
ఉరివేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
మద్యానికి బానిసగా మారిన ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్: మద్యానికి బానిసగా మారిన ఓ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ ఠాణా పరిధిలోని ఎస్ఎల్ఎన్ కాలనీలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రమేశ్(30) మీర్పేట్ ఠాణాలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్ఎల్ఎన్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్న ఆయనకు భార్య నిఖిత, కూతురు, కొడుకు ఉన్నారు. మద్యం అలవాటున్న రమేశ్ తరచూ భార్యాపిల్లలతో గొడవపడేవాడు.
శారీరకంగా హింసిస్తుండడంతో నిఖిత ఉన్నతాధికారులకు తన గోడును వెళ్లబోసుకున్నారు. విధి నిర్వహణలోనూ రమేశ్కు మంచి పేరు లేకపోవడంతో అధికారులు రాచకొండ కమిషనరేట్లోని కంట్రోల్రూమ్కు అటాచ్ చేశారు. శనివారం కూడా మద్యం మత్తులో భార్యతో ఘర్షణకు దిగారు. మూడు నెలల బాబును ఎత్తి నేల మీదకు విసిరేయగా... సమయానికి నిఖిత పట్టుకున్నారు. ఈ బాధలు భరించలేక పిల్లలను తీసుకుని బోరబండలోని తన పుట్టింటికి వెళ్లిపోయారు. దీంతో మానసికంగా కుంగిపోరుున రమేశ్ చీరతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకున్నారు. ఇరుగుపొరుగు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.