపై ఇరుదేశాలకూ హక్కులేదని అన్నారు. నిజాంకు 16 మంది కుమారులు, 18 మంది కుమార్తెలు ఉండేవారు. వీరంత ప్రస్తుతం చనిపోయినప్పటికీ ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు మిగిలారు. కాని వారి వారసులు 120 మంది ఉన్నారు. వీరందరి తరఫున నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా నజాఫ్ అలీఖాన్ వ్యవహరిస్తున్నారు. కాగా నిజాం ఆభరణాలపై 1995లో సుప్రీం కోర్టులో కేసు నమోదైంది. ఈ కేసుపై సుప్రీం తీర్పునిస్తూ...నిజాం రాజ్య ఆస్తులు, వ్యక్తిగత ఆస్తులను వేరుగా చూడాలి. ఈ ఆభరణాలు నిజాం వారసులకు చెందుతాయని తెలిపింది. ఇంకా కోర్టులోనే వివాదం... ఈ నిధులని విడుదల చేయాలని ఇంగ్లాండు ప్రభుత్వం మొదటి నుంచి సుముఖంగానే ఉంది. నిధులన్నీ తమకే చెందుతాయంటూ... భారత్, పాక్, నిజాం వారసుల మధ్యే వివాదం కొనసాగుతూ వచ్చింది. 1958 నుంచి పాకిస్తాన్తో భారత్ పలుమార్లు చర్చలు జరిపింది. కాని పాక్ నిధులు తమకే చెందుతాయని పట్టుబట్టింది. చివరగా 2012 జూలై 5న నిధులపై రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. మరో వైపు నిజాం వారసులు 2004 నుంచి ఈ నిధులపై పూర్తి హక్కు తమకే ఉందంటూ రంగంలోకి దిగారు. నిజాం మనవడు నవాబ్ నజాఫ్ అలీఖాన్ దీనిపై ఇంగ్లాండు కోర్టు ఇచ్చే తీర్పుకే కట్టుబడి ఉంటామని ప్రకటించాడు. అయితే 2013 ఏప్రిల్ 3న పాక్ హైకమిషన్ నిధులను విడుదల చేసేలా బ్యాంకుపై చర్యలు తీసుకోవాలంటూ ఇంగ్లాండు కోర్టును ఆశ్రయించాడు. అయితే 2015 జనవరి 16న కోర్టు తీర్పునిస్తూ ‘ పాకిస్తాన్ కోర్టును దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు నిధులను విడుదల చేయడానికి సిద్దంగానే ఉంది. కాని నిధులు ఎవరికి చెందుతాయనే సందిగ్దంలోనే నిలిపివేసింది. అనవసరంగా బ్యాంకుపై చర్య తీసుకోవాలని పాక్ ప్రయత్నించడం సరైంది కాదు.’ అని వెల్లడించింది. తెలంగాణకూ హక్కుంది.... హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఉన్నందును తెలంగాణాకూ ఈ నిధులపై హక్కు ఉందని విదేశాంగ అధికారులు ప్రకటించారు. నిధులకు సంబంధించి ఆధారాలను సేకరించేందుకు వీరు హైదరాబాద్ను మూడుసార్లు సందర్శించారు. ఇటీవల విదేశాంగ అధికారులు తార్నాకాలోని ఆర్కైవ్స్లో వీటికి సంబంధించిన ఆధారాల కోసం శోధించారు. కాని ఏ ఆధారాలు లభ్యమవ్వలేదు. -
నిజాం పాలన కంటే ఘోరం
కేంద్రంతో పాటు మహారాష్ట్రలో కూడా అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వాల పాలన నిజాం ప్రభుత్వం కంటే ఘోరంగా ఉందని విమర్శించారు. నిజాం పాలనా కాలంలో హైదరాబాద్ సంస్థానంలో ఔరంగాబాద్తో పాటు మరాఠ్వాడా లోని కొన్ని ప్రాంతాలు కూడా ఉండేవి. నాటి నిజాం పాలన కంటే బీజేపీ పాలన దారుణంగా ఉందని ఔరంగాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో రౌత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశాఈ పర్యటనలపై కూడా రౌత్ మండిపడ్డారు. ప్రధానమంత్రి గురించి ఎప్పుడు అడిగినా.. స్విట్జర్లాండ్, లండన్, ఫ్రాన్స్, ఇరాన్ లేదా వేరే ఏదో దేశంలో ఉన్నారని చెబుతారంటూ మోదీ విదేశీ పర్యటనలపై ఎద్దేవా చేశారు. పశ్చిమబెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో మోదీ డజన్ల కొద్దీ ర్యాలీలు నిర్వహించిరాఉ గానీ, మహారాష్ట్రలోని కరువు ప్రాంతమైన మరాఠ్వాడా వచ్చేందుకు ఆయనకు సమయం లేకపోయిందని రౌత్ అన్నారు. రైతుల సమస్యలపై మోదీకి నిజంగానే పట్టింపు ఉంటే ఆయన వచ్చి మరాఠ్వాడాలో పరిస్థితి చూడాలని తెలిపారు. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంలో ఇటీవలే ఓ బుడగ పేలిందని ఏక్నాథ్ ఖడ్సే పేరు ప్రస్తావించకుండానే అన్నారు. త్వరలో మరిన్ని బుడగలు పేలుతాయని జోస్యం చెప్పారు. -
పరిశ్రమలకు పెట్టింది పేరు..
నిజాం పాలనా కాలంలోనే హైదరాబాద్ గొప్ప పరిశ్రమలకు పెట్టింది పేరు. ఆరో నిజాం హయాం నుంచి ఎన్నో ఫ్యాక్టరీలు నగరంలో వెలిశాయి. ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు ఎంతోమందికి ఉపాధి కల్పించాయి. ఆనాడు వెలిసిన ప్రముఖ పరిశ్రమల్లో కొన్ని.. 1874లో మొదటి స్పిన్నింగ్ మిల్లు ఏర్పాటైంది. 1876లో ఫిరంగుల ఫ్యాక్టరీ, 1876లో ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. 1885లో బాలాపూర్ వద్ద ప్రైవేట్ పేపర్ ఫ్యాక్టరీ, 1903లో నారాయణగూడలో ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ, 1910లో రెండు మద్యం తయారీ పరిశ్రమలు (డిస్టిలరీ), 1910లో ఐరన్, సోడా ఫ్యాక్టరీలు, 1911లో మింట్ సమీపంలో పవర్ ప్లాంట్, 1916లో దక్కన్ బటన్ పరిశ్రమ, 1919లో వీఎస్టీ ఫ్యాక్టరీ, 1921లో కెమికల్ ల్యాబ్, 1927లో దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ, 1929లో డీబీఆర్ మిల్స్, 1941లో గోల్కొండ సిగరెట్ కంపెనీలు ఏర్పాటు చేశారు. -
నిజం.. నిజాం నాటి నాణెం
చార్మినార్ వద్ద విక్రయానికి నిజాం కాలం నాటి నాణేలు చార్మినార్: పాతబస్తీ పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి వస్తున్న వారికి చార్మినార్ కట్టడం వద్ద నిజాం కాలం నాటి పురాతన నాణేలు ఆకట్టుకుంటున్నాయి. వీటిని ఖరీదు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నిజాం కాలం నాటి పురాతన నాణేలను ఇప్పటి యువతరానికి అంతగా తెలియకపోవచ్చు. చూద్దామన్నా... ఎవరి దగ్గరా దొరక్కపోవచ్చు. నిజాం కాలంలో ఏక్ అణా.. దో అణా.. చార్ అణా.. అనే పైసలు చెలామణిలో ఉండేవి. వాటితో పాటు దాదాపు 50 దేశాలకు చెందిన పురాతన కరెన్సీలను ఇక్కడి చార్మినార్ కట్టడం వద్ద ఫుట్పాత్పై పాతబస్తీకి చెందిన ఓ వ్యాపారి విక్రయిస్తున్నాడు. నిజాం కాలం నాటి ఒక రూపాయి నాణెం ధర ప్రస్తుతం రూ. 1500, చార్ఆణ 25 (పైసలు) ఖరీదు రూ. 800 లు గాను... ఏక్ ఆణ ఖరీదు రూ. 150 గాను... ఒక పైస ఖరీదు రూ. 100 గా విక్రయిస్తున్నట్లు నాణేల వ్యాపారి తెలిపాడు. -
నిజాంను పొగిడితే ఊరుకోరు
పొల్సాని మురళీధర్రావు పరకాల: ‘కేసీఆర్ మీరు చెప్పినట్లుగా నిజాం ఆదర్శ పాలనపై చర్చించేందుకు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా.. నిజాం గుణగణాలపై పరకాల చౌరస్తాలో మాట్లాడుకుందాం.. చరిత్రను వక్రీకరించి నిజాంను పొడిగితే బట్టలూడదీసి కొడతారు’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్రావు హెచ్చరించారు. అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని బుధవారం అమరధామంలో అమరవీరులకు నివాళులు అర్పించారు. మళ్లీ జమిందారి వ్యవస్థకు ప్రాణం పోసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అధికారం కోసం దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లితే ఖబర్దార్ అని హెచ్చరించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్కు ఏమాత్రం ఒకే దారిలో నడుస్తున్నాయన్నారు. తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
‘నిజాంను పొగిడితే జనం కొడతారు’
పరకాల: 'నిజాం ఆదర్శ పాలనపై చర్చించేందుకు మేం రెడీ.. నిజాం గుణగణాలపై పరకాల చౌరస్తాలో మాట్లాడుకుందాం.. చరిత్రను వక్రీకరించి నిజాంను పొడిగితే జనం కొడతారు..' అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్రావు అన్నారు. వరంగల్ జిల్లా పరకాలలో బుధవారం అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని అమరవీరులకు నివాళులు అర్పించారు. నిజాం లాగే మళ్లీ జమీందారీ వ్యవస్థకు ప్రాణం పోసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశం కోసమే పుట్టిన పార్టీగా చెప్పుకున్న కాంగ్రెస్, తెలంగాణ ఉద్యమం కోసం స్థాపించిన టీఆర్ఎస్ పార్టీకి తేడా ఏమాత్రం లేదన్నారు. రెండు పార్టీలు ఇప్పుడు కుటుంబ పార్టీలుగా, జేబు పార్టీలుగా మారిపోయాయన్నారు. -
నిజాంను పొగడడం తెలంగాణను అవమానపర్చడమే
హుస్నాబాద్రూరల్ : సాయుధ పోరాటంలో దొడ్డి కొంరయ్యను కర్కషంగా చంపిన నిజాంను కేసీఆర్ పొగడడం తెలంగాణను అవ మానపర్చడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ సాయుధపోరాట యోధుడు అనభేరి 67వ వర్ధంతి సభను శుక్రవారం రాత్రి మహ్మదాపూర్ గుట్టల్లో ఘనంగా నిర్వహించారు. గుట్టల నుంచి కొవ్వత్తులతో ర్యాలీగా గ్రామంలోని స్తూపం వరకు పాదయాత్రగా వచ్చి నివాళులర్పించారు. హైదరాబాద్ కార్పొరేషన ఎన్నికల్లో గెలిచేందుకే ఎంఐఎంను పొగుడుతున్నారన్నారు. కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కమ్యూనిస్టులకు ప్రథమ శత్రువుగా మారుతారని హెచ్చరించారు. కమ్యూనిస్టులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కలిసి పనిచేస్తామన్నారు. భూర్జువా పార్టీలతో స్నేహం చేయడం శాపంగా మారిందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ సూర్య చంద్రులున్నంత వరకు అమరుల త్యాగాలు మరువబోమన్నారు. అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తెలంగాణ సాంస్కృతిక శౌర్య రాష్ట్ర కన్వీనర్ పాశం యాదగిరి, సినీ హీరో మాదాల రవి, జిల్లా కార్యదర్శి రాంగోపాల్రెడ్డి, మాజీ కార్యదర్శి నారాయణ, నాయకులు సృజన్కుమార్ , అయిలయ్య, మల్లేశ్, శోభారాణి, సర్పంచ్ రమేశ్,తదితరులు పాల్గొన్నారు. -
దక్కన్లో నేనొక్కణ్ణే...
రేడియో అంతరంగాలు నిజాం కాలంలోని దక్కన్ రేడియోలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆలిండియా రేడియోలో సుదీర్ఘ కాలం స్టాఫ్ ఆర్టిస్ట్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు పి. కుప్పుస్వామి అయ్యర్ (94). ఏడేళ్ల వయసప్పుడే వీణ, వయొలిన్ చేతపట్టిన కుప్పుస్వామి.. ప్రతి సంగీత ఉపాసకునికీ గురుభక్తి, దైవభక్తి తప్పనిసరిగా ఉండాలంటారు. ప్రముఖ రేడియో కళాకారిణి శారదాశ్రీనివాసన్ తనను కలిసినప్పుడు, ఆయన నెమరు వేసుకున్న 32 ఏళ్ల్ల రేడియో అనుభవాలు, జీవిత విశేషాలు... ఆయన మాటల్లోనే... త్యాగరాజుగారి శిష్యుడు కృష్ణభాగవతార్ ముని మనుమణ్ణి అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంటుంది. నా మొదటి గురువు మా నాన్నగారు పిచ్చయ్య భాగవతార్. చెన్నైలో ఆయన దగ్గరే వీణ, వయొలిన్ నేర్చుకున్నాను. ఓ రోజు మా నాన్న నన్ను ‘‘కుప్పా! సంధ్యావందనం చేయాలి త్వరగా రా’’ అన్నారు. కంగారుగా పరుగెత్తుతూ వీణను కింద పడేశా. దాంతో అదీ పగిలింది, నన్నూ పగలగొట్టారు (నవ్వుతూ). తర్వాత కరూర్కి వెళ్లి గురుకులంలో చేరి శ్రీకరూర్ చిన్నస్వామి అయ్యర్ దగ్గర శిష్యరికం చేశాను. నేను సంగీతాన్ని వృత్తిగా చేసుకోవడం మా నాన్నకు ఇష్టం లేదు. కానీ ఆసక్తి మేరకు నేను ఆ రంగంలోకి వెళ్లాను. మద్రాస్ టు హైదరాబాద్ 1941లో జపాన్ వాళ్లు మద్రాసుపై రెండు బాంబులు వేశారు. అప్పుడు అక్కడి వారంతా ఎక్కడెక్కడికో వలస వెళ్లారు. మా విద్యార్థుల్లో ఓ అయ్యంగార్ కుటుంబ బంధువులు హైదరాబాద్లో ఉండేవారు. వాళ్ల ఇంటికి వారితోపాటు నన్నూ రమ్మన్నారు. అలా 1942లో ఇక్కడ అడుగుపెట్టాను. హిమాయత్ నగర్లోని వాళ్లింట్లోనే ఆరేళ్లు ఉన్నాను. నాకు తిండి పెట్టి, వసతి ఇచ్చి బాగా చూసుకునే వాళ్లు (కన్నీళ్లు పెట్టుకుంటూ). రోజుకో గంట కార్యక్రమం ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు బదిలీ అయిన చీఫ్ ఇంజినీర్ మహాలింగం గారింట్లో వాళ్ల అమ్మాయికి సంగీతం చెబుతుండేవాణ్ణి. అప్పుడు ఆయన ‘‘స్టేషన్లో వయొలిన్, మృదంగం వాయించే వాళ్లు కావాలి. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు చేసి వెళ్లండి’’ అన్నారు. నేను ట్యూషన్లు చెప్పే కీలక సమయం అది. కాబట్టి నేను రాలేనన్నాను. కానీ ఆయన పట్టు వదలకుండా అడిగే సరికి ఒప్పుకున్నాను. అలా 1947లో దక్కన్ రేడియోలో రోజూ గంట కార్యక్రమం చేయడానికి వెళ్లేవాణ్ణి. అప్పుడు హైదరాబాద్లో నేనొక్కణ్ణే సంగీత విద్వాంసుణ్ణి. దక్కన్ రేడియోలో రోజూ ప్రారంభంలో ఓ అయిదు నిమిషాలు వయొలిన్ వాయించేవాణ్ణి. నల్లకుంట నుంచి ఖైరతాబాద్కు సైకిల్పై వెళ్లేవాణ్ణి ఆఫీసుకు. ఇందిరమ్మ మేలు 1950లో ఆలిండియా రేడియోను భారత ప్రభుత్వం తీసుకుంది. అప్పుడు ఢిల్లీ నుంచి బంట్రోతు వస్తున్నాడంటే కూడా ఎంతో భయపడే వాళ్లం. ఇందిరా గాంధీ సమాచార, ప్రసారాలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా జీతం రూ.160 నుంచి ఒకేసారి రూ.300లకు పెరిగింది. నేను రిటైర్ అయ్యేటప్పుడైనా అంత జీతం తీసుకుంటానా అనుకునే వాణ్ణి. కర్ణాటక సంగీతం నేను మొదటి నుంచీ కర్ణాటక సంగీతంపైనే సాధన చేశాను. వరదరాజన్గారు కర్ణాటక సంగీతానికి ప్రొడ్యూసర్గా ఉండేవారు. ఆయన బంగారం లాంటి మనిషి. ఎవరైనా గాయకులు చిన్న చిన్న తప్పులు చేస్తే ‘‘ఏం ఫర్వాలేదు. చిన్న తప్పే కదా’’ అనేంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన మంచి స్వభావం గల పెద్ద విద్వాంసుడు. మంచాల జగన్నాథరావుగారు హిందుస్థానీ సంగీత విభాగంలో ప్రొడ్యూసర్గా ఉండేవారు. ఆయన వీణ వాయించేవారు. మా అందరి మధ్య మంచి స్నేహపూర్వక సంబంధాలుండేవి. నాతో పని చేసే పురుషోత్తం, జగన్నాథంతో కలిసి ఎప్పుడూ గోపీ హోటల్, అసెంబ్లీ దగ్గరుండే మైసూర్ కేఫ్కు వెళ్లేవాణ్ణి. భక్తి గీతాలు నేను భక్తి రంజని కార్యక్రమంలో ఎన్నో పాటలు పాడించేవాణ్ణి. దీపావళి, నవరాత్రి పండుగలకు ప్రత్యేక కార్యక్రమాలు చేశాను. అంబాళి, సుబ్రహ్మణ్యస్వామి, కృష్ణుడు, శివుడు, గణపతుల పై ఎన్నో పాటలు చేశాం. నా ప్రత్యేకత వయొలిన్ వాయించడం. నా భార్య రాజ్యలక్ష్మి కూడా ఆకాశవాణిలో పాడేది. 1980లో నేను పదవీ విరమణ తీసుకున్నాను. అప్పుడే నేను నిర్వహించిన కార్యక్రమాల రికార్డులన్నీ తెచ్చుకున్నాను. ఇప్పటికీ నా దగ్గర అవి భద్రంగా ఉన్నాయి. నాకున్న ఆసక్తితో అప్పుడప్పుడు ఆకాశవాణికి వెళ్లి ఇప్పటికీ కార్యక్రమాలు చేస్తుంటాను. ప్రెజెంటేషన్: నిఖితా నెల్లుట్ల ఫోటోలు: జి. రాజేశ్ అంత డబ్బు ఏం చేసుకోవాలో అర్థం అయ్యేది కాదు! అప్పట్లో సంగీతం నేర్చుకుంటే ఏ ఉద్యోగం రాకపోయినా బతికేయొచ్చు అనే వాళ్లు.. అలాగే నేను మా గురువు చిన్నస్వామిగారి దగ్గర ఉండగానే సంగీతం నేర్పిస్తే రూ.7 సంపాదించే అవకాశం దొరికింది. దాన్ని ఆయనకు ఇస్తే నా హోటల్ ఖర్చులు అన్నీ చూసుకుంటూ నెలకు రూపాయి మిగిల్చేవాళ్లు.. ఆ తర్వాత మరో మూడు, నాలుగు ట్యూషన్లకు ఒప్పందం కుదుర్చుకున్నా. మొత్తం నెలకు రూ.22 వచ్చేవి. అంత డబ్బు ఏం చేసుకోవాలో అర్థం అయ్యేది కాదు. ఆ గురువుగారి దగ్గర నేను మొత్తం ఆరేళ్లు ఉన్నాను. నాకు తిండి, బట్టలు పెట్టేవారు. ఆయన రుణం నా జన్మలో తీర్చుకోలేను. -
కరిగిన స్వర్గం! చెదిరిన స్వప్నం!!
నిజాం రాచరికానికి చరమగీతం పాడాలని, రాజ్యాన్ని కూలదోయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ భావించింది. 1947 సెప్టెంబర్లో పార్టీ ఆమేరకు పిలుపునిచ్చింది. పోరాటాన్ని ఉధృతం చేయాలని, ఆయుధాలను చేతబట్టాలని ఆదేశించింది. పోలీస్ స్టేషన్లను లూటీ చేసి, సైనిక దళాలపై మాటు వేసి, భూస్వాముల నుంచి కైవసం చేసుకుని, వీలైన అన్ని మార్గాల్లో పార్టీ నేతలు ఆయుధాలు సొంతం చేసుకున్నారు. ‘దళాలు’ అనే ప్రత్యేక బృందాలు ఏర్పరిచారు. శ్రామికరాజ్యం సాధించే వరకూ లేదా తాము చనిపోయే వరకూ ఎత్తిన జెండా దించబోమని, పట్టిన ఆయుధం విడవబోమని దళసభ్యులతో ప్రమాణాలు చేయించారు. అప్పటికి ఏడో నిజాం పాలిస్తున్నాడు. రజాకార్లు హద్దుల్లేని అమానుషకాండకు పాల్పడుతున్నారు. ఇది పోలీస్ యాక్షన్ పూర్వరంగం. ఈ దశలో తెలంగాణ సాయుధపోరాటపు అత్యున్నత దశ ఎలా ఉండేది? నల్లగొండ జిల్లాలో (ఇప్పటి నల్లగొండ జిల్లా కంటే విశాలమైనది) రెండు వేలకు పైగా గ్రామాలను కమ్యూనిస్ట్ పార్టీ ‘విముక్తం’ చేసింది. పార్టీని ‘సంగం’ అనేవారు. కార్యకర్తలను సంగపోల్లు అనేవారు. ‘సంగం’ ఆయా గ్రామాల్లో భూసంస్కరణలను అమలు చేసింది. రెండు వందల ఎకరాలకు పైగా ఉన్న భూస్వాముల నుంచి భూమిని స్వాధీనం చేసుకుని భూమిలేని రైతు కూలీలకు పంచింది.వ్యవసాయ కూలీల వేతనం పెంచారు. కనీస మొత్తం చెల్లించే అవగాహనతో గీతకార్మికులకు తాటిచెట్లను అప్పగించారు. వ్యవసాయానికి ఉపకరించే చెరువులు, కాల్వలు, బావులు తవ్వేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. పల్లెల్లో జలసిరి కళకళలాడింది. నాగళ్లు, ఎడ్లబండ్లు తయారు చేసుకునేందుకు అటవీభూముల నుంచి ఉచితంగా కలపను తీసుకునే హక్కును రైతులకు దఖలు పరచారు. ప్రజాకోర్టులు ఏర్పరచారు. వితంతు వివాహాలు జరిపించారు. రాత్రి పాఠశాలల ద్వారా వయోజనులకు అక్షరాలు నేర్పారు. ప్రపంచం గురించి గ్రామీణులకు తమదైన అవగాహన కలిగించారు. ఒక వినూత్న సాంఘిక, రాజకీయ చైతన్యం ! ఒక కొత్త కాంతి. ఒక కొత్త శాంతి. ఆహ్లాదభరిత వాతావరణం! గ్రామీణ ప్రాంతాల్లో విశాల భూభాగాన్ని కమ్యూనిస్ట్ పార్టీ (సంగం) తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. కొత్త ప్రాంతాల గ్రామీణులు వారిని బోనాలతో స్వాగతించారు. ఒక దశలో ‘అదిగో చూడు..’ అన్నట్లుగా ఎర్ర విప్లవం కనుచూపు మేరలో కన్పించింది! పోరు బాటా? పొరబాటా! అదే సమయంలో 1948లో ‘పోలీసు చర్య’ వచ్చింది ! మూడు రోజుల్లో పార్టీపై నిషేధమూ వచ్చింది. అప్పటికి కొందరు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అజ్ఞాత వాసం నుంచి బయటకు వచ్చారు. ఇతరులు సంసిద్ధులవుతున్నారు! ఆ పరిస్థితుల్లో పోరాటాన్ని కొనసాగిద్దామని కొందరు, వద్దు ముగిద్దామని మరికొందరు భావించారు. భిన్నాభిప్రాయాలు తీవ్రతరం అవుతున్నాయి! ఉద్యమ క్షేత్రాల్లో అజ్ఞాతంలో ఉన్న వారిలో అనేకులు సాయుధపోరాటాన్ని విరమిద్దామని భావించారు. ఆ క్షేత్రానికి దూరంగా మైదాన ప్రాంతాల్లో నివసించేవారు కొనసాగిద్దామని భావించారు. కమ్యూనిస్ట్ పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి అత్యున్నతమైనది. రణదివే పార్టీ ప్రధానకార్యదర్శి. ఆయన అభిప్రాయం ప్రకారం ‘ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగిరింది. ఎర్రజెండా ఎగరలేదు. కాబట్టి భారత దేశం స్వేచ్ఛను పొందలేదు. జవహర్లాల్ నెహ్రూ అధికారమార్పిడి జరిగిన వలసదేశానికి మాత్రమే ప్రధానమంత్రి! వాస్తవానికి ఆయన ఆంగ్లో-అమెరికన్ ఏజెంట్! కాబట్టి ఎర్రకోటపై ఎర్రజెండా ఎగిరే వరకూ తెలంగాణ కేంద్రంగా సాయుధ పోరాటం కొనసాగించాల్సిందే!’ ఈ వైఖరిని రణదివే సిద్ధాంతంగా పేర్కొనేవారు. బయటకు వచ్చిన వారు నిషేధం నేపథ్యంలో పార్టీ ఆదేశం మేరకు విధిగా లోపలికి వెళ్లారు. ఇదిలావుండగా రైతుకూలీల భావజాలంలో కూడా మార్పు వచ్చింది! ప్రజలు వ్యతిరేకించే జాగిర్దారీ వ్యవస్థను 1949 ఆగస్ట్లో గవర్నర్ జనరల్ రద్దు చేశారు. అప్పటికి ప్రజలు అనుభవిస్తున్న ఆస్తులపై హక్కులను నిర్ధారిస్తూ పౌరప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు పోరాటం చేయాలి? కొత్త ప్రభుత్వం సక్రమంగానే పాలిస్తోంది కదా! అని గ్రామీణ ప్రాంతాల ప్రజలు భావించసాగారు! ఈ నేపథ్యంలో ఒక మహానాయకుడి అనుభవమూ ప్రస్తావనార్హమే! ‘చండ్ర’ను కప్పిన నివురు! ‘కంట నిప్పులను చెరగిన చండ్ర రాజేశ్వరయ్య’ అని ప్రజలు పాటలు కట్టి పాడుకునేవారు. నగర జీవితమే తప్ప గ్రామీణ ప్రపంచం గురించి తెలియని నిజాం పాలన పల్లెలను కల్లోలపరచింది. గ్రామీణ తెలంగాణకు కంటగింపుగా మారిన పాలనను కూలదోసేందుకు చండ్ర రాజేశ్వరరావు చూపిన సమరశీలత్వానికి ఉదాహరణ ఆ కితాబు! అప్పటి ముఖ్య నాయకుడు, తర్వాత కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుడు అయిన చండ్ర రాజేశ్వరరావు పోలీస్ చర్య అనంతరం మారిన పరిణామాలను ప్రత్యక్షంగా గమనించారు. ఉద్యమ ఉచ్ఛస్థితిలో కరీంనగర్ జిల్లాలోని దామెలకొండలో ఆయన అజ్ఞాతవాసం గడిపారు. అప్పట్లో గ్రామీణులు ఆయనను ఆరాధించారు. అలసి వచ్చిన చండ్రను ఒయాసిసులా సేదతీర్చేవారు. మారిన పరిస్థితుల్లో వారిలో వచ్చిన తేడాను ఆయన గమనించారు. ఆశ్రీతుడికి అన్నం పెట్టే వారేరి? ఆకలి తట్టుకోలేక సమీపంలోని పొలం నుంచి కొన్ని మొక్కజొన్న కంకులను తుంచుకున్నారు. కాల్చుకుని ఆకలిని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా గమనిస్తోన్న గిరిజనులు చుట్టుపక్కల అలికిడిని సంశయాత్మకంగా గ్రహిస్తున్నారు. ప్రమాదం ముంచుకొస్తుందని ఊహించిన చండ్ర రాజేశ్వరరావు తక్షణం ఆ ప్రాంతం నుంచి మాయమయ్యాడు. క్షణ-శకలం ఆలస్యమైతే తనను చుట్టుముట్టిన భారత ప్రభుత్వపు సైన్యానికి బందీ అయ్యేవాడే! నిన్న దళాలను స్వాగతించిన గ్రామీణులే నేడు రావొద్దయ్యా అని ప్రాధేయపడుతున్నారు! నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామీణులకు రక్షణగా నిలచిన కామ్రేడ్లు, తమకు తాము రక్షణ కల్పించుకోలేకపోయారు! సైన్యం ధాటికి గ్రామీణుల నిస్తబ్దత! సో... వాట్ టు డూ? (అంతర్జాతీయ కమ్యూనిస్ట్ నేత స్టాలిన్తో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం సమావేశం, వచ్చేవారం...) ప్రజెంటేషన్: - పున్నా కృష్ణమూర్తి -
కేసీఆర్.. నిజాంకు వారసునివా?: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజరిక వ్యవస్థకు ప్రతినిధిగా, నిజాం నవాబులకు వారసునిగా సీఎం కేసీఆర్ వ్యవహారశైలి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన తర్వాత ఇద్దరు సీఎంలు, రెండు లోగోలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. సచివాలయాన్ని కూల్చేసి, చాతీ ఆసుపత్రిని అడవుల్లోకి పంపించడం మంచిదికాదన్నారు. ఫాస్ట్ను ఉపసంహరించి మళ్లీ ఫీజుల రీయింబర్స్మెంట్ అనడం కేసీఆర్ అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. -
లండన్ ‘మత్తు’ వదిలించిన హైదరాబాద్
మనిషి మంచా చెడా? ‘ఎస్ ఆర్ నో’ ఏదో ఒకటి స్పష్టంగా చెప్పు అని దబాయిస్తే సమాధానం చెప్పడం కష్టమవుతుంది. నిజాంల పాలనా అటువంటిదే. ఏడుగురు నిజాంలలో చివరి, ఏడో నిజాంల చివరి దశాబ్దం చీకటి పాలన. శతాబ్దాల మతసామరస్యపు హైదరాబాద్ కీర్తి పతాక ఏడో నిజాం హయాంలో అవనతం అయినా పూర్వుల మంచి పనులను ఆయనా కొనసాగించాడు. భాగ్యనగరంలోని 14 భవనాలనూ నేలమట్టం చేసింది ముస్లిమేతరులు కాదు, ఢిల్లీ నుంచి వచ్చి ‘ఫతే మైదాన్’లో విడిది చేసిన ఔరంగజేబు సైన్యాలు. హైదరాబాద్లో రామాలయపు విగ్రహ ప్రతిష్టాపనలో ముఖ్య అతిథి, ఆలయ నిర్వహణకు మాన్యాలు రాసి ఇచ్చిందీ ఏడుగురిలో ఒక నిజాం అని విస్మరించకూడదు. ఈ అంశాలను తరువాత వివరంగా ముచ్చటించుకుందాం. ‘అన్ హ్యాపీ ప్రిన్స్’ తండ్రి ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ ప్రపంచ మానవాళికి వేదనారహిత వైద్య సేవలు అందించడం కోసం దోహదపడిన వైనాన్ని చూద్దాం... దోమకాటు వల్ల మలేరియా విస్తరిస్తుందని సర్ రోనాల్డ్ రాస్ అమీర్పేటలో పరిశోధనలు చేయడం, 1902లో నోబెల్ ప్రైజ్ పొందడం తెలిసిందే. ఉస్మానియా హాస్పిటల్ పాత పేరు అఫ్జల్గంజ్ హాస్పిటల్. దీని పేరు మారినా అందులోని ‘ఎడ్వర్డ్ లోరీ హాల్’ పేరు మారలేదు. ఎడ్వర్డ్ లోరీ ఎడిన్బరో, ప్యారిస్లలో చదివాడు. 1872లో ఆరో నిజాం వ్యక్తిగత వైద్యునిగా, హైదరాబాద్ మెడికల్ స్కూల్ ప్రిన్సిపాల్గా, అఫ్జల్గంజ్ సూపరింటెండెంట్గా హైదరాబాద్ వచ్చారు. అప్పటికి ఇంగ్లండ్లో వైద్య అవసరాలకు క్లోరోఫాం వినియోగంపై అస్పష్టత ఉండేది. ఎడిన్బరోలో 1847లో లావ్రీ గురువు డా.జేమ్స్ సిమ్సన్ తొలిసారి ఒక ఆపరేషన్ సందర్భంగా వినియోగించాడు. శ్వాసక్రియలో వచ్చే మార్పులను పర్యవేక్షిస్తూ క్లోరోఫాంను వైద్య అవసరాలకు వినియోగించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ థియరీని స్కాటిష్ స్కూల్ అనేవారు. క్లోరోఫాం వినియోగం గుండెపై ప్రభావం చూపుతుంది. వాడేందుకు మరిన్ని పరిశోధనలు జరగాలి అని లండన్ వైద్యులు అనేవారు ఈ థియరీని లండన్ స్కూల్ అనేవారు. ఈ వివాదాల నేపథ్యంలో అనస్తీషియా రహిత ఆపరేషన్లలో బాధ అనివార్యమయ్యేది! లండన్కు ‘హృదయం’ లేదు! ఎడ్వర్డ లోరీ స్కాటిష్ థియరీ కరెక్ట్ అని నిరూపించదలచుకున్నాడు. లోరీ ఉత్సాహానికి మహబూబ్ అలీఖాన్ ప్రోత్సాహాన్నిచ్చాడు. లోరి నాయకత్వంలో మరో ముగ్గురు సభ్యులతో 1888లో క్లోరోఫాం కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ నిర్దారించిన అంశాలకు అభినందనగా హైదరాబాద్ మెడికల్ కాలేజీలో వేడుక జరిగింది. దేశవిదేశాల వైద్యరంగ ప్రముఖులు, రాజ ప్రముఖులు, విచ్చేసిన సమావేశంలో ఎడ్వర్డ లోరీ పరిశోధనా ఫలితాలను ప్రకటించారు. వేలాది ప్రయోగాల్లో ఒక్క సందర్భంలో కూడా క్లోరోఫాం హృదయంపై ప్రభావం చూపలేదని నివేదిక విడుదల చేశారు. మానవాళికి బాధారహిత వైద్యసేవలు అందించగల క్లోరోఫామ్ విషయంలో లండన్ స్కూల్ ‘హృదయ’రహితంగా వ్యవహరించిందని చమత్కరించారు! ఎడ్వర్డ లోరీ పరిశోధనాఫలితాలు, ప్రసంగంపై బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ అధికార పత్రిక ‘లాన్సెట్’ పెదవి విరచింది. ఎడ్వర్డ లోరీ పరిశోధనలు యూరప్ ప్రమాణాల మేరకు లేవని, హృదయంపై క్లోరోఫాం చూపే దీర్ఘకాలిక నష్టాలను విస్మరించాయని, కేవలం కుక్కలపై కదాచిత్గా చేసిన ప్రయోగాలను పరిగణనలోకి తీసుకోలేమని వ్యాఖ్యానించింది. వెయ్యి స్టెర్లింగ్ పౌండ్లతో ‘లాన్సెట్’కు ఆహ్వానం! ఈ నేపథ్యంలో ఎడ్వర్డ లోరీ కోర్కెమేరకు ఆరవనిజాం రెండవ క్లోరోఫాం కమిషన్ను ఏర్పాటు చేశాడు. లండన్ స్కూల్ నుంచి ఒక నిపుణుడిని కమిషన్ సభ్యుడిగా ఆహ్వానించారు. ఆ సభ్యుడిని హైదరాబాద్ అతిథిగా గౌరవిస్తామని, రాకపోకలకు అయ్యే ఖర్చులకు 1000 స్టెర్లింగ్ పౌండ్లను ఇస్తామని ప్రకటించారు. ‘లాన్సెట్’ ఆ మేరకు డాక్టర్ థామస్ లాడర్ బ్రంటన్ను పంపింది. తొలి కమిషన్ సభ్యులతో పాటు బ్రంటన్, బ్రిటిష్ ఇండియా తరఫున మేజర్ జనరల్ గెరాల్డ్ బర్మ్ఫోర్డ్, హైదరాబాద్ మెడికల్ కౌన్సిల్ తరుఫున రుస్తుంజీలు ఎడ్వర్డ్ లోరీ నాయకత్వంలో పరిశోధనలు ప్రారంభించారు. ఈ బృందంలో సేవలు అందించిన హైదరాబాదీ మహిళ డాక్టర్ రూపాబాయి ఫర్దూంజీ ప్రపంచంలో తొలి అనస్థీషియనిస్ట్ కావడం గమనార్హం. 1889 అక్టోబర్ 23న ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. రోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేర్వేరు జంతువులపై ప్రయోగాలు చేశారు. నవంబర్ 29న మేక, గుర్రం, కోతిపై జరిగిన క్లోరోఫాం ప్రయోగాలను ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ స్వయంగా పర్యవేక్షించారు. పరిశోధన ఫలితాలను కమిషన్ ప్రకటించక ముందే బ్రంటన్ ‘లాన్సెట్’ నాయకత్వానికి టెలిగ్రామ్ పంపారు... ‘నా పర్యవేక్షణలో 490కి పైగా కుక్కలు, గుర్రాలు, కోతులు, పిల్లులు, కుందేళ్లపై ప్రయోగాలు జరిగాయి. అధిక మోతాదు వల్ల ఏర్పడే దుష్పరిణామాలు, శ్వాసక్రియలో మార్పులు మినహా క్లోరోఫాం వినియోగం వల్ల గుండెపై ఎటువంటి ప్రత్యక్ష ప్రభావాలూ లేవు’ అని. ఇది తొలి కమిషన్ సారాంశమే. ఒక రకంగా లండన్ స్కూల్కు హైదరాబాద్ పాఠం. మహబూబ్కు ‘ఇంగ్లిష్’ వైద్యుల కృతజ్ఞత హైదరాబాద్ రెండో క్లోరోఫామ్ కమిషన్ రిపోర్ట్ ఐదు విడతలుగా 1890 జనవరి నుంచి ‘లాన్సెట్’లో అచ్చయింది. తర్వాత వాల్యూంగా 1890 జూన్ 21న సారాంశాన్ని ప్రచురిస్తూ ఎడిటర్ ఇలా అన్నారు... ‘హైదరాబాద్ పరిశోధనలపై కొంత భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, శాస్త్రీయ పరిశోధనలు చేసేందుకు ఆకాశమే హద్దుగా నిజాం ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహానికి ప్రపంచ వైద్య వృత్తికారుల తరఫున కృతజ్ఞతలు’. నేచర్ పత్రిక హైదరాబాద్ ప్రయోగాలను ప్రత్యేక వ్యాసాల్లో ప్రశంసించింది. అయితే క్లోరోఫాం వివాదం ఆగిపోలేదు. ‘స్కాటిష్- హైదరాబాద్ థియరీ’ తప్పని తర్వాత కాలంలో నిరూపితమైంది. ఇటీవలి కాలంలో డబ్ల్యూ స్టాన్లీ సైక్స్ ‘ఎస్సే ఆన్ ది ఫస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ అనెస్థీషియా వాల్యూమ్ 3 (1982)’లోని 19 అధ్యాయాల్లో నాలుగు హైదరాబాద్ పరిశోధనలకు సంబంధించినవే. ఈ పరిశోధనలు సైన్స్ పురోగతికి బహుదా ఉపకరించాయని వైద్య చరిత్ర కొనియాడింది. రిటైర్మెంట్ తరువాత ఎడ్వర్డ్ లోరీ 1901లో ఇంగ్లండ్ వెళ్లారు. 1905లో మరణించారు. భార్యకు ప్రేమను తప్పితే ఏమీ మిగల్చలేదని తెలుసుకున్న మహబూబ్ అలీఖాన్, ఆ జీవన పర్యంతం ఆమెకు నెలకు 600 స్టెర్లింగ్ పౌండ్లు అందేలా ఏర్పాటు చేశారు. ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి narendrayan-23 -
నిజాం గొప్ప రాజే: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రుల నిర్మాణం విషయంలో నిజాం గొప్పరాజే అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాద్లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ నిజాం గొప్పరాజు అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేసిన వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. మనిషికి ఎన్ని అవయవాలు ఉన్నాయో, అన్నింటికీ వేర్వేరుగా దవాఖానాలను కట్టించిన ఘనత నిజాందేనన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఈ ఆరునెలల కాలంలో కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. మరోవైపు విజన్ ఉన్న పాలకుడు నిజాం నవాబు అని, అందుకే భవిష్యత్తును ముందే అంచనా వేసి దూరదృష్టిలో అసెంబ్లీ, ఆర్ట్స్ కాలేజ్, హాస్పిటళ్లు వంటి నిర్మాణాలు చేశాడని, కానీ చంద్రబాబుకు విజన్ లేదని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ధ్వజమెత్తారు. -
టీ టీడీపీ నేతలకు ఇంగిత జ్ఞానం లేదు: నిరంజన్ రెడ్డి
చరిత్ర తెలియని తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. నిజాం కాలంలోజరిగిన మంచి పనులను మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ కీర్తించారని ఆయన చెప్పారు. నిజాం మంచి రాజు అని కేసీఆర్ ఓ సందర్భంలో చెప్పడాన్ని ఇతర పార్టీల నేతలు తప్పుబట్టిన విషయం తెలిసిందే. -
'కొమరం భీంను నిజాం చంపలేదు'
-
కొమురం భీంను నిజాం చంపలేదు: నాయిని
హైదరాబాద్: కొమురం భీంను నిజాం చంపలేదని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. నిజాం పాలనలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండవచ్చని, అయితే 99 శాతం మంచి పాలన అందించారని నాయిని వ్యాఖ్యానించారు. చరిత్ర తెలుసుకోకుండా కొందరు నిజాం పాలనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎంఐఎం తమ పార్టీకి కొన్ని అంశాలపై మాత్రమే సమర్థిస్తుందని పేర్కొన్నారు. ఎంఐఎం కూడా కొన్ని విషయాల్లో తమను విమర్శించిందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు ఉనికి కాపాడుకోవడానికే తమపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తనకు తెలియదని నాయిని అన్నారు. -
కొమరం భీమ్ని చంపింది నిజాం కాదు!
-
అప్పుడు ఇస్తాంబుల్....ఇప్పుడు డల్లాస్ అట!
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఏడు నెలల పాలనలో కేసీఆర్...వారానికి ఒక వాగ్దానం చేశారని, అయితే ఆయన ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్ను అప్పట్లో ఇస్తాంబుల్ చేస్తానన్న...కేసీఆర్ ఇప్పుడు డల్లాస్ అంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ 20కి పైగా ఇచ్చిన హామీల్లో ఒక్కటీ ప్రారంభం కాలేదని విమర్శించారు. కేసీఆర్ ...హైదరాబాద్ హామీల అమలుకు రెండు లక్షల కోట్లు అవసరం అన్నారు. కాగా నిజాంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను షబ్బీర్ అలీ సమర్థించారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో నిజాం పాలన ప్రశంసనీయమన్నారు. హైదరాబాద్లో ఆస్పత్రులన్నీ నిజాం హయాంలో నిర్మించినవే అన్నారు. -
'నిజాం చాలా గొప్పరాజు'
హైదరాబాద్: నిజాం చాలా గొప్పరాజు అని తెలంగాణ సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, ప్రాజెక్టులు అన్నీ ఆయన నిర్మించినవేనని కేసీఆర్ గుర్తు చేశారు. గురువారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 75వ నుమాయిష్ను కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కంటే గొప్పగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ను అభివృద్ధి చేస్తామన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ స్థలం వారంలోగా సొసైటీకి అప్పగిస్తామని చెప్పారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎలాంటి కట్టడాలు నిర్మించవద్దని సూచించారు. హైదరాబాద్లో ఎవరైనా బతకవచ్చని... అందరిని అక్కున చేర్చుకుంటామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిపై త్వరలో జంట నగరాల ప్రజలతో ముఖాముఖీ నిర్వహిస్తామని చెప్పారు. -
ఊరికో చరిత్ర
ఘట్కేసర్ కీసరను రాజధానిగా చేసుకొని విష్ణుకుండినులనే రాజులు పరిపాలిం చారు. వారు తమ విద్యాసంస్థలను ఘటికలు అని పిలిచేవారు. ఘట్కేసర్ సమీపంలో వారు కొన్ని ఘటికలను ఏర్పాటు చేశారు. దాంతో ఘటికేశ్వరంగా పేరొచ్చింది. అదే కాలక్రమంలో ఘట్కేసర్గా రూపాంతరం చెందింది అనేది పూర్వీకుల కథనం. ఇక్కడ మరో చారిత్రక నేపథ్యం కూడా ఉంది. కీసర రామలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న శివలింగాలను శ్రీరామ భక్తుడైన హనుమంతుడు విసిరేసినట్లు చెబుతారు. అలా విసిరేసిన శివలింగాల్లో ఒకటి వచ్చి ఈ ప్రాంతంలో పడిందంటారు. ఘటికల వద్ద ఉన్న ఈశ్వరుడు కాబట్టి ఘటకేశ్వరుడిగా పేరొచ్చిందని, రానురాను అక్కడే గ్రామం వెలియడంతో ఘటకేశ్వరంగా అనంతరం ఘట్కేసర్గా మారిందని పెద్దలు చెబుతుంటారు. ఏదులాబాద్ ఈ ప్రాంతంలో సుమారు 48 వరకు వివిధ ఆలయాలు ఉన్నాయి. వీటిలో కుబేరాలయం, శ్రీగోదాదేవి సమేత మన్నార్ రంగనాయకస్వామి దేవాలయాలకు సుమారు 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. వీటిలో ఏదో ఒక దేవాలయంలో తరచూ పూజలు, ఉత్సవాలు జరుగుతుండేవి. అప్పుడు పాలించిన నైజాం నవాబులు పండుగను ‘ఈద్’ అని పిలిచేవారు. దాంతో ఈ ప్రాంతం కాస్తా ఈద్లాబాద్గా పేరుబడింది. కాలక్రమేణా ఏదులాబాద్గా మారింది. ప్రతాప్సింగారం ఓరుగల్లును రాజధానిగా చేసు కొని పాలించిన రాణీరుద్రమదేవి మనుమడైన ప్రతాపరుద్రుడు యేడాదికోసారి వేటకు వచ్చి కొంతకాలం ఇక్కడే గడిపేవాడట. దీంతో ఈ గ్రామానికి ప్రతాపసింగారంగా పేరొచ్చింది. ప్రతాపరుద్రుడు అశ్వాలతో కాచివానిసింగారం వద్ద దిగి నడుచుకుంటూ తన బలగాలతో వేటకు వచ్చేవాడట. తిరిగి కాచివానిసింగారం వద్ద గుర్రాలను ఎక్కి తన రాజధానికి తిరుగుపయనమయ్యేవాడట. ఈ కారణంగా అప్పట్లో కాచివాని సింగారాన్ని ఎక్కే సింగారంగా, ప్రతాప్సింగారంను దిగే సింగారంగా పిలిచేవారట. ముత్వెల్లిగూడ నైజాం పాలించిన కాలంలో కాచివానిసింగారం, ప్రతాప్సింగారం గ్రామాల్లోని కొన్ని వందల ఎకరాలను (జాగీర్లు) చూసుకోవడానికి నైజం ప్రభువు ముతవల్లీ (నిర్వాహకుడు)ని నియమించుకున్నాడు. ముతవల్లీ శిస్తు కింద పొలాల ద్వారా వచ్చిన ఫలసాయంలో కొంత భాగం నైజం నవాబుకు పంపేవాడు. ముతవల్లీ నివసించే గూడెన్ని ముతవల్లీగూడగా పిలిచేవారట. అదే కాలానుగుణంగా ముత్వెల్లిగూడగా మారింది. అవుశాపూర్ ఈ గ్రామానికి సమీపంలో ఓ జాగీర్ ఉండేది. ఆ జాగీర్ను నైజాం కాలం లో జమీలా అనే దొరసాని చూసుకునేదట. ఆమెకు సంబంధించిన అశ్వాలను జాగీర్కు ఆరు కిలో మీటర్ల దూరంలో ఉంచేవారట. దాంతో ఈ ప్రాంతం అశ్వాల పురం తదనంతరం అశ్వాపు రంగా పేరుమారి చివరికి అవుశాపురంగా రూపాంతరం చెందింది. కాచివాని సింగారం ప్రతాపరుద్రుని అల్లుడైన కసురుడు కాచివాని సింగారంను పరిపాలిం చాడు. అందుకే ఆ గ్రామం కసురుని పేరుతో కాసవాని సింగారంగా.. తర్వాత రూపాం తరం చెంది కాచివాని సింగారంగా మారింది. కసురుడు మంచి వేటగాడని తన మామ ప్రతాపరుద్రునితో కలిసి వేటకు వెళ్లేవాడని చెబుతారు. -
ఆదేశాల్లోపదనిసలు..!
నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణ పనులను పరిశీలించడం ప్రధానమంత్రి నెహ్రూకు ఎంతో ఇష్టం అని చెప్పుకున్నాం కదా. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి నెహ్రూ డ్యామ్ చూడడానికి వచ్చారు. ‘కండలను కరగదీస్తూ బండలను విసురుతున్న’ శ్రామికులను పారవశ్యంగా చూస్తున్నారు. ‘మీ దినసరి కూలీ ఎంత?’ అని అడిగారు. ‘ముప్పావలా’ అని చెప్పారు. ‘మంచి మొత్తమే’ అన్నారట బ్రహ్మానందరెడ్డి. ఆ మాటకు నొచ్చుకున్న శ్రామికులు ముఖ్యమంత్రి మీద కలబడ్డంత పని చేశారట. రోజు కూలీని రూపాయి పావలా చేయమని నెహ్రూ ఆదేశించడంతో కార్మికులు ‘బ్రహ్మానంద’పడ్డారట! అప్పట్లో పాలకుల తీరు ఇప్పుడు హాస్యంగా అన్పించడం సహజం. ఇప్పుడు సాధారణంగా భావిస్తోన్న అంశాలు భవిష్యత్తులో నవ్వు తెప్పిస్తాయేమో! ఈ నేపథ్యంలో నిజాంల హయాంలో కొన్ని ఆదేశాలను గుర్తు చేసుకుందాం! తప్పు చేసిన మేలు! నిజాం హయాంలో కూడా ఉపాధి కోరుకునేవారి పేర్లను నమోదు చేసుకునే విధానం ఉండేది. అలా నమోదు చేసుకున్న వారు రేపటి ఉద్యోగాలకు ‘అభ్యర్థులు’! వీళ్లకు పని చెప్పే వారు. జీతం గీతం ఉండేది కాదు. ఉద్యోగం ఖాళీ కాగానే ఇచ్చేవారు. అభ్యర్థుల్లో ఒకరు రాసిన ‘నోట్ ఫైల్’ అపార్థానికి దారితీసేదిగా తప్పుల తడకగా ఉండడాన్ని మొదటి సాలార్జంగ్ గమనించారు. సదరు ‘రచయిత’కు పది రూపాయల జరిమానా విధిస్తూ, జీతంలోంచి మినహాయించుకోవాలని ‘నోట్ ఫైల్’పై ఆదేశించారు. ‘అభ్యర్థి’కి జీతభత్యాలు లేనందువలన జీతంలో మినహాయించుకోలేమని సాలార్జంగ్కు తిరుగు టపాలో ఆ తప్పుల తడక చేరింది! ‘అయితే వాడిని ఏదో ఒక ఉద్యోగంలో నియమించి జరిమానా వసూలు చేయండి’ అని మరొక ఆదేశం జారీ అయింది! కాదనేందుకు నిజాం ఎవరు?! ఫలక్నుమా ప్యాలెస్లో నివసించిన ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ మహా ఉదారుడు! వృద్ధుడైన ఆయన వ్యక్తిగత సేవకుడు తన అనారోగ్యాన్ని, ఈతి బాధలను ప్రభువుకు చెప్పుకున్నాడు. ఇతడికి నెలకు ఎనిమిది రూపాయల పెన్షన్ను జీవితాంతం ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ఉత్తర్వు సిద్ధమైంది. నిజాం సంతకం చేయడమే తరువాయి. ఎనిమిది అనే సంఖ్య దగ్గర లేఖకుని పొరపాటు వలన సున్నా చేరి ‘80’గా మారింది. క్లర్క్ క్షమాపణలు చెప్పాడు. మరో కాపీ తెస్తానన్నాడు. ‘విశ్వాసుడైన ఆ సేవకునికి రూ.80 ఇవ్వాలని రాసిపెట్టి ఉంటే కాదనడానికి మనమెవ్వరం?’ అన్నాడు నిజాం! ఆ సేవకుడు జీవితాంతం రాజభోగాలు అనుభవించాడు! పోలీసు కమిషనర్కు ఫైన్! ఆరవ నిజాం దగ్గర నవాబ్ సహాబ్ జంగ్ హోం మంత్రి. అక్బర్జంగ్ సిటీ పోలీస్ కమిషనర్. ఏదో విషయమై సిటీ పోలీస్ కమిషనర్ హోం మంత్రితో వాదులాడాడు. నీ పని ఇలా ఉందా అనుకున్నాడేమో ఒక రూపాయి జరిమానా విధించాడు. అక్బర్జంగ్ సహజంగానే అప్సెట్ అయ్యాడు. తనకు విధించిన శిక్ష గురించి నిజాంకు మొరపెట్టుకున్నాడు. మరుసటి రోజు సహాబ్ జంగ్ నిజాం సందర్శనకు వె ళ్లినపుడు ‘కమిషనర్ నా విశ్వాసపాత్రుడు, హితైషుడు. అటువంటి వ్యక్తికి జరిమానా విధిస్తారా’ అన్నాడు. అయ్యో అలాగా అని నిజాంకు క్షమాపణ చెప్పాడు సహాబ్ జంగ్. తన నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తాన ని అన్నాడు. ఆఫీసుకు వచ్చి సంబంధిత ఫైల్ తెప్పించుకున్నాడు. జరిమానాలో సగం చెల్లింపు జరిగింది. సంబంధిత వ్యక్తిని అర్ధరూపాయి చెల్లించనివ్వండి’ అని రాశారు! ‘బల్లె’ ఇంక్రిమెంట్! ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ (1866-1911) ఉదారుడు. విద్యాధికుడు. వేటగాడు. అశ్వికుడు. ఆయన స్థాపించిన ‘నిజాం స్కాలర్షిప్ ట్రస్ట్’ సహాయంతో కవికోకిల సరోజినీ నాయుడు ఇంగ్లండ్లో చదువుకున్నారు. అదలా ఉంచితే.. ఆరవ నిజాం సైన్యాధికారి నవాబ్ అఫ్సర్ జంగ్. ఈయన కింద ‘రిసాల్దార్ మేజర్’గా రెహమాన్ఖాన్ అనే వ్యక్తి బల్లెపు పోటుగాళ్ల మూడవ దళంలో పనిచేసేవాడు. పురానీ హవేలీలో నివసించే ఆరవ నిజాంను సందర్శించేందుకు వెళ్లే అఫ్సర్జంగ్కు అశ్వికుడైన రెహమాన్ఖాన్ పైలట్! ఓ పర్యాయం నిజాం నివసించే ప్యాలెస్ ప్రాంగణంలో రెహమాన్ఖాన్ గుర్రంపై స్వారీచేస్తున్నాడు, వాయువేగంగా! గుర్రపు వేగానికి పొడవాటి తెల్లటి గడ్డం గాలిలో నైరూప్య చిత్రాలను చూపుతోంది! ‘సెలయేళ్లుగా ప్రవహిస్తోన్న తెల్లటి గడ్డా’న్ని నిజాం తన భవంతి నుంచి చూసి అబ్బురపడ్డాడు! రెహమాన్ఖాన్ గడ్డం పోషణకు ఆజీవన పర్యంతం నెలకు పదిరూపాయల ఇంక్రిమెంట్ను మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు! రెహమాన్ఖాన్ తన గడ్డాన్ని ప్రేమగా నిమురుకున్నాడు, చివరి శ్వాస వరకూ! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి